Saturday 4 June 2022

మనమంతా పరిపూర్ణమైన అపరి పూర్ణులం....మునాబ్ మజారి.

 అందరికీ ధన్యవాదాలు. నన్ను నేను ప్రేరణాత్మక వక్తగా కాక ఒక కథకురాలిగా భావిస్తా ఎక్కడి కెళ్ళినా ఒక కథ చెబుతా, మాటలకున్న శక్తి విలువ నాకు తెలుసు. పదాలు మిమ్మల్ని తయారు చేయవచ్చు, మీ మనసును గాయ పరచవచ్చు, గాయాన్ని మాన్ఫవచ్చు.అందుకే నేను ఆశావాదంతో మాట్లాడుతుంటా వాళ్ళు దాన్ని నా బలహీనతగా భావిస్తే నేను అది బలంగా భావిస్తా, వారు నన్ను వికలాంగురాలిగా భావిస్తే నేను విభిన్న ప్రతిభా వంతురాలిగా భావిస్తా, నా సామర్ధ్యాన్ని చూస్తా. మీ జీవితం లో జరిగే కొన్ని సంఘటనలు మీ DNA ను మార్చేంత శక్తి కలిగి ఉంటాయి మీ దేహాన్ని ముక్కలు చేసినా మీ ఆత్మలో పరివర్తన కలిగిస్తాయి.అవి మిమ్మల్ని మరింత ఉన్నతీకరిస్తాయి. నాకు అలాగే జరిగింది.18 ఏళ్లప్పుడే నాకు పెళ్లి అయింది మాది చాలా సంప్రదాయ కుటుంబం వివాహం అయిన 2 ఏండ్ల కు నాకు కార్ ప్రమాదం జరిగింది. నా భర్త ప్రమాదం నుండి తప్పించుకున్నాడు. నాకు తీవ్ర గాయా లయ్యాయి.కుడి భుజం మణికట్టు విరిగాయి. ఊపిరి తిత్తులు, కాలేయం దెబ్బతిన్నాయి గాలి పీల్చలేక పోయేదాన్ని, మూత్రము మీద నియంత్రణ కోల్పోయాను. నా వెన్నెముక పూర్తిగా దెబ్బతిన్నది. జీవితాంతం ఇక నడవ లేనని తెలిసింది ఈ గాయాలు నా జీవితాన్ని పూర్తిగా మార్చేసాయి కొంత మంది రక్షించి ఒక జీప్ వెనుక భాగంలో తీసుకెడుతుంటే మిగిలిన ఎముకలు కూడా విరిగాయి. అప్పుడు నా కర్ధమైంది. సగం దేహం విరిగిపోయింది, మిగతా సగం చలనం లేకుండా మారిందని. రెండున్నర నెలలు ఆసుపత్రి లో ఉన్నాను. నాకు చాలా శ స్త్ర చికిత్సలు జరిగాయి. నా శరీరం లో చాలా టైటానియం అమర్చారు అందుకే పాకిస్థాన్ లో నన్ను అందరూ ఉక్కుమహిళ అంటారు.ఒక రోజు డాక్టర్ వచ్చి నీవు ఇక చిత్రకారిణి కాలేవని చెప్పారు. మరుసటి రోజు వచ్చి నీ వెన్నెముక బాగా దెబ్బ తిన్నదని ఇక నీవు నడవ లేవని, బిడ్డలను కనలేవని చెప్పడం తో నా కర్ధమయింది పూర్తిగా నా జీవితం నాశనమయిందని. మా అమ్మను అడిగాను నేను ఎందుకు బ్రతికి ఉండాలని, నా జీవితానికి అర్థం ఏముందని? పిల్లలు కలగక పోతే జీవితమంతా అసంపూర్ణం గా మిగిలిపోవాల్సిందేనా అని. దేవుడు నీ కేదో గొప్ప భవిష్యత్తును వ్రాసి పెట్టాడేమో అని అమ్మ అన్నది. అంత బాధలోనూ అమ్మ మాటలు నా మీద మంత్రం లా పనిచేసాయి నన్ను ఆసుపత్రి నుండి తీసికెళ్ళమని అమ్మను, తమ్ముడిని కోరాను నేను మొదటి చిత్రాన్ని నా మృత్యు పాన్పు మీద వేసాను అదే నా హృదయానికి నేను చేసుకున్న చికిత్స. ఆసుపత్రి నుండి ఇంటికొచ్చాను. నా గాయల వల్ల 2 సంవత్సరాలు ఇంట్లోనే బెడ్ పైనే  ఉండవలసి వచ్చింది,కిటికీ గుండా పక్షుల కిలకిలా రావాలు వింటూ.ఒకసారి బయటికెళ్లి ప్రకృతి సంగీతాన్ని వినాలని కోరిక కలిగింది, అప్పుడనిపించింది ప్రజలెంత అదృష్టవంతులో కాని వారది గుర్తించరు. రెండున్నర సంవత్సరాల తర్వాత చక్రాల కుర్చీ పై కూర్చో గలిగాను. అప్పుడు నాకు పునర్జన్మ లభించినట్లనిపించింది. ఇక జీవితమంతా నడవ లేనని గుర్తు కొచ్చింది. అద్దముందు నిలబడి అనుకున్నా ఏ అద్భుతం జరిగి నేను నడవలేనని, ఏడ్చుకుంటూ మూలన కూర్చునే బదులు, ఎవరి దయ కోసమో ఎదురు చూసే బదులు నా స్థితిని అంగీకరించాలని నిర్ణయించుకున్నా! నా కోసం నేను జీవించాలనుకున్నా, అప్పుడే నిర్ణయించుకున్నా నా భయాలను గెలవాలని కానీ నా పెద్దభయం ఏంటంటే విడాకులు. నా అవసరం లేని వ్యక్తికి నేను ఎందుకు? అతనికి స్వేచ్చ ఇచ్చి నేను స్వేచ్ఛను పొందటం మేలు కదా!అతను వివాహం చేసుకున్నాడు అని తెలియగానే అభినందనలు తెలియజేసా రెండవ పెద్దభయం నాకు పిల్లలు కలగరని! కానీ ప్రపంచంలో ఎంతో మంది అనాధలున్నారు. వారిలో ఒకరిని దత్తత తీసుకోవచ్చు కదా అనిపించింది, అదే చేసాను. ఇక  3 వ భయం  జనాలను ఎలా ఎదుర్కోవాలి అని ఇంట్లో బెడ్ మీదున్న ఆ రెండు సంవత్సరాలు తలుపులు వేసుకొని ఎవరిని పలకరించటానికి ఇష్టపడే దాన్ని కాదు. వారు ఒక లాగా సానుభూతి చూపడం నాకు నచ్చదు ఇప్పుడు ఇలా మీ అందరి ముందు నా కథ పంచుకోవడం నా అదృష్టం. అలాగే పెయింట్ వేయడం మొదలు పెట్టాను. మోడలింగ్ చేస్తున్నాను. అందువలన  మనల్ని మనం ముందు అంగీకరిస్తే ప్రపంచం మనల్ని గుర్తిస్తుంది. పాకిస్థాన్ తరపున ఐక్యరాజ్యసమితికి రాయబారిగా వ్యవహరిస్తూ స్త్రీ ల  పిల్లల  హక్కుల గురించి  లింగ సమానత్వం గురించి  మాట్లాడుతున్నా.2015 BBC ఎన్నుకొన్న 100 మంది స్త్రీల లిస్ట్ లో నేను ఉన్నా, Forbes ఎన్నుకొన్న 30 సంవత్సరాల లోపు వయసు  గల  30 మంది స్త్రీల లిస్ట్ లో ఉన్నా. మీ వృత్తి లో మీరు  ఎంతో ఉన్నతస్థానం చేరుకోవాలని మీకు ఉండవచ్చు. కానీ దానికి ఒకటే  సూత్రం నేను అనుకోకుండా మనం అనుకోవాలి. నీ ఒక్కడివే విజయాలు సాధిస్తావు అనుకోవద్దు. నీ  వెనుక ఒకరుండాలి. నీకు మద్దతిస్తూ ఒకరుండాలి అటువంటి వ్యక్తిని కోల్పోవద్దు. నా  వెనుక  మా అమ్మ ఉంది నేను ఇలా ఉన్నానంటే ఆమే కారణం. మనం జీవితం నుంచి ఎంతో ఆశిస్తుంటాం కానీ జీవితం నన్నిక్కడ నిలిపింది. ఇది నాకు పరీక్షా కాలం. దాన్ని మనం  అర్థం  చేసుకుంటే  చాలు ఓటమి  ఒక అవకాశం, మళ్ళీ మళ్ళీ లేచి నిలబడి ప్రయత్నించాలి కానీ ఎప్పుడూ వదిలి పెట్టకూడదు. మనకు అంతా దోషం లేకుండా ఖచ్చితంగా, సంపూర్ణం గా ఉండాలనుకుంటాం. జీవితం, వృత్తి సంబంధాలు డబ్బు ఇలా అన్నింట్లో సంపూర్ణతను ఆశిస్తాం ఏదీ ఈ ప్రపంచం లో పరిపూర్ణంగా ఉండదు. మనమంతా పరిపూర్ణంగా అసంపూర్ణులం.ఇతరులకు మనం మంచిగా పరిపూర్ణంగా కనిపించాలనుకోవద్దు. నీ లోపల నీకు  ఆ పరిపూర్ణత ఉంటే చాలు. ఈ సమాజం మనం సంపూర్ణులుగా ఉండటానికి చాలా నిబంధనలు పెట్టింది. స్త్రీ పురుషులకు అవి విభిన్నంగా ఉంటాయి. మనం ఎదుటివారు చెప్పిన దానికి ఎక్కువ ప్రాధాన్యమిస్తాం. మనల్ని మనం తక్కువ వింటాం.ఇతరుల మేలు కోసం నీవు ఏదయినా చేస్తే నీవు సంపూర్ణంగా ఉన్నట్లు. ఇతరుల బాధను మనం అనుభవించి నట్లయితే ఆ బాధే మనల్ని ఇతరులతో అనుసంధానం చేస్తుంది. బాధ తప్ప ఏదీ ఇతరులతో మనల్ని అనుసంధానించదు. అందుకే చెబుతుంటా నేను బాధ లో ఉన్నానని. నా కదే ఆశీర్వాదం. చక్రాల కుర్చీలో ఉన్నాను కాబట్టే పిల్లలకోసం పనిచేస్తున్నా. వైద్య సహాయం అందని మారుమూల ప్రాంతాల పిల్లలకు వైద్యం అందిస్తున్నా. అలాగే హిజ్రా లకు  సహాయం అందిస్తున్నా. ఇలా అసంపూర్ణమైన వ్యక్తులు మనతో అనుబంధం ఏర్పరచు కోవడానికి కారణం నేను అసంపూర్ణురాలుని కాబట్టి. జనం అడుగుతుంటారు ఎప్పుడూ నవ్వుతూ ఉండటంలో మీరు అలసట చెందరా అని. నీవు కోల్పోయిన వాటి గురించి, వ్యక్తుల గురించి ఆలోచించవద్దు. నీవు ప్రస్తుతం పీల్చే ప్రతి శ్వాసను ఆస్వాదించు.జీవితాన్ని ఉత్సవం లా జరుపుకో.జీవించు, మరణానికంటే ముందే చావకు. అందరం మరణించే వాళ్ళమే.75 ఏళ్ళు ఒకేలా బ్రతికి మనం దాన్ని జీవితమంటాం. ఎంతో కష్టపడి డబ్బు సంపాదిస్తారు అది కాదు జీవితం అంటే. బయటికెళ్లి నీ సహాయం కావలిసిన వారిని గుర్తించు. వారి జీవితాలకు రంగులద్దు. వారి జీవితాలకు విలువనివ్వు. అన్ని నిరాశా వాదపు భావనలు తొలగించే స్పాంజ్ లా మారు అందమైన ఆశావాదపు భావనలు వెదజల్లగలిగితే ఇతరులను మార్చగలవు. నేను నవ్వుతుంటేనే ఇతరులను ఆనందపరచగలను. నీకు ఉన్న వాటి పట్ల గొప్పగా భావించు. మనకు లేని వాటిపట్ల ఎక్కువగా ఆలోచించ వద్దు. జీవితాన్ని పూర్తిగా జీవించండి. నీవు ఉన్న స్థితిని అంగీకరించు.నీ పట్ల నీవు దయకలిగి ఉండు అప్పుడే ఇతరుల పట్ల దయ కలిగి ఉంటావు.నిన్ను నువ్వు ప్రేమించు ఆ ప్రేమను వ్యాపింపజెయ్యి. జీవితం చాలా కఠినంగా ఉంటుంది.అలజడి, పరీక్షలు ఉంటాయి. అవే నిన్న ద్రుడంగా గా తయారు చేస్తాయి. ఎప్పుడూ దేన్నయినా  మధ్యలో వదిలి వేయవద్దు. నిజమైన ఆనందం డబ్బులో, విజయం లో కీర్తిలో ఉండదు.

నిజమైన ఆనందం కృతజ్ఞతలో ఉంటుంది. ప్రతి క్షణం జీవించడానికి ప్రయత్నించండి.(అనువాదం :ఒద్దుల రవిశేఖర్ )

Wednesday 1 June 2022

రేనాటి సూర్య చంద్రులు

 రచయిత :తంగిరాల సుబ్బారావు                   పుస్తక పరిచయం :ఒద్దుల రవిశేఖర్                    ఉయ్యాలవాడ నారసింహారెడ్డి యుద్ధ వీరగాధ (విప్లవ కాలము క్రీ. శ 1845-1847) బుడ్డా వేంగళ రెడ్డి దాన వీర గాధానిక (జీవిత కాలము:క్రీ. శ  1822-1900) చిరంజీవి " సైరా నరసింహా రెడ్డి " చిత్రం విడుదల కాగానే ఒక్క సారి అందరి దృష్టి ఉయ్యాలవాడ నారసింహారెడ్డి పై పడింది. ఆచార్య తంగిరాల వేంకట సుబ్బారావు గారు ఎంతో శ్రమకోర్చి సేకరించి గుడిగుచ్చి అందించిన ఈ పుస్తకం లో నారసింహా రెడ్డిని సూర్యుడిగాను, వేంగళ రెడ్డిని చంద్రునిగాను వర్ణించారు రచయిత. చరిత్ర ఎప్పుడూ వ్రాసే వారి అభిప్రాయాలను బట్టి ఉంటుంది అందుకే చరిత్రపై ఎన్నో భే ధాభిప్రాయాలు ఉంటాయి. నారసింహారెడ్డి విషయం లో అదే జరిగింది. కానీ రచయిత బ్రిటిష్ ప్రభుత్వం భద్రపరిచిన రికార్డులను, జనపదాల్లో పాడుకునే పాటలను, వీరగాధలను పరిగణన లోకి తీసుకొని ఆయన బ్రిటిష్ వారిపై విప్లవ శంఖం పూరించారని అర్ధమవుతుంది అంటారు. ఆయననను భారత ప్రధమ స్వాతంత్ర్య సంగ్రామ వీరుడిగా రచయిత పేర్కొన్నారు. అలాగే 1866 లో రాయలసీమ ప్రాంతం లో వచ్చిన ఎర్రగాలి కరవు, ధాత కరవుల కాలంలో 3 నెలల పాటు కొన్ని వేల మందికి అన్నదానం చేసిన అపర దానకర్ణుడిగా ఖ్యాతి గాంచారు బుడ్డా వేంగళ రెడ్డి. ఆయన తన జీవితమంతా తన ఆస్థి పాస్తులను దాన ధర్మాలకే ఖర్చు చేశారు.చారిత్రక ప్రాంతాలపై ఆసక్తి ఉన్నవారు పుస్తకం మొదట్లో, చివర్లో ఇచ్చిన చిత్రాలు చూసి ఆయా ప్రాంతాలను సందర్శించవచ్చును. గిద్దలూరు దగ్గర కొత్త కోటపై ఉన్న ఫిరంగులను మేము విహార యాత్రలో చూసాము. ఈ పుస్తకం లో బండి గోపాలరెడ్డి, కలవటాల జయరామారావు బందుమియ్య రచనలను పొందు పరచారు. చివరలో బ్రిటిష్ ప్రభుత్వం వారు జరిపిన ఉత్తర ప్రత్యుత్తరములు ఇవ్వడం వలన రచనకు మరింత విశ్వసనీయత కలిగింది. గ్రంధాలయం లో ఎప్పటినుండి ఉందో ఈ పుస్తకం ఇప్పటికి చదివింది నేనే. ఆసక్తి గల వారు అన్ని ప్రభుత్వాగ్రంధాలయాల కెళ్ళి చదువ వచ్చును.  

Monday 30 May 2022

నాలో రగిలే అగ్ని కి అదే ఇంధనం... ప్రియాంక చోప్రా

 అందరికి శుభమధ్యాహ్నం. ఈ అమ్మాయి పేరు ఈవ,16 ఏండ్ల వయసు. ఈ వయసులో అమ్మాయిలు వారి అమాయకత్వాన్ని ఆనందిస్తూ,వారి యవ్వనంలో త్రుళ్ళుతూ గడుపుతుంటారు. కానీ ఇంత చిన్న వయసులో ప్రపంచం లోని తన తోటి పిల్లల గొంతుకై, అవకాశాల్లేని యువతులు, మహిళలకు సలహా లిస్తూ ఇటువంటి గౌరవాన్ని పొందటం విశిష్ఠ మైన విషయం. ధన్యవాదాలు.  మీలాంటి అద్భుతమైన, అపురూపమైన మహిళల మధ్యన నేను పాల్గొనడం విశేషమైన గౌరవంగా భావిస్తున్నాను.   ఇక్కడ హాజరయిన ఎంతో గొప్ప విజయాలు సాధించిన octavia, మిచేల్, కెల్లీ, పాటి లాంటి 50  మంది మహిళలకు నా అభినందనలు. మీ విజయాలు నాకే కాకుండా ఎంతో మందికి స్ఫూర్తి నిస్తాయి. మీ ప్రక్కన నిలబడటం నాకెంతో గర్వ కారణం. మీ జీవితం లో ఒక్క సారి ఆగి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, ఇక్కడి దాకా ఎలా వచ్చాం, ఇక్కడ ఎందుకు నిలబడ్డాము అని. నాక్కూడా నా మూలాల్లోకి తిరిగి వెళ్లి చూసుకోవాలనిపిస్తుంది. నేను అపురూపమైన, అద్భుతమైన తల్లిదండ్రులకు పుట్టాను. వాళ్ళు భారత సైన్యం లో పనిచేసారు. నేను వారికి ప్రధమ సంతానం.99% మా తల్లిదండ్రులనుగర్వపడేలా చేసాను. కొన్ని సార్లు వ్యక్తిగత విజయాలు చెప్పుకుంటే ఎక్కువ గా చెప్పినట్లు అనిపిస్తుంది. కొన్ని సంవత్సరాల తర్వాత మా తమ్ముడు పుట్టాక కూడా నాకేమీ మార్పు లేదు. మా ఇద్దరికీ సమాన అవకాశాలు ఇచ్చారు మా తల్లి దండ్రులు.ఈ విషయాన్ని నేను నొక్కి చెప్పగలను. సమాన అవకాశాలు ఇవ్వడం మీకు సాధారణం అనిపించవచ్చు కానీ అభివృద్ధి చెందుతున్న అన్ని దేశాల్లోలాగానే మా భారత్ లో కూడా ఈ అసమానత్వ సమస్య ఉన్నది.ఈ అసమానత్వం చాలా చిన్న వయసు నుండే అబ్బాయిలు అమ్మాయిల మధ్య ఉంటుంది.సేవా భావం కలిగిన, మధ్యతరగతికి చెందిన తల్లిదండ్రుల ఇంట్లో నేను పెరిగాను. వాళ్ళు తరచూ చెబుతూ ఉంటారు. తక్కువ సంపద కలిగి ఉన్నవారికి సేవ చెయ్యడం అనేది అవకాశం కాదు అది ఒక జీవన మార్గం అని మనం ఎంతో అదృష్టవంతులమని చెబుతుండే వారు.నాకు  7,8 ఏండ్ల వయసు నుండే మా తల్లి దండ్రులు వెర్రిల్లి పట్టణ చుట్టూ ప్రక్కల ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ నన్ను తీసుకెళ్ళే వారు. నేను రోగులకు మందులు ఒక ప్యాకెట్ లో పెట్టి ఇచ్చే దాన్ని. ఈ పని నేను చాలా తీవ్రంగా చేస్తుండే దాన్ని. ఇలా నేను వెడుతున్నప్పుడు బాల బాలికల మధ్య, స్త్రీ పురుషుల మధ్య అంతరాలు గమనించాను.ఉదాహరణకు బాలికలను యవ్వనం రాగానే పాఠశాలలు మాన్పించి వివాహానికి సిద్ధం చేస్తారు. కాని బాలు రు వారి బాల్యాన్ని ఆనందిస్తుంటారు.స్త్రీలు అయినంత మాత్రాన ప్రాధమిక మానవ హక్కులు, ఆరోగ్యం నిరాకరించబడటం అన్యాయం. ఇలా నేను ఎదిగే కొద్ది ఇటువంటి ఎన్నో అంశాలు గమనించాను. నా సినిమా కెరీర్ 18,19 ఏండ్లకే మొదలయ్యింది. స్త్రీ ని అయినందుకు నాకు తక్కువ పారితోషికం ఇవ్వజూపే వారు, నేను వ్యతిరేకిస్తే నా స్థానం లో ఇంకొకరికి అవకాశం ఇచ్చేవారు.ఎందుకంటే వినోద రంగం లో మహిళలను మారుస్తూ ఉంటారు. అప్పుడు నన్ను వారు మార్చలేని విధంగా తయారవ్వాలని నిర్ణయించుకున్నాను. చివరకు అంతిమంగా ఇది ప్రియాంకా చోప్రా foundation పుట్టుకకు దారి తీసింది. దీని తరపున విద్య, వైద్య రంగాల్లో  UNICEF భాగస్వామిగా పని చేయాలని నిర్ణయించుకున్నాను.12 ఏండ్ల క్రితం మా ఇంట్లో పని మనిషి వాళ్ళ అమ్మాయి, నేను షూటింగ్ నుండి త్వరగా వచ్చిన రోజు నా పుస్తకాల గది లో పుస్తకం తీసి చదవడం గమనించా,8 లేక 9 ఏండ్లు ఉంటాయోమో పుస్తకాలంటే ఎంత ప్రేమో అనుకున్నా, ఈ రోజు బడి ఉంది కదా ఎందుకు వెళ్ళలేదు అని అడిగితే నేను ఇక బడికి వెళ్ళను అంది.వాళ్ళ అమ్మను అడిగితే  అమ్మాయిని అబ్బాయిని బడికి పంపే స్థోమత లేదు మాకు అన్నది.ఆ అమ్మాయికి చదువుకు డబ్బు వృధా, ఆ డబ్బు తో వారికి పెళ్లి చేయవచ్చు అంది. నా కు ఆ మాట ఈడ్చి కొట్టినట్లు తగిలింది. నా అంతరంగాన్ని కుదిపేసింది.ఆ అమ్మాయి చదువుకయ్యే ఖర్చు నేను భరించాలని నిర్ణయించుకున్నాను. ఆ అమ్మాయి చదువు కొనసాగించాలి ఎందుకంటే, చదువనేది కనీస మానవ హక్కు మరియు ప్రస్తుతం అత్యా వశ్యకం. అప్పుడు దృఢముగా నిర్ణయించుకున్నా ఎంత మంది పిల్లల జీవితాల్లో వీలయితే అంత మార్పు తీసుకు రావాలని, ఎంతో కొంత సహాయం చేయాలని నిర్ణయించుకున్నా.ఈ మధ్యే ఒక అందమైన కోట్ చదివా,ఈ సందర్భంగా దాన్ని చెప్పటం చాలా సమయోచితం అనుకుంటా " ఈ రోజు ఊయల ఊపే చేయి రేపటి తల్లిని తయారు చేస్తుంది, స్త్రీ నాగరికత యొక్క విధినే రూపు దిద్దుతుంది " అటువంటి అందమైన సృష్టి అయిన ఆడబిడ్డలు నేడు మానవత్వం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య కావడం విధి కల్పించిన దుఃఖకరమైన నిందా స్తుతి కాక మరేమిటి? ప్రపంచాన్ని మార్చే శక్తి బాలికలకుంది. అది నిజం.గత రెండు దశాబ్దాల్లో ఎన్ని ప్రయత్నాలు ఎంత అభివృద్ధి జరిగినా తరగతి గదుల్లో బాలుర కంటే బాలికలు చాలా తక్కువగా ఉన్నారు.కోటి మంది బాలుర తో పోలిస్తే కోటిన్నర మంది  ప్రాధమిక పాఠశాల బాలికలు చదవడం వ్రాయడం నేర్చుకోలేక పోతున్నారు. ఇదీ మన భవిష్యత్తుకు ఆరంభం. గత 11 సంవత్సరాల నుండి ప్రపంచ వ్యాప్తంగా బాల్య వివాహం, యుద్ధం, సెక్స్, హింస ల బాధితులు, వాటి నుండి నుండి బయట పడ్డవారికి UNICEF చేసే నమ్మ శక్యం కాని అపూర్వమైన సేవను వీక్షిస్తున్నా, కానీ చాలా పని మిగిలి ఉంది చేయడానికి. నాలో రగిలే అగ్ని కి అదే ఇంధనం, అదే ఈ సమస్య పట్ల నా నిబద్దత కు కారణం, అక్కడనుండే నా తీవ్రమైన ఇష్టం మొదలయింది, ఎందుకంటే బాలికా విద్య కుటుంబాలకు అధికారం ఇవ్వడమే కాదు సమాజానికి, ఆర్ధిక వ్యవస్థకు కూడా తోడ్పాటు నందిస్తుంది. ఇక్కడ కూర్చున్న కళాకారులు, ప్రభావశీలురు మనందరి సామాజిక బాధ్యత ఏంటంటే మాట్లాడలేని వారి గొంతుక కావడం.ఇక్కడ కూర్చున్న ప్రతి స్త్రీ ని ఎందుకు ప్రశంసిస్తున్నానంటే, మీ కందరికి ఈ సమస్య పట్ల ఉన్న అవగాహనతో మీ మీ కార్యక్షేత్రాల్లో మీ స్వరాన్ని వినిపించండి, మనం బ్రతికున్నంత వరకు ఒక్క తరపు బాలికలు కూడా విద్యను కోల్పోకూడదు. ఈ వేదికపై నాకు అవకాశమిచ్చిన "Variety " సంస్థకు, ప్రోత్సహించిన మీ అందరికి, ఇక్కడున్న అందరం ఈ సమస్యపై పోరాటం చేస్తూ ముందుకెళదామని ఆశిస్తూ అందరికి ధన్యవాదాలు.(అనువాదం :ఒద్దుల రవిశేఖర్ ) (https://youtu.be/iCwKM6uB71I)

