Sunday 3 April 2022

"పధం" సంస్థలో NMMS లో శిక్షణ.

 "పధం"సంస్థలో NMMS,SSC విద్యార్థులకు శిక్షణ"పధం" సంస్థ.                           తర్లుపాడు వారి ఆధ్వర్యం లో సంక్రాంతి సెలవుల్లో 10 వతరగతి విద్యార్థులకు శిక్షణా కార్యక్రమాలు 8/1/2022 నుండి ప్రారంభమయ్యాయి.NMMS విద్యార్థులకు గత సం దసరా నుండి శిక్షణా తరగతులు జరుగుతున్నాయి.10 వ తరగతి విద్యార్థులకు అన్ని subject లలో పరీక్షలో వచ్చే అంశాలపై విషయ నిపుణులతో శిక్షణ ఇప్పిస్తున్నారు.పధం నిర్వాహకులు మల్లిఖార్జున ఈ  కార్యక్రమాన్ని సమన్వయ పరుస్తున్నారు.మొదట introduction class తీసుకున్న ఒ.వి.రవిశేఖర్ రెడ్డి ,చిన్నప్పుడు అందరికి "కుతూహలం" చాలా ఎక్కువగా ఉంటుందని వయసు పెరిగే కొద్దీ ఆ లక్షణం కోల్పోతారని చెబుతూ తెలుసుకోవాలనే కోరిక విద్యార్థి దశలో అత్యున్నత స్థాయిలో ఉండాలని దానినుండి జ్ఞానం ఆనందం వస్తాయని జీవితమంతా అటువంటి కుతూహలాన్ని కోల్పోకుండా ఉండాలని  స్నేహితుల,పరిసరాల ప్రభావం మీపై  ఎక్కువగా ఉంటుందని ,చిన్న వయసు నుండి మంచి అలవాట్లను ఏర్పర్చుకుంటూ చెడు అలవాట్లను తొలగించుకుంటూ మనసు ను ఎప్పటికప్పుడు rewiring,recharging చేసుకోవాలని చెప్పారు.జార్జి ఫార్మసీ కాలేజ్ కరస్పాండెంట్ శ్రీ A.సతీష్  మాట్లాడుతూ పరిసరాలను పరిశీలిస్తూ,ప్రయోగాత్మకంగా నేర్చుకుంటూ ఉంటే ఏదయినా వస్తుందని ఉపాధ్యాయులే అంతా చెప్పాలనే భావన నుండి బయటపడాలని స్వయం అభ్యసనం(self learning) చేయాలని జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలనే లక్ష్యాలు పెట్టుకోవాలని విద్యార్థులకు సందేశ మిచ్చారు.మార్కాపురం బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ M.చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ ప్రాంతం ఒక శాంతినికేతన్ లా ఉందని ఇలాంటి వాతావరణం లో చక్కని జ్ఞానం పొందవచ్చని పధం నిర్వాహకులను అభినందించారు.చెన్నారెడ్డి పల్లి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, శ్రీ వై శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులు పరీక్ష విధానం గురించి క్షుణ్ణంగా తెలుసుకుని మంచి మార్కులు సాధించాలని పదం కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మర్రిపాలెం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగేశ్వర రావు గారు సంక్రాంతి సెలవులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మార్చిలోనే పరీక్షలు జరుగుతాయని ఈ మూడు నెలలు ఏకాగ్రతతో చదవాలని విద్యార్థులను కోరారు.చివరగా మల్లిఖార్జున గారు మాట్లాడుతూ చదవడం ఒక ఆనందకర ప్రక్రియ అని,జీవితంలో సాధించాల్సింది ఆనందంగా ఉండడమే అని అటువంటి సమాజాలు ఉన్నతమైనవని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో పదం నిర్వాహకులు చాంద్ భాషా,ఆనంద్,కోటి మోహన్,వెంకట్ నారాయణ,నాగూర్, గాలెయ్య భాస్కర్, కరీం పాల్గొన్నారు."