Saturday 17 September 2016

                                             రూపాయికే ఐ.ఐ.టి శిక్షణ (సూపర్ 30)
       పేదరికంతో కేంబ్రిడ్జి విశ్వ విద్యాలయం లో చదివే అవకాశం కోల్పోయిన బీహార్ కు చెందిన ఆనంద్ కుమార్  ప్రతి సంవత్సరం ప్రతిభావంతు లైన నిరుపేద విద్యార్థులకు ఉచిత వసతి భోజనం కల్పించి  ప్రతిష్టాత్మక ఐ.ఐ.టి లలో సీట్లు సాధిస్తూ సూపర్ 30 గా గుర్తింపు పొందారు.మన దేశంలో గణిత బోధన,చదువులు ఐ.ఐ.టి. ల పై ఆసక్తి,తమ శిక్షణ కేంద్రం విజయ సూత్రాలపై ఆయన మాటల్లోనే
1) నాకు లెక్కలంటే ప్రాణం.డబ్బుల్లేక  కేంబ్రిడ్జిలో చేరే అవకాశం కోల్పోయాను.ఆ దిగులుతో నాన్న చనిపోయారు.  అమ్మ అప్పడాలు చేస్తే నేను వాటిని అమ్మే వాణ్ని.Ramaanujam school of mathematics మొదలెట్టి ట్యూషన్స్ చెప్పా .
2) మన దేశంలో చదువును ఉద్యోగం ఉపాధితో ముడిపెడుతున్నారు.10 తరువాత ఐ.ఐ.టి పై విద్యార్థుల్లో ఉన్న ఆసక్తిని గమనించి 30 మంది పేద పిల్లలను ఎంచుకుని  వారిని మా ఇంట్లోనే  ఉంచుకుని  శిక్షణ ఇస్తున్నా .
3) కేవలం IITians ను తయారు చెయ్యడమే నా లక్ష్యం కాదు.సాధ్య మైనంత మందికి చదువు చెప్పించి వారి ద్వారా సమాజానికి తిరిగి లబ్ది చేకూర్చాలన్నదే నా ఆశయం.ఈ దేశం లో డబ్బుల్లేక ఎవరు చదువు ఆపేయకూడదు. అదే నా జీవిత అంతిమ లక్ష్యం.
4)సూపర్ 30 లో మేము మూస పద్ద్దతి లో భోదించం. పిల్లలు బృందంగా చర్చించి ప్రశ్నలు తయారు చేస్తారు.వాటికి సమాధానాలు అన్వేషిస్తారు.ఆలోచించే,ప్రశ్నించే తత్వం ఆధారంగా భోధన జరుగుతుంది.సంస్కారం నేర్పుతాం.  నా శిష్యుల్లో ఎవరూ రూపాయి కట్నం తీసుకోలేదు. 
5)మారుమూల ఉన్నవారు పట్టణాలకు వఛ్చి శిక్షణ తీసుకోలేరు.అటువంటి వారి కోసం అంతర్జాలం CELLPHONES ను  ఉపయోగించుకుని ఏడాది లోపే ఆన్లైన్ ద్వారా ఐ.ఐ.టి శిక్షణ ఇవ్వబోతున్నాము. ఒక్క రూపాయి మాత్రమే చెల్లించి నా తరగతులను ఆన్లైన్లో వినవచ్చుఁ. 1 నుండి 12 తరగతి దాకా అన్ని పాఠాలు online లో ఉంచుతా .
6) రామానుజం ఓ విలక్షణ శాస్త్రవేత్త్త. ప్రపంచంలో గణితంలో ఇచ్ఛే అత్యున్నత పురస్కారం పొందిన వాడు మన మంజుల భార్గవ్.కానీ ఇలాంటి వారు మన దేశం లో తయారు కావటం లేదు.మన గణిత బోధనా పద్ధతులు బాగా లేవు. లెక్కల్ని బట్టీ పట్టిస్తున్నాము.ఎలా ఎందుకు అని ప్రశ్నించి,విశ్లేషించే అవకాశం లేకుండా చేస్తున్నాము.
6) మంచి చదువులు మంచి ఉపాధ్యాయులు న్న చోట వస్తాయి.గణిత ఒలింపియాడ్స్ లో  చైనా గత 20 ఇండ్లలో 13 సార్లు ప్రపంచ నెంబర్ 1 గా నిలిచింది.
7) పిల్లల్ని ఆలోచించ నీయకుండా అంతా వారి మెదళ్లలో కుక్కుతుండడంతో వారి ఊహా శక్తి చఛ్చి పోతుంది.
8) ప్రతిభావంతులంతా ఐ.ఐ.టి వైపు పరుగులు తీ స్తుండడంతో  ఉపాధ్యాయ  విద్య వైపు మంచి వారు రావటం లేదు పిల్లల పై చిన్నప్పటి నుండి ఐ.ఐ,.టి  అంటూ ఒత్తిడి తే కండి .వారికి పజిల్స్ ఇస్తూ ఆలోచించే తత్వాన్ని నేర్పండి
9)గణితం లో ఆసక్తికర సమస్యల్ని ఇఛ్చి పరిష్కరించ మనండి.వారి మనసులు  సహజం గా వికసించ నీయండి .
10) వారికి వయసుకు మించిన చదువులు చెబితే పిల్లలు యాంత్రికంగా తయారవుతారు.ఆత్మీయతలు మరిచి పోతారు.