Friday 27 May 2022

మూడడుగుల్లో విశ్వం

 మూడడుగుల్లో విశ్వం:రచయిత డా. వి. శ్రీనివాస చక్రవర్తి పుస్తక పరిచయం :ఒద్దుల రవిశేఖర్     భూమి మీద  దూరాలను కొలవడం సులభంగానే మానవుడు నేర్చుకున్నాడు. కాని ఖగోళ దూ రాలను కొలవడానికి మానవునికి కొన్ని వందల సం.రాలు పట్టింది. రచయిత అందుకు జరిగిన ప్రయత్నాలను సవివరంగా ఇందులో వివరించారు. ఆసక్తికరమైన కొన్ని అంశాలను ఇక్కడ ప్రస్తావిస్తాను. మొదటి మెట్టు :మొదటగా క్రీ. పూ  ఎరటోస్తనీస్, పోసిడోనియస్ విశ్వం స్థాయిలో శాస్త్రీయ పద్దతిలో దూరాలు కొలిచారు.భూమి వ్యాసాన్ని, చుట్టుకొలతను అంచనా వేసారు.అరిస్టార్కస్, హిప్పార్కస్ భూమి వ్యాసాన్ని ఆధారం చేసుకొని చంద్రుడి దూరాన్ని అంచనా వేసారు.భూమి సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తుంది అని,భూమి నుండి సూర్యుని దూరం కొలవటానికి ప్రయత్నించిన వారు అరిస్టార్కస్.1543 లో నికోలాస్ కోపర్నికస్ సూర్య కేంద్రక సిద్దాంతాన్ని ప్రత్తిపాదించారు. గ్రహాల దూరాలను అంచనా వేయడానికి కొత్త సూత్రాన్ని అందించిన వాడు కెప్లర్.1609 లో గె లీలియో ఒక దూరదర్శినిని తయారు చేసి ఆకాశం కేసి గురిపెట్టాడు.1673 లో గియోవానీ సూర్యునికి భూమికి మధ్య దూరం సగటున 9,29,65,000 మైళ్ళని అంచనా వేశారు. దీన్ని ఖగోళ ఏకాంకం (AU) అంటారు.1830 లో విల్ హెల్మ్ బెసెల్ హీలియో మీటర్ ను వాడటం మొదలు పెట్టాడు. 61 సిగ్మస్ అనే తార దూరం 64 ట్రిలియన్ మైళ్ళు అని కనుగొన్నారు కాంతి వేగం సెకనుకు 1,86,282 మైళ్ళు.ఒక ఏడాదిలో (6 లక్షల కోట్ల (ట్రిలియన్ ) మైళ్లు ) కాంతి ప్రయాణించిన దురాన్ని కాంతి సంవత్సరం అంటారు ఆల్ఫా సెంటారీ తార దూరం 4.3 కాంతి సం వత్సరాలని థామస్ హేండర్సన్ కనుగొన్నారు.1900 సం.రానికి  విక్షేప పద్ధతిని ఉపయోగించి 70 తారల దూరాలను కనుగొన్నారు 1950 కల్లా 6000 తారల దూరాలు కనుగొన్నారు. మన కంటితో 6000 తారలను చూడగలం.1609 లోనే గేలీలియో పాల పుంత గెలాక్సీ ని గమనించాడు. విలియం హెర్షల్ 1785 లో రోదసిలో తారలన్ని ఒక కటకం ఆకారం లో అమరి ఉన్నాయని ప్రతిపా దించాడు.                                              రెండవ మెట్టు :1921 లో 25 సెఫెయిడ్ తారలను హేన్రి యేట్టా లీవిట్ కనుగొన్నారు. షాప్లీ గోళాకార రాసులను కనుగొన్నాడు. గేలాక్సీ పరిమాణం కొలవాలని ప్రయత్నించాడు. సూర్యుడు గెలాక్సీ కేంద్రం చుట్టూ సెకనుకి 150 మైళ్ళ వేగంతో కదులుతూ  200 మిలియన్ ఏండ్లకు ఒకసారి గేలాక్సీ చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు. గెలాక్సీ వ్యాసం లక్ష కాంతి సం వత్సరాలు అని తెలిసింది. తారా నీహారికలను(నెబ్యూలా )మెసియర్ కనుగొన్నాడు. ఓరియన్ నెబ్యూలాను క్రిస్టియన్ హైగెన్స్ కనుగొన్నాడు.విలియం పార్సన్స్, సైమన్ మారియస్ నెబ్యూలాలను అధ్యయనం చేశారు.100 అంగుళాల దూరదర్శిని తో హబుల్ ఆండ్రోమెడా ను గమనించి ఇది ఒక గేలాక్సీ అని తేల్చారు. ఇది మన గెలక్సీ కి 2.5 మిలియన్ కాంతి సం.రాల దూరంలో ఉన్నట్లు తేలింది. గేలాక్సీ లు కూడా రాసులుగా ఉంటాయి. కోమా బెరెనేసిస్ అనే తారా రాశిలో 11,000 గెలా క్సీ లు ఉన్నాయి. మన గేలాక్సీఉన్న తారా రాశి లో 19 గేలాక్సీ లు ఉన్నాయి.                                                     3 వ మెట్టు :100 మిలియన్ కాంతి సం. రాలకి మించిన దూరాలను కొలవడానికి ఎడ్విన్ హబుల్ మరో పద్ధతి కనుగొన్నాడు.హబుల్ నోవాలపై అధ్యయనం చేశారు. వెస్టో స్లిఫర్ తారల నుండి వచ్చే కాంతిని బట్టి వాటి వయసులు తెలుసుకున్నాడు. అన్ని గేలాక్సీ లు మనకు దూరంగా వెడుతుంటే ఆండ్రో మెడా గేలాక్సీ మన గేలాక్సీ కి దగ్గరగా వస్తుంది. హబుల్ గేలాక్సీ ల దూరం కనుగొనడానికి V=HD అనే సూత్రాన్ని ప్రతి పాదించాడు. H=హబుల్ స్థిరాంకం. ఇలా గేలాక్సీ లన్నీ పరస్పరం దూరంగా జరుగుతుంటే విశ్వం వ్యా కోచిస్తుందా అన్న సందేహం కలిగింది. మహా విస్పోటనం విశ్వానికి నాంది అని జార్జి లమేత్ర్ మొట్ట మొదట ఊహించారు. విశ్వం లోని అంతరి క్షమే వ్యాకోచిస్తుంది. అలా పరిమాణం పెరిగి తిరిగి సంకోచిస్తుంది. దీన్నే మహా సంకో చం అంటారు. మన పాల పుంత గేలాక్సీ లో 20,000 కోట్ల తారలున్నాయి అందులో మన సూర్యుడొకడు.గేలాక్సీ కేంద్రం నుండి మన సూర్యుడు 26,000 కాంతి సం. రాల దూరం లో ఉన్నాడు. ప్రస్తుత అంచనాల ప్రకారం దృశ్య విశ్వం 93 బిలియన్ కాంతి సం వత్సరాలు.ఇలాంటి అద్భుతమైన, ఊహించటానికే వీలు కాని దూరాలను గురించి ఎంతో ఆసక్తికరంగా వివరించారు రచయిత. వారికి అభినందనలు.విశ్వం అనంతత ముందు సౌరకుటుంబం, భూమి, మానవ జాతి  చాలా అల్పంలా అనిపిస్తాయి. సౌరమండలం చివరినుండి మన భూమి చిన్న చుక్కలా కనిపిస్తుంది. కానీ మన భవిష్యత్తు  ఈ భూమే దానిని రక్షించుకోవాలి అన్న గొప్ప సందేశం తో ముగిస్తారు. విశ్వాన్ని అధ్యయనం చేయాలనే ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా సైన్స్ విద్యార్థులు,ఉపాధ్యాయులు అధ్యాపకులు చదివి తీరవలసిన పుస్తకమిది.

Tuesday 24 May 2022

మెదడు చరిత్ర :Dr. వి. శ్రీనివాస చక్రవర్తి

 రచయిత :డా. వి. శ్రీనివాస చక్రవర్తి             పుస్తక పరిచయం :ఒద్దుల రవిశేఖర్                      మనం ఆలోచిస్తున్నామన్నా, మన శరీరం లోని అన్ని వ్యవస్థలు క్రమబద్ధంగా నడుస్తున్నాయన్నా దానికి కేంద్రం మెదడే. మెదడు గురించి ఆలోచించి పరిశోధించిన వారి వివరాలు తెలియజేస్తూ మనకు మెదడు గురించి అర్ధమయ్యేలా సరళంగా వ్రాయడానికి ప్రయత్నించిన పుస్తకమిది. ఇది science కు సంబంధించిన పుస్తకం కనుక చదివి పూర్తి వివరాలు తెలుసు కోండి. ఇక్కడ  విశేష కృషి చేసిన శాస్త్రవేత్తల గురించి మాత్రమే ప్రస్తావిస్తాను. క్రీ.శ  2వ శతాబ్దంలోనే వైద్యుడ యినా కాడ్ గాలెన్ మెదడు నిర్మాణాన్ని వివరించాడు.1500 సం రాల తర్వాత లియో నార్దో డావిన్సీ అండ్రియాస్ వేసేలియాస్ మెదడు గురించి గొప్ప అధ్యయనాలు చేశారు. తరువాత రెనడే కార్త్, ఫ్రాన్స్ గాల్ మెదడును యంత్రం లా భావించారు.రాబర్ట్ హుక్ సూక్ష్మ దర్శిని సహాయం తో జీవకణాలను మొదటి సారి చూసాడు.ఆంటాన్ వాన్ రీవెన్ హాక్ సూక్ష్మ దర్శిని సహాయంతో నాడీ కణాలను పరిశీలించాడు. లూయిగీ గాల్వాని విద్యుత్ జీవక్రియా శాస్త్రం నకు ప్రాణం పోశారు. జోహాన్నస్ ముల్లర్ ఇంద్రియ సంవేదనలపై శో ధించారు. ఎమిల్ దుబ్వా రేమండ్ హెల్మ్ హోల్జ్ "విద్యుత్ ఈల్" మీద పరిశోధనలు గావించారు. హోల్జ్ నాడీ మండల క్రియలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు.20 వ శతాబ్దం ఆరంభానికి మెదడు ఒక విస్త్రతమైన సంక్లిష్టమైన విద్యుత్ యంత్రం అని అర్ధమయ్యింది. ఔషద  శాస్త్రంపై పెన్ ఫీల్డ్,పాల్ బ్రోకా, కార్ల్ వెర్న్ కీ పరిశోధించారు. వెర్న్ కీ పరిశోధన ల నుండి కనెక్షనిజం అనే నాడీ   శాస్త్రం ఆవిర్భవించింది. దాన్నుండి neural networks అనే కొత్త గణిత సిద్ధాంతం జన్మించింది. మనస్తత్వ శాస్త్రం పై ఇవాన్ పావ్లోవ్ జరిపిన పరిశోధనలు ప్రేరణ, స్పందన, నియంత్రణ లకు దారితీశాయి. B. F. Skinner,Tharandike, jhon watson ప్రవర్తనా వాదాన్ని ప్రవేశ పెట్టారు. మెదడు ఒక జాలం (Net work ) 10,000 కోట్ల న్యూరానులను కలిగి ఉంది. ఇన్ని విశేషాలను మనకు వివరించిన రచయిత శ్రీనివాస చక్రవర్తి గారికి ధన్యవాదాలు చెప్పాలి. మెదడు గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉన్నవారు పాఠశాల, కళాశాలలో సైన్స్ విద్యార్థులు ఉపాధ్యాయులు, అధ్యాపకులు తప్పక చదవాల్సిన పుస్తకం...... ఒద్దుల రవిశేఖర్.

Monday 23 May 2022

కోవిడ్, ఎయిడ్స్ నేను..... Dr.Y.మురళీ కృష్ణ

 ప్రతి రంగంలో క్రొత్త దారులు వేసేవారుంటారు. తమదయిన ముద్రతో వినూత్న ఆవిష్కరణ లతో మానవాళికి మేలు చేసే వారుంటారు వారిలో డా. యనమదల  మురళీ కృష్ణ గారు ఒకరు. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న రెండు మహమ్మారులకు తన దైన పరిష్కారాలు చూపిస్తూ లక్షలాది మంది జీవితాలను రక్షిస్తున్న మురళీ కృష్ణ గారి  వ్యాసాలు Facebook లో తరచుగా చదువుతూ share చేస్తుండే వాడిని.తాను కనుగొన్న పద్ధతులతో ఎయిడ్స్, కోవిడ్ కు ఇచ్చే చికిత్సలపై ఆయన వ్రాసిన "కోవిడ్ ఎయిడ్స్ నేను "అన్న పుస్తకం తెప్పించుకుందామనుకుంటూ కొంత ఆలస్యమయ్యింది."రవీ నువ్వు చదవాలి" అంటూ ఆప్యాయంగా పలకరించి పుస్తకాన్ని పంపించిన వారికి ధన్యవాదాలు. వైద్య రంగంలో ఆరోగ్యం పట్లతగిన జాగ్రత్తలు చెబుతూ సరియైన చికిత్సను అందిస్తూ రోగిని కోలుకునేలా చేయడం వైద్యుని ప్రాధమిక విధి.  ఏ మందు వాడాలో, ఏ చికిత్స,ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ పుస్తకం లో చక్కగా వివరించారు.వైద్య రంగం లో తాను చేసిన కృషిని వివరిస్తూ తగిన సూచనలు అందజేస్తూ ఎయిడ్స్, కోవిడ్ ల పట్ల ప్రజలకు సరిఅయిన అవగాహన కల్పించడం లో వారి అనుభవం పరిశోధన ఎంతగానో దోహద పడ్డాయి. అంతర్జాతీయ స్థాయిలో వారి ప్రతిభను గుర్తించడం, మన దేశపరిస్థితుల కనుగుణంగా వైద్య విధానాలు రూపొందించడం ఆయనలోని విశేష ప్రతిభ, మేధస్సును తెలియజేస్తాయి. ఈ పుస్తకం లో నాకు విశేషంగా తోచిన, ఉపయుక్తంగా అనిపించిన కొన్ని అంశాలు 1)ఆసుపత్రుల్లోని A/C గదుల్లో HAI జబ్బులు వ్యాపిస్తాయి జనం గుమికూడే ప్రాంతాలు మూసికొని ఉండరాదు A/C ఇళ్ళకే పరిమితం చెయ్యాలి.2)ఇంటిలో కేవలం సబ్బు, నీటిని ఉపయోగించి చేతులు శుభ్రం చేసుకోవాలి. ఇతర చోట్ల శానిటైజర్ వాడాలి.3) కోవిడ్ బారిన పడ్డవారు  ధైర్యం, ప్రశాంతత, డాక్టర్ సూచించిన వైద్యం తో కోలుకోవచ్చు.4) కరోనాకు home care treatment ను రెండు pages లో చేతిరాతతో వివరించిన విధానం 5)కోవిడ్ చికిత్సలో డా. మురళీ కృష్ణ గారి ప్రోటోకాల్ అంతర్జాతీయ సదస్సుకు పరిశోధనా పత్రం సమర్పణ వారిలోని విశేషమైన ప్రతిభకు తార్కాణం.6)కోవిడ్ బారిన పడ్డ వారికి ఎదురవుతున్న సమస్యలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు 7) అన్ని వ్యాసాల్లో అదనపు సమాచారం కోసం QR codes ఇవ్వడం 8)MBBS చేస్తున్నప్పటినుండి ఎయిడ్స్ పట్ల సమాజానికి అవగాహన కల్పిస్తూ దానిపై స్వంత పరిశోధనలుచేస్తూ specialist వైద్యునిగా ఆయన ప్రయాణం అద్భుతం.9)ఎయిడ్స్ రోగులను ఆయన చూసే విధానం కొన్నివేల మంది రోగులకు ఆరోగ్యాన్ని ప్రసాదించడం మానవునిలోనే మాధవుడున్నాడు అనేందుకు సాక్ష్యం.10) తాను తక్కువ ఖర్చుతో, స్వంత డబ్బులతో వైద్యం చేస్తూ నిస్సహాయమైన రోగులకు సహాయం చేసేలా సమాజాన్ని చైతన్యం చేయడం 11) వైద్యునిగా ఆయనకు కలిగే సంతృప్తిని గురించి "మీరు జీవితాన్ని స్వాధీనం చేసుకున్నారు "అన్న ప్రశంస పొందడం 12) వైద్య రంగం లోని లోటుపాట్లను ఒక వైద్యునిగా ఎత్తి చూపడం  13)ఆయన వైద్య విద్యార్థి గా ఉన్నప్పటినుండి ఇప్పటివరకు తన గురించి, తన విధానాల గురించి వివరించే పద్ధతి పాఠకుడిని పుస్తకాన్ని ఆసక్తిగా చదివేలా చేస్తుంది.14) వైద్యం లోని విషయాలే కాకుండా గొప్ప జీవన తాత్వికతను గురించి చెబుతూ ఆలోచింప జేసే విధానం 15) మనం పంచిన ప్రేమ పదింతలై తిరిగి వస్తుంది... ఎంత గొప్ప తాత్వికత 16) విపరీత మైన వినిమయలాలస ప్రకృతిని ధ్వంసం చేస్తుంది అన్న విషయం ద్వారా పర్యావరణ పరిరక్షణ గురించి చెప్పడం 17)తనకు నచ్చిన, తాను మెచ్చిన వ్యక్తుల గురించి చెప్పడం 18) జ్ఞానాన్ని అనుభవం లోకి తెచ్చు కోవడమే గొప్ప జీవితం, సంతృప్తిని మించిన సంపదలేదు అని తన అనుభవ సారం చెబుతారు 19)కాలం చెల్లిన మందులు కూడా వాడొచ్చు అన్న కొత్త విషయాన్ని తెలియజేయడం 20)ఆయన,పుస్తకాలు విపరీతంగా చదవడం, కాలం కన్నా ముందు ఆలోచించడం.                                             ఇవీ ఈ పుస్తకం లో నాకు నచ్చిన అంశాలు. ఆరోగ్య స్పృహ ఉన్న ప్రతి ఒక్కరు చదవతగ్గ పుస్తకం. నాకు అనిపిస్తుంటుంది, ప్రకృతి తనను తాను రక్షించుకోవడానికి ఒక్కో రంగం లో కొంతమంది విశిష్ఠ వ్యక్తుల్ని సృజించుకుంటుంది అని. అందులో మురళీ కృష్ణ గారు ఒకరు. వారికి నాదొక విన్నపం,వ్యాధులు, జబ్బులు రాకుండా ముందుగా ఎటువంటి ఆహారం తీసుకోవాలి, తగిన చికిత్సలు, తక్కువ ఖర్చుతో రోగాలు నయమయ్యే విధానాలపై మరిన్ని పుస్తకాలు వ్రాయాలని........ ఒద్దుల రవిశేఖర్ 

