Sunday 12 October 2014

బాలల హక్కుల యోధుడు కైలాష్ సత్యార్థి,మలాలా యూసఫజాయ్ లకు నోబెల్ శాంతి బహుమతి

                బాలల హక్కుల కోసం,వెట్టి చాకిరి నిర్మూలన కోసం,పిల్లల చదువుల కోసం కైలాష్ 3 దశాబ్దాల కృషికి ఈ నోబెల్ శాంతి బహుమతి వచ్చింది.ఇప్పటికి 80,000 మంది పిల్లలను బాలకా ర్మికత్వం నుంచి విముక్తి చెందించి వారికి అందమైన భవిష్యత్తును కల్పించారు.child labour act,విద్యాహక్కు రూపకల్పనలో పాలు పంచుకున్నారు. భారత దేశం లోనే కాకుండా ప్రపంచ వ్యాప్త బాల కార్మికుల కోసం ఈయన కృషిని గుర్తించారు. "నేను చనిపోయే లోపు బాల కార్మిక వ్యవస్థ అంతాన్ని చూస్తాను అని ఆత్మ విశ్వాసం తో చెబుతారు .
             బాలల పథకాలను వారి మీద జాలితో కాకుండా అవి వారి హక్కుగా చూడాలంటారు.పేదరికం,నిరక్షరాస్యత బా ల కార్మికవ్యవస్థ ఈ మూడింటి మధ్య అవినాభావ సంబంధం ఉందని వీటిని ఉమ్మడిగా తుద ముట్టించా లంటారు పిల్లల పట్ల ఆయన భావాలు ఆయన మాటల్లోనే
    "నేను చిన్న పిల్లల చెలికాడిని మనం వారిపట్ల చూపాల్సింది జాలి దయ కాదు మనకు స్వచ్చత పార దర్శకత నేర్పేందుకు పిల్లలను మించిన వారు ఎవరుంటారు .వారు పక్షపాతం లేకుండా ముక్కుసూటిగా ఆలోచించే మాయా మర్మం తెలియని వాళ్ళు "
        ఇంత ప్రేమ వారిపట్ల ఉండబట్టే నోబెల్ శాంతి బహుమతి వచ్చింది.
  ఇక మలాలా చావు బతుకుల మధ్య పోరాడి గెలిచి న  ధీరబాలిక .విద్య నేర్చుకోవటం  పట్ల ఆమె దృఢ చిత్తం ,ప్రాణాలను లెక్క చేయని సాహసం ఆమెకు ఈ అవార్డ్ తెచ్చి పెట్టాయి .ప్రపంచమ్ లోని బాలికలంతా ఆమె స్పూర్తిని అందిపుచ్చుకోవాలి.ఒక విద్యార్థి,ఒక ఉపాధ్యాయుడు ఒక కలం,ఒక పుస్తకం ఈ ప్రపంచాన్ని మారుస్తాయి అని ప్రకటించిన ఆశావాది .
           బాలలందరి తరపున వీరిద్దరిని హృదయపూర్వకంగా అభినందిద్దాము .
కైలాష్ విద్యార్థి గురించి మరింత సమాచారం ఈ క్రింది వెబ్సైటు లో గమనించగలరు . 
http://www.kailashsatyarthi.net/contact/submit.php