Tuesday 24 December 2013

ఈ సహస్రాబ్ది వ్యక్తి (Man off the millennium)


 
      ఎలా ఈయన అంత గుర్తింపు తెచ్చుకున్నాడు అని తెలుసుకుంటే ఆశ్చర్యమేస్తుంది. ఆయన పేరు కళ్యాణ సుందరం. ఆయనది తమిళనాడు రాష్ట్రం.చేసే ఉద్యోగము librarian.భారతదేశంలో అత్యుత్తమ librarian గా కేంద్ర ప్రభుత్వ సత్కారం పొందాడు. ప్రపంచంలోని 10 మంది అత్యుత్తమ librarians లో ఒకడిగా గుర్తింపు పొందాడు. ఇవన్నీ ఒక ఎత్తు .
          45 సం రాల నుండి సంఘసేవకు తన జీవితాన్ని అంకితం చేసాడు.వివాహము చేసుకోలేదు. 30 సం లుగా తన జీతం మొత్తాన్ని సేవా కార్యక్రమాలకే ఖర్చు చేస్తున్నాడు.మరి తన ఖర్చులకు డబ్బు ఎలా అని ఆశ్చర్య పోతు న్నారా! ఒక హోటల్ లో సాయంత్రం పనిచేస్తూ వారిచ్చేజీతంతో తన పరిమిత అవసరాలు తీర్చుకుంటాడు.రిటైర్ అయిన తరువాత వచ్చిన 10 లక్షలను సంఘసేవకే కేటాయించాడు.ఈ విషయాలన్నీ తెలుసుకున్న ఓ అమెరికన్ సంస్థ ఈయనను Man of the millennium గా ప్రకటించి 30 కోట్ల రూపాయలను బహుమతిగా అందించింది ఇక చెప్పేదేముంది ఈ మొత్తం కూడా దానధర్మాలకే వినియోగించాడు .
         ఈ విషయాలన్నీ గమనించిన రజనీకాంత్ ఎంతో ఆలోచించాడట ఆయన గురించి !అన్నీ ఇచ్చే చెట్టు గొప్పదా! చెట్టుని రక్షించేవాడు గొప్పవాడా! ఈ ఆలోచన తర్వాత రజనీకాంత్ మనసులో ఆయన ఓ జైన విగ్రహంలా ఎదిగారట  కల్యాణ సుందరం గారిని తన తండ్రిగా రజనీకాంత్ స్వీకరించారు.
           డబ్బు ఎంతున్నా తల్లిదండ్రులను ఆదుకోవడానికి అవేవీ పనికిరావు వారిని మనమే చూసుకోవాలి అన్న సందేశం ఈ దత్తత లో మనకు అర్దమవుతుంది.
           (ఈ కథనం ఆంధ్రజ్యోతి ఆదివారం సంచికలోనిది .వారికి ధన్యవాదాలు ) 

Sunday 15 December 2013

దేవుడి భాషను చెప్పిన కుర్రాడు


             చిన్న జ్వరానికి,జలుబుకే కంగారు పడిపోతాం. కానీ అమెరికాకు చెందిన Myatee stepaneck నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చు. అతని 13 ఏళ్ళ జీవితంలో సాధించిన విజయాలు 1)అతడు వ్రాసిన కవితల పుస్తకాలు అమెరికాలో అత్యధికంగా అమ్ముడు పోయిన పుస్తకాల జాబితాలో స్థానం సంపాదించాయి.2)ప్రతిష్టాత్మక మైన మెలిండా ఎ లారెన్స్  పేరిట ఉన్నఅంతర్జాతీయ బుక్ అవార్డు గెలుచుకున్నాడు.3) తన లాంటి రోగుల కోసం దేశ మంతా తిరిగి విరాళాలు సేకరించి ఇచ్చాడు.3)ఎన్నోబహిరంగ సభల్లోపాల్గొన్నాడు,ఎన్నోటి .వి కార్యక్రమాల్లో పాల్గొ న్నాడు 4)అమెరికాలోని ప్రముఖులు అతని మిత్రులు .
            పుట్టినప్పటి నుంచి అతనికి ఓ అరుదైన వ్యాధి ఉంది.అది mascular dystrophy . ఈ వ్యాధితోనే అతని అన్నలు చనిపోయారు .చక్రాల కుర్చీ లేనిదే కదలలేడు.వారానికి ఒకసారి రక్త మార్పిడి చేయించుకోవాలి ఊపిరి పీల్చుకోవాలంటే ఒక యంత్రం పనిచేయాల్సిందే!ఆహారం గొంతులోకి గొట్టాల ద్వారా ఇవ్వాలి.ప్రతి రాత్రి నరాల ద్వారా సూదులు తప్పని సరి.ఎన్ని బాధలు !ఎంత కష్టం !
          ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది అతడు ఎప్పుడూ ఆనందంగా ఉండడం గురించి !నిరాశకు గురవకుండా అతను వ్రాసిన వేలాది కవితల గురించి.కవితలు కథలు వ్రాసేవాడు. శాంతి,ఆశ ప్రేమ జీవితం ప్రకృతి విచారం వైకల్యం లాంటి అంశాలపై ఎన్నో వ్యాసాలూ వ్రాసాడు. మ్యాటీ ని కలుసుకోవడం నా ఆశయాల్లో ఒకటి అన్నాడు జిమ్మీ కార్టర్. 
ఒఫ్రా విన్ఫ్రే ,ల్యారీ కింగ్ లాంటి ప్రముఖులు అతని కార్యక్రమాల్లో పాల్గొన్నారు .
     అతని భావాలలో కొన్ని
       *దేవుడికి నచ్చిన భాష పిల్లల భాష
     *నేను పెద్ద అవుతాననే నమ్మకం నాకు లేదు కానీ పెద్దవ్వాలనే కోరిక ఉంది . నాకు కథలు కవితలు ఇష్టం అందుకే రచయితను అవుతాను
* అందరి జీవితాల్లోను తుపానులు ఉంటాయి దీన్ని అందరు తెలుసుకోవాలి ప్రతి తుపాను తర్వాత మనం ఆడు కోవాలి.  జీవితమనే బహుమతి లభించినందుకు మనం ఆనందించాలి. 
*మనందరం ఒకే భూమి మీద ఉన్నాం. మన అందరికీ ఒకటే హృదయం ఉంది ఒకే జీవితం ఉంది అందుకే మన అందరం ఒకే కుటుంబం లా ఉండాలి
* నాకు ప్రతి రోజు ఒక బహుమతే! ఎందుకంటే ఎప్పుడు చనిపోతానో తెలియదు.కాబట్టి నాకు బలం దేవుడి నుంచి,అమ్మ నుంచి నాకు ఎదురయిన మనుషుల నుంచి లభిస్తోంది .
    చూడండి ఎంత ఆశావాదం! చిన్న విషయాలకే ఆత్మ హత్య చేసుకునే వారు,జబ్బుల బారిన పడి జీవితం పట్ల విరక్తి చెందిన  వారు అతని నుండి ఎంతో స్పూర్తి పొందవచ్చు.మ్యాటినీ తన 13 వ ఏట చనిపోయాడు గొప్ప స్పూర్తిని  ప్రపంచానికి అందించి.
  ( ఈ కథనం ఈనాడు పత్రిక లో వచ్చింది.వారికి ధన్యవాదాలు )


 