Sunday 3 April 2022

10 సంవత్సరాల నా బ్లాగ్ ప్రయాణం

 2011 జులై లో అనుకుంటా ICT లో training, Mysore లో ఉందంటూ ఉమ్మడి రాష్ట్రం నుండి 5 లేదా 6 మంది ఉపాధ్యాయులను అనుకుంటా పంపారు ప్రభుత్వం తరపున. అది దక్షిణాది రాష్ట్రాల ఉమ్మడి శిక్షణా సమావేశం. అప్పుడు అందరి సమక్షంలో బ్లాగ్ ఎలా మొదలు పెట్టాలో చెప్పారు. అప్పుడు మొదలయిన నా బ్లాగ్ ప్రయాణం 10 ఏండ్లు పూర్తి చేసుకుంది.మొదట్లో చదువరుల సంఖ్య బాగా ఉండేది. చక్కగా స్పందిస్తూ comments వ్రాసేవారు. అప్పుడు ఈ FB, Whatsapp, instagram లు లేవు. క్రమేపీ ఇవన్నీ వచ్చాక బ్లాగ్ లు చదవడం తగ్గింది.అయినా వ్రాస్తూ ఉన్నా. ఇప్పటికి 200 post లు పూర్తయ్యాయి.77,601మంది పాఠకులు చదివారు.1000 comments వచ్చాయి.చదువుతున్నట్టు statistics చూపిస్తున్నాయి. కానీ స్పందనలు లేవు.బ్లాగ్ లో వ్రాసేవన్నీ ఇప్పుడు Fb లో share చేస్తున్నా. Fb లో కూడా అంతే చదివే అలవాటు బాగా తగ్గి పోతున్నారు. దానికి బదులుగా వినడం, చూడడం బాగా పెరిగింది. దానికి youtube వేదికయింది.ఇంతకు ముందే పెట్టిన youtube channel ఉన్నా బ్లాగ్ లో పెట్టిన విషయాలను, ఇంకా నేను చెప్పాలనుకున్న విభిన్న అంశాలను ఒక చోట చేర్చాలని దానికి కొత్తగా ఒక youtube channel పెట్టాలనుకుంటున్నాను. త్వరలో మీ ముందుకు వస్తాను. అందులో ఆడియో, video అన్ని రూపాల్లో share చేసుకోవాలని. మిత్రులందరికి ముందుగా తెలియజేయాలని ఇక్కడ పంచుకుంటున్నాను. ఎప్పటిలాగానే సదా మీ ప్రోత్సాహాన్ని కోరుకొనే ..... మీ ఒద్దుల రవిశేఖర్.

"పధం" సంస్థలో NMMS లో శిక్షణ.

 "పధం"సంస్థలో NMMS,SSC విద్యార్థులకు శిక్షణ"పధం" సంస్థ.                           తర్లుపాడు వారి ఆధ్వర్యం లో సంక్రాంతి సెలవుల్లో 10 వతరగతి విద్యార్థులకు శిక్షణా కార్యక్రమాలు 8/1/2022 నుండి ప్రారంభమయ్యాయి.NMMS విద్యార్థులకు గత సం దసరా నుండి శిక్షణా తరగతులు జరుగుతున్నాయి.10 వ తరగతి విద్యార్థులకు అన్ని subject లలో పరీక్షలో వచ్చే అంశాలపై విషయ నిపుణులతో శిక్షణ ఇప్పిస్తున్నారు.పధం నిర్వాహకులు మల్లిఖార్జున ఈ  కార్యక్రమాన్ని సమన్వయ పరుస్తున్నారు.మొదట introduction class తీసుకున్న ఒ.వి.రవిశేఖర్ రెడ్డి ,చిన్నప్పుడు అందరికి "కుతూహలం" చాలా ఎక్కువగా ఉంటుందని వయసు పెరిగే కొద్దీ ఆ లక్షణం కోల్పోతారని చెబుతూ తెలుసుకోవాలనే కోరిక విద్యార్థి దశలో అత్యున్నత స్థాయిలో ఉండాలని దానినుండి జ్ఞానం ఆనందం వస్తాయని జీవితమంతా అటువంటి కుతూహలాన్ని కోల్పోకుండా ఉండాలని  స్నేహితుల,పరిసరాల ప్రభావం మీపై  ఎక్కువగా ఉంటుందని ,చిన్న వయసు నుండి మంచి అలవాట్లను ఏర్పర్చుకుంటూ చెడు అలవాట్లను తొలగించుకుంటూ మనసు ను ఎప్పటికప్పుడు rewiring,recharging చేసుకోవాలని చెప్పారు.జార్జి ఫార్మసీ కాలేజ్ కరస్పాండెంట్ శ్రీ A.సతీష్  మాట్లాడుతూ పరిసరాలను పరిశీలిస్తూ,ప్రయోగాత్మకంగా నేర్చుకుంటూ ఉంటే ఏదయినా వస్తుందని ఉపాధ్యాయులే అంతా చెప్పాలనే భావన నుండి బయటపడాలని స్వయం అభ్యసనం(self learning) చేయాలని జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలనే లక్ష్యాలు పెట్టుకోవాలని విద్యార్థులకు సందేశ మిచ్చారు.మార్కాపురం బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ M.చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ ప్రాంతం ఒక శాంతినికేతన్ లా ఉందని ఇలాంటి వాతావరణం లో చక్కని జ్ఞానం పొందవచ్చని పధం నిర్వాహకులను అభినందించారు.చెన్నారెడ్డి పల్లి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, శ్రీ వై శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులు పరీక్ష విధానం గురించి క్షుణ్ణంగా తెలుసుకుని మంచి మార్కులు సాధించాలని పదం కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మర్రిపాలెం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగేశ్వర రావు గారు సంక్రాంతి సెలవులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మార్చిలోనే పరీక్షలు జరుగుతాయని ఈ మూడు నెలలు ఏకాగ్రతతో చదవాలని విద్యార్థులను కోరారు.చివరగా మల్లిఖార్జున గారు మాట్లాడుతూ చదవడం ఒక ఆనందకర ప్రక్రియ అని,జీవితంలో సాధించాల్సింది ఆనందంగా ఉండడమే అని అటువంటి సమాజాలు ఉన్నతమైనవని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో పదం నిర్వాహకులు చాంద్ భాషా,ఆనంద్,కోటి మోహన్,వెంకట్ నారాయణ,నాగూర్, గాలెయ్య భాస్కర్, కరీం పాల్గొన్నారు."పధం"సంస్థలో NMMS,SSC విద్యార్థులకు శిక్షణ"పధం" సంస్థ. తర్లుపాడు వారి ఆధ్వర్యం లో సంక్రాంతి సెలవుల్లో 10 వతరగతి విద్యార్థులకు శిక్షణా కార్యక్రమాలు 8/1/2022 నుండి ప్రారంభమయ్యాయి.NMMS విద్యార్థులకు గత సం దసరా నుండి శిక్షణా తరగతులు జరుగుతున్నాయి.10 వ తరగతి విద్యార్థులకు అన్ని subject లలో పరీక్షలో వచ్చే అంశాలపై విషయ నిపుణులతో శిక్షణ ఇప్పిస్తున్నారు.పధం నిర్వాహకులు మల్లిఖార్జున ఈ కార్యక్రమాన్ని సమన్వయ పరుస్తున్నారు.మొదట introduction class తీసుకున్న ఒ.వి.రవిశేఖర్ రెడ్డి ,చిన్నప్పుడు అందరికి "కుతూహలం" చాలా ఎక్కువగా ఉంటుందని వయసు పెరిగే కొద్దీ ఆ లక్షణం కోల్పోతారని చెబుతూ తెలుసుకోవాలనే కోరిక విద్యార్థి దశలో అత్యున్నత స్థాయిలో ఉండాలని దానినుండి జ్ఞానం ఆనందం వస్తాయని జీవితమంతా అటువంటి కుతూహలాన్ని కోల్పోకుండా ఉండాలని స్నేహితుల,పరిసరాల ప్రభావం మీపై ఎక్కువగా ఉంటుందని ,చిన్న వయసు నుండి మంచి అలవాట్లను ఏర్పర్చుకుంటూ చెడు అలవాట్లను తొలగించుకుంటూ మనసు ను ఎప్పటికప్పుడు rewiring,recharging చేసుకోవాలని చెప్పారు.జార్జి ఫార్మసీ కాలేజ్ కరస్పాండెంట్ శ్రీ A.సతీష్ మాట్లాడుతూ పరిసరాలను పరిశీలిస్తూ,ప్రయోగాత్మకంగా నేర్చుకుంటూ ఉంటే ఏదయినా వస్తుందని ఉపాధ్యాయులే అంతా చెప్పాలనే భావన నుండి బయటపడాలని స్వయం అభ్యసనం(self learning) చేయాలని జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలనే లక్ష్యాలు పెట్టుకోవాలని విద్యార్థులకు సందేశ మిచ్చారు.మార్కాపురం బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ M.చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ ప్రాంతం ఒక శాంతినికేతన్ లా ఉందని ఇలాంటి వాతావరణం లో చక్కని జ్ఞానం పొందవచ్చని పధం నిర్వాహకులను అభినందించారు.చెన్నారెడ్డి పల్లి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, శ్రీ వై శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులు పరీక్ష విధానం గురించి క్షుణ్ణంగా తెలుసుకుని మంచి మార్కులు సాధించాలని పదం కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మర్రిపాలెం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగేశ్వర రావు గారు సంక్రాంతి సెలవులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మార్చిలోనే పరీక్షలు జరుగుతాయని ఈ మూడు నెలలు ఏకాగ్రతతో చదవాలని విద్యార్థులను కోరారు.చివరగా మల్లిఖార్జున గారు మాట్లాడుతూ చదవడం ఒక ఆనందకర ప్రక్రియ అని,జీవితంలో సాధించాల్సింది ఆనందంగా ఉండడమే అని అటువంటి సమాజాలు ఉన్నతమైనవని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో పదం నిర్వాహకులు చాంద్ భాషా,ఆనంద్,కోటి మోహన్,వెంకట్ నారాయణ,నాగూర్, గాలెయ్య భాస్కర్, కరీం పాల్గొన్నారు.

Scince day రోజున నా రేడియో ఇంటర్వ్యూ.

 28/2/2022 న జాతీయ సైన్స్ దినోత్సవ సందర్భంగా మార్కాపురం ఆకాశవాణి కేంద్రం అధికారి శ్రీ సుధాకర్ మోహన్ గారు నాతో నిర్వహించిన interview ఈ దిగువ లింక్ లో తన website లో ఉంచిన నాగమూర్తి గారికి ధన్యవాదములు. నన్ను ప్రోత్సాహించిన సుధాకర్ మెహన్ గారికి ప్రత్యేక ధన్యవాదములు.(http://www.ignitephysics.net/2022/03/28-28-02-2022.html?m=1)

Monday 28 March 2022

స్పందనా రాహిత్యం

 ఒక అందమైన దృశ్యాన్ని చూస్తే హృదయం పరవశిస్తుంది.ప్రకృతి అందాలకు మనసు మురిసిపోతుంది. పైరగాలి పాటకు ప్రాణం లేచి వస్తుంది.బోసినవ్వుల పసిపాపను చూస్తే అప్రయత్నంగా మన పెదవుల పై చిరునవ్వు ప్రత్యక్షం అవుతుంది. ఎవరయినా మనల్ని పలకరిస్తే ముఖం విప్పారుతుంది.ఏదయినా ప్రశ్న వేస్తే జవాబిస్తాం. అడగాలనిపిస్తే ప్రశ్నిస్తాం.హాస్యానికి నవ్వులతో హారతి పడతాం.క్లిష్టమైన సమస్యలకు తర్కాన్ని అన్వయిస్తాం. తోటివారు చూపే ప్రతిభా నైపుణ్యాలను అభినందిస్తాం. ఇలా ఎన్నో విధా లుగా ప్రతిస్పందిస్తుంటాం. ఇది మానవ సహజ లక్షణం. కానీ ప్రస్తుతం ఒక కొత్త తరహా మానసిక స్థితి ఏర్పడుతుంది. దేనికీ స్పందించకపోవటం. Online or offline మనకెందుకు లే అనే భావన. ఇది ప్రత్యక్ష సంభాషణల్లోను పరోక్ష social మీడియాలోనూ గమనించవచ్చు. FB లో చాలా మంది అసలు active గా ఉండరు. Active గా ఉన్నవాళ్లలో ఎక్కువ మంది ఒక paragraph అయినా చదవరు. చదివిన వారు స్పందించరు. ఇక whatsapp లో మరీను.256 మంది ఉన్న group లో ఏ కొద్ది మందో post లు పెడుతుంటారు. ఒక్కరు లేదా కనీసం ఇద్దరు కూడా స్పందించరు.ఇక చాలామంది వారికి ప్రత్యక్షంగా whatsapp కి పంపిన సమాచారానికి కూడా స్పందించరు. పంపేవారు కూడా అవసరం లేనివికూడా ఎక్కువ సందేశాలు పంపుతుంటారు.whatsapp ఓ రకంగా మనం మరిచిపోయిన ఉత్తరాలు వ్రాసుకోవడానికి ఆధునిక రూపం. ఏదయినా మాట్లాడు కుంటేనే మాటలు, స్నేహం కుదురుతుంది. స్పందిస్తుంటేనే మన మనస్తత్వం ఎదుటివారికి అర్ధమవుతుంది. Social media ను మనం ఇంతకుముందు వ్రాసిన ఉత్తరాలకు బదులుగా చక్కగా ఉపయోగించుకోవచ్చు.ఎంత మంచి విషయం post చేసినా కనీసమైన స్పందన ఉండటం లేదు.communication gap భయంకరం గా కనిపిస్తుంది. పరస్పర మానవ సంబంధాల్లో కూడా ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరు ఎవరితో వివరంగా ఏదీ చెప్పరు. చెప్పినా దానికి సరిఅయిన సమాధానం ఇవ్వరు.ఇలా కుటుంబంలో,బయట స్పష్టత స్పందన కరువై ఎన్నో సమస్యలు సంక్లిష్టం గా మారుతున్నాయి.మానవ సంబంధాల పటిష్టతకు కనీసం ఒక ఫోన్ కాల్, లేదా ఒకసారి ఆత్మీయులను కలవడం చేయాలి. అవతలి వారి బాధలు వినాలి.సహానుభూతి(empathy )కలిగి ఉండాలి. స్పందించే గుణం కోల్పోతే సగం జీవితం కోల్పోయినట్లే..... ఒద్దుల రవిశేఖర్.

Sunday 20 March 2022

Heal Paradise(అనాధ పిల్లల పాఠశాల ) village సందర్శన

 

ఎప్పటినుండో అనుకుంటూ వెళ్లలేకపోయిన ప్రదేశం ఇది. ఓ సారి CA PRASAD గారి పిలుపు మేరకు నయీ తాలీమ్, మానవతా మిత్రమండలి సమావేశానికి 2018 లో వెళ్లలేకపోయిన ప్రాంతం. కరోనా కష్టాలు తొలగి పోయిన తరువాత ఇక వెళ్లకుండా ఉండలేక పో యాను. ప్రసాద్ గారు అందులో పనిచేసే కరుణ బాబు, మణికుమారి ఫోన్ numbers ఇవ్వడం తో వారి తో సంప్రదించగా రమ్మన్నారు.మణికుమారి గారయితే అమెరికా నుండి ఫోన్ చేసి campus incharge ప్రసాద్ గారి నెంబర్ ఇచ్చారు.vijayawada city bus stand నుండి 308 అగిరపల్లి bus ఎక్కి గంట ప్రయాణం తరువాత దిగాను. నూజివీడు రూట్ లో 30 కి. మీ ఉంటుంది. ముందుగానే నాకోసం wait చేస్తున్న Blind school incharge అబ్రహాం గారు నన్ను అక్కడనుండి 5km దూరంలోనున్న పాఠశాలకు తీసుకెళ్లి సంజన madam గారికి పరిచయం చేశారు. ఆమె ఈ మధ్యనే అక్కడ చేరారట.B.Tech పూర్తి చేసి వాలంటీర్ గా అక్కడ చేరారు. ఆమె campus అంతా చూపిస్తూ వివరంగా చెప్పారు. పాఠశాలలో సుమారు 700 మంది అనాధ, పేద పిల్లలకు 1 నుండి 12 తరగతి వరకు CBSE విధానం లో ఉచిత విద్య నందిస్తున్నారు.మొదట ఆర్గానిక్ ఫార్మింగ్ చూసాము. దానికి వెనుకగా పెద్ద సరసు.ప్రకృతి అంతా పిండారబోసినట్లు. తరువాత blind school చూసాము incharge అబ్రాహాం గారు. ఎవరయినా పిల్లలు ఉంటే refer చెయ్యమన్నారు. తరువాత జైపూర్ పాదం తరహాలో ఇక్కడ కూడా 18ఏండ్ల లోపల వయసు గలవారికి చెయ్యి కాలు రెండూ అమర్చుతారు. Great service. అక్కడ నుండి సోలార్ పవర్ తో నడిచే కిచెన్ చూపించారు.శక్తి వనరులు ఆదా చేయడం ఎలాగో ప్రత్యక్షంగా చూడొచ్చు. భవనం పై ఏర్పాటు చేసిన సౌరఫలకల తోనే మొత్తం campus అంతా కరెంటు అవసరాలు తీరుతున్నాయి. మిగిలిన విద్యుత్ ను ప్రభుత్వానికి అమ్ముతారు. మంచి రుచికరమైన పోషకాహారం పిల్లలకు అందిస్తున్నారు. తరువాత ప్రిన్సిపాల్ శ్రీదేవి గారితో, campus incharge ప్రసాద్ గారితే మాట్లాడి HEAL SCHOOL గురించి వివరంగా తెలుసుకున్నాను. వారు తమ సమయాన్ని నాకు కేటాయించి ఎంతో ఆదరంతో మాట్లాడారు. ఏదయినా విద్యార్థులకు నా వంతు సహాయం చేయగలనని తెలిపాను.science labs అద్భుతంగా తీర్చి దిద్దారు. ఆధునిక మైన డిజిటల్ classrooms, computer lab ఉన్నాయి. పిల్లలకు అన్ని రకాల ఆటలు ఆడుకోవడానికి విశాలమైన ఆటస్థలం ఉంది.ఎవరికయినా సహాయం చేయాలనుకుంటే అత్యంత అర్హులు అనాధ పిల్లలే. ఇంత గొప్ప సేవకు అంకురార్పణ చేసి అనాధపిల్లల కు భువిపై స్వర్గాన్ని సృష్టించిన పాఠశాల వ్యవస్థాపకులు శ్రీ సత్యప్రసాద్ కోనేరు గారు వారి మిత్రులు ఎంతయినా అభినందనీయులు. మనం ధనం,కాలం, జ్ఞానం, ప్రేమ ల్లో ఏదయినా ఆ అనాధపిల్లలకు అందించ వచ్చు. ఒకసారి మీరు చూసి నిర్ణయం తీసుకోండి... ఒద్దుల రవిశేఖర్ 

Thursday 10 February 2022

మనపై మనకు ప్రేమ.

 మనం ఎన్నో పనుల్లో నిమగ్నమవుతుంటాం. ఉద్యోగం,వృత్తి, వ్యాపారం,సేవ, ఇంకా ఎన్నో.నిజంగా ఆయా పనులను సంపూర్ణమైన ఇష్టంతో, ప్రేమతో చేస్తున్నామా ఆలోచించండి.ఎంతో మందిని అభిమానిస్తుంటాం. సినిమాలు, రాజకీయం,ఆటలు వంటి విభాగాల్లో ప్రసిద్దులను అభిమానిస్తుంటాం, ఇష్టపడుతుంటాం.ఒక్కోసారి ఈ ఇష్టం ఎంత వరకు వెడుతుందంటే తమ తల్లిదండ్రులను ఇష్టపడే కంటే,తమనితాము ఇష్టపడే కంటే, తమనితాము ప్రేమించే కంటే ఎక్కువగా ఉంటుంది.ఎవరినైనా అభిమానించవచ్చు. కానీ అది తమ విలువైన కాలాన్ని ఎంత హరిస్తుందోతెలుసుకోరు,పైగా తమ లక్ష్య సాధనకు అడ్డంకి గా కూడా మారొచ్చు. తాము ఎదగాలి అనుకున్న రంగాల్లో కానీ లేదా విభిన్న రంగాల్లో ప్రసిద్దులైన వారి జీవిత చరిత్రలు చదివి లేదా వారి సందేశాలు విని ప్రేరణ పొందవచ్చు. ఆ అభిమానం, ప్రేమ, ఇష్టం తమపై, తాము చేసే పనులపై పెడితే ఎన్నో అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు. ఉదాహరణకి తమ పై తమకి ప్రేమ ఉన్నవారు ఆహార అలవాట్లలో, ఆరోగ్యవిషయాల్లో, వ్యాయామం చేయడం లో శ్రద్ద పెడతారు.... ఒద్దుల రవిశేఖర్.

