Sunday 31 December 2023

44. పాటల పూదోట

 Harris jayaraj music వింటుంటారా. ఇది చాలా heart touching song. మధ్యలో వచ్చే వేణుగానం,మిగతా instruments వింటుంటే మనసు మబ్బుల్లో తేలిపోతుంది.Parth Dodiya mashup చాలా సున్నితంగా హృదయాన్ని స్పృశిస్తుంది.(https://youtu.be/cDLL8FHhLc8?si=nPWjiHf-qBZ89xqo)

43. పాటల పూదోట

 G.V.Prakashkumar మంచి talent ఉన్న music director.ఈ పాట ఒక మంచి ప్రయోగం. రూప్ కుమార్ రాథోడ్ స్వరం విభిన్నంగా గమకాలు పలికిస్తుంటే హరిణి వినసొంపుగా పాడిన ఈ గీతం వినండి.(https://youtu.be/no4pZ4EwE_o?si=Iev-cloanjU20xM-)

42. పాటల పూదోట

 సంగీతం, సాహిత్యం, గానం, అభినయం,ఫోటోగ్రఫీ దర్శకత్వం శిఖరాగ్ర స్థాయికి చేరితే ఈ పాటవుతుంది. ఆకాశం కాన్వాసుపై,కడలి అలలపై,చిక్కని భావోద్వేగాలతో చిత్రీకరించిన గీతమిది. బాలు గళం అజరామరం వాణి జయరాం అరుదైన గాయని.ఇళయరాజా సంగీతం మన హృదయాలను రంజింప జేస్తుంది.భారతీ రాజా అత్యున్నత దర్శకత్వ ప్రతిభ కనిపిస్తుందీ పాటలో.(https://youtu.be/PX-X8SbYbFE?si=HHPvSea7jGCr1xnt)

Sunday 10 December 2023

41.పాటల పూదోట

అనురాగ్ కులకర్ణి స్వరం ఎన్ని హొయలు పోయిందో ఈ గీతంలో. చరణాలతో ఆడుకున్నాడు. సితార స్వరం వినసొంపుగా, విలక్షణంగా ఉంది.మలయాళం లోని హృదయం సినిమాతో సంచలనం సృష్టించిన Hesham compose చేసిన పాట ఇది.(https://youtu.be/bzMqVi-Z2Us?si=FETQ_Yh600k_NOKp 

Tuesday 21 November 2023

కోటప్పకొండ సందర్శన

 కొండలపై ఉన్న గుడుల పరిసరాలన్నీ ప్రకృతి రమణీయతతో శోభిళ్లుతుంటాయి. అందులో కోటప్పకొండ ఒకటి. ఇది శివాలయం. నరసరావుపేట కు దగ్గరలో 20 కి.మీ దూరం లో ఉంటుంది. బస్టాండ్ నుండి కార్తీక మాసం ఆదివారం,శనివారం లలో ₹50 ticket తో కొండపైకి RTC బస్సులు నడుస్తుంటాయి. కొండ క్రింద అన్ని వర్గాల వారికి సత్రాలున్నాయి. కొండ ఎక్కటానికి, దిగటానికి రెండు మార్గాలున్నాయి. ఎక్కే మార్గానికి ఇరువైపులా పూలు పూసి స్వాగతిస్తున్నాయి. మధ్యలో ఒక park ఏర్పాటు చేశారు. కొండ పైన గుడి ముందర భాగం విశాలంగా ఉంటుంది.దక్షిణామూర్తి గుడి, విగ్రహం,నంది విగ్రహం మనోహరంగా ఉంటాయి. శివుడి విగ్రహం 4 దిక్కులు కనపడే విధంగా గుడికి ఎదురుగా అమర్చారు.నిత్య అన్నదానం ఉంటుంది.చాలా రుచిగా ఉంది. మనకు తోచిన విరాళం ఇవ్వవచ్చు. ఇహ గుడి చాలా ఎత్తులో ఉంటుంది. గుడి లోపలికి మెట్లు చాలా ఎక్కాలి. గుడి బయటకు వచ్చాక ఎడం వైపు కొండ పైన నాగుల పుట్ట చాలా ఎత్తులో ఉంటుంది.అక్కడే ఒక శివుడి విగ్రహం చాలా ఆకర్షణీయం గా ఉంటుంది. అక్కడ నుండి దిగువకు, ప్రక్కలకు చూస్తే view point చా లా అద్భుతం గా ఉంటుంది. ప్రక్క కొండ మీద పాత కోటేశ్వర స్వామి ఉంటారు. అక్కడ mike లో పాటలు కొండ అంతా ప్రతి ధ్వనిస్తున్నాయి. శివరాత్రి కి కట్టే ప్రభలు ఆ ఉత్సవాలు, జనాల్ని చూడటానికి రెండు కళ్ళు చాలవట. చిన్నపురెడ్డిని బ్రిటిష్ వారు ఉరి తీసింది ఈ కొండపైనే.దేవుళ్ళందరూ కొండలపై ఎందుకు కొలువుంటారో తెలుసా, తమతో పాటు ప్రకృతిని ఆరాధించమని.కొండల నిండా ఇంకా చెట్లు బాగా పెంచితే గొప్ప ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం అవుతుంది. ... ఒద్దుల రవిశేఖర్

Monday 20 November 2023

ఉద్యానవనాల్లో మొక్కలు నాటడం

 ఉద్యానవనాల్లో మొక్కలు నాటుదాం

రోజూ "నడక " సాగించే muncipal park లో 5km నడక పూర్తయి ఇంటికి వెళ్లే క్రమంలో అక్కడ పనిచేసే తోటమాలి సురేష్ మొక్కలు నాటడం గమనించాను.ఇంతకు ముందు మొక్కలు ఇస్తానని చెప్పాను. ఇప్పుడు మొక్క తెస్తే నాటుతావా అని అడగ్గానే తప్పకుండా అన్నాడు. పండ్ల మొక్కలు తీసుకురానా అంటే ok అన్నాడు. నర్సరీ దగ్గర దిగి లోపలికి వెడుతుంటే మిత్రులు సజీవరాజు, ప్రదీప్ కనిపించి పలకరించి అడిగారు ఏం చేస్తున్నారుఅని.విషయం చెప్పగానే మేము మొక్కలు ఇస్తామన్నారు. సపోటా, నేరేడు, సీతాఫలం మొక్కలు తీసుకెళ్లగానే కొంత మంది పిల్లలతో కలిసి సురేష్,మేము park లో పాదులుతీసి మొక్కలు నాటాము. మేము ముగ్గురం APNGC లో సభ్యులం.ఇలాగే ఉభయ తెలుగు రాష్ట్రాలలోని NGC సభ్యులు, మొక్కల ప్రేమికులు వారి దగ్గర లో ఉన్న స్థానిక park లలో పండ్ల మొక్కలు,నీడ నిచ్చే మొక్కలు, పూల మొక్కలు నాటితే park లలో మంచి వాతావరణం ఏర్పడుతుంది.

Sunday 12 November 2023

40.పాటల పూదోట

 వర్మ "రంగీలా " చూసారా. ఇండియాను ఊపేసింది. ఇందులో రెహమాన్ music వింటుంటే పాట మధ్యలో instruments ఇంత అత్య ద్భుతంగా ఉపయోగించవచ్చా అనిపిస్తుంది.హరిహరన్, స్వర్ణలతల స్వరాల్లో పాట ఇంత మధురంగా ఉంటుందా అని ఆశ్చర్యపోతాం. Ear phones పెట్టుకుని కళ్ళుమూసుకుని విని తరించండి.(https://youtu.be/KQUS-phhM0Y?si=3aJ0uYULkLJTO9pR)

39. పాటల పూదోట

 శ్రీమణి చక్కని సాహిత్యం అందించగా, సుదర్శన్ రూపంలో కొత్త స్వరాన్ని పరిచయం చేస్తూ DSP(దేవిశ్రీ ప్రసాద్) అందించిన హాయిగా వినాలనిపించే మంచి మెలోడీ ఇది.వినండి మరి.(https://youtu.be/tpvNtKjlf5E?si=PkF8-2JZrvvyaBi4)

38.పాటల పూదోట

 రెహమాన్ సృష్టించిన శాస్త్రీయ సంగీతపు అలలపై నరేష్ అయ్యర్ పలికిన సరిగమపదనిసల గమకాల పై మహతి సైంధవి స్వరం మీ మనసును మలయసమీరంలా తాకుతూ మీ హృదయాన్ని పరవశింపజేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం ear phone పెట్టుకుని కళ్ళు మూసుకుని ఆస్వాదించండి. (https://youtu.be/WjdAM6aLO5I?si=lLd6fZrE0Rw0l05e)

37. పాటల పూదోట

 రెహమాన్ సృష్టించిన శాస్త్రీయ సంగీతపు అలలపై నరేష్ అయ్యర్ పలికిన సరిగమపదనిసల గమకాల పై మహతి సైంధవి స్వరం మీ మనసును మలయసమీరంలా తాకుతూ మీ హృదయాన్ని పరవశింపజేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం ear phone పెట్టుకుని కళ్ళు మూసుకుని ఆస్వాదించండి. (https://youtu.be/WjdAM6aLO5I?si=lLd6fZrE0Rw0l05e)

Monday 6 November 2023

బుద్ధ వనం

 బుద్ధవనం

నాగార్జున సాగర్ మీదుగా హైదరాబాద్ వె డుతునప్పుడల్లా సాగర్ దాటాక ఎడమ వైపు బుద్ధవనం board చూస్తుంటాం. కాని 2014 నుండి నిర్మాణం లో ఉండి 2023 వేసవిలో ప్రారంభించబడిందట.దీనికోసం 274 ఎకరాలు కేటాయించారు. ప్రస్తుతం 70 ఎకరాల్లోనే కొన్ని విభాగాలు పూర్తయ్యాయి.మాచర్ల నుండి నల్లగొండ, హైదరాబాద్ వెళ్లే బస్సులన్నీ అక్కడ ఆపుతాయి. Ordinary bus, auto ల్లో ₹50 తీసుకున్నారు. అక్కడే cottages ఉన్నాయి. భోజనం మాత్రం బయట ఉన్న hotels లో చేయాలి. ఒక రోజు ఉదయం వెళ్లి మధ్యాహ్నం వరకు గడపవచ్చు. సొంత వాహనాలు ఉంటే సాయంత్రం వెళ్లి ఆ వాతావరణాన్ని enjoy చేయవచ్చు.ఉదయం 10 గంటల కల్లా వెళ్ళాం. అప్పుడప్పుడే యాత్రికుల రాక మొదలయింది. Ticket ₹50. రాజప్రసాదం లోపలికి వె డుతున్నామా అన్న అనుభూతి కలిగింది.

1) అర్థ చంద్రాకారంలా ఉన్న మహా స్థూపం,అందులోని నాలుగు వైపులా 4 బుద్ధ విగ్రహాలు బంగారు రంగులో మెరిసిపోతుంటే,పై భాగంలో ఆకాశం ప్రతిబింబిస్తుంటే ధ్యాన మందిరంలో యాత్రికులు ధ్యానం చేసుకునే విధంగా ఓ ప్రశాంత వాతావరణం అక్కడ విలసిల్లుతుంది.అక్కడ ధ్యానం చేయడం చక్కని అనుభూతి కలిగిస్తుంది. మహా స్థూపం క్రింద museum ఏర్పాటు చేశారు.క్రీ. శ 1 వ శతాబ్దం నాటి బుద్ధ విగ్రహాలను చూడవచ్చు.

2)మహా స్థూపానికి ముందు బుద్ధచరితవనంలో ఆయన జీవిత విశేషాలను పొందుపరిచారు.

3) జాతక వనంలో జాతక కథల్లోని చిత్రాలను శిల్పాలుగా మలిచారు.