Thursday 28 November 2013

అభివృద్ది పల్లవించిన గంగదేవిపల్లె


            ఈ రోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఎన్నికైన సర్పంచ్ లకు శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటవుతున్నాయి . ఆ సమావేశాల్లో గంగదేవిపల్లెను గురించి చెబితే బాగుంటుంది.
            పల్లెలన్నీ నిరక్షరాస్యత ,జీవన ప్రమాణాల తరుగుదల ,పేదరికం ఆకలి చావులు వంటి సమస్యలతో కునా రిల్లి  పోతున్నాయి.వాటికి అతీతమైనదేమీ కాదు ఒకప్పటి గంగదేవిపల్లె.అప్పుడు ఆ ఊరు మద్యం మత్తులో ముని గి తేలుతుంది.రోడ్లు లేవు కరంటు లేదు.ఊరంతా ఫ్లోరైడ్ నీళ్ళు .అధికారులు,రాజకీయ నాయకులు పట్టించు కున్న పాపాన పోలేదు.ఈ గ్రామం ఆంధ్రప్రదేశ్ లోని వరంగల్ జిల్లా,గీసుకొండ మండలంలో ఉంది.
         కూసం రాజమౌళి ఆయన మిత్రులు గొనె చేరాలు,చల్ల మల్లయ్య,కూసం నారాయణ పెండ్లి రాజయ్య ఓ జట్టుగా కలిసి ఆ ఊరిని ఆదర్శంగా తయారు చేయాలని సంకల్పించారు.గ్రామ ప్రజల్లో చైతన్యం కల్పించారు.ఆ ఊరిలో బడి లేదు డాక్టర్ లేడు. శివారు గ్రామం,పంచాయతీ కూడా కాదు. మద్యం తో అందరు ఇంట బయటా గొడవ పడుతుండే వారు.నాటు సారా త్రాగి చని పోతుండేవారు.రాజ మౌళి ఆయన  మిత్రులు కలిసి ఊర్లో సారాపై నిషేధం విధించారు.  ప్రతి ఇంటికి వెళ్లి త్రాగుబోతులకు నచ్చజెప్పారు.సారా contractors వ్యతిరేకించారు.అయినా లెక్కచేయకుండా అభి వృద్ది వైపు తోలి అడుగు వేసారు.1994 లో ఈ గ్రామానికి పంచాయతీగా గుర్తింపు వచ్చింది.
             తరువాత నీటి కమిటీని ఏర్పాటు చేసి గ్రామస్తుల చందాలతో  రూ 53000 వసూలు చేసి లోడి ,బాల వికాస్
సంస్థల  సహకారంతో కుళాయిల ద్వారా నీటి సరఫరా ఏర్పాటు చేసుకున్నారు. టాటా కంపెనీ సహాయంతో ఫ్లోరైడ్    రహిత త్రాగునీరు ఏర్పాటుచేసుకున్నారు.2000 సంవత్సరం సిమెంట్ రోడ్లు ,వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు అయ్యాయి.కానీ ఊరంతా ఆరుబయట మలమూత్ర విసర్జనాలు చేస్తుండేవారు.పారిశుధ్యం పై వారిలో చైతన్యం కల్పిం చారు రాజమౌళి.జరిమానాలు హెచ్చరికలతో ఊరంతా దారికి వచ్చారు.తరువాతి కాలంలో అక్షరాస్యతపై నాటి కలు వేయించి రాత్రి బడులు తెరిపించారు.పది మంది నిరక్ష్యరాస్యుల బాధ్యత ఒక అక్ష్యరాస్యుడికి అప్పగించారు. 2002 నాటికి 100% అక్ష్యరాస్యత సాధించారు.పిల్లలందరినీ బడిలో చేర్చారు .
            తరువాత పచ్చదనానికి ప్రాధాన్యత నిచ్చి ప్రతి ఇంటి ముందు ఒక మొక్క నాటేలా తప్పనిసరి చేసారు. మొక్క పెంచకపోతే మంచి నీళ్ళు కట్ చేసారు.ఆ వూరిలో కరంట్ చౌర్యం చేయరు.సకాలంలో బిల్లులు చెల్లిస్తారు. తగాదాలు పంచాయతీలోనే పరిష్కరించుకుంటారు. గ్రామ పెద్దలే తీర్పు ఇస్తారు ఎన్నికల్లో మందు,నోట్ల పంపిణీ నిషేదించారు.1995 నుంచి ఇప్పటివరకు ఏకగ్రీవ ఎన్నికలే ఊర్లో మహిళలే మహారాణులు.1995 నుంచి అందరు మహిళలే వార్డ్ members 14 పొదుపు సంఘాలున్నాయి .కెనడా,బంగ్లాదేశ్ ల నుంచి వచ్చిన సంస్థలు గ్రామ అభివృద్ధిని మెచ్చుకున్నాయి . శిక్షణ కొచ్చిన ప్రతి ఐఏఎస్ కు ఈ ఊరు ఓ పాట్యాంశం. 2005 లో పంచాయతీరాజ్ కమీషనర్ చెల్లప్ప "దేశం లో ప్రతి జిల్లాలో ఇలాంటి గ్రామం ఒకటుండాలి" అన్నాడు .
           గ్రామం లో 13 అభివృద్ది కమిటీలు వేసారు. రూపాయికి 20 లీటర్ల మినరల్ వాటర్ సదుపాయం కల్పించారు
2007 లో  ఈ గ్రామం దేశంలో ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎన్నికయింది . కూసం రాజమౌళి గారు అప్పటి నుంచి సర్పంచ్చ్ గా కొనసాగుతున్నారు.ఈ గ్రామం అగ్రశ్రీ అవార్డ్ సాధించింది.నిర్మల్ గ్రామ పురస్కారం అబ్దుల్ కలాం ద్వారా స్వీకరించారు . వివిధ పార్టీలున్నా ఊరి మంచికోసం అందరూ స్పందిస్తారు .
         ఇలాంటి గ్రామాలు దేశమంతా ఏర్పడితే దేశం అభివృద్ది చెందిన దేశంగా మారుతుంది.
             (ఈ సమాచారం ఈనాడు ఆదివారం నుండి సేకరించ బడింది .వారికి ధన్యవాదాలు )

Sunday 24 November 2013

స్టీవ్ జాబ్స్ చెప్పిన జీవిత సత్యాలు

       సాంకేతిక ప్రపంచానికి రారాజు లా వెలుగొందినా తాను జీవితం లో చూసిన ఎత్తు పల్లాలను తనదైన మాటల్లో ఓ తాత్వికవేత్తలా స్టీవ్ జాబ్స్ చెప్పిన తీరు ఆయన మాటల్లోనే 
  •  "మనిషి జీవితం లోని అన్ని సంఘటనలకు లింక్ లు ఉంటాయి . వాటన్నిటిని కలుపుతూ  పోతే అదే భవిష్యత్తు అవుతుంది . అదే జీవిత మవుతుంది . ప్రతి మార్పును ఆహ్వానించాలి.ఆస్వాదించాలి . "
  • "జీవితంలో ఎదురుదెబ్బలు అవసరం.ఆత్మ విశ్వాసాన్నికోల్పోకూడదు.చేస్తున్న పనిని ప్రేమిస్తూ ఉండాలి.ఎప్పుడూ ఒకే పనిలో సెటిల్ అయిపోకూడదు . అలా అయిపోతే మనలోని కొత్త ఆలోచనలు బయటికి రావు.జీవితంలో ఎలాంటి మెరుపులు ఉండవు ".   
  • "ప్రతి రోజు ఇదే నీ ఆఖరి రోజు అనుకోని బ్రతికితే ఏదో ఒకరోజు నువ్వు ఉన్నత స్థానంలో ఉంటావు . "
  • "ఈ భూమ్మీద మనుషులందరూ సమానంగా పంచుకునేది ఏదయినా ఉందంటే అది మరణమే .కాబట్టి ఈ ప్రయాణం లో ఎదురయ్యే అవమానాలు,రాగ ద్వేషాలు ,అపజయాలు అన్నీసమానమే". 
  • "మనం  ఏం వదిలేసి వెళ్ళిపోతున్నాం అన్నదే ముఖ్యం.సాటి వారికి ఎంత సాయ పడ్డాం,ఈ ప్రపంచానికి ఏం అందించ గలిగాం,ఎంత ప్రేమను పొందాం అన్నదే శాశ్వతం". 
  • "connecting the dots,నేను దీన్ని నమ్ముతాను. మన లక్ష్యం బలంగా ఉండాలి.ఎన్నిఅనూహ్య పరిణామాలు ఎదురయినా మనసు కోకూడదు.అప్పుడే ఆ పరిణామాలన్నీ అనుసంధానమై లక్ష్యం వైపు నడిపిస్తాయి ".