Tuesday 8 February 2022

యాగంటి సందర్శన

 27 ఏండ్ల నుండి నంద్యాల వస్తున్నా, మహానంది చాలా సార్లు చూసినా యాగంటి చూడటం కుదర్లేదు. ఇన్నాళ్ళకి కుదిరింది. నంద్యాల నుండి బనగానపల్లికి ₹35 టికెట్ ఉంటుంది. మధ్యలో పాణ్యం వస్తుంది. బనగానపల్లి నుండి ఆటో లో ₹30 ఛార్జ్.10కిమీ ఉంటుంది. మధ్యలో KC canal వస్తుంది.ప్రఖ్యాతి గాంచిన బేతంచెర్ల బండల గనులు కనపడతాయి. రెండు కొండల నడుమ కోనేరు, శివాలయం ఉన్నాయి.కోనేరు చాలా అద్భుతంగాఉంది.ప్రస్తుతం ప్రవేశం లేదు.కోనేరు చుట్టూ చక్కటి నిర్మాణం తో  గోడ ఉంది.ఆలయం ప్రక్కనే కొండమీద నుండి నిరంతరం వచ్చే నీరు ఈ కోనేటిలోకి వస్తాయి. మహానంది లో కూడా ఇలానే నీళ్లు వస్తుంటాయి. ఈ నీళ్లతోనే 500 ఎకరాల్లో అరటి సాగు చేస్తుంటారు రైతులు.వేసవి లో కూడా తగ్గకుండా వస్తూనే ఉంటాయట. ఇప్పటికీ అర్ధం కానీ రహస్యం ఇది.ఇక యాగంటి లో గుడి ప్రక్కనే ఉన్న కొండలో ఒక గుహ ఉంది. ఇక్కడే అగస్త్యమహాముని  తపస్సు చేశారట.గుహను చూస్తే సంభ్రమాశ్చర్యాలకు గురవుతాము.సహజంగా ఏర్పడ్డట్లే ఉన్నాయి. మెట్లు ఎక్కి పైకి వెళ్లాలంటే పెద్దవారికి వీలు కాదు. గుహ పైన చీలిక ఉంది. దాని ద్వారా చక్కటి వెలుతురు వస్తుంది. ఈ గుహ ప్రక్కనే ఇంకో గుహలో వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. మహానంది లాగా ఇక్కడ అంతగా అభివృద్ధి జరగ లేదు. చెట్లు ఎక్కువగా కనపడలేదు. కొండల మీద చెట్లే మీ లేవు. కొండల మీద, గుడి ముందు మొక్కలు నాటి పెంచితే మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది.బనగానపల్లి లోనే బ్రహ్మం గారు పశువులను కాస్తూ రవ్వలకొండ లో సహజసిద్ధంగా ఏర్పడ్డ గుహలో కాలజ్ఞానం వ్రాసారట. తాడిపత్రి కి వెళ్ళేదారి లోనే ప్రసిద్ధిచెందిన బెలుం గుహలు ఉంటాయి. మరోసారి వాటిని చూడాలి.

Sunday 2 January 2022

ఒక వైపు.....ఇంకోవైపు.

 కాలం చెక్కిన గాయాన్ని మాన్పటానికి ప్రయత్నం ఒకవైపు,నిర్లక్ష్యపు చేష్టలతో ప్రాణం మీదకు తెచ్చుకునే మనుషులొక వైపు, ఇది జరుగుతున్న వర్తమానం.                                                 ప్రకృతిలో ఎప్పుడూ పరస్పర విరుద్ధ శక్తుల మధ్య సంఘర్షణ అనివార్యం.చరిత్ర మొత్తం మనకు కనిపిస్తున్నదిదే.                                           విధ్వంసక ఆయుధాల కుప్పలపై కూర్చున్న రాజ్యాలొక వైపు,నిస్సహాయంగా చూస్తున్న ఐక్యరాజ్య సమితి మరో వైపు ,నడుస్తున్న నాటకమిదే.                                                   మనిషికి రక్షణ ఛత్రంలా ప్రకృతి ఒక వైపు,దాన్ని ఛిద్రం చేస్తూ కాలుష్యం మరోవైపు మనం నిత్యం చూస్తున్నదిదే.                                         అయస్కాంత మేదో ఆకర్షించినట్లు సంపద కేంద్రీకృతం ఒకవైపు,కోట్ల మంది దరిద్రనారాయణుల జీవితమొకవైపు , కఠిన వాస్తవమిదే.                                            సృష్టికి ప్రతిసృష్టి చేసే విజ్ఞానం ఒక వైపు,జీవితాలను దుర్భరం చేసుకునే అజ్ఞానం మరోవైపు.                                             ప్రజాస్వామ్యం ఇచ్చిన స్వేచ్ఛ ఒక వైపు,నియంతృత్వపు పరిపాలనలోని దైన్యం మరో వైపు.                                                           బంగారం లాంటి భూమిని మరుభూమిగా మారుస్తున్న వైనం ఒక వైపు,అంగారకుడి ఉపరితలంపై ఆవాసం కోసం ఆరాటం మరో వైపు.                                                    నాణ్యమైన,సుఖప్రదమైన జీవితాలొక వైపు,క్షణ క్షణం బ్రతుకు నరకం మరొక వైపు.                    అధిక ఆహారంతో ఊబకాయ ప్రపంచం ఒకవైపు,ఆకలితో డొక్కలంటుకుపోయిన ప్రజలొక వైపు.                                                             వేలకోట్ల ఆకాశ హర్మ్యాలొక వైపు,నిత్యం రాత్రి ఆకాశం చూసే కోట్లాది బ్రతుకులొక వైపు.              ఈ ఘర్షణకు అంతం ఎప్పుడో, లేదా అంతమే పరిష్కారమా! కాలమే సమాధానం ఇవ్వాలి..... ఒద్దుల రవిశేఖర్.

Saturday 1 January 2022

నూతన సంవత్సరం(2022)... నూతన ఆలోచనలు

                 ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లోను స్థానిక కాలమాన పరిస్థితుల్ని బట్టి వారి క్రొత్తసంవ త్సరాలు జరుపుకుంటారు.కానీ ప్రపంచీకరణ జరిగిన తరువాత ఆంగ్లసంవత్సరాన్ని నూతన సంవత్సరంగా జరుపుకునే సంస్కృతి గత 30 సం. నుండి విస్తృతమైంది.ఇక అందరు గతం నుండి బయటపడి నూతన సం.లో సంతోషంగా,ఆరోగ్యంగా ఉండాలని ఇతరులకు శుభాకాంక్షలు చెప్పుకోవడం అలవాటయ్యింది.నిజంగా ప్రపంచంలోని మనుషులందరు ఆశించినట్లు ఇతరుల మేలు కోరే సమాజం ఈ రోజు బాగా కనిపిస్తుంది.ఇతరులగే కాక మనకు మనం  శుభాకాంక్షలు చెప్పుకుంటే మరింత బాగుంటుంది.ఎందుకంటే మన ఆలోచనల్లో వచ్చే మార్పులు,నూతన ఆలోచనలు మనకు మేలు జరగడంతో పాటు ఇతరులకు కూడా ఉపయోగపడాలి,లేదా నష్టం కలిగించకుండా ఉండాలి.అలాగే మనకు నష్టం కలిగించే అసూయ,ద్వేషం,కోపం,బద్దకం,నిర్లక్ష్యం లాంటి వాటినుండి విముక్తి పొంది ప్రేమ,కరుణ,స్నేహం,శాంతి మన మనసులో విరబూయాలని మనకు మనం కోరుకుందాం .                            ఏ వృత్తిలో ఉన్న వారయినా తాము చేసే పనులతో తమలో నైపుణ్యాలు పెంచుకుంటూ,ఇతరులకు ఉపయోగపడేలా ప్రవర్తించాలి.ఉదాహరణకు ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులకు చక్కని విద్యను అందించాలని,ఒక వైద్యుడు రోగులకు మరింత మెరుగైన సేవలందించాలని,రాజకీయనాయకులు ప్రజలజీవితాల్లో మార్పులు తీసుకురావాలని,ఉద్యోగులు ప్రజలకు బాధ్యతగా ఉండాలని,వ్యాపారవేత్తలు నాణ్యమైన వస్తువులు తయారుచేయాలని ఇలా ఎవరికివారు తమకి తాము శుభాకాంక్షలు చెప్పుకోవాలి.మనలో వచ్చే మార్పే బయట ప్రతిఫలిస్తుంది.ఇలా ఎవరికి వారు మారితే బయటి ప్రపంచం సుఖసంతోషాలతో ఉంటుంది.నూతన ఆలోచనలతో మనలో వచ్చేమార్పు అందరికి శుభం కలిగిస్తుంది.అందరికి నూతన సం. శుభాకాంక్షలు.......ఒద్దుల రవిశేఖర్.

Thursday 30 December 2021

వెళ్ళు, నీ కలను వేటాడు(Go,Hunt your dream)

 https://www.fearlessmotivation.com/2019/06/29/go-hunt-your-dream-official-music-video-and-lyrics/. (Thanks to "fearless motivation" William Hollis and Chris's Ross)  పై లింక్ లో వీడియో చూడండి.Powerful motivation.                        *కల ....అది అత్యంతశక్తివంతమైన పదం.              *నీ కలలను వేటాడే క్రమంలో నీవు చాలాసార్లు పడిపోయి ఉండవచ్చు.                                   *తిరిగి ప్రయత్నించడానికి నీకు శక్తి లేదని భావించవచ్చు.                                              *తిరిగి లేవడానికి నీకు బలం లేకపోవచ్చు            *ఇక వదిలివేయడం ఒక్కటే మార్గం అనిపించవచ్చు   *జీవితం కొట్టే ఎదురుదెబ్బలకు నీవు పడిపోవచ్చు   *అదే సరైన సమయం తిరిగి కొట్టటానికి.        *చాలా మంది జీవితం కొట్టే దెబ్బలకు ఎదురుతిరిగి పోరాడలేరు.                                                   *నీవు అలాగే క్రిందనే ఉండిపోతావా లేదా తిరిగిలేచి పోరాడటానికి సిద్ధంగా ఉన్నావా                          *నీ మీద ఎవరికీ నమ్మకం లేనప్పుడు తిరిగి పోరాడటానికి ధైర్యం కావాలి.నమ్మకం కావాలి.బలమైన మనస్తత్వం కావాలి.   *మనందరిలో ఒక సింహం ఉంటుంది.    *కొంతమంది ఆ సింహాన్ని ఎప్పుడూ లేపరు.    *చాలా మంది ఆ సింహాన్ని బోనులో పెట్టి తాళం వేస్తారు.                                                              *నీ కలను సాధించటానికి ఆకలిగొని ఉన్నావా      *ఆ కలను నెరవేర్చుకోవడానికి పోరాటం చేస్తావా       *ఆ సింహాన్ని బయటకు రానీయండి.నీ కలను సాధించే ఆకలి గొనండి.                                   *వెళ్ళు వేటాడునీ కలను సాధించడానికి             *ఆ కల గురించి మాట్లాడటం నిన్ను ముందుకు తీసుకు వెళ్లదు.                                                *పని చేయడం మాత్రమే నిన్ను ముందుకు తీసుకు వెడుతుంది.                                                  *నిన్ను సందేహించేవాళ్ళు వాస్తవికంగా వెళ్లమంటారు.                                               *నిన్ను ద్వేషించేవాళ్ళు వైదొలగమంటారు.        *కానీ ముందుకురికి ఆ కలను సాధించగలిగేది నువ్వే                                                              *అది నీ కల.దాన్ని ఎవరూ వెంటాడరు            *ఎవరు నీ కోసం దాన్ని వేటాడరు                         *నీ కలకు ఎవ్వరూ మద్దతివ్వరు,నీవు తప్ప.       *ఒక సామెత లో ఇలా ఉంది"ప్రతి ఒక్కరికి తినాలని ఉంటుంది.కొంతమంది మాత్రమే వేటకు సిద్ధంగా ఉంటారు.ప్రతి ఒక్కరికీ విజయం సాధించాలని ఉంటుంది.కానీ కొంతమందే అందుకవసరమైన పనిలోకి దిగుతారు.                                           *మిమ్మల్ని మీరు పరిమితం చేసుకోవద్దు.                 *మీ కలలను మీరు నిజాలుగా మార్చుకోగలరు. *కానీ అది సాధ్యపడుతుందని ఒక్కరు మాత్రం విశ్వసించాలి.ఒక్కరు మాత్రం పనిలోకి దిగాలి. ఆ వ్యక్తి నువ్వే                                                        *నీ కంటే ముందు చాలా మంది,వారు కలగన్న జీవితాలను జీవించారు.పెద్ద పెద్ద విజయాలు సాధించారు.                                                  *వారు సాధించారు.అదే సాక్ష్యం నువ్వు సాధించగలగడానికి.                                      *నువ్వు నిజంగా కోరుకుంటే నీ కలను నిజం చేసుకోగలవు.                                                      *నీ కలలకు నువ్వే భయంకరమైన శత్రువువి. ఎందుకంటే నీ కలను ఎప్పుడు విడిచిపెట్టాలో,నువ్వే నిర్ణయిస్తావు కనుక,నువ్వే నిర్ణయిస్తావు నీ కలలను ఎప్పుడు చంపుకోవాలో                                          *నీ గురించి నీకు తెలిసిన దానికంటే నీవు ఎక్కువ శక్తివంతుడివి/రాలివి.                                          *నీ కలతో ప్రపంచాన్ని మార్చగలవు.                  *కానీ దానికి నువ్వు కావాలి. నీ అనువయిన స్థితి నుండి బయటకు రావడానికి,నీలో ఉన్న సింహాన్ని కట్టువిప్పటానికి,ఆ సింహాన్ని బోనులో నుండి నువ్వు మాత్రమే బయటకు విడువగలవు.నువ్వు మాత్రమే నీ కలలను వెంటాడగలవు.                            *బలహీనమైన మనస్తత్వం ఉన్నా,ఆపదలను ఎదుర్కోవడానికి భయపడినా జీవితంలో ఎప్పుడూ ముందుకుపోలేవు                                    *బలహీనమైన మనస్తత్వంతో నువ్వెప్పుడు నీ కలను సాధించుకోలేవు                                      *ఇతరులు వదిలివెడుతున్నా ముందుకే వెళ్లే మనస్తత్వాన్ని సృష్టించుకో                               *జీవితం ఎప్పుడూ ఉహించినవిధంగా ఉండదు.అది ఆశ్చర్యాలతో నిండి ఉంటుంది నువ్వు ఆలోచించే విధం కన్నా నీ కలకు నువ్వు దగ్గరగా ఉంటావు.                                                          *నువ్వు వదిలివెయ్యకుండా ఉంటే నీ కల వాస్తవం అవుతుంది.                                                    *సింహం లా ఉండండి.నువ్వెదుర్కొనే సవాళ్లనుండి ఎప్పుడూ వెనక్కి వెళ్లొద్దు.                                *సింహం ఎప్పుడూ దాని ఆహారాన్ని వేటాడటం ఆపదు,అది దొరికే వరకు.                                    *నీ కలను నిజం చేసుకునేంత వరకు వేటాడటం ఆపవద్దు.                                                        *పెద్ద కలలు కను,నువ్వు కలలు సాధించలేవని చెప్పే అల్పమనస్కుల మాటలు నమ్మొద్దు.                 *అవి వాళ్ళు సాధించలేనివి,కానీ నీకు బాగా తెలుసు                                                         *నిన్ను నువ్వు నమ్ము.                                        *నా లక్ష్యాల,కలల దారిలో నువ్వు కూడా ఉంటే కదులు, ముందుకు కదులు.(అనువాదం:ఒద్దుల రవిశేఖర్) 

Sunday 26 December 2021

స్టూడెంట్ నంబర్ 1

స్టూడెంట్ నంబర్ 1                                                రచన:విశేష్,భరత్                                                   పుస్తక పరిచయం:ఒద్దుల రవిశేఖర్           విద్యార్థుల తల్లిదండ్రులకు అంకితం ఇవ్వటంతోనే ఈ పుస్తక ప్రాధాన్యతను చెప్పకనే చెప్పారు రచయితలు. పైగా ముందు మాట కూడా లేకుండా వచ్చిన పుస్తకం ఈ మధ్య కాలంలో లేదు. మీరు రాసి పంపిస్తే ప్రచురిస్తాం అన్న మాటలతో పాఠకుల దృష్టి పుస్తకం మీదకు వెళ్లేలా చేస్తుంది.

ఈ పుస్తకం లో 12 అంశాలు ఉన్నాయి. ఇంతవరకు ఏ తెలుగు పుస్తకంలో రాని విధంగా సంభాషణల రూపంలో పుస్తకంలోని అన్ని అంశాలను రూపొందించడం, పాఠకుడితో మాట్లాడినట్టు ఉంది ఈ పద్ధతి. తనను తాను identify చేసుకుని లీన మయ్యేలా చేస్తుంది.                                ఇందులోని అంశాలు..

1)  బాగా చదవడమంటే ఏమిటో ఏమిటో విద్యార్థులకు ఎవరూ సరిగా చెప్పకపోవడం అనే అంశాన్ని ప్రస్తావిస్తూ ముందు, ముందు topic లలో వాటికి సమాధానాలుంటాయని ఉత్సుకతను లేపారు. 

                                                                      2)విద్యార్థుల్లో బలమైన నమ్మకాలను పెంపొందించాలని అప్పుడే విజయం సాధ్యమవుతుందని విద్యావ్యవస్థలో అదే లోపించిందని దాన్ని సరిదిద్దాలని ఇందులో తెలియజేస్తారు.                                        3)పాఠాలు ఎలా వినాలో, ప్రతి పాఠం శ్రద్ధగా వింటే అది మన జీవితాలకు ఎలా పెట్టుబడిగా మారుతుందో మన సంపాదనా స్థాయి ఎలా పెరుగుతుందో ఇందులో ఆసక్తిగా వివరిస్తారు.

4)తరగతి లో చెప్పే పాఠ్యాంశాల్ని ఎలా notes రాసుకోవాలో, mindmaps ఎలా తయారు చేసుకోవాలో ఇందులో వివరణాత్మకంగా చెబుతారు.                                   

5)బాగా చదవడం అంటే ఏమిటో 7 steps ద్వారా ఇందులో వివరిస్తారు.అన్నీ సాధన చేస్తే అలవాటయ్యేవే!                         

6)సంగీతం వింటూ ఆల్ఫాస్థితికి చేరి మరింత ఏకాగ్రతను పొంది బాగా చడవవచ్చని, చదివింది, విన్నది,అలాగే గుర్తుండి పోతుందనే వినూత్న విషయాన్ని ఇందులో పరిచయం చేస్తారు.

7)విద్యార్థులకు challenging గా ఉండే "గుర్తుంచుకోవడం" అనే అంశం చదివి తెలుసుకుని ఆచరిస్తే వారి జ్ఞాపక శక్తి అనూహ్యంగా పెరుగుతుంది. 

 8 ) మనం marks, grades, ranks సాధించిన వారినే తెలివైనవారని అనుకుంటాము. తెలివితేటల్లోని విభిన్నమైన రకాలను పరిచయం చేసి,  ప్రతి ఒక్కరికీ ఏదో ఒకదానిలో ప్రావీణ్యం ఉంటుందని చెబుతారు.                         

9)మెలకువలు పాటిస్తే ఎవరయినా ఏకాగ్రతను సాధించవచ్చు అని ఇందులో వివరిస్తారు.     

10) విద్యార్థుల పై ఒత్తిడిని పెంచే పరీక్షలకు ప్రణాళికా బద్దంగా ఎలా తయారు కావాలో తెలియజేస్తారు                       

11)పరీక్షలంటే విద్యార్థుల్లో ఉండే భయాన్ని ఎలా అధి గమించాలో practical గా వివరిస్తారిందులో.

12) ఇక చివరి అంశం లో విద్యార్థులకు ఉండాల్సిన skills ను వివరిస్తూ జీనియస్ లా మారాలంటే ఏ రకమైన ఆలోచనా తీరు కలిగి ఉండాలి,దానికి ఎలాంటి, training తీసుకోవాలో Genius gym లో విద్యార్థులకు ఎటువంటి శిక్షణ ఇస్తారో తెలుపుతూ ఈ పుస్తకాన్ని ముగిస్తారు.             

విద్యార్థులు,వారి తల్లిదండ్రులు తప్పనిసరిగా చదవ వలసిన practical way of conversation ఇందులో వివరించబడింది. తరువాత Genius Gym లో శిక్షణ పొంది genius లుగా మారటానికి ఈ పుస్తకం పునాదిలాగా పనిచేస్తుంది. విద్యార్థినీ విద్యార్థులు, తల్లిదండ్రులు తప్పక చదవ వలసిన పుస్తకం ఇది.

-ఒద్దుల రవిశేఖర్

👉 స్టూడెంట్ నెంబర్-1 పుస్తకం హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో 50, 101 నెంబర్ స్టాల్స్ లో దొరుకుతుంది.