4)ధ్యాన వనంలో శ్రీలంక ప్రభుత్వం donate చేసిన 27 అడుగుల బుద్ధ విగ్రహాన్ని చరిత వనం లో ధర్మ ఘంటను చూడవచ్చు.

5)స్థూప వనం లో విభిన్న దేశాలు ప్రాంతాల్లో ఉన్న బౌద్ధ స్థూపాల models చూడవచ్చు.

బుద్ధవనం లో ఇంకా చాలా విభాగాలు అభివృద్ధి చేయవలసి ఉంది. పూర్తి రూపం సంతరించుకుంటే ఇది అంతర్జాతీయ పర్యాటక కేంద్రం అవుతుంది.బుద్దవనం ప్రతి ఒక్కరు తప్పని సరిగా చూడదగ్గ సందర్శనీయ ప్రాంతం.... ఒద్దుల రవిశేఖర్

Monday 23 October 2023

36. పాటల పూదోట

 అభినందన సినిమా చూసారా.ఇందులో అన్ని పాటలు బాగుంటాయి.సంగీత సాహిత్యాలు పోటీ పడిన గీతమిది.ఆత్రేయ సాహిత్యం, ఇళయరాజా సంగీతం అందించగా బాలు జానకి ల స్వరాల్లో సుమధురంగా సాగిన ఈ వీనుల కు ఇంపైన గీతం ఈ వారం మీ కోసం. (https://youtu.be/RMoUYGnu02w?si=H-SCgSiTMdK2aLl-)

35. పాటల పూదోట

  ఉన్ని కృష్ణన్ పాటలెప్పుడైనా విన్నారా, విలక్షణ స్వరం.రెహమాన్ compose చేసిన ఈ పాటలో చరణాల మధ్య మంద్రంగా సాగే beat వింటూ అప్పుడప్పుడు మధ్య లో వచ్చే music వింటూ ఉంటే మనసు గాల్లో తేలిపోతుంది.కవితా కృష్ణ మూర్తి గొంతు హృదయాన్ని తాకుతుంది. కళ్ళు మూసుకుని earphone పెట్టుకుని పాట వినడం మరిచిపోకండి.(https://youtu.be/Wzj5vJgAtBk?si=E3Kddi92qEGTWkmS)

34.పాటల పూదోట

 Classical songs వింటూ ఉంటారా!వినలేం బాబూ అంటారా!wait wait కాస్త western beat add చేస్తాం లెండి.విజయ్ సంగీతంలో ఆర్యా దయాల్ baby సినిమా కోసం ఎంత విభిన్నంగా పాడిందో! వింటే మీకే అర్థం అవుతుంది. ఈ weekend మీకోసం"దేవరాజ........".(https://youtu.be/W2qp0A58PTA?si=TKYH5iL6zgZaxTOY)

33.పాటల పూదోట

 వేటూరి కలం నుండి జాలువారగా రాజన్ నాగేంద్ర స్వర కల్పనలో బాలు జానకి పాడిన మధురగీతం ఇది. " వీణ వేణువైన సరిగమ" పాటలోని వీణ ఫణి నారాయణ, వేణువు రామ చంద్ర మూర్తి పలికించిన instrumental music వినండి.మనసును హాయిగా మైమరిపించే చక్కని ప్రయోగం.(https://youtu.be/j0_86ZfGnE4?si=i8kpa5coSAi5LcoL)

Saturday 14 October 2023

ప్రపంచ ప్రసిద్ధ ఉపన్యాసాలు

 పుస్తకం:ప్రపంచ ప్రసిద్ధ ఉపన్యాసాలు

పరిచయం :ఒద్దుల రవిశేఖర్

కళల్లో ఉపన్యాస కళ క్లిష్ట మైనది మరియు విశిష్ట మైనది. ప్రపంచ గతిని మార్చిన గొప్ప నాయకులు తమ ఉపన్యాసాల ద్వారానే ప్రపంచాన్ని విశేషంగా ప్రభావితం చేశారు.అందుకనే విద్యార్థి దశ నుండే వేదికలపై మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. అందుకనే పాఠశాల స్థాయిలో వక్ తృత్వ పోటీలు చర్చలు జరుపుతుంటారు. వాటి వల్ల విద్యార్థుల్లో సభా కంపం పోయి ధైర్యం వస్తుంది. ఎలా ఉపన్యసించాలో ఈ పుస్తకం తొలి పలుకు లో అనువాద రచయిత సి. వి. యస్. రాజు గారు వివరిస్తారు.ఉపన్యాసాల్లో విభిన్న శైలులు ఉంటాయి. చర్చిల్ హాస్యచతురత, సర్వేపల్లి వాక్చాతుర్యం(నిముషానికి 120 పదాలు ) ఇలా ఒక్కొక్కరు ఒక్కో విశేషమైన నైపుణ్యం కలిగి ఉంటారు.

ఈ పుస్తకం లో 1)సోక్రటీస్ :ప్రశ్నించడాన్ని ప్రపంచానికి నేర్పిన తాత్వికుడు. ఏథెన్స్ రాజ్యం లో జన్మించాడు సత్యాన్వేషణకు నూతన పద్ధతి కని పెట్టాడు. జ్ఞానమే దేవుడన్నారు.

2)సిసెరో :రోమ్ రాజ్యం లో సెనేటర్  ఇలా

గొప్ప వాక్ చాతుర్యం కలిగిన వ్యక్తి.సీజర్ ను పొగుడుతూ "నీ యుద్దాలు కాల మున్నంత వరకు ప్రతి భూమి పెదవులతో చెప్పుకోబడతాయి."

3) మార్క్ ఆంటోనీ :రోమన్ రాజకీయ నాయకుడు. జూలియస్ సీజర్ మిత్రుడు.తన ఉపన్యాసం లో " దేశ ద్రోహుల చేతుల కంటే కృతఘ్నత చాలా బలీయమైనది. "

4) జీసస్ :జీసస్ మొదటి శతాబ్దానికి చెందిన యూదు బోధకుడు. ఆయన బోధనలే క్రైస్తవ మతం గా మారింది."అసలు ప్రమాణాలు చేయవద్దు. భూమి మీద, భగవంతుని మీద, తలమీద ప్రమాణాలు చేయవద్దు ". 

5) క్వీన్ ఎలిజబెత్ :ఇంగ్లాండ్ రాణి

6) ఆలివర్ క్రాంవెల్ :ఇంగ్లాండ్, లెఫ్టినెంట్ జనరల్ గా పని చేశారు

7) పాట్రిక్ హెన్రీ :అమెరికా లోని వర్జీనియా కు గవర్నర్ గా పని చేశారు."స్వాతంత్ర్యమైనా ఇవ్వండి లేదా మరణాన్నైనా ఇవ్వండి ".

8) జార్జి వాషింగ్టన్:అమెరికా మొదటి అధ్యక్షులు. "నిజమైన స్వాతంత్ర్యమనే భవనానికి ఐక్యతే మూల స్థంభం ". 

9) థామస్ జెఫర్సన్ :అమెరికా మూడవ అధ్యక్షులు.

10) నెపొలియన్ బోనపార్టి:ఫ్రాన్స్ దేశ అధ్యక్షులు గా పని చేశారు

11) అబ్రహాం లింకన్ :అమెరికా అధ్యక్షుడిగా పనిచేశారు."మనం ఇప్పుడు చెప్పిన మాటల్ని ప్రపంచం గుర్తించదు, జ్ఞాపకం ఉంచుకోదు కాని ఇక్కడ వారు చేసిన పనిని మాత్రం మరచి పోదు ఇలా సుసాన్ బి అంథోని,ఎమిలిన్ ప్యాంక్ హార్ట్స్, మేరీ క్యూరీ, గాంధీ, లెనిన్, చర్చిల్, స్టాలిన్, రూజ్ వెల్ట్, హిట్లర్, నెహ్రూ,కెనడీ, ఇందిరా గాంధీ, మదర్ థెరిసా, రీగన్ నెల్సన్ మండేలా మార్టిన్ లూథర్ కింగ్, చేగువేరా, గోర్బ చోవ్, బుష్ వంటి 30 మంది ప్రసిద్ధ ఉపన్యాసాలు ఇందులో ఇచ్చారు.వీటిని చదవడం వలన చక్కని ఉపన్యాస మెలకువలు తెలుస్తాయి. విద్యార్థులు ఉపాధ్యాయులు చదవ తగ్గ పుస్తకం.

Wednesday 27 September 2023

ప్రపంచ పర్యాటక దినోత్సవం సెప్టెంబర్ 27

 ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా మీకు ఇష్ట మైన ప్రాంతాన్ని సందర్శించండి. జీవితాన్ని కొత్త కోణం లో చూడండి.ఖరీదైన వస్తువులు ఇచ్చేసంతోషం కన్నా కొత్త ప్రాంతాలు చూస్తే కలిగే ఆనందం మిన్న.పర్యాటకం మీ జ్ఞానాన్ని విస్తృత పరుస్తుంది.జీవితాన్ని అర్థం చేసుకోవడానికి చక్కగా ఉపయోగ పడుతుంది. మీ పర్యాటక అనుభవాలను పంచుకొని మిగతావారికి మార్గదర్శకులు కండి. ప్రకృతి పరిమళాన్ని మీ గుండెలనిండా నింపుకోండి.ప్రపంచం లోని ప్రతి ఒక్కరూ ప్రతినెలా ఏదో ఒక ప్రాంతాన్నిసందర్శిస్తే ఎంతో మందికి ఉపాధి లభిస్తుంది.... ఒద్దుల రవిశేఖర్.