Sunday 10 November 2013

ప్రజల ప్రాణాలు గాల్లో!

           చార్ ధామ్ యాత్రలోఆకస్మిక వరదల్లో వేలల్లోభక్తులు మరణించారు.భక్తీ పారవశ్యంతో వెళ్లి కుంభమేలాల్లో ఆలయాల్లోతోక్కిసలాటల్లో వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు.ఆలయాలు,మత సంబంద ప్రాంతాల్లో గత పదేళ్ళలో 1000 మంది ప్రాణాలు కోల్పొయారు.వీటిల్లో నిస్సహాయులైన మహిళలు ,వృద్దులు,చిన్నారులు   బలి అవుతున్నారు. వరదలు,తుపానులు వలన మరిన్ని వందల మంది మరణిస్తున్నారు. ఆలయాలకు ఆదాయం పుష్కలంగా వస్తున్నా సురక్షిత ఏర్పాట్ల పై ఏమాత్రం దృష్టి పెట్టక పోవటం ,గత అనుభవాల నుండి పాటాలు నేర్వక పోవటంతో ఈ సంభవిస్తున్నాయి.
               ఇవన్నీఒక ఎత్తు అయితే ఇక యముడి నరకలోకానికి దారులా అన్న విధంగా ఉండే మన రోడ్లపై జరిగే ప్రమాదాల్లో ఏడాదికి కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు.ఈ మధ్య వోల్వో బస్సులో45 మంది సజీవదహన సంఘటన మనసును కలచి వేసింది.ఈ ఘటన కలిగించిన భయంతో ట్రైన్ లో పొగలు రావటంతో దూకి ప్రాణాలు పోగొ ట్టుకున్న వారెంత దురదృష్టవంతులు.ఇక గౌతమీ ఎక్ష్ ప్రెస్ లో మంటల్లో ప్రాణాలు కోల్పోయిన వారిదెంత విషా దం.ఇక లారీలు,ఆటోలు ,బైక్స్ ప్రమాదాలు లెక్క లేనన్ని ఆగి ఉన్న లారీని డీ కొని ఎన్నో  ప్రమాదాలు జరుగుతు న్నాయి.బైక్స్ పై వేగంగా వెడుతూ యువకులు ప్రాణాలు కోల్పోతున్నారు.విజయవాడలో బస్ స్టాప్ లో ఆగి ఉన్న వారిపై కారు వెళ్ళడం వారు చనిపోవడం చూస్తుంటే ప్రజల ప్రాణాల కెంత భద్రత ఉందో అర్థమవుతుంది .
          వీటి వెనుక ప్రజలు సరి అయిన జాగ్రత్తలు తీసుకోక పోవటం,డ్రైవర్స్ నిర్లక్ష్యం ట్రాఫిక్ నియంత్రణ సరిగా లేకపో వటం రోడ్డు భద్రతా ప్రమాణాలను పాటించే యంత్రాంగం వైఫల్యం ,త్వరగా గమ్యం చేరుకోవాలనే ప్రయాణీకుల తొందర ఇలా ఎన్నో అంశాలు ఇమిడి ఉన్నాయి.
        పటిష్ట మైన భద్రతా ఏర్పాట్లు ,ముందస్తు హెచ్చరికలు ,చట్టాలను కటినంగా అమలు చేయటం,ట్రాఫిక్ నిబం ధనల ప్రచారం , లైసెన్స్ ల తనిఖీ, వాహనాలు  సరి అయిన స్థితిలో ఉన్నాయో లేదో చూడటం  వంటి చర్యల వలన వీలయినంత మేర ప్రమాదాలు  తగ్గించవచ్చు.ప్రజలు తమ విలువైన ప్రాణాలు  కాపాడు కోవటానికి తగిన  జాగ్రత్తలు తీసుకోవటం ,పకడ్బందీ ఏర్పాట్లతో ప్రయాణం చేయటం ఎంతో అవసరం .    

Monday 4 November 2013

పుట్టిన రోజు ఇలా చేస్తే ఎలా ఉంటుంది!


           మా చిన్నప్పుడు పుట్టిన రోజు చేసుకున్న జ్ఞాపకాలే లేవు.గుర్తు ఉంచుకుందామనుకుంటూ ఉంటాము.   తీరా ఆ  రోజుకి మర్చి పోవటం ,18 వ ఏట అనుకుంటా ఓ ఫ్రెండ్ గుర్తుచేసేదాకా ఇలా మరిచిపోవటమే జరిగింది మరి ప్పుడో పిల్లల పుట్టిన రోజులు ఎంతో వైభవంగా జరపటం చూస్తున్నాము.ఘనంగా ఆడంబరంగా జరుపుతున్నారు.   ఎంతోడబ్బు ఖర్చు చేస్తున్నారు.చిన్నప్పుడు ఓ 5 లేదా 6 ఏండ్ల వరకు పర్లేదు కానీ తరువాత నిరాడంబరంగా జరు పుకుంటే బాగుంటుందేమో!
          ఇక పోతే పుట్టిన రోజు ఎన్నో నిర్ణయాలు తీసుకుంటారు.వాటి అమలులో విఫలం అవుతుంటారు .ఇది అంతా మామూలే! ఇక చెప్పేదేమిటంటే ఈ మధ్య మా అమ్మాయి పుట్టిన రోజు ఏదైనా విభిన్నంగాచేద్దామనుకున్నాను. గుర్తు ఉండిపోయేలా!అప్పుడు ఓ ఆలోచన వచ్చింది.ఆ రోజు మొక్కలు నాటితే ఎలా ఉంటుంది అని. కానీ ఎక్కడ నాటాలి ? నాటగానే సరిపోదు వాటిని సంరక్షించాలి. వాటిని పెంచాలి. అప్పుడే కదా ఫలితం.నేను పనిచేసే పాటశాల సరయిన చోటు అని నిర్ణయించుకున్నాక దగ్గరిలో ఉన్న నర్సరీ నుండి 8 కానుగ మొక్కలు తెప్పించి బడి పిల్లలు మరియు మావ్యాయామ ఉపాధ్యాయుడు  రామానాయక్ సహకారంతో నాటించాను.ఆయన అప్పటికే చాలా  మొక్కలను పెంచాడు.8,9 తరగతుల పిల్లలకు వాటి బాధ్యత అప్పగించాము.ఒక్కొక్కరికి ఒక మొక్క కేటాయించి వాటి సంరక్షణ చూడమని ప్రోత్సాహించాము.అలాగే పిల్లలందరికీ వారి పుట్టిన రోజు నాడు మొక్కలు నాటమని చెప్పాము .
             ఇలా మనం ప్రతి పుట్టిన రోజు ఒక మొక్క నాటినా ఈ ప్రపంచానికి ఎంతో మేలు చేసిన వారిమవుతాము.ఓ కల కంటే తప్పు లేదనుకుంటా! ప్రపంచంలో ప్రతి ఏటా 7 వ వంతు జనాభా ప్రతి ఒక్కరు ఇలా ఒక మొక్క నాటినా   ఏటా 100 కోట్ల మొక్కలు నాటవచ్చు.అప్పుడు ఈ భూమి మీద నీటి కరువు ,గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఉండవేమో!
మీరు కూడా మీ గుర్తుగా ఈ భూమికి  బహుమతిగా ఒక మొక్క నాటుతారు కదూ !