👉పోస్ట్ ద్వారా పొందాలనుకునే వారు ఈ కింది లింక్ క్లిక్ చేయండి. పోస్ట్ ద్వారా మీ ఇంటికి పంపిస్తాం. 

https://imjo.in/sX2DmY

Friday 17 December 2021

వ్యాసరచన

ఏదయినా ఒక విషయాన్ని గురించి సమగ్రంగా వివరంగా అన్ని కోణాల్లో వ్రాయడాన్ని వ్యాసం అంటారు.మనకున్న జ్ఞానానికి,సృజనాత్మక శక్తికి,తార్కిక శక్తికి వ్యాసం నిదర్శనం.స్వాతంత్ర్యోద్యమ కాలంలో గాంధీ,నెహ్రూ తమ భావాలను వ్యాసాల రూపంలో ప్రజలకు తెలియజేసేవారు.                                        పాఠశాలల్లో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహిస్తుంటారు.అలాగే కొన్ని సంస్థలు కూడా వ్యాసరచన పోటీలకు ఆహ్వానిస్తుంటాయి.విద్యార్థి ఏదయినా అంశాన్ని లోతుగా పరిశీలించడానికి, విషయాన్ని సేకరించడానికి తన స్వంత భాషలో అభివ్యక్తీకరించడానికి ఈ ప్రక్రియ ఎంతో దోహదం చేస్తుంది.మన మాతృభాష అయిన తెలుగుతో పాటు హిందీ ,ఇంగ్లీష్ లలో కూడా పాఠశాల స్థాయిలో విద్యార్థులను వ్యాసరచనలో ప్రోత్సాహించాలి.కేవలం పాఠ్యపుస్తకాలలో ఉన్న విషయాలను నేర్చుకుని పరీక్షలు వ్రాయడం కాకుండా ప్రపంచంలోని విభిన్న విషయాలను తెలుసుకోవడానికి వ్యాసరచన పోటీలు దోహదం చేస్తాయి.ఒక భాష మనకు బాగా వచ్చు అంటే ఆ భాషలో బాగా మాట్లాడటం తో పాటు వ్రాయడం కూడా వస్తే పరిపూర్ణత వచ్చినట్లు.                                  ఇక విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాలైన సివిల్స్,గ్రూప్ 1 స్థాయి పరీక్షలు వ్రాయడానికి చిన్నప్పటినుంచి వ్యాసరచన ప్రక్రియ ఎంతో దోహదం చేస్తుంది.పరీక్షల కోసం నేర్చుకుని రాయడం కాకుండా ఏ విషయాన్ని అయినా విశ్లేషించి మన అభిప్రాయాలను వ్యక్తీకరించడం విద్యార్థుల ఉన్నతికి దోహదం చేస్తుంది.                ప్రస్తుతం పాఠశాలల్లో మార్కులు గ్రేడుల మాయాజాలం లో పది వ్యాసరచన ప్రక్రియను ప్రక్కకు పెట్టారు.కనీసం నెలకు ఒక అంశంలో నైనా తెలుగు,హిందీ ,ఇంగ్లీష్ భాషల్లో వ్యాసరచన పోటీలను పాఠశాలల్లో నిర్వహిస్తే విద్యార్థుల భవితకు బంగరు బాటలు వేసినట్లే.           విద్యార్థులు ఏదైయినా అంశంపై తమ స్వంత అనుభవాలను,అభిప్రాయాలను వ్రాసే విధంగా కూడా ప్రోత్సాహిస్తే వారికి రచనా శక్తి అలవడుతుంది.సమాజంలో తాము గమనించే అంశాలపట్ల తమకు వచ్చే ఆలోచనలను,మనిషి జీవితం మరింత సౌకర్యవంతంగా,ఉన్నతంగా మారడానికి అవసరమయ్యే వినూత్న సంస్కరణలను వ్యాసాలరూపంలో వ్రాసి వార్తాపత్రికలు, సోషల్ మీడియా ద్వారా కూడ ప్రజలకు తెలియజేయవచ్చు.                               పైన తెలిపిన విధంగా పాఠశాల స్థాయినుంచే వ్యాసరచన పట్ల ఆసక్తిని,ఇష్టాన్ని,విద్యార్థుల్లో కలిగించడం ప్రతి ఒక్క ఉపాధ్యాయుని బాధ్యత.....ఒద్దుల రవిశేఖర్.

Saturday 11 December 2021

తెలుగు కోసం

 తెలుగు కోసం రచయిత:డా.జి.వి.పూర్ణచందు.                  పుస్తక పరిచయం:ఒద్దుల రవిశేఖర్.    భాష,సాహిత్యం, సంస్కృతి,చరిత్ర ల అనుశీలన అన్న శీర్షికలోనే పుస్తకం లోని విషయాలు ఏంటో తెలుస్తాయి.1)సంస్కృతి చరిత్ర:ఈ విభాగంలో వినాయకుడు,గణపతి ల గురించి వ్రాస్తూ వినాయకచవితిని పర్యావరణ పరిరక్షణ పండుగగా జరుపు కొమ్మని పిలుపివ్వడం బాగుంది.తొలి తెలుగు దేవతలు గురించి ఆసక్తికర విషయాల్లో ఆసక్తికర విషయాలెన్నో.ఆంధ్ర్ర మహావిష్ణువు, మురుగ స్కంధ ,సుబ్రహ్మణ్యం ల వివరణ,అలెగ్జాండర్ దాడి కథల్లో ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి మనకి.సుశ్రుతుని వైద్య విధానాలు,బౌద్ధయుగంలో సభాసంప్రదాయాలు,వైదికుల పరిభాషలో విశేషాలెన్నో.,2) మన ఆహారం భాష సంస్కృతి : అన్నమయ్య వంటకాలు, తెలుగు పచ్చళ్ళ ముచ్చట్లు చదువుతుంటే నోరూరాల్సిందే.తినే ఆహారాన్ని అన్నం అనేది తెలుగు వారే. పంచదార చెరకు పండించిన తొలి రైతులు తెలుగు వారే  3) మన భాష:పాణిని వ్యాకరణానికి చేసిన సేవను గూర్చి చక్కగా వివరించారు.కోడింగ్ పద్ధతిని కంప్యూటర్ లో ఒక భాషను వ్రాయటానికి పాణిని పేరు కూడా చేర్చి పాణిని బాకస్ నౌర్ పద్ధతి అనే వ్యవహార నామం వ్యాప్తి లో ఉంది.భాషను పరిశోధించడం ద్వారా చరిత్రను ఎన్నో విధాలుగా మనం తెలుసుకోవచ్చు .ద్రావిడ కుటుంబంలో తెలుగే తొలిభాష అనే ఆశ్చర్యం గొలిపే తెలుస్తుంది.సింధు నాగరికత   ద్రావిడుల నాగరికత.అందులో తెలుగు వారి పాత్ర ఎంతో ఉందని తెలుస్తోంది.దక్షిణ భారతీయ కులాలు,జాతులలో ఆఫ్రికన్,ఆసియన్ మూలాలు ఉన్నట్లు  mt DNA పరీక్షలో నిర్దారణ అయింది.ఈ జాతులు ప్రస్తుతం తెలుగు నేలమీద నివసిస్తున్నారు.వైదిక యుగం కన్నా ముందు పూర్వ ముండా భాష మాట్లాడిన నాగరిక ప్రజలు ఉండేవారని నిరూపణ అయింది.వరి స్పష్టమైన తెలుగు పదం.పూర్వ ద్రావిడ భాషకు దగ్గరగా కనిపించేది తెలుగు భాషే.పాళీ భాషలో తెలుగు వ్యవసాయ పదాలు కలిసి ఉన్నాయి.ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి తెలుగు భాషకు ప్రాచీన హోదాకై విశేష కృషి చేసారు4)భాషోద్యమం-భాషాభివృద్ది.కంప్యూటర్ లో తెలుగు భాషాభివృద్ది ప్రపంచ భాషగా తెలుగును తీర్చటానికి ఇది మొదటి అడుగు.5) మన భాష మన చారుత్ర:అమెరికా మెక్సికో లోని రెడ్ ఇండియన్లు ,'ఇంకా' మయా అనే రెండు ప్రధాన తెగలు కూడా మూల ద్రావిడ భాషకు సంబంధీకులే అన్న విషయం సంభ్రమానికి గురిచేస్తుంది.మూలా ద్రావిడ భాష మాట్లాడిన ప్రజలు ప్రపంచ దేశాలన్నింటా విస్తరించి ,దక్షిణ భారతదేశంలో తెలుగువారిగా స్థిరపడినట్లు అనిపిస్తుంది.ఇప్పటికి 2700 సం. క్రితం తెలుగు నేలను అస్మకులు పరిపాలించారు.15 వ శతాబ్దానికి ప్రపంచం లోనే అత్యధిక ధనిక సామ్రాజ్యంగా విజయనగర సామ్రాజ్యాన్ని తొలుత గుర్తించినవారు పోర్చుగీస్ లు.రాయల కాలం లో వజ్రాల గనులు నిర్వహించారు.ఆంధ్రవిశ్వ విద్యాలయ స్థాపన గురించి వివరంగా ఇచ్చారు.తొలి ద్రావిడ ప్రజలు సుమేరియా మీదుగా బంగాళా ఖాతం గుబడా కృష్ణా,గోదావరి ముఖద్వారాల్లోంచి తెలుగు నేల మీద మొదటగా పాదం మోపారని భారతదేశం లో తొలి ద్రావిడులు తెలుగు ప్రాంతీయులేనని ప్రాంక్లిన్ సి సౌత్ వర్త్ ప్రకటించారు.6) మన సాహుత్యం:పాల్కురికి సోమనాధుని తెలుగు పద ప్రయోగాలను సోదాహరణంగా వివరిస్తారు.రాయల నాటి పాలనా భాష గురించి వివరించారు.తొలి తెలుగు నిఘంటువు "ఆంధ్రదీపిక" మామిడి వెంకటార్య పండితులు రూపొందించారు.తొలి తెలుగు పత్రికల గురించి సవివరంగా వివరిస్తారు.1831 లో తొలి పత్రిక 'తెలుగు జర్నల్' అనే పత్రిక వెలువడింది.స్వాతంత్ర్యోద్యమ కాలంనాటి పత్రిక "ఆంధ్రపత్రిక" 1908 లో ప్రారంభమయి 1991 లో మూత పడింది.తెలుగు భాష మీద విపరీతమైన ప్రేమ గలా డా.జి వి.పూర్ణచందు గారి విస్తృత పరిశోధనా గ్రంధం ఇది.తెలుగు వారి చరిత్రను పెక్కు ఆధారాలతో వివరించిన వారికి తెలుగు జాతి ఎంతగానో ఋణ పడిఉంటుంది.తెలుగు భాషాభిమానులు,తెలుగు వారి చరిత్ర తెలుసుకోవాలనే ఆసక్తి గలవారు,విద్యార్థులు,మరీ ముఖ్యంగా తెలుగు ఉపాధ్యాయులు,అధ్యాపకులు తప్పక చదవవలసిన పుస్తకమిది.

Thursday 2 December 2021

సిరివెన్నెల కురియని రాత్రి.

 10 వ తరగతి ముగిసిన వేసవి.కె.విశ్వనాధ్ గారి సినిమా "సిరి వెన్నెల"పేరే ఎంత మనోహరంగా ఉందో .సినిమా చూస్తున్నంత సేపు గుండె స్పందనలు కళ్ళు పలికిస్తున్నాయి.పాటల్లో అప్పటివరకు వినని సాహితీ సొబగులు,మరోలోకానికి తీసు కెళ్లిన వేణుగానం. అప్పుడు పరిచయమయ్యారు సీతారామ శాస్త్రి.అప్పుడే ఇష్టం పెరిగింది వేణుగానం పై.సిరివెన్నెల లోని "విధాత తలపున"ఎన్ని సార్లు పాడుకున్నానో .ఇక అర్ధరాత్రి నెల్లూరు అర్చన థియేటర్ లో "రుద్రవీణ" సినిమా చూసి అందులోని "చెప్పాలని ఉంది ,గుండె విప్పాలని ఉంది" పాట స్ఫూర్తి తో అర్ధరాత్రి ఒంటి గంటకు ఓ కవిత వ్రాసుకున్నా .ఇక నెల్లూరు VR College లో ఏదో function కు వచ్చిన సిరివెన్నెల గారు "త్రిశంకు స్వర్గం లో త్రివర్ణ పతాకం"అన్న ఒక పాట స్వయంగా పాడారు. తరువాత ఏదో పత్రికలో ఆ పాట వస్తే వ్రాసుకుని ట్యూన్ గుర్తు పెట్టుకుని చాలా వేదికల మీద పాడా.National science fair( రాంచీ,జార్ఖండ్) లో పాడి అక్కడి కలెక్టర్ ప్రశంస లందుకున్నా. ఈ పాట గాయం సినిమా లో వచ్చింది.ఇక "ఎటో వెళ్ళిపోయింది మనసు" జామురాతిరి జాబిలమ్మ" "నిగ్గదీసి అడుగు",తరలి రాద తనే వసంతం" "జగమంత కుటుంబం నాది " నాకు బాగా ఇష్టమై పాడుకునే ఆయన పాటలు.మా తరపు ఊహలకు భావుకత అద్దిన పాటల రేడు సిరివెన్నెల."నీవు లేవు నీ పాట ఉంది"మాకు తోడుగా.శ్రద్ధాంజలి వారికి....ఒద్దుల రవిశేఖర్.

Monday 29 November 2021

సంగీత మేరు శిఖరాలు

 

రచయిత:Dr. జానమద్ది హనుమత్ శాస్త్రి.          హృదయం లోని వివేకమే సంగీతం....కన్ఫ్యూషియస్.                             పుస్తక పరిచయం:ఒద్దుల రవిశేఖర్      సామవేదం యొక్క ఉపవేదమనబడు గాంధర్వ వేదం సంగీతమయం.భరతుని నాట్య శాస్త్రం,మతంగుని బృహద్దేశి సంగీతానికి సంబంధించిన ప్రాచీన గ్రంధాలు.నాదం నుండి శృతులు,శృతుల నుండి స్వరాలు,స్వరాల నుండి రాగాలు పుడతాయి.సంగీతం విశ్వజనీనమైన భాష.    Music: If  you know and understand it is the best and easiest way for concentration. .Swami Vivekananda                  45 మంది శిఖరప్రాయులైన గాయనీ గాయకుల జీవిత చరిత్ర ఇది. సంగీత సాగరాన్ని మధించిన గాన గంధర్వులు వారు.1) శ్యామ శాస్త్రి(1762౼1827):  2)త్యాగరాజ స్వామి(1767౼1847) 3)ముత్తుస్వామి దీక్షితులు(1775౼1835) వీరు ముగ్గురు సంగీత త్రిమూర్తులు.                  4)సంగీత  సార్వభౌమ స్వాతి తిరుణాల్ దీక్షితులు (1813౼1846)                                           5)వైణిక శిరోమణి వీణ శేషన్న(1852౼1926)      6) ఆధునిక హిందూస్థానీ సంగీత పితామహుడు పండిట్ విష్ణు నారాయణ భాట్కండే(1860౼1936) 7) వైణిక ప్రవీణ వీణ సుబ్బన్న(1861౼1939) 8)సరోద్ వాద్య విద్యా నిధి ఉస్తాద్ అల్లావుద్దీన్ ఖాన్(1862౼1972)                                           9) సంగీత కళానిధి మైసూరు వాసుదేవాచార్యులు (1865-1961) 10)తాళ బ్రహ్మ,గాన విశారద బిడారం కృష్ణప్ప (1886-1939) 11) గాయక శిఖామణి ముత్తయ్య భాగవతార్ ( 1877-1945) 12) టైగర్ వరదా చార్యులు (1876-1976) 13)త్యాగరాజభక్త శిరో మణి బెంగళూరు నాగరత్నమ్మ (1878-1952) 14) సంగీత కళానిధి శ్రీమాన్ రాళ్లపల్లి ఆనంతకృష్ణ శర్మ (1893-1979) 15) సంగీత కళానిధి ద్వారం వెంకటస్వామి నాయుడు( 1893-1964) 16) సంగీత రత్న టి.చౌడయ్య (1895-1967) 17) గాన గాంధర్వ ఓంకార్ నాధ్ ఠాగూర్( 1897-1967) 18) సంగీత కళానిధి ముసిరి సుబ్రమణ్య అయ్యర్ (1899-1975) 19) స్వర భూషణ ఉస్తాద్ బడేగులామ్ అలీఖాన్(1901-1969) 20)సంగీత కళానిధి సెమ్మంగుడి  శ్రీనివాస అయ్యర్ (1908-2003) 21)గాయనగంగ గంగుభాయ్ హానగల్ (1913-2009) 22)షెహనాయ్ నవ్వాజ్ ఉస్తాద్ బిస్మిల్లాఖాన్( 1916-2006) 23) సంగీత రత్న సంధ్యావందనం శ్రీనివాస రావు (1918-1994) 24) భారతరత్న గా వెలిగిన భక్తి సంగీత సుధా తరంగం యం. యస్.సుబ్బులక్ష్మి (1916-2004) 25) తబలా వాద్య విశారదుడు ఉస్తాద్ అల్లారఖా (1919- 2000) 26) డి.కె.పట్టమ్మాళ్ (1919-2009) 27)జయచామరాజేంద్ర ఒడయర్ (1919-1974) 28) వైణిక శిరోమణి వి.దొరై స్వామి అయ్యంగార్ (1920-1997) 29) సితార్ వాద్య విశారద పండిట్ రవిశంకర్ (1920) 30) గానలోల ఘంటసాల వెంకటేశ్వరరావు (1922-1974) 31) విఖ్యాత వైణికుడు ఈమని శంకర శాస్త్రి (1922-1987) 32)20 వ శతాబ్ది తాన్ సేన్ పండిట్ భీమ్ సేన్ జోషి (1922) 33) మహామహో పాధ్యాయ నూకల చిన సత్యనారాయణ ( 1923) 34) మహోత్తమ గాయకుడు యం. డి.రామనాధన్(1923-1984) 35) మంగళ వాద్య విశారద షేక్ చిన మౌలానా (1924-1999) 36) వేణు నాద మాంత్రికుడు టి.ఆర్ .మహాలింగం (మాలి) (1926-1986) 37) వైణిక శిరో భూషణ ఎస్.బాల చందర్ ( 1927-1990) 38)అమృత గాన వర్శిని యం. ఎల్.వసంతకుమారి ( 1928-1990) 39) మహా గాయని,భారతరత్న లతా మంగేష్కర్(1929) 40) గానంతో శిలలనే కరిగించగల  పండిట్ జస్ రాజ్ (1930) 41) సంగీత శిఖరం మంగళం పల్లి బాల మురళీ కృష్ణ (1930) 42) సంగీత కళానిధి పద్మభూషణ్ డా:శ్రీపాద పినాక పాణి గారి జీవితానుభవాలు (1913) 43)వేణు వాదన మాంత్రికుడు హరిప్రసాద్ చౌరాసియా (1938) 44) సుమధుర గాయకుడు కె.జె.ఏసుదాసు(1940) 45) ఘటం వాద్య విశారద టి.హెచ్.వినాయక్ రామ్ (1942)  తమ జీవితాలనే తపస్సుగా మలిచి సంగీత సాగరాలను మధించి మనకు అమృతరాగాలను పంచిన మహనీయుల గురించి పేర్లు మాత్రమే ప్రస్తావించాను,ఈ పుస్తకాన్ని చదివి మరిన్ని వివరాలు తెలుసుకుంటారని.ప్రతి దినం కొంత సమయాన్ని సంగీతం పాడటం ,లేదా వినడం అలవాటు చేసుకుంటే మనసు నిర్మలంగా ఉంటుందని,విద్యాలయాల్లో సంగీత సాధన ఏర్పాటు చేయటం అత్యావశ్యకం అణా రచయిత సందేశం తో ఈ పుస్తకం ముగుస్తుంది.చివర్లో రాగాలు -రోగాలు శీర్షికన ఏ రాగం ఎప్పుడు వింటే ఏ రోగం తగ్గుతుందో వివరించడం మరింత ప్రయోజనకరంగా ఉంది.సంగీత త్రిమూర్తుల్లో ఒకరైన త్యాగరాజు పూర్వీకులు ప్రకాశం జిల్లా మార్కాపురం దగ్గరలోని కాకర్ల గ్రామం కావడం విశేషం.వారి పూర్వీకులు క్రీ.శ 1600 ప్రాంతం లో తంజావూరు సమీపంలోని తిరువారూరు కుతరలివెళ్లారు.సంగీత ప్రియులకు ఈ పుస్తకం చదవడం మరింత ఆనందం కలిగిస్తుంది.హనుమత్ శాస్త్రి గారు సరళంగా చదువగలిగేలా వారి జీవిత చరిత్రలు అందించారు.ఆ రకంగా ఆ గాన గంధర్వులను ఇప్పటి తరానికి పరిచయం చేసారు...ఒద్దుల రవిశేఖర్

Monday 22 November 2021

The secrets of INDUS VALLEY

 The secrets of INDUS VALLEY by R.Rajagopalan illustrated by R.Ashish Bagchi                                                          చరిత్ర మీద ఆసక్తి ఉన్నవారికి,పరిశోధకులకు ఇండస్ వాలీ నాగరికత(హారప్పా మొహంజదారో) ఇప్పటికీ రహస్యమే.ఈ ప్రాంత ప్రజలు ఎక్కడనుండి వచ్చారు?వారి వ్రాత అక్షరాలు దొరికాయి కానీ వాటి అర్ధం ఇప్పటికి సరిగ్గా తెలీదు.వారి భాష పేరేమిటి?పరిపాలకులు ఎవరు?ఈ నాగరికత ఎలా నశించింది? ఈ ప్రశ్నలు వెంటాడే ప్రశ్నలు? వీటికి పూర్తి సమాధానం ఇవ్వకపోయినా కనుగొన్న ఆధారాలను ప్రస్తావిస్తూ రచన సాగింది.త్రవ్వకాల్లో దొరికిన నగరాల ఆనవాళ్లను బట్టి ఉన్నతమైన నాగరికత అని అలాగే పరిపాలన కూడా ఆధునికమైన ప్రజాస్వామ్యానికి తీసిపోనిదని అర్ధమవుతుంది.చక్కటి ప్రణాళికతో కట్టిన నగరాలు, ఆధునిక వసతులతో కూడిన గృహాలు అప్పటి అభివృద్ధిని చెబుతాయి.దొరికిన అద్భుతమైన చిత్రాలతో మనల్ని ఆకాలానికి లాక్కెడుతుంది రచన.Rosetta stone గురించి దాని decode గురించి జరిగిన ప్రయత్నాలు ఆశ్చర్యానికి గురి చేస్తాయి.archaeologist,epigraphist లాంటి వృత్తుల గురించి కూడా పరిచయం చేసి విద్యార్థులను ఆ దిశగా ప్రోత్సాహించారు.ఐరావతం మహదేవన్ ఇండస్ లిపి పై చేసిన పరిశోధన ఆసక్తి గొల్పుతుంది.అంతా చదివాక 5000 సం. రాల క్రితం జరిగిన చరిత్ర కోసం ఇప్పుడు మనం తలలు ఎందుకు బ్రద్దలు కొట్టుకోవాలి? అన్న ప్రశ్న ఉదయిస్తుంది.మన చరిత్ర గురించి మనం తెలుసుకుంటేనే ప్రస్తుత మనదేశం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం అర్ధమవుతుంది.ఇండస్ నాగరికత కాలం లోనే శాస్త్రీయ వైఖరి ఉంది.ప్రస్తుతం అది లోపిస్తున్న తీరును అర్ధం చేసుకోవాలి.కానీ ఆ కాలం లో చెట్లు విపరీతంగా నరికి నగరీకరణ జరగడం వారి పతనానికి కారణం అయింది.మరి ప్రస్తుతం మనమదేగా చేస్తుంది. చెట్లు నరకడం,నదుల కాలుష్యం,పర్యావరణ నాశనం ,భూతాపం ఇవన్నీ మనకు ప్రమాద సంకేతాలు.ప్రస్తుత మన నాగరికత కూడా ఆ దిశలో పయనిస్తుంది ,అన్న ఆలోచనాత్మక సందేశంతో పుస్తకం ముగించిన రచయిత రాజగోపాలన్ అభినందనీయులు....ఒద్దుల రవిశేఖర్.