Monday 18 September 2023

చదువులు.. కొత్త దారులు

 చదువులు కొత్త దారులు                                           మనము  కలవాలి ,అనుభవాలు పంచుకోవడానికి అని C.A  ప్రసాద్ గారు చెప్పడంతో 16 /9 /2018 ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసాం.9:30 కే  రమ్మన్నారు. నేను జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాస్ రెడ్డి గారు 9:40 కల్లా వెళ్ళాము. అక్కడకు వెళ్లగానే ప్రసాద్ గారు కుర్చీలు వేస్తూ సర్దుతూ కనిపించారు ఇంకా ఎవరూ రాలేదు. అంత సామాన్యంగా ఉంటారు ఆయన. సార్ మాకు ఏమైనా పని చెప్పమంటే నవ్వి ఊరుకున్నారు ఇక పని మనమే వెతుక్కోవాలని చూసా . క్రింద అప్పుడేే పుస్తకాలు వచ్చాయి వాటిని మొదటి అంతస్తుకు తీసుకువచ్చి  బల్ల పై సర్దాము.  ఒక్కొక్కరే ఉపాధ్యాయులు రావటం మొదలైంది ఆనంద్, నాగమూర్తి వచ్చారు. పదకొండు గంటలకల్లా దాదాపు 80 మంది ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు వచ్చారు.                                                                                                                                                                          కార్యక్రమానికి వచ్చిన ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ ఈదర హరిబాబు గారిని,వాడ్రేవు చినవీరభద్రుడు గారిని విజయ భాను గారిని SSA అధికారిని వేదికపైకి ఆహ్వానించారు.ప్రసాద్ గారుమాత్రం వెనక కూర్చొని వింటూ కార్యక్రమాన్ని సంధాన  పరుస్తున్నారు స్టేజీపై కూర్చోవాలనే ఆలోచన కూడా ఆయనకు లేదు. మొదటగా హీల్ పారడైస్ స్కూల్(http://healcharity.org)ప్రిన్సిపాల్ శోభారాణి గారిని  ప్రసంగించమని ఆహ్వానించారు. ఈ పాఠశాలను లండన్ లో ఉండ కోనేరు సత్యప్రసాద్ గారు స్థాపించారట.తన ఆస్తిలో చాలా భాగం దానికి ఆయన ఖర్చు చేశారట 27 ఎకరాలలో ఉన్న ఈ పాఠశాలలోపిల్లలే పరిశుభ్రత ,వంట,తోటపని చేసుకుంటారట. ఇందులో అనాధ పిల్లలకే ప్రవేశం. చాలాకాలానికి నేను అనుకున్న కార్య క్షేత్రం నాకు దొరికినట్లయింది త్వరలో ఈ పాఠశాలకు వెళ్లాలని 550 మంది అనాధ పిల్లలకు ఏదైనా చేయాలన్న సంకల్పం కలిగింది. శోభారాణి గారితో తర్వాత వివరంగా మాట్లాడాను ఆమె తప్పకుండా రండి సార్ అని ఆహ్వానించింది ఆనంద్, నేను వెళ్లాలని నిర్ణయించుకున్నాము. తర్వాత మార్తాండ రెడ్డి అని కడప లో రిటైర్ అయిన డాక్టర్ గారు మాట్లాడారు పిల్లలకు నేర్పాల్సిన కొన్ని కార్యక్రమాలు  చేస్తున్నారట. Ten commandments for teachers  అనే పుస్తకాన్ని ముద్రించారట. కొమరోలు ఉన్నత పాఠశాల ప్రభుత్వ కాలేజీ చాలా బాగుందని ప్రశంసించారు. తర్వాత ప్రాథమిక విద్యారంగంలో సంచలనాలు సృష్టిస్తున్న విజయ భాను కోటే గారు మాట్లాడుతూ చిన్నప్పుడు రామకృష్ణ మఠం వెళ్ళేదాన్నని వివేకానందుని సూక్తులు  నాపై ప్రభావం చూపాయి అని చెప్పారు. తర్వాత ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి విద్యార్థులకు తను చేసిన ప్రయోగాలు వివరించారు.ఈ విధానాన్ని ఆస్ట్రేలియాలోని స్టీవార్ట్ అనే professor  ప్రవేశపెట్టారు. దీనిని 1 నుండి 10 వ తరగతి వరకు అమలు చేయవచ్చు. 1 + 4 +6  విధానంలో జూన్ నెల అంతా పిల్లలను పాఠశాలకు అలవాటు చేయడం, మిగతా నాలుగు నెలలు  లేతఆకాశం అనే కార్యక్రమం ద్వారా బోధన, తర్వాత ఆరు నెలలు పిల్లలు స్వయంగా   చే

నేర్చుకుంటారు.TLM కూడా పిల్లలే చేస్తారు.Cleanliness is not cleaning,it is not littering. విజయ భాను గారు ఏపీ ప్రభుత్వ సహకారంతో ఫిన్లాండ్ విద్యా విధానాన్ని పరిశీలించడానికి వెళ్లారు. ఆహారము పోషక విలువలతో కూడిన టువంటి ఆయుర్వేద మందులను తయారు చేయడంపై పిల్లలకు అవగాహన కార్యక్రమాలు పోషకాహారం పిండిని పిల్లలతో తయారు చేయించడం చేస్తారు. మునగాకు పొడి పచ్చడిని తయారు చేశారు పిల్లలు చేసిన కార్యక్రమాలన్నీ రికార్డు చేస్తారు.Shine India comes from teacher. జీతములో 10% పాఠశాలకు ఇస్తారట. వీటన్నిటికీ కారణం పాఠశాల పట్ల పిల్లల పట్ల నాకున్న passion.                                                          ...............తర్వాత వాడ్రేేవు చినవీరభద్రుడు గారిని ప్రసంగించమని ఆహ్వానించారు.ఈయన centre for innovations in publicsystem లో assistant director గా పని చేస్తున్నారు. ఈ సంస్థ విద్య వైద్యం ఈ గవర్నెన్స్ లో దేశవ్యాప్తంగా జరుగుతున్న నూతన ప్రయోగాలు పరిశీలించడం ప్రభుత్వానికి సలహా ఇవ్వటం చేస్తుంది దేశంలోని చాలా ప్రాంతాల్లో అద్భుతాలు జరుగుతున్నాయి. కొన్ని వినూత్న కార్యక్రమాలు1) అరబిందో సొసైటీ వారు ఉత్తరప్రదేశ్ లోని పాఠశాలల్లో పైసా ఖర్చు లేకుండా అమలయ్యే విధానాలు  తెలియజేయమని అక్కడి ఉపాధ్యాయులను కోరితే లక్ష మంది స్పందించారు వాటిలో 33 రకరకాల అత్యుత్తమ పద్ధతులను ఎన్నుకున్నారు. 1నుండి  5వ  తరగతి వరకు 11 రకాల పద్ధతులు తయారు చేశారు. 2)BALA: Building as learning aid.గదే బోధనోపకరణం.మెట్లకు సంవత్సరాలు రాసి వాటి ప్రాముఖ్యతను తెలియజేస్తారు.3). విజయనగరం జిల్లా చీపురుపల్లి లో శోధన అనే బాలబడి ఉంది దీనికి జీఎంఆర్ ఫౌండేషన్ సహాయం చేస్తుంది. పాఠాలను చిన్నచిన్న నాటికల రూపంలోకి మారుస్తారు. పిల్లల్లో గొప్ప ఉత్సాహం కనిపిస్తుంది 1 నుండి 9వ తరగతి వరకు పాఠశాలల్లో సిలబస్ అక్కడ స్థానిక సమాజం నిర్ణయించాలి. పాఠశాల విద్యా చరిత్ర కేవలం 156 సంవత్సరాలు మాత్రమే.అంతకు ముందు అంతా జ్ఞాన ప్రసారము చుట్టుపక్క సమాజం ద్వారానే జరిగింది వ్యవసాయం పాఠం సెప్టెంబర్ లో ఉంటే దానిని సందర్శించి నేర్చుకోవచ్చు.4) జిడ్డు కృష్ణమూర్తి గారి ప్రభావంతో ప్రేమ గంగాచారి అనేవారు  తమిళనాడులోని కోయంబత్తూరు దగ్గర anaikatti లో విద్యావనం(http://www.vidyavanam.org/home.html) అనే పాఠశాలను స్థానిక గిరిజన తెగ పిల్లల కోసం స్థాపించారు.వారి కుటుంబంలో వీరే మొట్టమొదట బడికొచ్చిన పిల్లలు. ఇక్కడ స్థిరమైన తరగతి గదులు ఉండవు తమిళం, ఇంగ్లీషు, లెక్కలు, సైన్సు వంటి zones ఉంటాయి.5) అలాగే ఒరిస్సా రాజధాని భువనేశ్వర్ లో డాక్టర్ అచ్యుత్ సమంత అనే ఆయన కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ను స్థాపించారు. ఇక్కడ 25 వేల మంది పిల్లలు చదువుకుంటున్నారు అందులో 13 వేల మంది అక్కడ ఉన్న హాస్టల్లో ఉంటున్నారు. ఇక్కడ పాఠశాలల్లో  ఒకేషనల్ విద్యా విధానం పటిష్టంగా ఉంది పిల్లలే బట్టలు కుట్టుకుంటారు పచ్చళ్లు తయారు చేసుకుంటారు. ఆ పిల్లల వార్షికాదాయముఒకటిన్నర  కోట్లు. ఇలాంటి 130 అత్యున్నతమైన విధానాలు మేము సేకరించాము.వీటిని దేశం లోని అన్ని రాష్ట్రాలకు పంపించాము, విచారకరమైన విషయమేమంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వీటినింతవరకు అమలుచేయలేదు,మిగతా రాష్ట్రాలు అన్ని ఈ విధానాలను అమల్లో పెట్టాయి. చివర్లో ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ ఈదర హరిబాబు గారు మాట్లాడుతూ విద్యాలయాల్లోకి నేను ప్రవేశించడానికి ముందు నాలో ఉన్న రాజకీయ నాయకుడిని చెడు అలవాట్లను చంపుకున్నాను. ఉపాధ్యాయులారా మిమ్మల్ని మీరు సంస్కరించుకోండి. పాఠశాలలు జాతి నిర్మాణ కేంద్రాలు.ఉపాధ్యాయులు,విద్యార్థులు దేశ సంపద. చివరగా డాక్టర్ కొర్ర పాటి  సుధాకర్ గారు మాట్లాడుతూ పిల్లల నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు వారికి కోపం రాదు ఆనందంగా ఉండటం ఎలాగో వారి నుండి నేర్చుకోవచ్చు.ఒక ఎకరంలో అడవిని పెంచుతున్నా అంటూ ముగించారు.తరువాత మధ్యాహ్నం,ప్రాధమిక పాఠశాల ఉపాధ్యాయులు ఒక గ్రూపు సృజన ఆధ్వర్యం లో,ఉన్నత పాఠశాల ల ఉపాధ్యాయులు నా ఆధ్వర్యం లో మరో గ్రూపులో కూర్చొని తమ అనుభవాలు,అభిప్రాయాలు కలబోసుకున్నాము.ఇంతటి మహత్తర కార్యక్రమం రూపొందించిన C.A.ప్రసాద్ గారు చివర్లో మాట్లాడుతూ ఇవన్నీ ఒక పుస్తకం రూపం లో తీసుకు వస్తాము.అందరికీ ధన్యవాదాలు,మళ్లీ కలుద్దాం అని ముగించారు....... ఒద్దుల రవిశేఖర్ 

Sunday 17 September 2023

32.పాటల పూదోట

 

ఇది సినిమా లోని పాట కాదు.ఒక నిజ జీవిత సంఘటనకు అక్షర రూపం ఈ పాట.పిల్లలు క్షణికావేశానికి లోనై ఆత్మహత్య లు చేసుకుంటే తల్లి తండ్రులు పడే అంతులేని వేదనకు ప్రతి రూపం ఈ గీతం.1)(https://youtu.be/IBs2FyxUGlc) 2)https://youtu.be/3d1lCjnZ9S8. పై హిందీ లో ఉన్న పాటకు ఇది తెలుగు అనువాదం.గుండెల్ని పిండేసే ఈ గీతాన్ని వినండి.

31. పాటల పూదోట

 

భరతన్ దర్శకత్వంలో కీరవాణి మనల్ని మంత్ర ముగ్దుల్ని చేసిన ఈ గీతం "దేవరాగం "అనే మలయాళ చిత్రంలోనిది.చిత్ర, జయచంద్రన్ స్వరాల్లో జాలువారిన "దేవరాగాన్ని " వినండి ఈ వారాంతం.(https://youtu.be/pUmyjM35LII)

30. పాటల పూదోట

 

"ఆనందం"సినిమా పేరు విన్నారా ఈ పాట ప్రత్యేకత సగం పాట గాయకుడు పాడాక మిగతా సగం గాయని పాడుతుంది. సిరివెన్నెల చిలికిన చిక్కని తెలుగు పదాల సౌరభాన్ని దేవిశ్రీ ప్రసాద్ తన సంగీతం తో మరింత గుబాళింప చేసాడు.ప్రతాప్ చిత్రల స్వరాల్లో చిత్రంగా పలికిన ఈ గీతం ఈ వారాంతం మీ కోసం.(https://youtu.be/pN8g9Mp-a_4)

29. పాటల పూదోట

 

సిరివెన్నెల పాటల్లో ఆణిముత్యం ఈ పాట. కెవి మహదేవన్ స్వర కల్పనలో బాలు, సుశీల పాడిన ఈ పాట ఎన్ని సార్లు విన్నా తనివితీరదు. విశ్వనాధ్ దర్శకత్వం లో వచ్చిన  " సిరివెన్నెల" చిత్రం లోని పాటలన్నీ అజరామరం.(https://youtu.be/dfOYIXOclTg)

28.పాటల పూదోట

 

https://youtu.be/vbz_BVTiozE ) శివ compose చేయగా సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాట  ఒకే టెంపో లో సాగుతూ మన హృదయాలను మీటుతుంది, వినండి ఈ weekend.