Wednesday 30 October 2013

అన్ని గ్రామాలు హివ్రే బజార్ లా ఉంటే ఎంత బాగుంటుందో కదా!


                    ఆంధ్రప్రదేశ్ లో 3 నెలల క్రితం పంచాయతీ ఎన్నికలు జరిగాయి .నిన్ననే సర్పంచ్ లకు చెక్ పవర్ వచ్చింది .మరి గ్రామాలు ఎలా ఉండాలి?మహాత్ముడు కలలు గన్న గ్రామ స్వరాజ్యం ఎక్కడుంది? సర్పంచ్ ల నాయ కత్వంలో ప్రజలు సమిష్టి కృషితో ఏ విధంగా అభివృద్ది సాగించాలి? అనే విషయాలను మహారాష్ట్ర లోని అహ్మద్ నగర్ జిల్లా  నగర్ తాలుకాలోని హివ్రేబజార్ గ్రామాన్నిపరిశీలిస్తే అర్థమవుతుంది.
           ప్రపంచంలోని వంద దేశాల ప్రతినిధులు సందర్శించిన పల్లె అది.సర్పంచ్ ఎలా ఉండాలో ప్రజలెలా  ఉండాలో ఆదర్శ గ్రామాలు ఎలా ఉండాలో నిరూపించిన గ్రామం ఇది.ఆ వూరి సర్పంచ్ పేరు పోపట్రావు పవార్.ప్రజలు,నీళ్ళు అడవి,జంతువులు ఆయన అజెండా!అంతర్గత శతృవులయిన కరవు ,పేదరికం నిరుద్యోగం,అనారోగ్యం ఇవే కదా ! పల్లెలకు శత్రువులు .వీటిపై మరో స్వాతంత్ర్య పోరాటం చేయాలని పిలుపు నిచ్చాడు జల సంరక్షనే ప్రధాన లక్ష్యం వాన చినుకుల్ని ఒడిసి పట్టుకున్నారు.ప్రభు త్వ నిధులు ఒక్క పైసా దుర్వినియోగం కాకుండా 600 ఇంకుడు గుంతలు త్రవ్వుకున్నారు. checkdam  లు కట్టుకున్నారు.పల్లె అంతా బిందు సేద్యమే!నీటి ఆడిట్ పద్ధతిని ఏర్పాటు చేసుకుని గొట్టపు బావులు నిర్మించారు.గ్రామసభలోచర్చించి ఎవరు ఏ ఏ పంటలు వేయాలో నిర్ణయిస్తారు. అన్ని వసతుల గల  పాటశాల నిర్మించుకున్నారు.ఒక్క దోమ కూడా అక్కడ కనపడదు .ప్రతి ఇంటికి మంచి నీటి కుళా యిలు,మరుగు దొడ్డి ఉన్నాయి.భూగర్భ డ్రైనేజి వ్యవస్థ ఉంది.ఊరంతా బయో గ్యాస్ తో వంట చేస్తారు.దొంగ  తనాలు దోపిడీలు లేవు. మద్యపానం అక్కడ నిషిద్ధం. వ్యాయమశాల,గ్రంధాలయం,ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పశు వుల ఆసు పత్రి ఆడిటోరియం ఉన్నాయి.నిధులు ప్రభుత్వానియే అయినా ఇవన్నీ ప్రజలు శ్రమదానం ద్వారా కట్టుకున్నవే! పల్లె బాగుపడాలంటే ప్రజల్లో సమైక్యత ఉండాలి .సహకార స్పూర్తి కావాలి..ఇదే  గ్రామీణ భారత ధార్మిక నీతి... ---హివ్రేబజార్ విజయ  రహస్యము ..
         1989 నుండి ఏకగ్రీవంగా ఎన్నికవుతున్న పోపట్ రావు M.COM. చదివారు.అన్నాహజారెను ఆదర్శంగా తీసుకుని ప్రజల్లో నైతిక విలువలు పెంపొందించారు .సార్క్ సదస్సులో తన అనుభవాన్ని పంచుకున్నారు.వివిధ విశ్వవిద్యాలయాలు,మేనెజ్ మేంట్ స్కూల్స్ లో  గ్రామీణాభివృద్ది గురించి మాటలాడారు.మహారాష్ట్ర  ప్రభుత్వం  golden jubilee india programme క్రింద 300 గ్రామాల్ని హివ్రేబజార్ లా తీర్చిదిద్దాల్సిన  బాధ్యత  ఆయనకు అప్పగిం చింది జాతీయఅవార్డ్  అందుకున్నారు.రాజకీయ party లు ఆయనకు  M.L.A పదవి  ఇస్తామన్నా వద్దన్నారు .
              మన  రాష్ట్ర  సర్పంచ్ లంతా  హివ్రే బజార్ చూసి వచ్చి ఇక్కడ కూడా అలా చేస్తే  బాగుంటుంది కదా!
(ఈ వ్యాసం ఆదివారం ఈనాడు అనుబంధం లోనిది .వారికి ధన్యవాదాలు.)
  మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్  ను గమనించండి
http://www.rainwaterharvesting.org/Rural/Hirve.htm  

Sunday 20 October 2013

తల్లిదండ్రులూ!పిల్లలకు bikes,cars ఇచ్చేముందు ఓ సారి ఆలోచించండి! .