Sunday 21 November 2021

చిన్న చిన్న ఆనందాలు మూటగట్టుకోవడం.

 జీవిత పయనంలో లక్ష్యాల సాధనలో పడి మనకిష్టమైన పనులు చేయడం మరిచిపోయివుంటాం.ఉద్యోగం, వివాహం,పిల్లలు,వారి చదువులు,ఆరోగ్యం,ఇల్లు కట్టుకోవడం ,పిల్లల వివాహాలు మళ్లీ వారికి పిల్లలు ఇలా విభిన్న దశల్లో జీవితం కొనసాగుతుంది.మనం మనకోసం కాక ఇతరుల కోసం బ్రతుకుతుంటాం.పిల్లల కోసం ఎన్నో త్యాగాలు చేస్తాం.కాలం గడిచిపోతుంది.చివర్లో వారేదో మనకు చేస్తారనుకుంటాం.వారి కుటుంబాల తో వారు బిజీ. ఆయా దశల్లో మన అభిరుచులు,మన కిష్టమైన కళలు, ఆటలు,కొత్త ప్రదేశాలు చూడటం,మొక్కలు నాటడం,పెంచడం,ప్రకృతిని పరిశీలించడం ఇవన్నీ చేయడం సాధ్యం కాకపోవచ్చు.కానీ అన్ని బాధ్యతలు తీరాక ఇవన్నీ చేయాలంటే మన మానసిక,శారీరక ఆరోగ్యం బాగుండకపోవడంతో మనం చేయాలనుకున్నవి చేయలేకపోవడంతో జీవితం అసంతృప్తిగా ముగుస్తుంది.మొన్నటి కరోనా కాలంలో ఎంతమంది చిన్న వయసులో చనిపోయారో కదా!ఎన్ని అనుకుని ఉంటారు వాళ్ళు జీవితంలో ఏదో చేయాలని.అలాగే ఆకస్మిక ప్రమాదాలు,గుండెపోటులతో మరింతమంది మరణిస్తున్నారు.పునీత్ రాజ్ కుమార్(48) మరణం ఎంత విషాదం. అందుకే సమయం లేదు మిత్రమా! జీవితం లో మీరు ఏ దశలో ఉన్నా మీ కిష్టమైన వ్యాపకాలకోసం కొంత సమయం కేటాయించండి.సంగీతం వినడం,నేర్చుకోవడం,పాటలు పాడడం చిత్రలేఖనం,పుస్తకాలు చదవడం,స్నేహితులతో మాట్లాడటం,వ్యాయామం ....ఇలా ఎన్నో పనులు చేస్తూ ఎప్పటికప్పుడు చిన్న చిన్న ఆనందాలు మూటగట్టుకుంటూ జీవితం కొనసాగిద్దాం.ఇక జీవిత చరమాంకంలో ఆ జ్ఞాపకాల దొంతరాలను నెమరువేసుకుని తృప్తిగా జీవితయాత్ర చాలించవచ్చు.....ఒద్దుల రవిశేఖర్.

Thursday 15 July 2021

యువతతో జగతి ముందుకు(Better India Better world)

 రచయిత:N.R.నారాయణమూర్తి.  అనువాదం:వసుంధర.                                    పుస్తక పరిచయం:ఒద్దుల రవిశేఖర్          ఇండియాలో ఉపాధి కల్పనకు,పేదరిక  నిర్ మూలనకి వ్యాపారదక్షతను సాధనం చేసుకోవాలన్న ఆలోచన నుండి ఉదయించిందే ఇన్ఫోసిస్ అని ,యువతతో పనిచేస్తున్నప్పుడు తన మెదడు బాగా పనిచేస్తుంది అని  ముందుగా చెప్పడం ద్వారా పుస్తక ఉద్దేశ్యాన్ని,ఆయన ఇచ్చే సందేశాలను గూర్చి తెలియజేసారు రచయిత.మన దేశం సాధించిన విజయాలు తక్కువేమీ కావంటూ దేశంలో పేదరికం,నిరక్షరాస్యత, వ్యాధులు,విద్య వంటి విషయాల్లో మనం ఉన్న స్థాయిని వాస్తవికంగా తెలియజేసారు.నిజాయితీ పరులు ఉన్నత లక్ష్యాలతో కృషి చేస్తే ఏ దేశమైనా ఎన్ని అడ్డంకులనైనా అధిగమించి గొప్పతనాన్ని సాధించగలదు.ఉన్నత లక్ష్యాల కోసం కలలు కనాలి.వాటి సాఫల్యాని కి త్యాగాలు చేయాలంటారు. విద్యార్థులారా అన్న  వ్యాసం లో మనం ఉత్పత్తి చేసిన సంపద కారణంగా గుర్తింపు వస్తుంది.మనకున్నది నిర్భాగ్యులతో పంచుకోవడమే మన సంపదకు సద్వినియోగం అని యువతకు గొప్ప సందేశమిచ్చారు.మనదేశ ప్రజల దయనీయ స్థితులు వివరిస్తూ 1000 సం. రాల బానిసత్వం వల్ల వచ్చిన ఉదాసీనత ను వదిలి పెట్టాలని,నమ్రతను అలవర్చుకోవాలని పిలుపిస్తారు.రేపు నేను కనిపించకపోతే,నేనేమయ్యానని నా వాళ్ళు వెతుక్కునేందుకు నేనేం చెయ్యాలి?అని అంతర్మధనం చెందుతారు.మార్పొక్కటే నేటి ప్రపంచం లో నిత్యం .ఏ రంగం లో నైనా ప్రావీణ్యత సాధించటం మొక్కటే విజయానికి మార్గం అని దిశానిర్దేశం చేస్తారు.ఎందుకూ అని కాదు,ఎందుక్కాదు అని ప్రశ్నించుకోవాలంటారు. పాశ్చాత్యుల నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అన్న వ్యాసం లో తనకంటే ఎక్కువ సాధించినవారిపట్ల గౌరవభావం ఉండాలని,పూచీ పడే స్వభావముండాలని,నిజాయితీతో,సమయపాలన పాటిస్తూ ఉండాలంటారు.1991 లో మన దేశానికి ఆర్ధిక స్వాతంత్ర్య0 వచ్చింది.హరిత,శ్వేత విప్లవాలు ,1991 ఆర్ధిక సంస్కరణలు రోదసీ విజ్ఞానం,అణుశక్తి,software విప్లవం దేశ స్వరూపాన్ని మార్చివేశాయి అంటారు.జ్ఞానాన్ని నవీకరణకు ఉపయోగించుకునే దేశం లాభపడుతుంది అంటారు.ఉన్నత విద్యారంగం లో సంస్కరణలు రావాలని ఆశిస్తారు.నాయకుల స్థాయిని బట్టి దేశాలు అభివృద్ధి చెందుతాయి అంటారు.తను స్థాపించిన ఇన్ఫోసిస్ యాత్రాక్రమాన్ని వివరిస్తూ లాభాల్ని చట్టబద్ధంగా నైతికంగా సాధించాలి అంటారు.ఇందులో ఇంకా వాణిజ్య సంస్ధ పాలన,వ్యాపార దక్షత,ప్రపంచీకరణ వంటి ఎన్నో అంశాలపై స్పూర్తిదాయక,సందేశాత్మక వ్యాసాలున్నాయి.యువతను తీవ్రంగా ప్రభావితం చేసే పుస్తకం ఇది.ముఖ్యంగా సృజనాత్మకంగా ఆలోచిస్తూ ఎదగాలనుకున్న యువత చదివితీరాల్సిన పుస్తకం ఇది.

Wednesday 14 July 2021

ఆర్థిక చరిత్ర (The worldly philosophers)

 పుస్తక రచయిత:రాబర్ట్ హెల్బ్రోనర్                       అనువాదం:జాస్తి జవహర్ లాల్.                             పుస్తక పరిచయం:ఒద్దుల రవిశేఖర్.                            ఆర్థిక సమస్యల మీద చర్చలు ఒక సిద్ధాంతానికి,ఇజానికి కట్టుబడక,ప్రతి ఇజం లోను ఎంతో కొంత నిజం ఉంటుందని,ఏ విషయాన్నయినా,ఇతరుల దృక్పధాన్ని అర్ధం చేసుకోవడానికి నిష్పాక్షికత అవసరం.దీన్ని రాబర్ట్ చక్కగా సమతౌల్యం చేశారని అనువాదకులు ముందుమాటలో చెప్పటం తో పుస్తకం చదవాలన్న ఉత్సుకత కలుగుతుంది.                                  ఆర్థిక దృక్పధం:ఉమ్మడి అవసరాలు తీర్చుకోవడానికి ఆర్థికశాస్త్రం అవసరమైంది.17 వ శతాబ్దం వరకు కూడా అమెరికాలో లాభం ఒక నేరంగా పరిగణించేవారు అని తెలిసుకుంటే ఆశ్చర్యమేస్తుంది.లాభాపేక్ష ఆధునిక మానవుడితోనే వచ్చింది.16 శతాబ్దం చివరివరకు ఇంగ్లాండ్ లో ఎక్కడ చూసినా బీదలే ఉండేవారు.పారిశ్రామిక విప్లవం తర్వాత మనిషి ఆర్థిక వ్యక్తిగా అవతరించాడు.                                                    ఆర్థిక శాస్త్రవేత్తలలో ఆద్యుడు ఆడమ్ స్మిత్.ఈయన నైతిక భావ సిద్ధాంతం ప్రతిపాదించారు.విపణిని నియంత్రించే సూత్రాలు వివరించాడు.             మాల్తస్ రికార్డో: జనాభా గుణశ్రేడి లో వనరులు,ఉత్పత్తులు అంక శ్రేడి లో పెరుగుతాయి.ఆహార లభ్యత మానవుల సంఖ్యని శాసిస్తుంది.ఇంకా ఇందులో సోషలిస్టులు అయిన రాబర్ట్ ఓవెన్, సైంట్ సైమన్,చార్లెస్ పౌరియర్,జాన్ స్టువర్ట్ మిల్ ల గురించి వివరించారు.                   కార్ల్ మార్క్స్:కమ్యూనిస్టు మేనిఫెస్టో అనేది మార్క్స్,ఏంగెల్సులు తయారు చేసిన కార్యాచరణ ప్రణాళిక.హెగెల్ ప్రతిపాదించిన గతి తార్కిక భౌతిక వాదం మార్క్స్ ఏంగెల్స్ లను ఆకర్షించింది.సాంఘిక మార్పులకు,రాజకీయ విప్లవాలకు అప్పటి ఆర్థిక పరిస్థితులే కారణం.ఫ్యాక్టరీలు కార్మిక వర్గాన్ని సృష్టిస్తే,విపణి విధానం వ్యాపార వర్గాన్ని సృష్టించింది అంటారు మార్క్స్.డార్విన్ జీవ పరిణామాన్ని కనుగొన్నట్లుగా మార్క్స్ చరిత్రలో సంఘ పరిణామాన్ని కనుగొన్నారు అంటారు ఏంగెల్స్.ఇంకా ఇందులో వెబ్లెన్,మేవర్ట్ జోసెఫ్ షాంపెటర్ వంటి వారి గురించి వివరిస్తారు. గతం లో సంపద అన్న ధ్యాసగాని,దాచిపెట్టుకోవాలన్న తపన గాని లేవు.కొన్ని పనులు చెయ్యడం లో లాభం ఉన్నదనుకొన్నప్పుడు పెట్టుబడిదారుడు అవతరించాడు.ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విశేషాలతో కూడిన పుస్తకం ఇది.ఆర్ధిక శాస్త్రం మీద ఇష్టం ఉన్న వ్యక్తులు తప్పక చదవాల్సిన పుస్తకం ఇది.

Monday 12 July 2021

ప్రకృతితో స్నేహం చేద్దాం రండి.

 ఆహారసేకరణ కోసం ప్రతి రోజు 40 కి.మీ నడిచి ఎంతో శ్రమ కోర్చి ఆహారం సంపాదించే దశ నుండి కూర్చున్నచోట నుండి లేవకుండా కోరిన తిండి తినే దశకు వచ్చిన మానవుడు శ్రమకు,ప్రకృతికి దూరమయ్యాడు.దానితో ఎన్నో జబ్బులు చుట్టుముట్టి విలవిలలాడుతున్నాడు.తిరిగి ప్రకృతి మూలాల్లోకి వెళ్లకుండా ఈ తప్పును సరిదిద్దుకోలేం.మొక్కలతో,చెట్లతో,ప్రకృతితో స్నేహం చేస్తే ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది.మన ఇంటి ముందు,వెనుక మొక్కలు నాటి పెంచడం దగ్గరనుండి,రహదారుల వెంట,ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటి పెంచడం వరకు ఎవరికి వీలయిన విధంగా వాళ్ళు ప్రతి ఒక్కరు భూమికి మనం చెల్లించే బాకీగా భావించి ఈ కార్యక్రమంలో పాల్గొనాలి.అలాగే పిల్లలకు చిన్నప్పటినుండే ఈ అలవాటు నేర్పిస్తే వారి జీవితం ఎంతో ఆనందంగా మారుతుంది.ఇంకా ఈ కరోనకాలం లో తమ సొంత గ్రామాలకు,పట్టణాలకు చేరిన యువకులు మొక్కలు నాటి పెంచే కార్యక్రమం తో పాటు తమ వ్యవసాయక్షేత్రాల్లో తండ్రికి పొలం పనుల్లో సహాయం చేస్తే శ్రమ విలువ తెలుస్తుంది.అలా పొలం అందుబాటులో లేని వాళ్ళు తమ బంధువులు రైతులయితే వారి పొలాల్లోకి వెళ్లి చిన్నపాటి పనులు చేయండి.నీరు కట్టడం,కలుపు తీయడం,మట్టిపనులు చేయండి.చెమట పడుతుంటే కలిగే ఆనందాన్ని అనుభవించండి.మట్టి వాసన,నీటి పలకరింపులతో పులకరించండి.మొక్కలు రోజు పెరుగుతుంటే పరిశీలించడం అద్భుతమైన అనుభవం.ఇవన్నీ చేస్తున్నవాడిగా చెబుతున్నా,ప్రయత్నించండి.ఒక ముఖ్య విషయం ఆరోగ్యం కోసం ఉదయపు,సాయంత్రపు నడకలు,వ్యాయామాలు చేస్తుంటాం.చెమట చిందిస్తుంటాం.కానీ పైన చెప్పిన పనులు చేస్తుంటే దాని వల్ల ప్రకృతికి మేలు చేయడం తో పాటు సహజానందం కలుగుతుంది.మన శ్రమ ఓ పుష్పంగా,ఓ కాయగా,ఓ కూరగాయగా,నీడ నిచ్చే చెట్టుగా మారుతుంటే కలిగే ఆనందం వెలకట్టలేనిది.ప్రకృతి తో స్నేహం చేద్దాం,రండి....ఒద్దుల రవిశేఖర్.

Monday 10 May 2021

అన్వేషి....Dr పొనుగోటి కృష్ణారెడ్డి (పుస్తక పరిచయం:ఒద్దుల రవిశేఖర్)

 ఇది రచయితచే రచింపబడి ఆదరణ పొందిన 3 పుస్తకాల కలయిక. 1)బుద్ధుడు-బౌద్ధ ధర్మం 2)జనం మనిషి 3)విరాట్                                                  1) బుద్ధుడు -బౌద్ధ ధర్మం.                              బుద్ధుడి జీవితాన్ని,బోధనలను అతిసరళంగా వివరిస్తారు రచయిత ఇందులో.ఇందులో ముఖ్యాంశాలు.                                                  * *జ్ఞానోదయం పొందినప్పటి నుండి మహాపరి నిర్వాణం వరకు నిర్భయంగా బ్రతికిన మహా పురుషుడు బుద్ధుడు.                   *ఆత్మదీపోభవ(నీకు నీవే దీపం కావాలి)              *ప్రపంచ చరిత్రలోనే మొట్టమొదటిసారి స్వేచ్ఛ,సమానత్వం గురించి బోధించిన వాడు బుద్ధుడు.ప్రేమను,కరుణను,అహింసను ప్రపంచానికి మొదటి సారి బోధించినవాడు బుద్ధుడు.                                                                                     *ఆయన చివరి మాటలు:సృష్టిలో ప్రతిదీ నశించేదే.బాధ పడకండి.మీరు శ్రద్ధగా ధర్మాన్ని ఆచరించి నిర్వాణాన్ని సాధించండి.            *మనసును అదుపులో ఉంచుకోవడానికిపంచశీల,చతురార్య సత్యాలు,అష్టాంగ మార్గం దశపారమితలు బోధించారు.బుద్ధుడు క్రీ. పూ 563 లో పుట్టి 80 ఏళ్ల పాటు జీవించి 45 ఏండ్ల పాటు ధర్మప్రచారం చేశారు.                                                         2)జనం మనిషి:ఒక డాక్టర్ మరణం,2 లక్షల మంది అంతిమ యాత్రలో పాల్గొనడం,ఇది కదా జీవితం.పుచ్చలపల్లి సుందరయ్య గారి తమ్ముడు,పుచ్చలపల్లి రామ్ గారి జీవితాన్ని చదువుతుంటే ఇటువంటి మనుషులు ఈ భూమిమీద జీవించారా అనిపిస్తుంది.మనిషిని ప్రేమించడం,పేదలకు ఉచిత వైద్యం,దాతృత్వం,ప్రజాసేవ,స్నేహ తత్వం,ప్రజల తరపున పోరాడడం ఆయన్ని ఒక విశిష్ట మైన వ్యక్తిగా నిలబెడతాయి.పుస్తక ప్రేమికుడు,జ్ఞానాన్వేషి,అత్యంత ప్రతిభావంతుడైన వైద్యుడు,అత్యంత ధైర్యవంతుడు,కరుణామయుడు,గాంధీజీలా తను నమ్మిన విషయం ఆచరించినవాడు రామ్.ఒక డాక్టర్ గా ఉంటూ నిరంతరం ప్రజాసేవలో తరించే వ్యక్తిత్వం అత్యంత అరుదు.చదివి తీరవలసిన జీవితం ఆయనది.                                                          3) విరాట్ (మూల రచయిత: stephan thysvk) బుద్ధుడి కంటే ముందు జీవించిన ఒక గొప్ప యోధుడు,తాత్వికుడి జీవిత చరిత్ర ఇది. యుద్ధం వద్దనుకుని,సర్వ సైన్యాధ్యక్షుడి పదవిని కాదని న్యాయాధికారిగా నియమించబడిన  ' విరాట్' కథ ఇది.తన తీర్పును ప్రశ్నించిన దోషి పాత్రలోకి ప్రవేశించి అతని శిక్షను తాను అనుభవించి,న్యాయాధికారి పదవిని త్యజించి,గృహస్థు జీవితాన్ని వీడి,అడవులలోకి వెళ్లి ఏకాంతంగా జీవించిన ఒక ఋషి కథ ఇది.చివరకు ఒక ఇల్లాలి ప్రశ్న తో మళ్లీ ప్రజల మధ్యకు వచ్చి ఒక కుక్కల కాపరిగా జీవితాన్ని ముగిస్తాడు.హృదయాన్ని మెలిపెట్టే కథనం తో సాగుతూ గొప్ప జీవితసత్యాలను,తత్వాన్ని మనకందిస్తుంది ఆయన జీవిత గమనం.