27. పాటల పూదోట

 

https://youtu.be/rGX1Ch6OyUs(https://youtu.be/rGX1Ch6OyUs )"వరాహరూపం" పాట విన్నారా, origional song సన్నాయి మీద సాగితే ఇందులో వేణువు, గిటార్ modern music touch చేస్తూ అనూప్ శంకర్ చేసిన విభిన్నప్రయోగం,వినండి మరి.)

26. పాటల పూదోట

 

తెలుగులో ఈ పాట వినే వుంటారు. "తెలుసా మనసా ". మరి హిందీలో కుమార్ సాను,అల్కా యాగ్నిక్ గొంతుల్లో పలికిన ఈ గంధర్వగానా న్ని earphones పెట్టుకుని కళ్ళు మూసుకుని వినండి. కీరవాణి పాటల్లో ఇది అత్యద్భుతమైన melody.(https://youtu.be/nqTS7ngviwQ)

25. పాటల పూదోట

 

Bombay (Mumbai) సినిమా చూసారా, మణిరత్నం master piece.రెహమాన్ స్వరపరిచిన ఈ గీతం హరిహరన్, కవితా కృష్ణమూర్తి పాడారు. Earphone పెట్టుకుని, కళ్ళుమూసుకుని వినండి.సంగీత ప్రపంచపు సరిహద్దుల్లోకి వెడతారు. ఈ weekend మీకోసం.Tu Hi Re (Bombay / Soundtrack Version)(https://youtu.be/P4NwOb39sTQ)

24. పాటల పూదోట

 

https://youtu.be/kP9oPI5791A
నజీర్ స్వరంలో విలక్షణంగా సాగిన ఈ గీతాన్ని థామస్ స్వరపరిచారు.కృష్ణ కాంత్ తన కలం తో విరజిమ్మిన ఈ తేట తెనుగు గీతం వినండి.

23.పాటల పూదోట

 

భూమికి పచ్చని చీర కట్టినట్టున్న,పర్వత పరిసరాల్లో అల్కా యాగ్నిక్, ఉదిత్ నారాయణ్ స్వరాల్లో రెహమాన్ పలికించిన మరో melodious master piece తాల్ సినిమా లోని ఈ గీతం. హిందీ అర్ధమైతే మరింత బాగుంటుంది. ఈ వారాంతం మీ కోసం. (https://youtu.be/OinGHNpnGtc)

22. పాటల పూదోట

 

మణిరత్నం దర్శకత్వం వహించిన రత్నం లాంటి సినిమా "గీతాంజలి " చూసారా, మాస్ట్రో ఇళయరాజా సంగీతం ఆ చిత్రానికి మకుటాయమానం. ప్రకృతి ని పలకరిస్తూ బాలు పాడిన ఈ గీతం లో లీనమై పోండి.(https://youtu.be/vyH7ow2C4Zw)

21. పాటల పూదోట

 

అచ్చ తెనుగు పదాల సోయగం చిత్ర స్వరం లో జాలువారే ఈ "దేవరాగాన్ని " వినండి.(https://youtu.be/16nIvB_CbTE)

20. పాటల పూదోట

 

బాలు, శైలజ స్వరాల్లో వచ్చిన అజరామరమైన ఈ గీతాన్ని వేటూరి వ్రాయగా ఇళయరాజా సంగీతం అందించారు. కేవలం earphone పెట్టుకుని పాట మాత్రమే వినండి. తరువాత పాటని చూస్తూ వినండి. బాలు గాత్రం కమల్ హాసన్ అభినయం కళ్ళు చెమర్చేలా చేస్తాయి. ఈ వారం మీ కోసం ఈ గీతం.(https://youtu.be/ya6fkjJcvD4)

19. పాటల పూదోట

 

కృష్ణవంశీ "అంతఃపురం"చూసారా చిత్ర పాడిన పాటల్లో మకుటా యమానం ఇది.ఇళయరాజా స్వరకల్పనలో సిరివెన్నెల కురిపించిన వెన్నెల ఈ గీతం.(https://youtu.be/drgfr9WHVfA)

18.పాటల పూదోట

 

Gulzar కలం నుండి జాలువారగా రెహమాన్ సృష్టించిన మేఘాలను వర్షపు జల్లుగా మనపై శ్రేయా ఘోషల్ కురిపించిన ఈ గీతం మీకోసం (https://youtu.be/xj_OHHWcPNw)

17.పాటల పూదోట

 

https://youtu.be/qBZoM-6qu38)    దేవరాగం (శిశిరకాలం) అభిజిత్ వేణుగానంలో విని ఈ ఉషోదయానికి స్వాగతం పలకండి.

16.పాటల పూదోట

 

మణిరత్నం దర్శకత్వం లో వచ్చిన గీతాంజలి పాటలు యువత ను కట్టి పడేసాయి ఇళయరాజా సృజించిన ఈ పాట బాలు జానకి ల స్వరం లో పలికిన ఓంకారం.(https://youtu.be/NMPlZrSl144)

15.పాటల పూదోట

 

రామ్ గోపాల్ వర్మ "రంగీలా "చూసారా!సురేష్ వాడ్కర్, కవితా కృష్ణ మూర్తి ల గొంతులో మంద్రంగా సాగే ఈ గీతానికి "రెహమాన్ "సంగీతం". పాట లో చరణాలు ఆగిన తరువాత  రెహమాన్ తన ప్రతిభ ను పతాక స్థాయికి తీసుకు వెడతారు. దాన్ని earphones తోనే వినాలి.(https://youtu.be/w7yE8XOE2vM)

14. పాటల పూదోట

 

థమన్ సంగీతం లో వచ్చిన ఓ మలయ సమీరం ఈ మందారం. శ్రేయా ఘోషల్ స్వరంలో మంద్రంగా పలికిన ఈ గీతం మీ కోసం (https://youtu.be/Zo5kxK4j2qY)

13.పాటల పూదోట

 "సర్వం తాళ మయం" అంటూ ప్రకృతి లో పలికే స్వరాలన్నీ తాళమయం అంటూ హరిచరణ్ మధురమైన గానం చేస్తుంటే రెహమాన్ ఇచ్చిన best beats పాటకు మరింత బలాన్నిస్తే ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ మొదటి link లో తమిళ్ video song చూడండి. తరువాత రెండవ link లో తెలుగు పాట వినండి.

తమిళ్

1)(https://youtu.be/bDorKQg8Uyc?si=XIbfC9h8Pde_XuYt)

తెలుగు 2)https://youtu.be/XvBZx0Hauw0?si=D-K6Gly-3qAmF8yh

12.పాటల పూదోట

 "సర్వం తాళ మయం" అంటూ ప్రకృతి లో పలికే స్వరాలన్నీ తాళమయం అంటూ హరిచరణ్ మధురమైన గానం చేస్తుంటే రెహమాన్ ఇచ్చిన best beats పాటకు మరింత బలాన్నిస్తే ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ మొదటి link లో తమిళ్ video song చూడండి. తరువాత రెండవ link లో తెలుగు పాట వినండి.1)Tamil (https://youtu.be/bDorKQg8Uyc?si=-mpHbIq0d6rX12Hr)

2)Telugu (https://youtu.be/XvBZx0Hauw0?si=g1uadzh_89Ojuh9K)

11. పాటల పూదోట

 ప్రభాస్ "రాధే శ్యామ్ " చూసారా, సినిమా సరిగా ఆడకున్నా అందులోని పాటలన్నీ బాగుంటాయి. మిథున్ సంగీతం ఈ పాటలో మన హృదయవీణ ను కొనగోటితో మీటుతుంది .ఆర్జిత్ సింగ్ ఈ పాటకు ప్రాణం పోసాడు.(https://youtu.be/inwnVerWbJo?si=MCPpCBL-l-2KBfIr)

Saturday 9 September 2023

తిరిగి ఇద్దాం

 తిరిగి ఇద్దాం.                                                  కాలం పుట్టి ఇప్పటికి 1350 కోట్ల                      సంవత్సరాలయ్యింది.అదేంటి కాలానికి పుట్టుక ఏంటీ అంటారా బిగ్ బాంగ్  సిద్ధాంతం ప్రకారం మహా విస్ఫోటనం తర్వాత విశ్వావిర్భావం జరిగింది.అప్పుడు కాలం, స్థలం పుట్టాయి.దేన్నయినా కొలవాలంటే కొన్ని ప్రమాణాలు అవసరం.కాలాన్ని కొలవడానికి సెకను ప్రమాణం.ఆటల పోటీల్లో సెకనులో వందవ వంతు వరకు కొలుస్తారు.పిటి ఉష ఒలింపిక్స్ లో వందవ వంతులో పతకం కోల్పోయింది..మన భూమిపై కాలం భూభ్రమణం వలన ఏర్పడుతుంది.భూభ్రమణానికి  24 గంటలు సమయం పడుతుంది.దీనిని ఒక రోజుగా మనం పరిగణిస్తాం. భూపరిభ్రమణానికి 365 1/4 రోజులు పడుతుంది.దీనికి మనం ఒక సంవత్సరంగా పేరు పెట్టుకుని దానిని సమీక్షించుకుంటూ వచ్చే సం వత్సరానికి శుభాకాంక్షలు చెప్పుకుంటూఉంటాము.కాలానికి మనం విభజన గీతలు గీసి వేడుకలు చేసుకుంటుంటాము.మనం బహుశా భూమి 70 సార్లు సూర్యునిచుట్టు తిరిగేదాకా ఈ భూమిపై ఉంటాం.(సగటు వయసు 70 సం అనుకుంటే)భూమి మీద ఉండే ఈ సమయం లో మనం జీవిత చక్ర భ్రమణం లో చిక్కుకుని సంసార సాగరంలో ఈదుతూ ఒడ్డుకు చేరుకునే సరికి 3 భాగాల వయసయిపోతుంది.అంటే సుమారు 50 ఏళ్ళు దాటి పోతాయి.చివరి 1 భాగం అయినా మన జీవితాన్ని ప్రయోజనకరంగా తీర్చిదిద్దుకోకపోతే ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ మిగలదు. పుట్టినప్పటినుండి మనకు గాలి,నీరు,ఆహారం,వస్త్రాలు,ఇల్లు ఇలా సమస్తం ఇచ్చే ఈ భూమికి మనం ఏం తిరిగి ఇవ్వగలం,అని ఆలోచించుకోవాలి.జీవితమంతా తీసుకోవడమే తిరిగి ఇచ్చేదేమీ లేదా?ఇవ్వడం అంటే ఆర్థికసహాయం మాత్రమే కాదు.కొన్ని మొక్కలు నాటి పెంచి పెద్దజేయడం,ఒక కిమీ బైక్,కార్ నడపకుండా నడవడం లేదా సైకిల్ తొక్కడం,1యూనిట్ విద్యుత్,ఒక లీటర్ నీళ్లు పొదుపు చేయడం ,ప్లాస్టిక్ ను తక్కువగా వాడటం ఇవన్నీ ఇవ్వడంలో భాగమే,పర్యావరణానికి మేలుచేయడమే.ఇలా ఎవరికి తోచిన విధంగా వారు,వీలున్న ప్రతి సందర్భం లో ఈ భూమికి మనం ఏమి ఇవ్వగలమో,ఎలా దీన్ని కాపాడుకోగలమో ఆలోచించాలి.భవిష్యత్ తరాలకు ఆకుపచ్చని పుడమిని అందించడానికి ఏమేం చేయగలమో ఆలోచించి,ప్రతి ఒక్కరూ భూమికి మనం తీసుకున్నవాటికి ప్రతిఫలంగా  తిరిగి ఇవ్వడం అలవాటు చేసుకుందాం.ఈ నూతన సంవత్సరం సందర్భంగా అలాంటి నిర్ణయాలు తీసుకుందాం....ఒద్దుల రవిశేఖర్.(https://m.facebook.com/story.php?story_fbid=3721138517945461&id=100001480499133)

పుస్తకాలు చదవడం వల్ల ప్రయోజనాలు

 The Benefits of Reading books పుస్తకాలు చదవడం వల్ల ప్రయోజనాలు. 