           ఓ హృదయ విదారక సంఘటనను చూసిన తరువాత ఈ వ్యాసం వ్రాయాల్సి వచ్చింది. స్కూల్స్ colleges తెరిచిన తొలి రోజు మేము స్కూల్ నుండి ఇంటికి వస్తుండగా ఒక విద్యార్థి ఒక అమ్మాయిని బైక్ మీద తీసుకువస్తూ ఒక కల్వర్ట్ దగ్గర accident కు గురై అబ్బాయి చనిపోగా ఆ అమ్మాయికి కాలు విరగటం జరిగింది.నేను బస్సులో అక్కడికి వచ్చే ఓ 5 నిముషాల ముందే అది జరిగింది. ఆ అమ్మాయి ఆ అబ్బాయి అక్క అని తరువాత తెలిసింది  ఆ తల్లితండ్రుల కెంత గర్భశోకం. ఆ అబ్బాయి ఇంటర్ పూర్తిచేసి ఇంజినీరింగు వెళ్ళాల్సి ఉంది అమ్మాయి ఇంజినీరింగ్ చదువుతూ ఉంది.అక్కను కాలేజీ నుండి ఇంటికి తీసుకు వస్తుండగా జరిగింది ఈ సంఘటన.
          ఇటువంటి సంఘటనలు ఈ మధ్య చాలా జరుగుతున్నాయి.పిల్లల కోరిక మేరకు bikes,cars కోరిక మేరకు కొని ఇస్తున్నారు.వాటిని అతి వేగంతో నడపటం,లేదా ఎదురుగా వచ్చేవాహనాల పొరపాటుతో ప్రమాదాలు జరగటం చూస్తున్నాం .బాబు మోహన్ ,అజహరుద్దీన్ కోట శ్రీనివాసరావు ,కోమటిరెడ్డి వెంకట రెడ్డి వీరి కుమారులు  ఈ విధం గా చనిపోయిన వారే!18 సంవత్సరాల వయసు నిండదనిదే వాహనం నడపకూడదు.12 సంవత్సరాల పిల్లలు కూడా నడుపుతున్నారు.వారికి bikes నడపటానికి parents ఎలా అనుమతిస్తున్నారో అర్థం కాదు.అలాగే ట్రాఫిక్ పోలీస్ పట్టించుకోవటం లేదు.అతి వేగంతో నడపటం కాకుండా ఒక్కో  బైక్ మీద ముగ్గురు కూడా ప్రయాణం చేస్తుంటారు town limits లోకూడా అతి వేగంగా వెళ్లి పాదచారులను ప్రమాదాలకు గురిచేస్తున్నారు.ఇక driving licence లేకుండా నడిపే వారెంత మందో!అడిగే వారెవరూ లేరు.
              ఈ విషయం చాలా serious గా ఆలోచించాల్సిన అంశం . లేక పోతే దేశానికి ఎంతో విలువైన యువత అర్థాంతరంగా రాలిపోతున్నారు.ఇది  తల్లిదండ్రులు,ట్రాఫిక్  వ్యవస్థ ,పౌర సమాజం స్పందించాల్సిన అంశం .

Tuesday 15 October 2013

విశ్వ నరుడు(స్టీఫెన్ హాకింగ్ పై పాపినేని శివశంకర్ కవిత)

physically challenged  కాదు
Physics నే  challenge చేసినవాడు
దేహ విధ్వంసం చేసే
మోటార్   న్యురాన్  వ్యాధిని
విజ్ఞాన వ్యాయామంతో
అధిగమించినవాడు
ధ్వనులుగా పొల్లులుగా  విడిపోయి
పడిపోయిన మాటని
speech synthesizer లో స్థిరపరుచుకున్నవాడు
ప్రపంచంలో ప్రతి వికలాంగుడికి
గుండెదిటవు నిచ్చినవాడు
కాస్మిక్ కడలిలో
బుద్ది బాహువుల గజ ఈతగాడు
కాల్లూ చేతులు  ఆడకపోయినా
కాలబిలంలో ఏరోబిక్స్ చేసినవాడు
అండాండ పిండాండాల నులిపోగుల్లో
ఉయ్యాల లూగినవాడు
విశ్వానికి అంతం లేదని పంతంతో
బ్రహ్మాండానికి Grand design నిర్మించి
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకునికే
ప్రవేశం నిరాకరించినవాడు
వికలాంగుడు కానే కాడు
సకల మేధాంగ  సుందరుడు
స్టీఫెన్ హాకింగ్  einstein కు
అసలైన వారసుడు

Sunday 13 October 2013

అన్నార్తులకు ఇ-సాయం

              ప్రపంచ వ్యాప్తంగా తినేందుకు తిండి లేక ప్రతిరోజు 24,000 మంది చనిపొతున్నారు.వీరిలొ 3 వ వంతుమంది 5 సంవత్సరాల వయసు లోపు చిన్నారులే .ఈ విషయం తెలుసుకున్న జాన్ బ్రీన్ అనే కంప్యూటర్ ప్రోగ్రామర్  ఇంటర్నెట్ తో అన్నదానాన్ని ముడి పెట్టాలనుకున్నాడు .ఈ ఆలోచన పలితమే hungersite అనే website.1999 june లో ఏర్పాటయింది.తరువాత  ఆర్ధిక  సమస్యల  కారణంగా ఈ సైట్ charityusa   అనే సంస్థ చేతుల్లోకి వెళ్ళింది.
              కొన్ని సంస్థలు విరాళాలు తీసుకుంటాయి.కానీ ఈ సైట్  మనం చేసే క్లిక్ ల ఆధారంగా నడుస్తుంది www.thehungersite.com  open చెయ్యగానే  click here its free అని  వస్తుంది రోజు కొక సారి క్లిక్ చెయ్యటమే అలా చెయ్యగానే మనం  thankyou పేజి లోకి వెళ్తాము అక్కడ కొన్ని వ్యాపార ప్రకటనలు ఉంటాయి.  మనం   కొన్నా    కొనకపోయినా చూస్తె  చాలు.స్పా న్సర్స్ hungersite కు foodpackets  పంపిస్తారు అది వాళ్ళ మధ్య ఒప్పందం .ఈ సైటుకు అమెరికా లోని mercycore,second harvest అనే  సంస్థలు  సాయం  అందిస్తున్నాయి.
             ఇంకా ఈ సైట్ లో breastcancer,animals,veterans,autism,diabetes,literacy,rainforest వంటి సమస్యలకు కూడా సైట్స్ ఉన్నాయి .
            ప్రతి రోజు ఒక్క  సారయినా ఈ  సైట్ లోకి వచ్చి క్లిక్స్ ఇవ్వడం ద్వారా ఎంతోమంది జీవితాల్లో ఆనందాన్ని నింపిన వారమవుతాము. మరెందుకు ఆలస్యం ఈ రోజే మొదలెడదాము.

www.thehungersite.com
(ఈ సమాచారం ఆదివారం ఈనాడు అనుబంధం  లోనిది .వారికి ధన్యవాదాలు)

Sunday 28 July 2013

విహార యాత్రలకు యూత్ హాస్టల్స్


                మనం  ఎన్నోప్రాంతాలను చూడాలనుకుంటాం.కాని కొత్త ప్రాంతాలు అక్కడి విషయాలుతెలియవు ఉండ టానికి వసతి సౌకర్యం చాలా ఖరీదుగా ఉంటుంది.ఆహారం సమస్య.ఇంకా చెప్పాలంటే భద్రత కూడా ఒక సమస్యే!ఇన్ని ఆలోచనలతో ప్రయాణాలు వాయిదా వేసుకుంటాం.కాని అన్నిటికీ పరిష్కారం ఒక సంస్థ  చూపిస్తుంది.
               అదే YHAI(youth hostels association of india).ఇది  HOSTELLING INTERNATIONAL వారి  అనుబంధ సంస్థ .దీనికి ప్రపంచ వ్యాప్తంగా  90 దేశాల్లో 4000 hostels ఉన్నాయి.45 లక్షల మంది సభ్యత్వం కలిగి ఉన్నారు..మన దేశంలో 23 రాష్ట్రాల్లో దీని శాఖలున్నాయి.మన రాష్ట్రం లో సికింద్రాబాద్(040 27540763) విశాఖపట్నం(9441246987),తిరుపతి(0877 2240300),హైదరాబాద్(9396539854),విజయవాడ(9000094949) లలో శాఖలున్నాయి.
     దేశ వ్యాప్తం గా సంవత్సరం పొడవునా వారు యాత్రలు నిర్వహిస్తుంటారు.ముందు అందులో సభ్యత్వం తీసు కుంటే వారు ఇచ్చేఅన్నిసౌకర్యాలు పొందవచ్చు.ప్రస్తుతం DR HAREESH SAXENA గారు YHAI  CHAIRMAN   ఉన్నారు . వారు  ఇప్పటికి  90 దేశాలు  తిరిగారు.వారు ఒక బ్లాగు కూడా నిర్వహిస్తున్నారు. harishtravels.blogspot.in ఇంకా మరిన్ని వివరాలకు ఈ క్రింది websites చూడండి .
  www.yhaindia.org
www.hihostels.com

Thursday 27 June 2013

IIT లో సాయి సందీప్,రవి చంద్ర ల అద్బుత విజయం.