పధం"సంస్థలో NMMS,SSC విద్యార్థులకు శిక్షణ"పధం" సంస్థ. తర్లుపాడు వారి ఆధ్వర్యం లో సంక్రాంతి సెలవుల్లో 10 వతరగతి విద్యార్థులకు శిక్షణా కార్యక్రమాలు 8/1/2022 నుండి ప్రారంభమయ్యాయి.NMMS విద్యార్థులకు గత సం దసరా నుండి శిక్షణా తరగతులు జరుగుతున్నాయి.10 వ తరగతి విద్యార్థులకు అన్ని subject లలో పరీక్షలో వచ్చే అంశాలపై విషయ నిపుణులతో శిక్షణ ఇప్పిస్తున్నారు.పధం నిర్వాహకులు మల్లిఖార్జున ఈ కార్యక్రమాన్ని సమన్వయ పరుస్తున్నారు.మొదట introduction class తీసుకున్న ఒ.వి.రవిశేఖర్ రెడ్డి ,చిన్నప్పుడు అందరికి "కుతూహలం" చాలా ఎక్కువగా ఉంటుందని వయసు పెరిగే కొద్దీ ఆ లక్షణం కోల్పోతారని చెబుతూ తెలుసుకోవాలనే కోరిక విద్యార్థి దశలో అత్యున్నత స్థాయిలో ఉండాలని దానినుండి జ్ఞానం ఆనందం వస్తాయని జీవితమంతా అటువంటి కుతూహలాన్ని కోల్పోకుండా ఉండాలని స్నేహితుల,పరిసరాల ప్రభావం మీపై ఎక్కువగా ఉంటుందని ,చిన్న వయసు నుండి మంచి అలవాట్లను ఏర్పర్చుకుంటూ చెడు అలవాట్లను తొలగించుకుంటూ మనసు ను ఎప్పటికప్పుడు rewiring,recharging చేసుకోవాలని చెప్పారు.జార్జి ఫార్మసీ కాలేజ్ కరస్పాండెంట్ శ్రీ A.సతీష్ మాట్లాడుతూ పరిసరాలను పరిశీలిస్తూ,ప్రయోగాత్మకంగా నేర్చుకుంటూ ఉంటే ఏదయినా వస్తుందని ఉపాధ్యాయులే అంతా చెప్పాలనే భావన నుండి బయటపడాలని స్వయం అభ్యసనం(self learning) చేయాలని జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలనే లక్ష్యాలు పెట్టుకోవాలని విద్యార్థులకు సందేశ మిచ్చారు.మార్కాపురం బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ M.చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ ప్రాంతం ఒక శాంతినికేతన్ లా ఉందని ఇలాంటి వాతావరణం లో చక్కని జ్ఞానం పొందవచ్చని పధం నిర్వాహకులను అభినందించారు.చెన్నారెడ్డి పల్లి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, శ్రీ వై శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులు పరీక్ష విధానం గురించి క్షుణ్ణంగా తెలుసుకుని మంచి మార్కులు సాధించాలని పదం కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మర్రిపాలెం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగేశ్వర రావు గారు సంక్రాంతి సెలవులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మార్చిలోనే పరీక్షలు జరుగుతాయని ఈ మూడు నెలలు ఏకాగ్రతతో చదవాలని విద్యార్థులను కోరారు.చివరగా మల్లిఖార్జున గారు మాట్లాడుతూ చదవడం ఒక ఆనందకర ప్రక్రియ అని,జీవితంలో సాధించాల్సింది ఆనందంగా ఉండడమే అని అటువంటి సమాజాలు ఉన్నతమైనవని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో పదం నిర్వాహకులు చాంద్ భాషా,ఆనంద్,కోటి మోహన్,వెంకట్ నారాయణ,నాగూర్, గాలెయ్య భాస్కర్, కరీం పాల్గొన్నారు.

No comments:

Post a Comment