    1) A book is like a garden carried in the pocket.పుస్తకం జేబులో తీసుకువెళ్లగలిగే అందమైన తోట.                 

2) Exercises your brain.మెదడు కు వ్యాయామం కల్పిస్తుంది.              

 3)Provides knowledge and information.జ్ఞానాన్ని సమాచారాన్ని అందిస్తుంది.                                   

  4)Books are a good topic if conversation. సంభాషించుకోవడానికి పుస్తకాలు మంచి వనరులు.        

  5)Reduces stress,put you in a better mood.ఒత్తిడిని తగ్గించి ,మంచి మానసిక స్థితినిస్తాయి                                       

6)better writing skills .మంచి లేఖనా నైపుణ్యాలనులను కలిగిస్తాయి.          

7)Great and free entertainment.ఉచితంగా గొప్ప ఆహ్లాదాన్నిస్తాయి.                                         8) Improves concentration and focus. దృష్టిని,ఏకాగ్రతను మెరుగుపరుస్తాయి.

9)Develops creativity .సృజనాత్మకతను పెంపొందిస్తాయి.                                        

10) Enriches the language and vocabulary.భాషను,పదజాలాన్ని అభివృద్ధి చేస్తాయి.                                       

  11)Good for memory.మంచి జ్ఞాపకశక్తి నిస్తాయి.                                                  

  12) Books pose questions to stimulate further reflection .పుస్తకాలు ప్రశ్నించడం నేర్పుతాయి.         

  13)Introduces to the unknown fantasy world.అగోచరమైన ఊహా ప్రపంచాన్ని పరిచయం చేస్తాయి.                

 14) Increases your ability to empathize with others .ఇతరుల పట్ల మన సహానుభూతి సామర్ధ్యాన్ని పెంచుతాయి.            సేకరణ ,అనువాదం:ఒద్దుల రవిశేఖర్.

జీవితం... స్టీవ్ జాబ్స్

 మీరు పెద్దయ్యాక, ప్రపంచం అలాగే ఉంటుందని, మీరు చేయాల్సిందల్లా దాని పరిధుల్లోపల జీవితాన్ని గడపడం మాత్రమేనని చెబుతారు. ఆ మాటలు విని ఆ గోడలు బద్దలు కొట్టడానికి ప్రయత్నించకండి. 


మంచి కుటుంబ జీవితాన్ని గడపడానికి ప్రయత్నించండి, ఆనందించండి, డబ్బు ఆదా చేయండి. అయితే అది చాలా పరిమిత జీవితం.


మీరు ఒక సింపుల్ విషయం తెలుసుకున్న తర్వాత జీవితం చాలా విస్తృతంగా ఉంటుందని అర్థమవుతుంది.


అదేంటంటే... మీరు జీవితం అని పిలిచే ప్రతిదీ మీ చుట్టూ ఉన్న మీలాంటి వ్యక్తులే రూపొందించారు. వారు మీకంటే తెలివైన వారేం కాదు. మీరు దానిని మార్చవచ్చు, ప్రభావితం చేయవచ్చు... ఈ విషయం అర్థమైతే, మీరు మళ్లీ అదేలా ఉండరు.


 -స్టీవ్ జాబ్స్


When you grow up, you tend to get told that the world is the way it is and your life is just to live your life inside the world. 


Try not to bash into the walls too much. Try to have a nice family life, have fun, save money. That’s a very limited life. 


Life can be much broader once you discover one simple fact. 


That is—everything around you that you call life was made up by people no smarter than you. And you can change it. You can influence it.... Once you learn that, you’ll never be the same again. 


—STEVE JOBS

11.పాటల పూదోట

 నేను ఐష్టంగా వినే పాటలు 

(https://youtu.be/WcYBoOuqG90) తేనియ లాంటి తేట తెనుగు లో సిరివెన్నెల కురిపించిన ఈ కమ్మని గీతాన్ని చిత్ర తన గొంతులో అమృతాన్ని కలిపి పాడింది. శోభా శంకర్ జత కలువగా ప్రకృతి ని తన సంగీతంతో ముడి వేసి రెహమాన్ అందించిన దృశ్య కావ్యం విని తరించండి.

Friday 8 September 2023

10. పాటల పూదోట

 

మిక్కీ జె మేయర్ versatail composer అనుకున్నంత పేరు రాలేదు కాని. శ్యాం సింగరా య్ ఆయన సృజన. ఈ గీతాన్ని చైత్ర అనురాగ్ కులకర్ణి గానం చేశారు.ప్రకృతి ని సంగీతంలో కలిపి వీనుల విందు చేసిన ఈ గీతాన్ని earphone తో వింటూ చూడండి.(https://youtu.be/rTW7Yb5eRxA)

9. పాటల పూదోట

 సిద్ శ్రీ రామ్ తో ప్రసన్న చేసిన మరో ప్రయోగం ఈ గీతం. శ్రీరామ్ గొంతులో ఎన్ని variations ఉన్నాయో అన్నీ పలికించాడు. అలలై లేచి మెరుపై మెరిసి మన ఎదలో అలజడి లేపుతుంది ఈ సంగీతం. Ear phones పెట్టుకుని, కళ్ళుమూసుకొని వింటే ఎన్ని రకాల instruments వాడారో ఆశ్చర్య మేస్తుంది. చూస్తూ మరోసారి వినండి. జనని కూడా సిద్ తో పోటీ పడింది. ఈ వారం మీ కోసం.(https://youtu.be/t60uDwyxzWQ)

8. పాటల పూదోట

 గోవింద్ సరళ మైన సంగీతానికి ప్రదీప్ గళం మనల్ని ఆలోచింప చేస్తుంది. ఒంటరి తనం నుండి....... ఏకాంతం లోకి ప్రయాణం. సాహిత్యాన్ని అర్ధం చేసుకుంటూ వినండి. ఒంటరి గా వస్తాం ఒంటరిగానే వెడతాం నడుమ జరిగేదంతా మనసుకు పట్టించుకోకుండా ఏకాంత స్థితి లోకి వెళ్ళడానికి ప్రకృతి... సంగీతాన్ని తోడు చేయాలి.(https://youtu.be/2a34XyiZO14)

7. పాటల పూదోట

 

కాలభైరవ అనే singer ఉన్నాడని ఈ పాట విన్నాకే తెలిసింది.ఇంత వరకు వినని అదో ప్రత్యేక స్వరం.భావోద్వేగాలు,ఆవేదన,ఆర్థ్రత తన గళం నుండి జాలువారుతుంటే మనమూ అందులో లీనమౌతాం. సుద్దాల అశోక్ తేజ గీతానికి కీరవాణి సంగీతం మనల్ని కట్టిపడేస్తుంది. పాట చూస్తూ ఒక సారి, చూడకుండా ear phones తో మరో సారి వినండి. నిన్న ప్రకటించిన జాతీయ సినిమా అవార్డులలో ఉత్తమ గాయకుడు అవార్డు కాలభైరవ నే వరించింది.(https://youtu.be/2VmgpHUld8o?si=jjJp1fxdG_WR0L1m)

మంచి -చెడు

 మంచి, చెడులను బుద్ధి విశ్లేషి స్తుంది.కాని ఒక్కోసారి అది చెడును మంచిగా మంచిని చెడుగా పొరబడుతుంది.తెలుసుకునేలోగా జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.                                     

చెడును మంచిగా పొరబడినప్పుడు తీవ్ర వేదన నష్టం కలుగుతాయి. మంచిని చెడుగా భావిస్తే మరపురాని గాయమై జీవితాంతం బాధిస్తుంది. ఒద్దుల రవిశేఖర్ 

6.పాటల పూదోట

 

మణిరత్నం "PS 1" సినిమా చూసారా. అందులో రెహమాన్ స్వరపరచిన గీతం "అంతర నంది"గొంతులో నుండి ప్రవహిస్తూ మన హృదయాన్ని తాకుతుంది. ఆ పాటను సముద్రం నేపథ్యంలో ఒక దృశ్య కావ్యం గా మలిచారు మణిరత్నం.(https://youtu.be/bh6et8Ko200)

5)పాటల పూదోట

 

పాట వినడం కూడా ఓ కళే అనేలా చేసిన సంగీత మాంత్రికుడు రెహమాన్. శోభా శంకర్ పాడిన ఈ గీతం headphones పెట్టుకొని వినండి. Background లో రెహమాన్ వాడే instruments మనసు కెంత హాయినిస్తాయో తెలుస్తుంది. ఈ weekend song వినండి మరి.(https://youtu.be/_16dW-ohq54)

4)పాటల పూదోట

 RHTDM సినిమా లోని ఈ Rain theme song ని కరణ్ బీర్ remix చేసిన తీరు superb. Ladies chorus తో పాటు బీట్ mix అవుతూ thrill చేస్తూ ఉంటే flute add అవడం తో మరింత melodious గా మారింది.earphone తో కళ్ళు మూసుకుని వినడం మరువకండి. (https://youtu.be/5maPVXz2Czk?si=y6jGchldzTW-QhD7)

3)పాటల పూదోట

 

ప్రకృతిలో గడపటం, సంగీతం వినడం  మనసుకు ఒత్తిడి తగ్గించే దివ్యఔషధా లు.హృదయం సినిమాలో Hesham స్వరపరచిన ఈ గీతాన్ని విమల్,భద్ర మనల్ని అడవిలో ఉన్నామా అని feel అయ్యేలా పాడారు.మనోజ్ఞ మైన అడవి అందాలు సెలయేటి గలగలలు చూపు తిప్పు కోనివ్వవు. English subtitles చూస్తూ పాటను అర్థం చేసుకోండి.(https://youtu.be/lZL2K3ewRYM)

2) పాటల పూదోట


ప్రపంచ ధరిత్రీ దినోత్సవ సందర్భంగా అత్య ద్భుతమైన జయరాజ్ సాహిత్యం, మోహన్ అందించిన చక్కని సంగీతం,విజయ్ ఏసుదాస్(జేసుదాస్ కుమారుడు) అమృత స్వరంలో జాలువారిన ఈ 23 నిముషాల దీర్ఘ గీతాన్ని save చేసుకుని వినండి. మానవ జీవిత తాత్వికతను రంగరించి మనపై వెదచల్లిన పుప్పొడి పరిమళం ఈ గానం వినండి మరి.(https://youtu.be/j1Z0u4SkdwQ?si=yjOuOSB2CB3xD5XA)

Wednesday 6 September 2023

1)పాటల పూదోట


మానసిక ప్రశాంతత కు, ఆరోగ్యానికి సంగీతం ఉపకరిస్తుందని తెలిసిందే." నడక " లో మంచి పాటలు వింటుంటే ఆ అనుభూతే వేరు. అలాగే ఒంటరి తనాన్నుండి తప్పించు కోవాలన్నా సంగీతమే దివ్య ఔషధం.విభిన్న మైన పరిమళాలు విరబూసే సంగీతం వినడం అలవాటు చేసుకోండి. దైనందిన జీవిత సమస్యలనుండి కాస్త ఉపశమనం పొందండి

చిత్రం :వందేమాతరం 

పాడటం మొదలెట్టాక stage పై నేను పాడిన మొట్ట మొదటి పాట ఇది.ఈ సినిమా విడుదల కాకముందే Nellore లో శ్రీనివాస్ గారు law చేస్తూ ఉండేవారు. మేము ఆయన ఉండే room పైన ఉండేవాళ్ళం.అప్పుడే ఆయన పాటలు record చేసుకొని practice చేస్తూ ఉండే వాళ్ళు."వందేమాతరం" శ్రీనివాస్ స్వీయ సంగీతం లో ఆయనే పాడిన అర్థవంతమైన గీతం,డా. సినారె రచన.రాజశేఖర్ కి మొదటి సినిమా అనుకుంటా. ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులకు అద్దం పట్టినట్లు సినారె వ్రాసిన ఈ పాటను కృష్ణ గారు చక్కగా చిత్రించారు. వందేమాతరం లోని ప్రతి వాక్యానికి అప్పటి పరిస్థితులను అన్వ యించి వ్రాయగా శ్రీనివాస్ తనదైన గంభీరమైన విలక్షణ మైన గొంతుతో అద్భుతం గా పాడారు. అప్పటినుండి ఆయనకు "వందేమాతరం శ్రీనివాస్ అనే పేరు స్థిర పడింది."దర్శకుడు T. కృష్ణ. (https://youtu.be/DICYKmHXbl0?si=Zw5H-RLaolBghS1d)

Tuesday 6 June 2023

ఆత్మహత్య లు వద్దు.