Saturday 1 May 2021

మానవ ఆరోహణ(The Ascent of Man)....మూలం:జేకబ్ బ్రోనోస్కీ.పరిచయం:ముక్తవరం పార్థసారధి

 మానవ పరిణామ క్రమాన్ని వివరించే పుస్తకాల్లో  ఇది 4 దశాబ్దాల క్రితంది అయినా మనకు ఈ మధ్యనే పరిచయం చేసారు పార్ధసారధి గారు.ఏదేమైనా ఈ అంశం పై ఏ పుస్తకమైనా నన్ను కుతూహలానికి గురిచేస్తుంటుంది.           ప్రకృతి పరిణామం కన్నా భిన్నమైన  విషయం "మానవారోహణ".జ్ఞానమెప్పుడు పరిణామక్రమం లో ఒక దశ మాత్రమే.ప్రతి పరిణామ దశలో కీలకమైన మలుపు ఒకటి ఉంటుంది.అదే ప్రపంచాన్ని అర్ధం చేసుకునే దృష్టికోణం అన్న వాక్యాల ద్వారా రచయిత తను చెప్పదలచుకొన్న అంశాలకు పూర్వరంగం సిద్ధం చేసుకున్నాడు.మానవ మేధస్సు వివిధ రంగాలలో వికసించిన క్రమం ఇందులో ప్రస్తావించారు.1859 లో అచ్చయిన The origin of spices తో,1871 నాటి " the descent of man" తో చార్లెస్ డార్విన్ మనకు ఆదర్శం కావడాన్ని ప్రస్తావిస్తూ ఒక్కొక్క అంశాన్ని చెబుతూ ఆసక్తి కలిగిస్తూ వెడతారు.20 లక్షల సంవత్సరాల క్రితం లభించిన పిల్ల వాడి పుర్రె ను విశ్లేషించి ఆస్ట్రలో పితికస్ దానికి పేరు పెట్టారు.తొలి రాతి పనిముట్టు తయారు చేసిన కాలం ఇది.10 లక్షల సంవత్సరాల క్రితం Homoerectus ఆవిర్భవించాడు.2 లక్షల సం. నాడు Neanderthal Man దర్శనమిస్తాడు.తరువాత దశలో వచ్చినవారు Homo sapien (మనం).మానవ చరిత్రలో మౌలికమైన ఆవిష్కరణ నిప్పును రాజెయ్యటం.అగ్నిని తయారు చేసిన మనిషి జీవితమే మారిపోయింది.ఈ విషయాలతో మొదలు పెట్టి తరువాత దొరికిన కుడ్య చిత్రాల ఆధారంగా 20,000 ఏళ్ల క్రితం మనిషిని విశ్లేషిస్తారు.గత 12,000 ఏళ్ల క్రితం నుండి జరిగిన మానవ చరిత్ర మీద దృష్టి సారించారు రచయిత.10,000 ఏళ్ల క్రితం కొన్ని ప్రాంతాల్లో కొన్ని జంతువులను మచ్చిక చేసుకొని మొక్కల్ని పెంచడం ప్రారంభించాడు.మంచుయుగం చివరి దశలో వ్యావసాయిక విప్లవం(జీవ విప్లవం)ప్రారంభమైంది.మానవారోహణలో తొలిమెట్టు సంచారజీవితం మాని ఒక చోట స్థిరపడి వ్యవసాయం ప్రారంబించటమే.ప్రకృతి లో జరిగిన జన్యు సంయోగ ఫలితాల ద్వారా ఏర్పడిన గోధుమ ఏర్పడిందనే ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేయడం ద్వారా మనల్ని రచనలోకి మరింత ముందుకు వెళ్లేలా చేస్తారు.ప్రకృతి సహజంగా ఏర్పడిన వీటిని తరువాత పంట లాగా పండించడం నేర్చుకున్నాడు.క్రీ.పూ 6000 సం నాడు జెరికో వ్యవసాయ క్షేత్రంలో వీటిని పండించారు.తరువాత కొడవలి,నాగలి,చక్రం ఆవిష్కరించారు.కుక్క,గాడిద,ఎద్దు,గుర్రం వంటి జంతువులను పెంచుకుని వాటి సహాయం తో అదనపు సంపద సృష్టించిన విషయం మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.ఈ విధంగా లభించిన ఆధారాల ఆధారంగా పనిముట్లు,నిర్మాణాలు చేయడం,లోహాలను వాడటం,గణిత అవిష్కరణలతో ఉదాహరణలతో మనకు ఆసక్తి కలిగిస్తూ ముందుకు సాగుతారు.ఇక 16 వ శతాబ్దం లో మొదలయిన పారిశ్రామిక విప్లవాన్ని గెలీలియో తో మొదలు పెట్టి న్యూటన్,leebnitz einstein,నీల్స్ బోర్ దాకా కళ్ళకు కట్టినట్లు వివరిస్తారు.ఆవిరి యంత్రం కనుగొన్న జేమ్స్ వాట్,చార్లెస్ డార్విన్ ల కృషిని తలచుకుంటారు.కాంతి కిరణాల పై ప్రయోగాలు,రాంట్ జెన్ x రే కిరణాలు,లియో జిలార్డ్ అణు విచ్చిత్తి ప్రక్రియలను ప్రస్తావిస్తారు.గ్రెగరీ మెండల్ పరిశోధనలు,DNA ఆవిష్కరణ,క్లోనింగ్ వంటి ఆధునిక పరిశోధనల వరకు వివరిస్తారు.సైన్స్ నైతికతను పెంచాలని,మేధో ప్రజాస్వామ్యం అవసరమని చెబుతారు.what is man అనే రహస్యం తెలుసుకోవడానికి కొనసాగాలి ఆరోహణ అంటారు.జ్ఞానం వెనుక బాధ్యత,నిజాయితీ,విచక్షణ ఉంటుంది.మానవ జాతి మూలాలు, చరిత్ర ఆరోహణ క్రమం ప్రతి స్కూలు పుస్తకం లోను భాగం కావాలని అభిలషిస్తారు రచయిత.మనిషికి తన పరిణామ క్రమాన్ని గురించిన జ్ఞానమే ఆలోచన కలిగిస్తుంది.అనుభవం,ఆలోచనను కలగలిపి ఆచరణను నిర్ణయించుకోవాలని చెబుతారు. జ్ఞానాన్ని లాటిన్ భాషలో సైన్స్ అంటారు.చరిత్ర అంటే గతం కాదు,ఈనాడు,ఈ క్షణం మనం తీసుకునే నిర్ణయాల వెనుక ఉన్న జ్ఞానమే చరిత్ర .దీని ఆధారంగా మనిషి ఆత్మవిశ్వాసం తో ముందడుగు వేయడమే మానవారోహణ అన్న ముగింపు తో మనలో కొత్త ఆలోచనల్ని రేకెత్తిస్తాడు. సైన్స్ ఉపాధ్యాయులు,అధ్యాపకులు,విద్యార్థులు,చరిత్రపట్ల అభిరుచి ఉన్న వారందరు చదవతగ్గ పుస్తకం ఇది....ఒద్దుల రవిశేఖర్.

Friday 30 April 2021

ఆనందో బ్రహ్మ.....యండమూరి.

              కాలాన్నివెనక్కి ముందుకు నడిపించిన సుందరకావ్యం ఇది.భవిష్యత్ లో జరగబోయే పరిణామాలు ముందుగా అంచనావెయ్యడం కొంతమందికే సాధ్యం,ముఖ్యంగా రచయితలకి.యండమూరి ఆ విషయంలో పరాకాష్టకు చేరుకున్నారిందులో ఉదాహరణకు సోలార్ శాటిలైట్.ఇంకో 100 ఏండ్లు పోయినా సాంకేతికత ఎలా మారినా ప్రేమ ప్రతి మనిషి హృదయాన్ని కదిలిస్తూ ఉంటుంది అన్న అంశాన్ని ప్రధానంగా చేసుకొని వ్రాసిన అపురూపమైన నవల ఇది.           మంచినవల:ఉన్న పరిస్థితులు ఉన్నట్టు వ్రాసి పాఠకుడి ఆలోచన్లని విస్తృతం చేయడం ద్వారా నిర్దుష్టమైన అభిప్రాయాల్ని కలుగజేసేది మంచినవల.                                              నవల:మనిషి జీవితంలో అనుభవాలకి అందమైన అల్లికే నవల....యండమూరి                     విశ్వనాథ సత్యనారాయణ,జంధ్యాలపాపయ్య శాస్త్రి,దేవులపల్లి కృష్ణశాస్త్రి ఎంత గొప్ప కవులో స్మరించుకుంటారు.                                  గోదావరి నది వర్ణించడం విషయానికి వస్తే కవి విశ్వరూపం కనిపిస్తుంది.తెలుగు భాషలో రచయిత వాడే కొన్నిపదాలు నిఘంటువు చూసి తెలుసుకోవాల్సిందే,కొన్నింటి అర్ధం వివరిస్తుంటారు.పల్లెటూరిని వర్ణిస్తుంటే అటువంటి ఊర్లలో కొంత కాలం గడుపుదామనిపిస్తుంది.                          "భూదేవి కొత్త పెళ్లికూతురయితే బంతిపూలు పసుపు!మిరప పంట కుంకుమా!" ఎంత చక్కని పోలిక.సాహిత్యమన్నా,గతకాలపు కవుల కావ్యాలన్నా రచయితకి ప్రాణం.వారి పేర్లను, వారి పద్య,గద్యాలను సందర్భం వచ్చినప్పుడల్లా ప్రస్తావించకుండా ఉండరు.సంక్రాంతికి పల్లె ఎలా ఉంటుందో చదివి తీరవలసిందే.        *"అధ్యయనం చేయాలంటే మనిషి జీవితం కన్నా గొప్పవేదం లేదు".ఆణిముత్యం లాంటి మాట. పద్యాలంటే రచయితకు చాలా ఇష్టం.మనం చదవని, మరిచిన,కావ్యాల్లోని పద్యాలను పరిచయం చేస్తూ తన్మయత్వం చెందుతూ మనల్ని పరవశించి పోయేలా చేస్తారు.ఇక స్త్రీని వర్ణించడం లో ప్రబంధకవులైన కాళిదాసు,ముక్కుతిమ్మన,శ్రీనాధుడు,అల్లసాని పెద్దనల కే మాత్రం తీసిపోని శైలిలో మనకర్ధమయ్యే వచనంలో వ్రాస్తారు.     మందాకిని పాత్రను అత్యద్బుతంగా మలిచిన తీరు తెలుగు నవలా చరిత్రలో కలికుతురాయి.అలాంటి వ్యక్తి ఒకరయినా జీవితంలో సరయిన దశలో మార్గదర్శకత్వం చేస్తే  ప్రతివ్యక్తి జీవితం మారిపోతుంది. సోమయాజితో పలికించిన పద్యం రచయిత వ్రాసిన అద్భుత మైన పద్యం.కార్తెలను వర్ణిస్తూ మందాకిని వ్రాసుకున్న డైరీ లో ప్రకృతిలో మనం కలిసిపోవాలని పిస్తుంది.మరిచి పోతున్న తెలుగు భాష ,సంస్కృతిమీద తీవ్రమైన ఇష్టం పుట్టించే నవల ఇది.గుండెను వీణ మీటినట్లు మీటిన నవల ఆనందోబ్రహ్మ.                         "వేదాంతమే ఋష్యత్వమైతే ఆనందమే బ్రహ్మత్వం".యండమూరి                                                             ......ఒద్దుల రవిశేఖర్.

Thursday 29 April 2021

ప్రేమ....యండమూరి

            పల్లెను వర్ణించాలంటే మాటలు చాలవు.వేప చెట్టు వేదం చదవడం,కొబ్బరాకులు నీటిలో జల తరంగిణులు మ్రోగించడం తో మొదలవుతుంది రచయిత పద విన్యాసం." వేదసంహిత"ను సృష్టిస్తూ బ్రహ్మ ఆమెను గురించి శిల్పి శిల్పాన్ని చెక్కినట్లు అక్షరాలను విరజిమ్ముతుంటే మనకు విభ్రమం కలుగుతుంది. ,మోహనరాగం,బిలహరి గురించి లోతుగా తెలుసుకుని మరీ మనకు వివరిస్తారిందులో.ఆంథ్రోపాలజీ గురించి పాఠకుడికి వివరంగా పరిచయం చేస్తూ ఇది ప్రేమ పై ఆధారపడి ఉందని చెప్పిస్తూ నవల యొక్క ప్రధాన ఉద్దేశ్యాన్ని వ్యక్తపరుస్తారు.ఊరు మేల్కోవడాన్ని కన్నులకు కట్టినట్లు వ్రాస్తారు.పనిచేసే వారు పాడే పాటల్లోని అంత రార్ధాన్ని కూలంకషంగా వివరిస్తారు. "పొద్దున్నే ఊరు మేల్కొవటం ఓ పాటైతే మేల్కొన్న తోటను చూడటం ఒక కావ్యం.ప్రేమ ,పైరును పోల్చడం ఆసక్తికరం.ఆంత్రోపాలజీ ప్రేమ చుట్టూ కోట కట్టి అందులో ప్రేమను బంధించింది అని చెబుతూ మనుషులు ఎందుకు ప్రేమ రాహిత్యంగా,ద్వంద్వ మనస్తత్వాన్ని కలిగి ఉంటారో వివరించిన తర్కం బాగుంది."ప్రేమించడానికి హృదయం ఉండాలి.ప్రేమింపబడటానికి వ్యక్తిత్వం ఉండాలి" ప్రేమంటే స్త్రీ పురుషుల మధ్య శారీరక ఆకర్షణ వల్ల కలిగే సంపర్కం మాత్రమే కాదు,విశ్వాన్నీ,ప్రకృతిని,సాటి మనిషిని ప్రేమించడం అని చెప్పడం ద్వారా ప్రేమకు సంపూర్ణ నిర్వచనం ఇచ్చారు.                                                            చరిత్ర చదివిన వారికే సరిగా ఈ అపాచీ కల్చర్(red indians) గురించి తెలీదు.సరిగ్గా ఈ విషయాన్ని తన "ప్రేమ" కు ఇరుసుగా మలచుకున్నారు యండమూరి.పోలీస్ ఆఫీసర్,అపాచీ నాయకుడి మధ్య సంభాషణలు సినిమాగా తీస్తే కళ్ళప్పగించి చూస్తాం."కోరిక యొక్క సాంద్రతని కొలిచే సాధనాలు ఇంకా ఈ ప్రపంచం లో కనుగొనబడలేదు." "ద్వేషం స్థానం లో ప్రేమను నింపండి.నవ్వును ప్రేమించండి." చక్కటి సందేశాలు."కన్నీటి చుక్కకి చాలా విలువుంది.ఇతరుల కష్టాల్ని చూసి అది స్రవించాలే కానీ,మన గురించి కాదు".గొప్ప సహానుభూతిని చూపే భావం. " సాటి మనిషికి చేయి అందిస్తే ప్రపంచమంతా సుఖ శాంతులతో వర్ధిల్లుతుందనే నమ్మకమే విశ్వ జనీనమైన ప్రేమ"అన్న వాక్యాల ద్వారా ప్రేమలోని విశ్వ వ్యాప్త భావనను ఆవిష్కరించారు. "ప్రేమకి పునాది నమ్మకమయితే పై కప్పు భద్రత".                                               పిల్లలాడే ఆటల్లోని అర్ధాలు వివరిస్తారు.ప్రకృతి ని వర్ణించడం లో యండమూరి తర్వాతే ఎవరయినా అనిపిస్తుంది."ప్రకృతి ని ప్రేమించడమే అన్నిటికన్నా గొప్ప".ప్రేమించు --ప్రేమను పొందు అన్న ఆలోచనా స్రవంతే సంక్రాంతి.ఇక 5 రోజుల పెళ్లిళ్లు ఎలా చేస్తారో చదవ వలసిందే.మనం మరచిన మన సంప్రదాయాలన్నీ గుర్తు చేస్తారు."మట్టినీ, మేఘాన్ని, మొక్కనీ ప్రేమించ లేని వాడు ప్రపంచం లో దేనినీ ప్రేమించలేడు.   అచ్చ తెలుగు సంస్కృతి నిండిన ఓ పల్లె గురించి వ్రాసిన విధానాన్ని ప్రతి తెలుగువాడు చదవాలి.ఇక తెలుగు భాషలోని గొప్పదనాన్ని వివరిస్తూ పద్యాలు మన భాషకు ఎలా తలమానికమో ఛందస్సు అలంకారాలు మనకే ఎలా ప్రత్యేకమో వివరించడం తెలుగు భాషపై మనకు మరింత మక్కువని పెంచేలా చేస్తాయి.ఆంధ్ర ,తెలంగాణ,రాయలసీమ నేపధ్యాలుగా కవి చెప్పిన గేయాలు హృదయాన్ని హత్తుకుంటాయి.తనను ఉరితీయబోయిన కార్టిస్ ను తన రక్తం ఇచ్చి రక్షించబోయిన అభిషేక్ పాత్ర ద్వారా ప్రేమ విశ్వరూపాన్ని చూపారు." మీకీ ప్రపంచం లో అయిష్టమైన దేదీ లేదా అన్న ప్రశ్నకు .....యండమూరి పలికించిన జవాబు ఏ తత్వ వేత్త చెప్పిన దానికి తీసిపోదు.ఈ ఒక్క జవాబు ఆయన్ను నవలా శిఖరాగ్రాన నిలబెడుతుంది."ప్రేమంటే సౌందర్యం,సౌందర్యమంటే ఆనందం." ఉప్పెన లో సముద్రం లో ప్రేయసీ ప్రియులు గడిపే దృశ్యం ఇందులో చదివి ప్రభావితమైనట్లుగా ఉంది.అద్భుతమైన ఈ వర్ణన ఉప్పెన సినిమాలో ఆవిష్కృతమైంది.ఓ మహాత్మాగాంధీ, ఓ నెల్సన్ మండేలా,ఓ మార్టిన్ లూధ ర్ కింగ్,ఓ ఆంగ్ సాన్ సూకీ లా అభిషేక్ ని అపాచీల కోసం పోరాటం చేసే నాయకుడిగా నిలపటం విశ్వ జనీనమైన ప్రేమకు నిలువెత్తు నిదర్శనం....ఒద్దుల రవిశేఖర్.

Wednesday 1 July 2020

సాధారణత్వం

(Free translation for an American poem by Ravi sekhar Oddula).                                               అసాధారణ జీవితం కోసం శ్రమపడమని మీ పిల్లలకు చెప్పకండి.                                                                          ఆ ప్రయత్నం చూడటానికి ఆరాధనీయంగా ఉండవచ్చు కానీ అది మూర్ఖత్వానికి దారి.                                                 వారికి సాధారణ జీవితం లోని    అద్భుతాలను,ఆశ్చర్యకరమైన అనుభవాలను పరిచయం చేయండి.                                          టమాటా,జామ,రేగు వంటి పండ్లరుచులను ఆస్వాదించనీయండి                                                పెంపుడు జంతువులు ,మనుషులు చనిపోతే ఎలా స్పందించాలో(ఏడ్వాలో) చూపండి.                                          చేతి స్పర్శలో వచ్చే అనంతమైన సంతోషాన్ని వారికి చెప్పండి.      సాధారణంగా వారిని జీవించనియ్యండి.            అసాధారణమైనది తన పని తాను చూసుకుంటుంది...........స్వేచ్చానువాదం ఒద్దుల రవిశేఖర్.(కవి పేరు దొరకలేదు.వారికి ధన్యవాదాలు)

Friday 29 May 2020

భూమిపై ఆరో వినాశనాన్ని ఆపేద్దాం.

భూమిపై ఆరో వినాశనాన్ని ఆపేద్దాం.                                       భూమిపై జీవ వైవిధ్యాన్ని ,సమృద్ధిని కాపాడటానికి  A Global deal for nature(GDN) అనే science policy  ని 19 మంది అంతర్జాతీయ పరిశోధకులు రూపొందించారు.రానున్న ఆరోవినాశ నాన్ని తప్పించేందుకు 7 లక్షలకోట్లు అవసరమవుతాయి అని ఈ విధానం చెబుతుంది.2015 పారిస్ ఒప్పందం తర్వాత,భూవినాశనాన్ని అడ్డుకునేందుకు తీసుకున్న నిర్ణయాల్లో రెండో అతిపెద్ద నిర్ణయం ఇదే.ఇది భావితరాలకు మనం ఇవ్వబోయే ఆటగిపెద్ద బహుమతి ఈ విధానం.

Wednesday 20 May 2020

సాయి అభయారణ్యం

http://www.saisanctuary.com/                 SAI(SAVING ANIMALS INITIATIVE) ఇండియాలో మొట్టమొదటి Private wildlife sanctuary.                          మనం మొక్కలు నాటితే సంతోషపడతాం,అవి పెరిగి పెద్దయి చెట్లయితే మరింత ఆనందిస్తాం.మన ఆలోచనలు అంతవరకే ఉంటాయి.కానీ అమెరికాలో స్థిరపడ్డ అనిల్.కె.మల్హోత్రావి ఆలోచనలు ఏకంగా ఓ అభయారణ్యాన్ని సృష్టించేలా చేశాయి.1986 లో ఇండియా వచ్చాక కర్ణాటకలోని కొడగు జిల్లాలో 300 ఎకరాలు భూమి కొన్నారు.ఆయన భార్య పమేలా,పర్యావరణ ప్రేమికురాలు తారాచందర్ మరికొంతమంది ఆయనకు సహకరించారు.అందులో 700 సం క్రితం చెట్టు ఓ ప్రత్యేకం.300 రకాల పక్షులు,పునుగు పిల్లులు,పులులు,ఏనుగులు జింకలు ఇలా వందలాది జీవరాసులున్నాయి.ఇందులో రెండు cottages నిర్మించి యాత్రికులను ఆహ్వానిస్తున్నారు.వాటిద్వారా వచ్చే డబ్బుతో ఆ అరణ్యాన్ని నిర్వహిస్తున్నారు.మనం ఓ సారి వెళ్లి చూసొద్దామా!ప్రసిద్ద కంపెనీలు CSR (Corporate social responsibility)క్రింద ఇటువంటి అరణ్యాలను సృష్టించవచ్చు.