                 IIT లో సీట్  తెచ్చుకోవటమే గొప్ప అనుకుంటే ప్రపంచం లోనే అత్యంత కష్ట మైన ప్రవేశ పరీక్షగా పేరు తెచ్చుకున్న ఇందులో అఖిల భారత స్థాయిలో  ప్రధమ,ద్వితీయ  స్థానాలు సాధించడం ఆ కుర్రాల్లిద్దరు తెలుగు వాళ్ళు కావడం అందరు గర్వించాల్సిన విషయం.వారు మొదటి RANKER  సాయి సందీప్  రెడ్డి ,రెండవ  RANKER రవిచంద్ర .
                ప్రపంచ స్థాయి ఇంజినీరింగ్ విద్య ను అందిస్తున్న IIT లో ప్రవేశం కొరకు ఎలా తయారవ్వాలనే విధాన్ని  వారిద్దరి మాటల్లోనే తెలుసుకుందాం.
                  ముందుగా సందీప్ రెడ్డి చెప్పిన విషయాలు.
ఈ rank  సాధించటానికి నా సరదాలనేమీ త్యాగం  చేయ లేదు.నాకు అబ్దుల్ కలాం స్పూర్తి.ఇంజినీర్ ను కావాలని మొదట నుండి  ఉండేది.గణితం పై ఎక్కువగా శ్రద్ధ పెట్టేవాన్ని.ఇందుకు సిద్ధ పడేవారికి కనీస స్థాయి తెలివితేటలు .ఇంటర్లో సగటున రోజుకు 12 గంటలు చదవ గలగాలి.ప్రతి అంశాన్ని లోతుగా చదవాలి.పూర్తీ ఏకాగ్రత అవసరం.Maths:R.D.sharma,M.T.G publications;PHYSICS;H.C.VERMAI.E IRODOV;CHEMISTRY:ATKINSVED JUNIOR,J.D LEE. చదివాను.
       IIT లో  application ప్రధానం .చదివిన  concept లని  apply చేయగలగాలి .నిజానికి  ఈ  పరీక్ష  అంత  కష్టం  కాదు .చక్కని  ప్రణాళికతో  సమయం  వృధా  చేయకుండా  చదివితే  ఎవరైనా  iit ప్రవేశ  పరీక్షలో  మంచి  rank సాధించవచ్చు .
                 రెండవ  ranker రవిచంద్ర  మాటల్లో  .....
                    నేను  సరదాగా  చదివాను .సబ్జెక్టు  మీద  అమిత  ఇష్టంతో చదివాను.IIT ప్రవేశ  పరీక్షకు  జ్ఞాపక  శక్తి  కంటే  ఆలోచింపగల సామర్థ్యం  కావాలి .నిజ  జీవిత  పరిస్థితుల్లో  ఇచ్చిన  సమస్యలను  అనువర్తించగలగాలి .
MATHS :TMH publishers-MATHS  for iit jee ;physics iradov;chemistry bahadur,himanshupandegopi tandon పుస్తకాలు  చదివాను .సీట్  సాధించాలంటే  6 లేదా  7 గంటలు  చదవాలి .topper గా  నిలవాలంటే  10 గంటలు  చదవాలి .సబ్జెక్టు  కు  సిద్ధ  మవటా న్ని  ఇష్టంగా  ఆస్వాదించాలి .ఇందులో  విజయానికి  బోధనా  ప్రాముఖ్యం  20%  అయితే  80%  విద్యార్ధి  సన్నద్ద్హత మీద  ఆధార  పడి ఉంటుంది .ఎంత  చదివాం  అన్నది  కాదు  ముఖ్యం  ఎంత  సాధన  చేసాం  అన్నది  ముఖ్యం
  ఇంటర్వ్యూ  కోసం 24/6/2013 ఈనాడును చూడగలరు.వారికి ధన్యవాదాలు.
                         వారి విజయాన్ని మనస్పూర్తిగా అభినందిద్దాం. 

Saturday 25 May 2013

క్షణికావేశం ఆపుకొని కొద్దిగా ఆలోచించండి!



               ఏప్రిల్ 28 వ తారీకు హైదరాబాద్ జిల్లా ఎడిషన్ చూసిన వారికి ఈ విషయం తెలిసి ఉంటుంది నాంపల్లి రైల్వే స్టేషన్ లో ఒక వ్యక్తి రైల్ కు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకోవటం ముక్కలుగా మారి చనిపోవటం. ఆ సమా చారం మా బంధువుల ద్వారా నాకు తెలిసింది.అతను మాకు వరుసకు అన్నయ్య అవుతారు.షాక్. చనిపో వటానికి కారణాలు అంతు చిక్కలేదు.అప్పులు లేవు.ఒక్కడే కొడుకు.పెద్ద బిల్డింగ్.ప్రైవేటు కంపెనీలో మంచి ఉద్యోగం తరువా త తెలిసింది ఏవో చిన్న కారణాలని.ఇంతకు ముందు మా మిత్రుడి ఆత్మహత్యను ఆపగలిగాను అతను నాకు ఫోన్ చె య్యటంతో ఆ విషయాన్ని ఇదే బ్లాగు లో వివరించాను.అలాగే ఈయన కనుక ఫోన్ చేసుంటే ఆపగలిగే వాడినేమో ఇలా ఎందరో చిన్నకారణాలకు జీవిత యాత్ర చాలిస్తున్నారు.
       ప్రతి సమస్యకు చావే పరిష్కారం అయితే ఎవరు ఈ ప్రపంచంలో మిగలరు.గంటకు 14 మంది సంవత్సరానికి ఒక లక్షా ఇరవై వేల మంది.ఇది మన దేశం లో ఆత్మ హత్య చేసుకుంటున్న వారి సంఖ్య.ఇందులో 12.1 శాతం తో మన ఆంధ్ర ప్రదేశ్ది రెండవ స్థానం.
       ప్రపంచ వ్యాప్తంగా ఏటా 10 లక్షల మంది ఆత్మ హత్య చేసుకుంటున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చింది.ప్రతి 40 సెకన్లకు ఒకరు చనిపోతున్నారు.ఇది 2020 కి ప్రతి 20 సెకన్లకి ఒకటిగా నమోదవుతుందని అంచనా.అందులో 60 శాతం మంది 45 సంవత్సరాలలోపు వారే!మొత్తం బలవన్మమరనాల్లో చైనా,భారత్ లోనే 30% నమోదవుతు న్నాయి.
       యువత ఇలాంటి నిర్ణయం తీసు కోవడానికి ప్రధాన కారణం ఒత్తిడిని ఎదుర్కో లేక పోవడం,ప్రేమ విఫల మైన వారు,పరీక్షలు,ఎంట్రన్స్ లలో మంచి రాంక్ రాకపోవటం వలన పెద్దల మందలింపులత,ఉద్యోగం సాధించలేక జీవి తంలో స్థిరపడలేక పోవటం,సంసారంలో గొడవలు,ఆర్హిక ఇబ్బందులు,వ్యాపారాల్లో నష్ట పోవటం ఇలా విభిన్న కార ణాలతో జీవితాలను అంతం చేసుకుంటున్నారు.మరీ దారుణ మైన విషయం ఏమిటంటే అప్పుల పాలైన వారు పిల్లలకు విషమిచ్చి తల్లిదండ్రులు ఆత్మ హత్య చేసుకోవటం.
        మరి ఇలాంటి వారు ఆగాలన్నా,ఆలోచించాలన్నా ఏమి చేయాలి?
అంతార్జాతీయంగా ఆత్మీయ నేస్తం.
              ప్రపంచ వ్యాప్తంగా 40 దేశాల్లో సేవలందిస్తున్న "Befriendars"అనే  సంస్థ ఉంది.మన దేశం లో దీనికి 11 శాఖలున్నాయి.నలభై వేల మంది సిబ్బంది ఉన్నారు.దీనికి అనుబంధంగా హైదరాబాద్లో ఏర్పాటయిందే రోష్ని .వీరికి ఫోన్ చేస్తే చాలు. చక్కని సలహాలతో సాయ పడతారు.నెలకు వీరికి 400 కాల్స్ వస్తుంటాయి.
చిరునామా
  రోష్నీ,ఇం.నం  1-8-48/21,కలావతి నివాస్,
సింధీ కాలని, s.p road,secunderabad phone:040-66202000,27848584,email :help@roshnihyd.com
పుస్తక నేస్తాలు.
 ఆలోచన ధోరణిలో మార్పు తెచ్చే పుస్తకాలు.
1)suicide:the forever decision
2)choosing to live
3)how i stayed alive when my brain was trying to kill me
4)change your brain change your life
మన  తెలుగులో  కూడా  మంచి  పుస్తకాలు  ఉన్నాయేమో  సలహాలివ్వండి .
మంచి  websites
www.depressionlife.com
www.suicide.com
www.suicidehelplines.comteenadvice.about.com
www.befrienders.com
www.youthsuicide.ca
  మనకు ఎవరయినా  ఇటువంటి  వ్యక్తులు  కలిస్తే  వాళ్ళ  సమస్యను  పూర్తిగా  విని
ధైర్యం  చెప్పండి .అవసర  మైతే  psychologist ల  దగ్గరికి  తీసుకేల్లండి.ఈ సమాచారాన్ని మీకు తెలిసిన మార్గాల్లో అందరికి తెలియజేయగలరు.
(ఇందులోని సంఖ్యా వివరాలు, helpline,books,websites సమాచారం ఈనాడు పేపర్ నుండి సేకరించాను.వారికి ధన్యవాదాలు.)
(ఇంతకు ముందు ఆత్మ హత్యలపై ఇదే బ్లాగు లో నేను వ్రాసిన వ్యాసం కోసం ఇక్కడ చూడగలరు.
http://ravisekharo.blogspot.in/2012/09/blog-post_10.html)