 NEET లో MBBS SEAT రాకున్నా, Biotechnology, Bioinformatics,Biomedical engineering వంటి మంచి ఉద్యోగ అవకాశాలున్న courses లో చేరవచ్చు.నిరాశతో ఆత్మహత్యలకు పాల్పడవద్దు.జీవితం విలువైనది.తల్లిదండ్రులారా పిల్లలపై మీ ఆశలను రుద్దవద్దు!వారికిష్టమున్న చదువులు చదవనీయండి,మంచి ర్యాంకులు రాకున్నా వారిని ఏమీ అనవద్దు.ఏదో ఒక రంగం లో వారు ఎదుగుతారు.మీ బిడ్డల ప్రాణాల కంటే చదువులు,ర్యాంకులు ఎక్కువేం కాదు కదా!ఈ విషయం తీవ్రంగా ఆలోచించండి.అభివృద్ధి చెందిన దేశాల్లో ఎక్కడా ఇలా లేదు!డాక్టర్,ఇంజినీర్ కాకుంటే భూకంపాలేమీ రావు.మిగతా వారి విజయాలను మీ పిల్లలతో పోల్చవద్దు.ఇంటర్ తర్వాత విభిన్న రంగాలలో రాణించే అవకాశాలున్నాయి.విద్యార్థులు,తల్లిదండ్రులు,విద్యావేత్తలు,పౌరసమాజం,ప్రభుత్వాలు ఈ సమస్య తీవ్రతను అర్థం చేసుకోండి,పరిష్కార మార్గాలు ఆలోచించండి.చదువులు ఆనందాన్ని ఇవ్వాలిగాని ఆత్మహత్యలకు పురికొల్పకూడదు...................ఒద్దుల రవిశేఖర్

Saturday 3 June 2023

ప్రపంచ సైకిల్ దినోత్సవం

 ప్రపంచ సైకిల్ దినోత్సవ శుభాకాంక్షలు

చిన్నప్పుడు మామయ్య వాడిన cycle ఉండేది. Cycle తొక్కేవాళ్ళని చూస్తే అది ఒక అద్భుతం గా అనిపించేది. పడిపోకుండా ఎలా తొక్కుతారా అనిపించేది.ఇంట్లో hero cycle చాలా ఎత్తుగా ఉండేది.6,7 తరగతుల్లో అనుకుంటా cycle నేర్చుకుందాం అని మిత్రుల సహకారం తో ప్రయత్నాలు మొదలెట్టాను. ఇద్దరు అటొకరు, ఇటొకరు పట్టుకుంటే కత్తెర తొక్కడం (seat పైన ఎక్కకుండా )అలవాటు చేసుకున్నా. క్రమంగా మిత్రులు పట్టు కోకున్నా తొక్కడం, balance చేసుకోవడం అలవాటయ్యింది. మరి seat ఎక్కి తొక్కాలికదా. మళ్ళీ మిత్రులు పట్టుకుంటే seat ఎక్కి కూర్చుని తొక్కుకుంటూ వెళ్లే వాన్ని ఆపాలంటే ఏదయినా చిన్న బ్రిడ్జి (mori) దగ్గరికెళ్లి దిగేవాన్ని. ఇక చివరి అంకం సొంతంగా seat ఎక్కడం ఇది నేర్చుకోవడానికి చాలా ప్రయత్నాలు. క్రింద పడటం, మళ్ళీ మళ్ళీ ప్రయత్నించడం...... ఇలా చివరికి cycle నేర్చే సుకున్నా. ఇహ 10 వతరగతి దోర్నాల చదివే రోజుల్లో రోజు వెళ్లి రావడం 16 km cycle తొక్కేవాడిని. తరువాత మార్కాపురం లో inter, చదివేటప్పుడు 2 సంవ త్స రాలు college కి cycle పై వెళ్లి వచ్చే వాళ్ళం నేను Jay కలిసి. ఇహ డిగ్రీ nellore సర్వో దయాలో చేరినప్పుడు cycle ప్రయాణమే.cycle పై nellore అంతా తిరిగే వాన్ని. ఇహ teacher గా మార్కాపురం లో చేరాక కూడా కొంత కాలం cycle వాడాను. ఇహ గత 6,7 ఏండ్ల నుండి ఆరోగ్యం కోసం cycle తొక్కడం చేస్తున్నాను. ఇలా cycle నా జీవితం లో విడదీయరాని భాగం అయింది. ఇహ cycle తొక్కడం వల్ల ప్రయోజనాలు ఇంకో post లో వ్రాస్తాను.... ఒద్దుల రవిశేఖర్ 

Wednesday 31 May 2023

దేవనహళ్లికోట

 దేవనహళ్లి కోట (Devanahalli Fort):బెంగళూరు కు సమీపంలో ని 

చారిత్రక ప్రాధాన్యత ఉన్న దేవనహళ్లి కోట చూద్దామని jay అనగానే ఆసక్తిగా అనిపించి చూడ్డానికి బయలు దేరాం. కోట ప్రవేశ ద్వారం చెక్కు చెదరకుండా అలాగే ఉంది. కోట లోపలికెళ్లి చూస్తే ఎక్కడా కోట లాంటి నిర్మాణం కనపల్లేదు.అన్ని సాధారణ ఇల్లే కనిపించాయి. కాని కోట గోడ మాత్రమే విశాలం గా చాలా పొడవుగా నిర్మితమై ఉంది. అక్కడున్న వివరాల ప్రకారం 1501 లో మట్టి కోట గా మల్ల బెరే గౌడ కట్టారు.ఈయన బెంగళూరు నగర నిర్మాత కెంపేగౌడ పూర్వీకుడు. ఈ మట్టికోట క్రమంగా చేతులు మారి 1749 లో హైదర్ అలీ చేతికి వచ్చింది. దీన్ని ఈయన పునర్నిర్మించాడు. ఈయన మైసూరు రాజు వడయార్ అశ్విక దళం లో పనిచేసే వారు. హైదర్ అలీ కొడుకే టిప్పుసుల్తాన్. దేవనహళ్లి లోనే టిప్పు సుల్తాన్ జన్మించారు. తరువాత మైసూర్ రాజ్యాన్ని హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ పరిపాలించారు.

             కోట గోడ పై  నడుస్తూ గమనిస్తే  వృత్తాకారంగా గోడ మాత్రమే ఉంది. గోడ కు ఒక వైపు పెద్ద చెరువు ఉంది. కోట గోడకు రక్షణ గా నిలిచే సైన్యం తుపాకులు ఎక్కుపెట్టడానికి గోడకు రంధ్రాలు చేశారు. ఒకే రంధ్రం గుండా 4 తుపాకులు ఎక్కుపెట్టేలా లోపల 4 వైపులా  4 చిన్నరంధ్రాలు చేశారు. ఫోటోలు చూస్తే మీకే అర్ధమవుతుంది. కోట గోడ నిర్మాణ శైలి. నంది hills ఇక్కడికి దగ్గరలోనే ఉంది. నంది కొండలు టిప్పు సుల్తాన్ వేసవి విడిది గా ఉపయోగించుకునే వారట.


Wednesday 17 May 2023

నందికొండలు (Nandi Hills) బెంగుళూరు సందర్శన.

 భానుడి భగ భగల నుండి కాస్తంత తప్పించు కోవటానికి బెంగుళూరు వెళ్లాను. ఆంధ్రా లో 45 C ఉంటే అక్కడ 34 C మాత్రమే ఉంది.ఇక దగ్గరిలో చూడదగ్గ ప్రాంతం ఏదయినా ఉందా అని ఆలోచిస్తే ఇంతకు ముందు మా అబ్బాయి స్నేహిత్ వాళ్ళ మిత్రులతో నంది కొండ (Nandi Hills ) చాలా బాగుంటుంది అని చెప్పాడు. మిత్రుడు Jay తో చెప్పగా ఆదివారం ఉదయాన్నే వెడదామన్నాడు. Car లో బయలు దేరాం. కొన్ని వందల cars, bikes లో అదేదో ఉత్సవాన్ని చూట్టానికన్నట్టు ఉదయం 4 గంటల నుండే బయలు దేరారు జనం.పైకి వెళ్ళడానికి రావడానికి ఒకటే దారి. వేరు వేరు గా ఉంటే ప్రజల కెంతో సౌకర్యం. Parking చేసి ticket కొనుక్కొని పైకి వెళ్ళగానే (కొద్దిగా కొండ ఎక్కాలి ) పలకరించాయి మంచు తుంపరలు. చల్లటి గాలి దట్టమైన పొగమంచు తెరలు కట్టి నట్లు, మంచు కరిగి టప్ టప్ శబ్దం చేస్తూ పెద్ద పెద్ద చినుకులు. మంచు తెరల మధ్య మనుషులు కనబడటం లేదు.అక్కడి వాతావరణాన్ని వచ్చిన వేలాది మంది తన్మ యత్వం చెందుతూ ఆస్వాది స్తుంటే ప్రకృతి మనిషి కెంత మంచి స్నేహితుడో అర్ధమవుతుంది.దీన్ని నందిహిల్స్ లేదా నంది దుర్గ్ అంటారు. టిప్పు సుల్తాన్ వేసవి విడిదిగా దీన్ని ఉపయోగించుకున్నాడు.ఇది బెంగుళూరు వాసులకు వారాంతపు విడిది గా మారింది.సిటీ నుండి 60km దూరంలో ఉంటుంది. చిక్ బళ్ళాపూర్ కు 10km దూరం లో ఉంటుంది.భూమికి 1478 మీ ఎత్తులో చిక్ బళ్ళాపూర్ జిల్లాలో (బెంగుళూరు.... హైదరాబాద్, అనంతపూర్ రూట్ లో )ఉంటుంది.చాలా దర్శనీయ స్థలాలు ఉన్నాయి గాని చెప్పే guides ఎవరూ లేరు. జనం అంతా 6 గంటలకల్లా అక్కడకు చేరుకున్నారు సూర్యోదయం చూట్టానికి. వారి కోలాహలాన్ని enjoy చేస్తూ మేము ఎదురు చూస్తున్నాం. విపరీతమైన మంచు కురవడం వల్ల కాస్త ఆలస్యంగా సూర్యుడు మబ్బుల మాటున దోబూచులాడాడు.కేరింతలతో జనం ఆ దృశ్యాలను కెమెరాల్లో బంధిస్తున్నారు.సూర్యోదయం అనంతరం కొండపై తిరుగుతూ 11 వ శతాబ్దం లో చోలుల కాలంలో నిర్మితమయిన 10 అడుగుల పొడవు,6 అడుగుల ఎత్తుగల నంది విగ్రహాన్ని చూసాం. అందుకే దీనికి నంది hills అని పేరు వచ్చిందేమో.ప్రక్కనే రాతి లో సహజంగా ఏర్పడ్డ గుహ చూసాం. దీన్ని బ్రహ్మా శ్రమం అంటారు. ఇక్కడ ఋషులు తపస్సు చేసుకునే వారట.SAARC SUMMIT జరిగిన భవనాన్ని చూసాం చెట్ల కొమ్మల చాటున తొంగి చూస్తున్న సూర్యుడిని చూస్తూ మంచు దుప్పటిని కప్పుకున్న చెట్లను పలకరిస్తూ,ఆకుల స్పర్శ తో గాలి గాంధర్వమై వీస్తున్న వేళ... పరవశించిన కొమ్మలు రా రమ్మని ఆహ్వానిస్తున్న దృశ్య కావ్యాలను చదువుతూ తనివి తీరా ప్రకృతి లో పరవశించి పోయాం మార్గ మధ్యం లో ద్రాక్ష తోటను చూసాం. మంచి అనుభూతులను మూట గట్టుకుని తిరుగు పయనమయ్యాము..(https://www.thrillophilia.com/attractions/nandi-hills)(https://en.m.wikipedia.org/wiki/Nandi_Hills,_India)

Saturday 15 April 2023

చరిత్ర శకలాలు.