Tuesday 19 May 2020

నాదేశం నా ప్రజలు(My country-My people రచన:గుంటూరు శేషేంద్ర శర్మ )పై ఒక విశ్లేషణ


ఆధునిక ఇతిహాసం,నాదేశం నా ప్రజలు(My country-My people రచన:గుంటూరు శేషేంద్ర శర్మ )పై ఒక విశ్లేషణ :ఒద్దుల రవిశేఖర్                                                                                 *కవి వ్యక్తీకరణ సమాజం గురించి అందులోని సమస్యలకు తన ప్రతిస్పందన.ఆంధ్రప్రదేశ్ లోని 5 కోట్లమంది కోసం,భారత దేశం లోని 50 కోట్లమంది(రచనాకాలం జనాభా)కోసం గొంతెత్తుతాను అంటూనే ఈ దేశమే కాదు మానవ జాతి అంతా ఇదే వేదన పడుతుందని విశ్వవేదనను తన కలం ద్వారా పలికించాడు. తన పలికే నా దేశపు నాలికపై పలుకుతుందని ప్రకటించాడు.                               *ఇతిహాస నిర్మాణానికి తన అనుభవం,పాండిత్యం అంతా ధారబోసి రచించానని ప్రకటిస్తూ నా రక్తమే ఈ ఇతిహాసం అనడంలో తనలో పగిలిన బడబానలమేఈ రచన అంటూ విశ్వమానవుడయ్యారు."అనుభవ జ్ఞాన నేత్రద్వంద్వం" అనే పదప్రయోగం అద్భుతం.అనుభవం,జ్ఞానం అనే రెండు నేత్రాలతో మానవచరిత్రను పిండినట్లు తెలియజేసారు.అందుకే ఎంతో స్థిరంగా ఇది ఈ శతాబ్దపు పాటగా ధైర్యంగా ప్రకటించుకున్నారు.                                      *తన అనుభూతికోసం ప్రతితరం కవులు ఒక భాషను సృష్టించుకుంటారు.ఈ కాలపు మనిషిని అవిష్కరించడాానికి నేను ఒకభాషను,ఒక లోకాన్ని సృష్టించానని ,ఎందుకంటే మనిషి లాగా,ఎవరికీ తలవంచని స్వతంత్రమానవుడు ఈ కాలం మనిషి కనుక. ఇప్పటి మనిషి గతం లోని వ్యవస్థను విధ్వంసం చేయడమే లక్ష్యంగా నమ్ముతాడు కాబట్టి.కనుక తన రచన ఇప్పటి మనిషి ఆశల్ని,ఆశయాల్ని, తిరుగుబాటును ప్రతిబింబిస్తుందని చెబుతారు.                       *కర్షకుని ఇతివృత్తమే ఈ కావ్యం.ఈ ఇతిహాసం లో అంతా కర్షకుని శ్రమే కనపడుతుంది .ప్రపంచ సాహిత్యాన్ని విస్తారంగా చదివిన అనుభవం ఆయన ఇచ్చిన విభిన్నభాషల్లోని పుస్తకాల ఉదాహరణనుబట్టి మనకర్ధమవుతుంది.                                                                                             ఒకటో సర్గ.                                                     కర్షకుని,కార్మికుని హస్తం ఎన్ని పనులు చేస్తుందో వర్ణిస్తూ "మానవ జీవిత పొలాల్ని దున్నుతా"అన్న ఒక్క వాక్యం తో వివరిస్తారు.కానీ రైతుకు ఏమీ దక్కలేదని నిర్వేదం చెందుతాడు.ప్రపంచంలో అన్ని మార్పులు తన చేతి గుండా జరుగుతున్నా తన జీవితం ఏమీ మారలేదని ఆవేదన తో తనలో రగిలే ఎర్రకోరికనే ఒక జెండాగా ప్రకటిస్తారు.తన అంతరంగ ఆవేదనను తిరుగుబాటుగా మార్చి పలుకుతున్న ఈ భావాలు చూడండి."తుఫానులు లెక్కజేయని నాకు ఈ క్షుద్బాధ ఒక లెక్కా!మిలియన్ల సుత్తులు, కొడవళ్లు సూర్యకిరణాల్లో ప్రతిఫలిస్తున్నాయి.".సముద్రపు అశాంతిని,ం
ఝoఝామారుతపు ఆవేశాన్ని తనలో పలికిస్తున్నాడు.           *కాలమనే కాగితంపై ఒక స్వప్నం రాసి తన ఊపిరితో సంతకం చేస్తా అంటూ భవిష్యత్ తరానికి ఒక సందేశం అందిస్తారు.తన కోరిక మనిషిలో అశాంతిని రేకెత్తించి ఉద్రిక్త రక్తం లా ప్రాకుతుంది అంటారు.తన పద్యాలను పొందే అర్హత భూగోళo మీద అన్ని జాతులకూ ఉంటుందంటారు.పైన తెలిపిన ధిక్కార ధోరణి ఏమయినా రుచించక నోబుల్ బహుమతి నిరాకరించారేమో అనిపిస్తుంది.అంతలోనే వసంతాన్ని వర్ణిస్తూ మనల్ని హాయిగా పలుకరిస్తారు.                                                            *అడవుల్ని కప్పుకొని, నదుల్ని తలపాగాలాగా చుట్టుకోవడం,రస్తాలను ఉత్తరీయాలుగా వేసుకోవడం లాంటి ప్రయోగాలతో ప్రకృతే తానై పోయాడు.తన దేశపు పర్వతాలను ఇతిహాసాలుగా మలచ దలుచుకున్నా అని ప్రకటిస్తూ తన మార్గం చెప్పకునే చెప్పారు.                                                                                                                                                                           రెండోసర్గ:                                                      తనను ఒక తుఫానుగా పరిచయం చేసుకుంటాడు. తన జాతి కెరటంలా ఆకాశం మీదికి దుముకుతుంది అని ధిక్కరిస్తారు. నగరాలు ఏర్పడకముందు,నదుల్ని దాటి ఇతర దేశాలకు ఎలా ప్రయాణమయ్యింది వర్ణిస్తూ భూమిని వాక్యంలా,నీలి సముద్రాలు,కామాలు,సెమీకొలన్లుగా పరిగణిస్తాడు. సముద్రాలు,భూమి ప్రేమ లేఖలు వ్రాసుకునే నీలిసిరిగిన్నెలుగా అభివర్ణిస్తూ అందులోని సిరాలోనుంచి గాలులు మోసుకొచ్చే అక్షరాలే సామ్రాజ్యాలు,నాగరికతలు,విజ్ఞానం అని ఓ మనోహరమైన పోలికను ప్రతిపాదించారు.                                                                                          మూడో సర్గ                                                   హైదరాబాద్ మహానగరంగా మారాక ఎంత కాలుష్యకారకంగా మారిందో ఇందులో వర్ణిస్తారు.చెట్లు తనకేసి చూస్తూ మాకు కవిత్వాలు వద్దు,వెయ్యి ప్రళయాలు దట్టించిన ఒక బాంబు ఇవ్వమని అడుగుతాయని చెప్పడం ద్వారా చెట్లెంత విషాదంలో ఉన్నాయో కాలుష్యాన్ని పీల్చలేక అనిపిస్తుంది.పూలెందుకు పూస్తాయి ఇవి,బుల్లెట్లు పూయక అని తన ఆక్రోశాన్ని వెళ్లగక్కుతారు.మిలియన్ల కొద్దీ మనుషుల గొంతుల్ని కాలం నొక్కివేస్తుంది ఈ నగరం లో,కానీ నీలగిరి కొండల్లో చెట్లు,పర్వతాల నడుమ చిక్కి చూస్తుంది కాలం అనే పోలికతో కవిత్వం లో కొత్త పోకడలు పోతారు." ఇక్కడ మనిషి సంతోషపు ఇంద్రజాలం లో శబ్దమై,పాటై, పక్షుల పర్వతాల శరీరాల్లో ప్రవహిస్తాడు.కాలం చేతి వేళ్ళ లోంచి కారిపోతాడు మనిషి."ఈ వాక్యాల్లో మనిషి పొందే ఆనందపు అంచుల్ని పట్టి మనముందుంచుతారు.ఇక్కడ పక్షులు, కీటకాలు అంతకంటే ఎక్కువ ఆనందం పొందుతున్నాయి.ఇక్కడ మనిషి బుద్ది,అహంకారాలకు అధికారం లేదు.అందుకే కాలాన్ని నగరాలనుండి, కొండల్లోకి ఈడ్చుకువచ్చి సంహరించాను అని చెప్పడం ద్వారా తను ఎంత ప్రకృతి ప్రేమికుడో,అందులో ఎంత లీనమయ్యారో,ఎంత ఆనందం అనుభవించారో మన కర్ధమవుతుంది.విత్తనమై,చెట్టయి, పువ్వై వాటి మార్పుల్ని ,.పక్షినై,చేపనై మారి వాటి స్వేచ్ఛను తాననుభవిస్తారు.   పండు ఒట్టి సన్యాసి! సత్యదర్శనం కోసం తపస్సులో మునిగి పోయిన ఋషి ,ఎప్పుడయితే అది లభిస్తుందో అప్పుడు రాలిపోతుంది.అంతవరకు పండు ధ్యానం చేస్తున్న ఋషి అంటారు.ఈ ఒక్క పోలికతో ఆయన కవితా సౌందర్యం తాత్వికసీమల వైపు పయనిస్తోంది.రాలే పండు అనుకుంటుందట-చెట్టు గింజ తన కడుపులో ఉందని,చెట్టు నేను,ఒకటేనని ఎంత తాత్వికతను పండించారో ఇక్కడ! ఈ ధరిత్రి ఒక సృష్టి ప్రదర్శనశాల.పశువులు,పక్షులు,వృక్షాలు,మనుషులు అందరూ మట్టిలోకి అస్తమిస్తారు.కాలం అన్నిటినీ తనలోకి లాగేసుకుంటుంది.,నిర్దాక్షిణ్యంగా.ఈ నాగరికతలను నిర్మించటానికి చెమట ఒక శాశ్విత అంతర్వాహినిిలా ప్రవహిస్తూ ఉంటుందని  హెప్పడా ద్వారా శ్రామికుని పాత్రను ఆవిష్కరిస్తారు. ఈ ప్రదర్శనశాల ఎన్నో నాగరికతలు,ప్రభుత్వాలు వచ్చిపోతుంటాయి.అన్ని నశించిపోతుంటాయి.కానీ మనిషి బౌద్ధికశక్తి మరో మార్పుకు బీజం వేసుకుంటుంది.                                                            నాలుగో సర్గ.                                            ఇందులో మళ్లీ తన కవిత్వాన్ని కదనాశ్వo లా దూకిస్తారు.ఎరుపు,రక్తం వంటి మాటలతో ధిక్కారం తన అజెండాగా ప్రకటిస్తారు.నేను పోయినా నా కవిత్వం,నా జ్ఞాపకాలు ఈ దేశపు గాలిలో పక్షులై పాడుతుంటాయి,అని తన కవిత్వ ఉద్దేశాన్ని స్పష్టంగా తెలియజేస్తారు.చెట్లను,ఆకులుకాదు తుపాకులు కాయమని అడుగుతున్నాడు.అంతలోనే నిర్వేదం లో మునిగిపోతాడు. ఇప్పటివరకు ప్రకటించిన తిరుగుబాటు మాయమై తను ఓడిపోతున్న జీవినని,నేలమీద నడుస్తున్న బాటసారినని, ధ్యానంచేసుకోవాలనుందని ,తన ఏకాంతానికి భంగం కలిగించని దేవుడు లేని దేవాలయానికి పారిపోవాలని ఉందని తన నిస్సహాయతను వ్యక్తపరుస్తారు.ఈ ధ్యానంలోనుండే చివరకు దేవుడినయ్యాను అని చెప్పుకుంటారు.సూర్యోదయం,సూర్యాస్తమయాల్లేని అలౌకిక నిశ్శబ్దం లో మునిగిపోయాను అని తన స్థితిని వర్ణిస్తారు.చెట్లను నరికే కసాయి వాని చేతులు నరకాలి అని తనెంత వృక్ష ప్రేమికుడో తెలియజేస్తారు.తన ప్రయాణాన్ని తన ప్రేయసికి తెలియ జేస్తూ ఆయన కలం తెలుగు భాషను భరత నాట్యం ఆడేలా చేసింది."నీవక్షస్ శాద్వలసీమ మీద నా కవోష్ణ కిరణాల హిరణ్యం వెదజల్లుతాను".                                                                                         ఐదో సర్గ                                       మళ్లీ ఇందులో తనే నీ మోహినీత్వoతో తనని మోసం చేయవద్దని తనలో ద్వేషాన్ని తొలగించవద్దని,దాంతో నాలోని అగ్ని పర్వతాలు పగలనీయమని కోరుకుంటాడు.ఈ నేల ఎంతకఠినమైందో చెబుతూ తన గాయాల రక్త జ్వాలల్ని ఎండమావులుగా ఉమ్మివేస్తున్న నేల గా అభివర్ణిస్తారు."అవి రాళ్ళని ఎవరన్నారు,నోళ్ళుమూసుకున్న అంతరాత్మలు"అని చెప్పడంలో రాళ్లు ఎన్ని యుగాలనుండి అన్ని దోపిడీలు,దారుణాలు చూస్తూ మౌనంగా ఉన్నాయో మనకు తెలియజేస్తారు. కర్షకునికి నీ ఒంటరికావు,నీ అడుగులో అడుగేసే వాళ్ళు ఉన్నారని మరువకు అంటాడు.కొండలు ఎందుకు అరవవు,రాత్రుల కపాలాలు పగలవెందుకు,ఈ నక్షత్రాలు చచ్చి నేలకు రాలవెందుకు,ఈ జనం నా మాట వినరెందుకు ,వీరిని ఎలా మార్చాలో తెలీదు అని తన ఆక్రోశాన్ని వెళ్లగక్కుతారు.                                                      ఆరోసర్గ.                                                   పరిణామ క్రమంలో  భూమంతా మానవులు స్వేచ్చగా తిరిగినట్లు తను అలాంటి దేశద్రిమ్మరినని చెబుతూ నేను పీల్చే ఊపిరే పోట్లాట అని స్పష్టంగా ఎలుగెత్తిచాటుతారు."నేను సత్యాగహిని,సత్యం నా గుండెల్లో బ్రద్దలవుతున్న అగ్నిపర్వతం,నా గొంతులో గర్జిస్తున్న జలపాతం అని సత్యం కోసం తన కోసం తన పోరాటాన్ని ఆరంభిస్తారు."దేశం కోసం పోరాడటానికి తరలిరమ్మని ప్రజలకు పిలిపిస్తున్నాడు.మీ వేడి గొంతులతో నా తుపాకులూ, నా శతఘ్నులు తయారుచేసుకుని దేశం కన్నీరును తుడుస్తాను"అని తన దేశభక్తిని చాటుకుంటారు."నా గొంతు ,నా భాష జాతికి అంకితం,నేను ఒక రక్త ప్రవక్తను".అంటూ నా పద్యాలనే బందూకులు తీసుకురండి,మబ్బుల్లో దాచుకున్న పిడుగులు తెండి,రండి,అంటూ తనని తాను ఝంఝామారుతాన్ని అని ప్రజలకు పిలుపిస్తారు.పీడిత ప్రజలదే ఈ భూమి,నాతో కలిసినడవండి, నాగళ్ళు తీసుకు రండి,మనల్ని బానిసలు చేసిన వాళ్ల ప్రాణ వాయువులు తీద్దాం రమ్మని విప్లవోన్ముఖం వైపు ఒకరకంగా ఒక Long March కోసం పిలుపిస్తారు.ఆకలి ,దప్పికలు నీ స్వేచ్ఛను హరిస్తున్నాయి.విద్యార్థులను పుస్తకాలు వదిలేసి పొలాలు ఆక్రమించుకుందాం రమ్మంటారు."స్వేచ్ఛ మనిషికి మొదటి శ్వాస.అది నీ రక్తపు సజీవభాష. నీ చివరి శ్వాస వరకు స్వేచ్ఛను నిలుపుకోవడమే నీ ధ్యాస "అంటూ మనిషికి స్వేచ్ఛ ఎంత అవసరమో తెలియ జేస్తారు.తన ఆగమనాన్ని ,తన మహాప్రస్థానం కర్షకులకోసం అంటూ తన శక్తి ,రక్తం అంతా ధాన్యంగా,పండ్లుగా మారిపోవాలి.తను ఒక ఉద్యమ విద్యుత్తు ఇస్తున్నానంటూ పిలుపిస్తారు.తిండి గింజలు ఎలా వస్తున్నాయి.వ్యవసాయం ఎలా చేస్తారో తెలుసుకోవాలంటారు."భూమిని బుజ్జగిస్తాను,లలితంగా లాలిస్తాను.వెన్నలాంటి మన్నుతో గోరుముద్దలు చేసి పైర్ల పసినోళ్ళ కందిస్తాను.".భూమి పట్ల,పంట పట్ల రైతు ప్రేమను ఇంతకన్నా  గొప్పగా ఎవరు వ్రాయగలరు.ఇంత చేస్తున్నా నాకు గుడిసెతప్ప ఏమీ లేదని కర్షకుని దైన్యాన్ని తనలో పలికిస్తారు. ఉదయాన్నే సూర్యోదయం అవుతుందని ఆశిస్తే సూర్యగ్రహణం వచ్చిందని ,మనుషుల్ని అలా మోసం చేసారని ఆవేదనతో జ్వలించి పోతారు."ఎవరు నేల గొంతు ఆలకించి దాన్ని లాలించి తన చెమటతో,రక్తంతో వెన్నలా,జున్నులా మృదువు చేశారో" రైతు దేహంలోకి ,మనసులోకి పరకాయ ప్రవేశం చేసినట్లుంది ఈ కవిత్వం.ఇంత చేసినా చివర్లో ఒక్కగింజ దక్కలేదని బాధపడతారు.మనిషిని అవమానించిన వాణ్ణి దుర్భాష లాడతారు.తిట్లు చిన్నవి,నా దేహమంతా అగ్నిఛ్చటుల వర్షపాతం వీస్తోంది. అది మిమ్మల్ని భస్మిపటలం చేస్తోంది అని హెచ్చరిస్తారు.రైతుకు ఏమీ దక్కనివ్వని ఈ వ్యవస్థపై తిరుగుబాటు బావుటా ఎగురవేస్తాడు."ఈ దేశం లో ఒంగేవాడికి ఒంగి సలాం చేసేవాడు పుడుతున్నాడు"అని బానిసలుగా బ్రతికే వారిని ప్రశ్నిస్తారు.                                                                                                 ఏడవ సర్గ                                                      చెట్లను మునీశ్వరులతో పోలుస్తారు.సూర్యుడు భూమిని ప్రేమించినంతగా నిన్ను ప్రేమిస్తున్నాను. తన దేశాన్ని తన ప్రేయసిలో చూసుకుంటూ ఆమె అందించే ప్రేమతో ఈ శతాబ్దం విసిరే క్రూర సవాళ్ళను ఎదుర్కొంటాను,అని ముగిస్తారు.                       *శ్రామికునిపట్ల,కర్షకుని పట్ల సామాన్యమానవుని పట్ల ఇంత ప్రేమ,ఆపేక్ష చూపించిన కవి మనం చూడలేమేమో!శ్రీశ్రీ మహా ప్రస్థానం మానవ సంగీతాన్ని పలికిస్తే శేషేంద్ర "నా దేశం,నా ప్రజలు" మనిషి గుండెలోని బడబాగ్నిని అగ్నిపర్వతం లా తుఫానులా విరుచుకు పడేలా చేస్తుంది.                                             *ఈ ధిక్కార ధోరణే ఆయనకు నోబుల్ బహుమతిని దూరం చేసిందేమో అనిపిస్తుంది.ఠాగూర్ "గీతాంజలి"కి ఏమాత్రం తీసిపోని కావ్యం.నోబుల్ బహుమతికి అర్హమైన కావ్యం.

                

Saturday 16 May 2020

విత్తనాలు నాటుదాం.

                 పండ్లు తినడం మనకు బాగా అలవాటు.ఆరోగ్యానికి పండ్లు ఎంతో మేలు చేస్తాయి.ఏ కాలం లో వచ్చే పండ్లను ఆయాకాలాల్లో తినడం ఎంతో మంచిది.విదేశాల్లోనుండి దిగుమతి అయ్యే ఖరీదైన పండ్ల కంటే మన దేశం లో పండ్లు తక్కువ ధరలో దొరుకుతాయి.పండ్ల తోటలను చూస్తే అక్కడ రైతులు వాటిని ఎంత కష్టపడి పండిస్తున్నారో అర్ధమవుతుంది ఒకప్పుడు మాకు బత్తాయి తోట ఉండేది.నీళ్లు లేక ఎండిపోయాయి.sweets,oil foods,junk food కు పెట్టే ఖర్చులో సగభాగం పండ్లు తినడానికి వెచ్చిస్తే రైతులు లాభపడతారు.                                                                                  మనం తినే పండ్లలో విత్తనాలు ఉంటాయి.వాటిని మనం పారవేస్తూ ఉంటాము.కానీ ఒక్కసారి ఆలోచించండి.ఆ విత్తనాల ద్వారానే కదా ఆయా మొక్కలు మొలిచేది.మరి వాటిని భద్రపరిచి,ఎండపెట్టి,ఎక్కడయినా భూమిలో పాతితే మొక్కలు మొలుస్తాయి కదా!అడవిలో చెట్లు ఎవరు నాటుతున్నారు.విత్తనాలు నేలపై పడి వర్షాలు పడ్డప్పుడు మొలకెత్తుతాయి.అలాగే రాబోయే వానాకాలం లో మనం తిన్న పండ్ల విత్తనాలను ఎక్కడ వీలయితే అక్కడ భూమిలో నాటితే సరి. పండ్ల విత్తనాలే కాదు,చింతపండు ఇంట్లో వాడతాము కదా,వాటి విత్తనాలు,ఇంకా వేప,కానుగ, మర్రి,రావి ఏవి దొరికితే అవి నాటుకుంటూ వెడితే వాటిలో 10 శాతం బ్రతికినా మేలే కదా! నేను విత్తనాలు దాచిపెడుతున్నాను,మీరు చేస్తారా ఈ పని.మన భూమికోసం,మన పిల్లలకోసం ఈ పని చేద్దాం.చేస్తారు కదూ!