Wednesday 22 May 2013

"సిరివెన్నెల" పాటల్లో ఆణిముత్యాలు

              1985 వేసవి సెలవుల్లో అనుకుంటా సిరివెన్నెల విడుదల ఆయింది.  సంగీతం పట్ల అంతగా అవగాహన లేకపోయినా అందులోని హరిప్రసాద్ గారి వేణు గానం మరోలోకాల్లోకి తీసుకు వెళ్ళింది అప్పటినుండి వేణువు నేర్చుకోవాలని ఉంది .ఇంత వరకు  తీరలేదు .
1)విధాత తలపున :        సిరివెన్నెల
             ఈ పాట బాగా పాడుకుంటుంటాను.ఇందులోని వాక్యాలు పలకటమే కష్టంగా ఉంటాయి.
2)తెలవారదేమో స్వామి:  శ్రుతిలయలు  
3)అందెల రవమిది :         స్వర్ణ కమలం
             విశ్వనాధ్  వారి కళాత్మకతకు సిరివెన్నెల గారి సాహిత్యం తోడయితే ఈ పాట  

              అర్థం చేసుకోరు అంటూ భానుప్రియ పలికే పలుకులు సరదాగా ఉంటాయి.
4)సురాజ్య మవలేని :              గాయం
              సమాజం పట్ల సిరివెన్నెల గారు సంధించిన పాశుపతాస్త్రం ఈ పాట.దీనికంటే ముందు త్రిశంకు స్వర్గం లో         అంటూ ఒక privatesong వ్రాసారు.అది నేను తరచుగా వేదికల మీద పాడేవాన్ని.దాన్ని మార్పు చేసి సినిమా కోసం ఈ పాటగా వ్రాసారు.
5)చిలుకా ఏ తోడు లేక:           శుభలగ్నం
6)మనసు కాస్త కలత పడితే :  శ్రీకారం
             ఈ పాటలో జీవిత సారాన్ని నింపారు.
7)అర్థ శతాబ్దపు :                   సింధూరం
             కృష్ణవంశీ తీసిన సినిమాల్లో ఇది బెస్ట్ అని చెప్పవచ్చు . చాలా ఫైర్ తో తీసారు.కానీ సినిమా ఆడలేదు బాగా   నష్ట పోయారు.ఈ పాటలో సిరివెన్నెల గారు స్వాతంత్ర్యం గురించి పడే ఆవేదన మనకు తెలుస్తుంది.
8)దేవుడు కరునిస్తాడని :      ప్రేమ కథ
             వర్మ గారు ఈ సినిమాకు కథ పంపించమని పేపర్ లో ఆడ్ ఇస్తే ఓ కథ తయారు చేసుకొని ఆ మనవి ఎక్కడ తీసుకుంటారులే అని మానేశాను.ఈ పాట ఇందులో చాలా బాగుంటుంది.
9)తరలిరాద తనే వసంతం : రుద్రవీణ
10)చెప్పాలని ఉంది :          రుద్రవీణ
12)నమ్మకు నమ్మకు ఈ రేయిని : రుద్రవీణ
            నెల్లూరు లో డిగ్రీ చదివే రోజుల్లో  అర్చన థియేటర్ లో సెకండ్ షో చూసి వచ్చి ఆ ఆవేశం తో ఓ కవిత వ్రాసాను.ఇప్పుడు చదివితే ఆ సినిమా అంతగా ప్రభావితం చేసిందా అనిపిస్తుంది.
13)ఎవరో ఒకరు :     అంకురం
            ఉమ మహేశ్వర  రావు అనే  డైరెక్టర్ అనుకుంటా ! ఈ సినిమాని చాలా బాగా తీసారు.ఎందుకో ఆయన తరువాత నిలదొక్కుకోలేకపోయారు.
14)తెలిమంచు కరిగింది :స్వాతికిరణం
          ఈ సినిమా నిజంగా హృదయాన్ని కదిలించి వేసింది.ఒకే రంగం లో ఉండే వారి మధ్య ఇంత ఈర్ష్య ఉంటుందా  అనిపిస్తుంది.అలాగే ఆ పిల్లవాని నటన ,ముమ్మట్టి నటన అద్భుతం
15)అపురూపమైనదమ్మ ఆడజన్మ:పవిత్ర బంధం
         జేసుదాస్ గొంతు ఈ పాటకు వరం.
ఇలా కొన్ని పాటలు మీకు పరిచయం చేయాలనిపించింది.






