 చరిత్ర శకలాలు

రచయిత :ఈమని శివనాగిరెడ్డి

పుస్తక పరిచయం :ఒద్దుల రవిశేఖర్

చరిత్ర ఎప్పుడూ ఆసక్తికరమే.ఏ చరిత్ర అయినా ఆ కాలం లో ఉన్నవారు పుస్తకం రూపం లో వ్రాస్తే అది చదివి మనం ఆయాకాలాలలో ఏం జరిగిందో తెలుసుకోవచ్చు. ప్రపంచంలోమొదటి సారిగా 5500 సం. క్రితం మెసపటోమియా(ప్రస్తుత ఇరాక్ )లో లిపి వాడారు.అంటే క్రీస్తు పూర్వం 3500 సం నుండి మాత్రమే జరిగిన సంఘటనలను వ్రాయడానికి భాష మొదలయిందన్న మాట. అన్ని చోట్ల ఒకే సారి భాష అందుబాటులోకి రాలేదు. మన దేశం లో పరిపాలించిన రాజులు వేసిన శాసనాల ద్వారా అప్పటి విషయాలు తెలుస్తున్నాయి.ఇంకా వారు నిర్మించిన దేవాలయాలు,అప్పటి ప్రజలు వాడిన వస్తువులు,ఇలా ఎన్నో సాక్ష్యాలుగా సేకరించి ఆయా కాలాలలో ఏం జరిగిందో ప్రముఖ స్థపతి ఈమని శివనాగిరెడ్డి గారు "చరిత్ర శకలాలు" అన్న పుస్తకం లో తెలుగువారి చరిత్రను వివరించారు. ప్రతి అంశం ఆధారాలతో సహా వ్రాసిన తీరు ఆకట్టుకుంటుంది. మన మనో ఫలకం పై ఆ కాలాలు ప్రత్యక్ష మవుతాయి.2000 సం. రాల క్రితమే శాతవాహన చక్రవర్తి తెలుగు నేలను ఏలిన దగ్గరనుండి,చైనాలో విశేష ప్రాచుర్యం ఉన్న జెన్ గురువు బోధి ధర్ముడు తెలుగు వాడేనని,74,000 ఏళ్ల క్రితం ఇండో నేషియా లోని తోబా అగ్ని పర్వతం పేలడం వలన ఎగజిమ్మిన లావా,బూడిద కర్నూల్ జిల్లా జ్వాలా పురం దాకా విస్తరించిందని అక్కడ ఆదిమానవులు వాడిన రాతి పనిముట్లు దొరికాయని,బుద్ధుని 'దంత 'పురం,తెలుంగాణపురం,తెలుగు నేలపై రోమన్ నాణాలు, చేజారిన కోహినూర్, నల్గొండ లో పడిన ఉల్కా శకలం, శ్రీశైల చరిత్ర ఇలా ఎన్నో ఆసక్తి గొలిపే చరిత్ర విషయాలు మనకు అందించిన తీరు ప్రశంస నీయం. చరిత్ర పట్ల ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరు చదువదగ్గ పుస్తకం ఈ "చరిత్ర శకలాలు ".

Thursday 6 April 2023

దార్శనికుడు (Scientist గురించి )

 అతడు వర్తమానం లో చరిస్తున్న భవిష్యత్ దార్శనికుడు

సృష్టి రహస్యాల్ని ఛేదిస్తూ సాగే అలుపెరుగని యాత్రికుడు

అతడి చేతులు

దిగ్ దిగంతాలు దాటుకుంటూ

అనంతాకాశపు ఆవలి అంచును సైతం అంది పుచ్చుకోగలవు

అతడి చూపులు

సాగర గర్భాల్ని చీల్చుకుంటూ

పరమాణు కేంద్రకాల్ని పటాపంచలు చేసుకుంటూ చొచ్చుకు పోగలవు

అతడి అడుగులు నాటికల్ మైళ్లంత విస్త్రతంగా ఉందనుకునేంత లోనే

నానో మీటర్లా సూక్ష్మీకరించుకుంటూ కాంతి సం వత్సరం లా దూసుకుపోతాయి

అతడి హృదయం వయలిన్ తంత్రులకు లయబద్ధంగా ఓ వైపు స్పందిస్తూనే

మరో వైపు వైరస్ ల వైచిత్రి ని విశ్లేషిస్తూ జీవ వైవిధ్యాన్ని ఆవిష్కరిస్తుంది

అతడి మనసు నీతో నాతో సంచరిస్తూనే

సరికొత్త సంబంధాలను సృజించడం లో సంగమిస్తుంది

అనాది నుండి అతనొక నిరంతర శ్రామికుడు

నిత్య చైతన్య స్ఫూర్తి

మానవాళి సౌఖ్యం కోసం పరిశోధనే ప్రాణంగా

ప్రజ్వలిస్తున్న విజ్ఞాన వీచిక

అతడే ఓ కెప్లర్... ఓ జన్నర్...ఓ రామన్... ఎందరెందరో

 (ఆంధ్రప్రదేశ్ 9 వ తరగతి భౌతిక శాస్త్రము వెనుక అట్ట లోపలిభాగం లోని కవిత. రచయిత పేరు లేదు. వారికి ధన్యవాదాలు )


Wednesday 5 April 2023

అమ్మ....నాన్న.....ఓ జీనియస్.


రచయిత :వేణు భగవాన్

పుస్తక పరిచయం : ఒద్దుల రవిశేఖర్

పిల్లల పెంపకం ఎప్పటికీ ఒక సవాలే. మన అమ్మా నాన్న మనల్ని పెంచినట్టు మన పిల్లల్ని పెంచుతామంటే కుదరదు.21 వ శతాబ్దపు parenting చాలా challenging గా ఉంటుంది. ఈ విషయం మీద ఈ పుస్తకం అంతా నడుస్తుంది. చక్కటి కొటేషన్స్ సేకరించి తనదైన అన్వయంతో ఒకటి, రెండు పేజీ లలోనే ఒక అంశాన్ని ముగించడం బాగుంది.ప్రస్తుత చదువులు, పిల్లలు ఎలా ఉన్నారో వివరిస్తూ ఈ పోటీ ప్రపంచం లో నిలదొక్కుకోవాలంటే ఏ రకమైన నైపుణ్యాలు ఉండాలి అన్న విషయాలు విపులంగా చర్చించారు. కెరీర్ అంటే, విజయం అంటే చక్కని నిర్వచనాలు ఇచ్చారు.అర్థవంతమైన బొమ్మలతో (ven diagram ) కూడిన సమాచారం మరింత ఆకట్టుకుంటుంది.ఖలీల్ జీబ్రాన్ కవిత ఆలోచింపజేస్తుంది.ఇదంతా విషయ సూచిక. పుస్తకం మొత్తం 10 chapters గా వర్గీకరించారు. 1) పిల్లలు గొప్ప మానవులుగా ఎదగాలనుకుంటే! ఇందులో అబ్రహాం లింకన్ ఉత్తరం మనల్ని కదిలిస్తుంది. బాల్యాన్ని ఆట పాటలతో ఆనందంగా గడపాలంటాడు. ఆ స్వేచ్చ లోనే పిల్లల్లో సృజనాత్మకత వెల్లివిరుస్తుంది. అది మానవ వనరుల్లో అత్యంత విలువైనది అంటారు. పిల్లలకు ప్రశ్నించే హక్కు, కలలు కనే స్వేచ్ఛ ఉండాలంటారు 2)సరయిన విద్యాలయాలను ఎంచుకోండి.ఇందులో పిల్లలని ప్రశంసించాలని, ప్రతి శిశువు ఓ జీనియస్ అని చెబుతారు. స్టీవ్ జాబ్స్ కవిత భావి జీనియస్ లు ఎలా ఉంటారో చెబుతుంది. తెలివి తేటలు (multiple intelligences) 10 రకాలుగా ఉంటాయని హోవార్డ్ గార్డనర్ కనుగొన్నారు. పిల్లల్లో వాటిని కనుగొనాలంటారు. పిల్లల్లో 5 రకాల minds అభివృద్ధి చేయాలట.3)పిల్లల్ని ఎలా పెంచాలి?4) గొప్ప మానవులుగా తీర్చి దిద్దండి.5) పిల్లల హృదయాలను గెలవాలంటే? 6) సరయిన సంభాషణ 7) Family managment 8) స్ఫూర్తి కలిగించండి 9) character building 10) ఒత్తిడిని జయించండి 

ఇలా 10 విభిన్న మైన topic లతో తల్లిదండ్రులను ఆలోచింప జేసే విధంగా వ్రాయబడిన ఈ పుస్తకం ఉపాధ్యాయులు కూడా తప్పనిసరిగా చదవదగ్గది.


Wednesday 8 March 2023

కొండవీడు కోట


సెలవొస్తే ఏదయినా ప్రాంతం చూసే అవకాశమొస్తే వెళ్లడమే. అలా విజయవాడ వస్తావా అని ఆనంద్ అనగానే ఏంటి కార్యక్రమం అంటే మార్కాపురం ప్రాంతం లో 10 వ తరగతి విద్యార్థులకు అందించే "వాసవి club అమృతాహార సేవ " ను విజయవాడ వాసవి క్లబ్ వారు కూడా అక్కడ  కూడా అందించేందుకు వారిని motivate చేయడానికి అన్నాడు. సరే మంచిదే కదా!మధ్యాహ్నం వీలయితే భవానీ ద్వీపమో, కొండవీడు కోట గాని చూద్దా మనుకున్నాం.మధ్యాహ్నం meeting అయ్యాక 3:00 కల్లా విజయవాడ లో బయలు దేరాం. మిత్రుడు HM సుధాకర్ car నడుపుతుంటే నేను ఆనంద్, పిచ్చిరావు 5 గంటలకల్లా కోట పైకి చేరుకున్నాం.