)




Sunday 12 May 2013

ధ్యానం అంటే .... జిడ్డు కృష్ణ మూర్తి


  • ధ్యానించే మనసు ఆధ్యాత్మికత గల మనసు. ఆధ్యాత్మికత చర్చీలుఆలయాలు,భజనలు,తాకలేని మతం.విస్పోటం చెంది ప్రేమ జ్వలిం టమే ఆధ్యాత్మిక మైన మనసు అంటే . 
  • జీవితం లోని అత్యుత్తమమైన కళల్లో ధ్యానం ఒకటి.బహుశా ఇదే అత్యు త్తమమైనదేమో!ఒకరు మరొకరి వద్ద నుంచి దీన్నినేర్చుకోలేరు.అదే దీని లోని సౌందర్యం.మిమ్మల్నిగురించి మీరు తెలుసుకుంటుంటే అదే ధ్యానం 
  • ధ్యానానికి అంతమనేది లేదు.ఒక ఆరంభము లేదు.ఒక వర్షపు చినుకు వంటిది.ధ్యానంలేని హృదయం ఎడారిగా మారిపోతుంది.బంజరు భూమి అయిపోతుంది.
  • మస్తిష్కం తన కార్యకలాపాలన్నింటిని తన అనుభవాలనన్నింటిని కట్టి పెట్టి అచంచలమైన ప్రశాంతితో ఉండగలదా అని కనిపెట్టడమే ధ్యానం.
  • ధ్యానానికి అత్యుత్తమమైన క్రమశిక్షణ ఎంతో అవసరం.అసూయ నుండి అత్యాశ నుండి,అధికారదాహాన్నుండి విముక్తి పొందాలి.
  • ధ్యానం మేధకు సంబంధించిన వ్యవహారం కాదు.హృదయం మనసు లోకి ప్రవహించినప్పుడు మనసు తత్వం భిన్నంగా ఉంటుంది.ప్రేమ కదులుతూ ప్రవహించడమే ధ్యానం.
  • ధ్యానం ఒక గమ్యానికి చేర్చే సాధనం కాదు.ధ్యానమే మార్గం.ధ్యానమే గమ్యం.రెండూ అదే. 
  • తెలిసిన విషయాలనుండి విముక్తి చెందడమే ధ్యానంలోని పరిపక్వత ధ్యానం అంటే జ్ఞాన ప్రపంచంలో సంచరిస్తూనే దాని నుంచి విముక్తి చెంది అజ్ఞేయం లోనికి ప్రవేశించడం.
  • మీకు నిజంగానే ధ్యానం అంటే ఏమిటో కనిపెట్టాలని కనుక ఉంటె అప్పు డు ఆధిపత్యాలను అన్నింటినీ పూర్తిగా సమిష్టిగా ప్రక్కకి తోసి వేయాలి 
  • సంతోషాన్ని,సుఖాన్నికొనవచ్చు.నిశ్చలానందాన్నికొనలేరు.పరిపూర్ణ స్వేచ్చ కలిగిన మనోస్థితికి మాత్రమే  నిశ్చలానందం కలుగుతుంది.  నిశ్చలానందము యొక్క స్వేచ్చలో మనసు ప్రవహించడమే ధ్యానం  విస్పోటంలోకన్నులు నిర్మలమై అమాయకత్వంతో నిండి పోతాయి అప్పుడు ప్రేమ దివ్యానుగ్రహ మవుతుంది. 
  • సావధానతతో స్పృహతో వున్నప్పుడు "నేను" అనే కేంద్రం ఉండదు. సావధానమే మౌనమే ధ్యానంలోఉన్న స్థితి.
  • విడదీసుకోవడాన్ని,వేరుపరచుకోవడాన్నిఅంతం చేయడమే ధ్యానం.  ధ్యానం జీవితాన్నుంచి వేరుగా ఉండే విషయం కాదు.అది జీవితపు అస లు సారం.
  • ధ్యానంలో గొప్ప తన్మయీభావం ప్రవహిస్తూ ఉంటుంది.ఇది కంటికీ మస్తి ష్కానికీ హృదయానికీ నిర్మలమైన అమాయకతత్వాన్ని ప్రసాదించే తన్మయత్వం.
  • ధ్యానం అంటే మనసు,హృదయము పూర్తిగా సమూలంగా మార్పు చెంద డం అనే అర్థం వున్నది.
  • కాలాన్ని ఎరుగని అమాయకత్వంలో ఉండటమే ధ్యానం.
  • ప్రపంచం,దాని తీరుతెన్నుల్నిఆకళింపు చేసుకోవడమే ధ్యానం.
  • అవగాహన వికసించడమే ధ్యానం.అవగాహన ఇప్పుడే జరగాలి మరెప్ప టికీ జరగదు.అది ఒక విద్వంసక ప్రజ్వలనం.ధ్యానం అంటే చేతనను అజ్ఞాతాన్నిబాహ్యమైన దానినంతటినీ అవగాహన చేసుకోవడం.
  • ఏకాంతంగా ఉన్నప్పుడే ధ్యానించాలి.మనసును ఆలోచనలుండి విడిపిం చినపుడు  ఏకాంతం కలుగుతుంది.ప్రశాంతమైన ఏకాంతంలో నిశ్శ బ్దంగా,రహస్యంగా ధ్యానం సంభవిస్తుంది.
  • ఆలోచనలు,మనోభావాలు పూర్తిగా ఎదిగి నశించి పోయినప్పుడు ధ్యానం కాలానికి అతీతమైన వాహినిగా ప్రకాశిస్తుంది. కదలికలో తన్మయత్వం ఉంటుంది.
  • మనసులోని వెలుగే ధ్యానం.నేనును అంతం చేయడమే ధ్యానం.
  • ప్రతి నిముషము మరణించడమే ప్రేమ.ప్రేమ పూవులుగా వికసించడమే ధ్యానం.
  • తెలిసిన దాని నుంచి విముక్తి చెందడమే ధ్యానంలో మనం చేయవల సినది.
  • ఒంటరిగా ఉండటానికి భయపడనప్పుడు, ప్రపంచానికి చెందకుండా అసలు దేనితోను మమకార బంధంలేకుండా ఉన్నప్పుడు ఏకాంతంలో ని తన్మయత్వం మీకు లభిస్తుంది.
  • మనసు సమస్తం పూర్తిగా మౌనంగా అయినప్పుడు జరిగే ధ్యానమే మానవుడు చిరకాలంగా అన్వేషిస్తున్న దివ్యానుగ్రహం.
  • ధ్యాన మంటే అసలు సారాంశానికి తలుపులు తెరవడం,సర్వస్వాన్ని దగ్ధంచేసి బూడిద కూడా మిగల్చని ఒక అగ్నిగుండాన్ని దాని తలు పులు తెరిచి ఆహ్వానించడం.
  • నిజమైన ధ్యానానికి పునాది అనాసక్త మైన ఎరుక.అంటే ఆదిపత్యాల నుండి,ఆకాంక్షలనుండి,అసూయనుండి భయాలనుండి విముక్తిని కలిగించే సంపూర్ణ స్వేచ్చ.
  • ఆలోచనలనుండి విముక్తి పొంది సత్యం అనే తన్మయానందంలో ప్రవ హించడమే ధ్యానం.
  • ధ్యానంలో సమస్త ఆలోచనలు ఆగిపోవాలి.ధ్యానానికి ఇదే పునాది.
  • మనలో నుండి కాలాన్ని తీసివేసి మనసును ఖాళీ చేయడమే సత్యం అనే మౌనం.
          (నేడు ప్రపంచ ప్రఖ్యాత తత్వవేత్త జిడ్డుకృష్ణ మూర్తి జయంతి. ఆయన  వివిధ ఉపన్యాసాలలో ధ్యానం గురించి వ్యక్త పరిచిన విషయాలను తెలుగులో పి సదాశివరావు గారు అనువాదం చేయగా ధ్యానం అనే పుస్తక రూపం లో వెలువడింది.అందులోని కొన్ని అంశాలను ఇక్కడ  వ్రాసాను .వారికి ధన్యవాదాలు.) 

www.jkrishnamurti.org  నందు ఆయన గురించి సమగ్రంగా తెలుసుకొనగరు.