కొండ పైకి 3 ఏళ్ల క్రితం తారు రోడ్డు వేశారు. మలుపులతో కూడిన ఘాట్ రోడ్డు. ఆ ప్రాంతమంతా అటవీశాఖ పరిధిలో ఉంది. కొండపైన చిన్న పార్క్ అభివృద్ధి చేశారు. లక్ష్మి నరసింహస్వామి ఆలయాన్ని పునరుద్దరిస్తున్నారు. ప్రక్కనే చిన్న మసీదు ఉంది. దానికి ముందు అనవేమారెడ్డి విగ్రహం ఉంది. చూపరులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ప్రక్కనే వేమన విగ్రహం ఉంది. వెనుకగా రంగసాని మంటపం ఉంది. అది ఎక్కి చూస్తే ఒక వైపు కోట గోడ కనిపిస్తుంది.14 వ శతాబ్దం లో రెడ్దిరాజులు అద్దంకి నుండి రాజధాని ని ఈ ప్రాంతానికి మార్చారు. ప్రోలయ వేమారెడ్డి దీనిని నిర్మించారు.1328 నుండి 1482 వరకు రెడ్డి రాజులు కొండవీడును రాజధాని గా చేసుకుని శ్రీశైలం నుండి సింహాచలం వరకు పరిపాలించారు. తరువాత గజపతులు, కృష్ణ దేవరాయలు(1516), కులీ కుతుబ్ షా (1579), ఫ్రెంచ్ వారు (1752), బ్రిటిష్ వారు (1788) వరుసగా ఈ కోటను స్వాధీనం చేసుకుని పరిపాలించారు. గుంటూరు కు 16 km దూరం లో ఫిరంగి పురం దగ్గరిలో ఉంటుంది.భూమికి 1700 అడుగుల ఎత్తులో ఉంటాయి ఇక్కడి కొండలు. ఆంధ్రప్రదేశ్ TOURISM Department వారు ఇక్కడ resort లాగా అభివృద్ధి చేసి వసతి కల్పిస్తే చక్కటి పర్యాటక ప్రాంతమౌతుంది. అక్కడ గడిపింది కొద్దిసేపే అయినా "ఇచ్చోటనే కదా భూములేలు రాజన్యుల అధికార ముద్రలు అంతరించి పోయే. ... గుర్రం జాషువా పద్యం గుర్తుకు వచ్చింది. ఈ ప్రాంతమంతా ఒకప్పుడు రాజులు రాణులతో కళ కళ లాడుతూ ఉండి ఉంటుంది కదా, ఎన్నో యుద్దాలకు ఈ కోట గోడలు సాక్షీ భూతాలుగా నిలిచాయి కదా అనిపించింది.అంత గొప్ప కోట ఆనవాళ్లే మీ లేవు.

కొండకు దిగువన కొండవీడు museum ఉంది. అపురూపమైన చిత్రాలు, శిల్పాకళా సంపద ఇక్కడ భద్రపరిచారు. శ్రీశైలం రెడ్ల సత్రం వారు దీన్ని ఏర్పాటు చేశారు. కోట చూసి వచ్చిన తరువాత museum తప్పకుండా చూడండి.( https://en.m.wikipedia.org/wiki/Kondaveedu_Fort)

..........ఒద్దుల రవిశేఖర్.

Sunday 19 February 2023

సంగమేశ్వర సందర్శన

 ఎప్పటినుండో చూడాలని అనుకుంటున్న ప్రాంతం సంగమేశ్వరం. శివరాత్రి సందర్భంగా  వెళ్లడం జరిగింది. ఆత్మకూరు అటవీ ప్రాంతం ఎండలకేమో చెట్లు ఎక్కువగా ఎండిపోయి కనిపించాయి. దారంటా అటు ఇటు వెదురు విస్తారంగా గుబుర్లు గుబుర్లుగా పెరిగి కనువిందు చేస్తూ ఉంది.దోర్నాల దాటాక కొత్త పల్లి దగ్గర వెలుగొండ tunnels దాటిన తర్వాత అడవి మొదలవుతుంది.అడవి ప్రయాణం ఎప్పుడూ ఉత్సాహాన్నిస్తుంది. కొర్రపోలు,పెద్దమంతనాల,బైర్లూటి ఊర్లు దారిలో కనిపిస్తాయి.భైర్లూటి దగ్గర Jungle safari ని AP అటవీ శాఖ ఏర్పాటు చేసింది.ఇక్కడ రాత్రి బసకు ఏర్పాట్లు చేసారు.అడవిలో ఒక రోజు ఉండాలని ఉంది.చూడాలి ఎప్పుడు కుదురుతుందో.ఆత్మకూరుకు 40 కిమీ దూరం లో కృష్ణానదిలో సంగమేశ్వరం ఉంటుంది.శ్రీశైలం డాం పూర్తిగా నిండితే ఇక్కడ ఉన్న శివాలయం  నదీ గర్భంలో పూర్తిగా మునిగిపోతుంది. నీరు తగ్గిన తరువాత మరల ఫిబ్రవరి, మార్చి లోనే గుడి బయట పడుతుంది.గత సం.రం శివరాత్రి కి నీళ్ల నుండి గుడి బయట పడలేదట.గుడి చుట్టూ 3 వైపులా నది ఒక వైపు చిన్న కొండ ఉంటాయి. చిన్న పడవలు నదిలో తిరుగుతున్నాయి.గుడి చుట్టూ నది హారంలా ఉంది. కనుచూపు మేరలో నది మధ్యలో కొండలు ఉన్నాయి. పుణ్య క్షేత్రంతో పాటు చక్కని నదీ విహార కేంద్రంగా దీన్ని మలచవచ్చు. ఇంకా గుడి ఎదురుగా ఉన్న కొండ పరిసర ప్రాంతాలను AP tourism శాఖ చక్కని resort లు కట్టి ,ఉద్యానవనాలు అభివృద్ధి చేయవచ్చు. Tourism department వారు boat షికార్ కూడా ఏర్పాటు చేయవచ్చు. ఇక్కడకు కొద్ది దూరం లో నది అవతల తెలంగాణ లోకి పడవ ద్వారా వెళ్లొచ్చు. అక్కడే కేంద్రప్రభుత్వం నది పై ఒక వంతెన కట్టబోతుంది. తరువాత మార్గ మధ్యం లో కొలను భారతి ని సందర్శించాము. ఇది జ్ఞాన సరస్వతి ఆలయం. బాసర సంగీత సరస్వతి ఆలయమట.ఇక్కడ పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తారు.7 రకాల శివాలయాలు బంగారు వర్ణం తో మెరిసిపోతున్నాయి.3 వైపులా కొండలు ఉంటాయి.ప్రకృతి ఒడిలో ఉన్నట్లు ఉంది ఈ ప్రాంతం. చిన్న పిల్లలు వేదమంత్రాలు చదువుతున్నారిచ్చట. తరువాత ఆత్మకూరు నుండి నంద్యాల మార్గంలో అడవిలోకి 15 కి.మీ వెళ్ళాము.ఇక్కడ రుద్రకోడూరులో శివుడు కొలువై ఉన్నాడు.పూర్తిగా మట్టి రోడ్డు. ఎదురుగా వాహనాలు వస్తే తప్పుకో లేనంతటి దారి. కాని bus లు ట్రాక్టర్లు జీప్ లలో జనం విపరీతంగా వచ్చారు. అసలు ఈ దారిలో వెళ్లి తిరిగి రావడం అదృష్టమే. ట్రాఫిక్ జామ్ అయి ఇరుక్కుంటే ఇక అడవిలో జాగారమే.ప్రభుత్వం ఈ విషయమై ఆ లోచించి కొద్దిగా రోడ్డు వెడల్పు చేయాలి.దేవాలయం దగ్గర ఎత్తయిన చెట్లు పచ్చగా చిగురించి మరింత శోభనిస్తున్నాయి. ప్రక్కనే కొలనులో భక్తులు స్నాన మాచరిస్తున్నారు.ఆ ప్రాంతమంతా భక్తులతో కోలాహలంగా ఉంది.కాని దర్శనం దగ్గర విపరీతమైన రద్దీ. గర్భ గుడిలోకి చిన్న వాకిలి గుండా దర్శనం చేయిస్తున్నారు. ఏమాత్రం తొ క్కిసలాట జరిగినా ప్రాణాలకే ప్రమాదం. ఇక్కడ కూడా ఆలయానికి బంగారు వర్ణం అద్దారు. ఈ ప్రాంతమంతా పచ్చని చెట్లతో మనోహరంగా ఉంది.ఇంత అటవి లోపలికి భక్తులు రావడం సాహసమే.ప్రభుత్వం మరింత శ్రద్ధ వహించి రహదారి వెడల్పు చేసి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తిరుగు ప్రయాణం కూడా ట్రాఫిక్ జామ్ లతో సాగి బయటపడి ఊపిరి పీల్చుకున్నాము.పండుగ సమయంలోనే కాకుండా సంగమేశ్వరం,కొలను భారతి, రుద్ర కోడూరు విడిగా రాగలిగితే చక్కటి అనుభూతినిస్తాయి. తీర్ధ యాత్రలతో పాటు విహార యాత్రలుగా కూడా అందరు ఈ ప్రాంతాలను సందర్శించే లాగా చేయగలిగితే మరింత బాగుంటుంది. ప్రకృతి, అడవుల్లోకి ప్రయాణం మనల్ని మరింత ఉత్తేజితుల్ని చేస్తాయి. అందుకని వాటిప్రేరణ తో మన పరిసరాల్లో మొక్కలు నాటి పెంచి మన ఆరోగ్యాలు కాపాడుకోవడంతో పాటు భావి తరాలకు చక్కటి పరిసరాలను  అప్పగించవచ్చు. ప్రకృతిని కాపాడండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది....... ఒద్దుల రవిశేఖర్.

Thursday 2 February 2023

Jungle safari (Eco tourism )అటవీ సందర్శన

 

APNGC, AP అటవీ శాఖ ఆధ్వర్యంలో 40 మంది విద్యార్థినీ విద్యార్థులు,4 గురు ఉపాధ్యాయులు పత్రికా విలేఖరులు, అటవీ శాఖ అధికారులు సిబ్బంది పాల్గొన్న వీర్ల కొండ ట్రెక్కింగ్, జంగిల్ సఫారీ ఆనందో త్సా హాల మధ్య సాగింది. దోర్నాల అటవీ శాఖాధికారి      E. విశ్వేశ్వర రావు గారి ఆహ్వానం మేరకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, చెన్నారెడ్డి పల్లె ప్రధానోపాధ్యాయులు Y. శ్రీనివాసరావు, APNGC ప్రకాశం జిల్లా కోర్డినేటర్ M. సజీవరాజు, మార్కాపురం Cluster కోర్డినేటర్ ఒద్దుల రవిశేఖర్, మల్లిఖార్జున గార్ల ఆధ్వర్యం లో అటవీ సిబ్బంది తమ వాహనాల్లో అందరినీ మొదట ట్రెక్కింగ్ జరిగే కొండ వద్దకు తీసికెళ్లారు. నిలువెత్తు కొండను సునాయాసంగా ఎక్కి అక్కడ ఉన్న ఇనుప మంచె పై నుండి నల్లమల అందాలను తిలకించాము.తరువాత జంగిల్ సఫారీ కి వెళ్ళాము. FRO విశ్వేశ్వర రావు గారు అక్కడ ఏర్పాటు చేసిన Exhibition లో ఉన్న జంతువుల విశేషాలను వివరిస్తుంటే విద్యార్థులు ఎంతో ఆసక్తిగా విన్నారు.జంతువుల జీవన విధానం కూడా తెలుసుకోవాలి. పులి ఎలా మనకు ఎలా మేలు చేస్తుందో తెలిపారు. భారత దేశం లో పులుల అభయారణ్యాల్లో ఇది పెద్దది.అటవీ శాఖ వారు ఏర్పాటు చేసిన భోజనాలు చేసి 3 వాహనాల్లో అందరం జంగిల్ సఫారీ కి బయలు దేరాము. మాతో పాటు భారతదేశం సైకిల్ పై చూడాలని బయలు దేరిన ప్రవీణ్ కుమార్ కూడా కలిశారు. అడవిలో ప్రయాణం 14 కిమీ. పగటి పూట జంతువులు ఏమీ కనబడ లేదు.సాయంత్రం 5 తరువాత ఆహార సేకరణకు పులులు బయలు దేరతాయట. నెమలిని మాత్రం చూసాము. మధ్యలో పులి చెరువు ఆగి చూసాము.అక్కడ Solar motor ఏర్పాటు చేశారు.6 మంది అయితే ఒక trip వేస్తారట,₹2400 ticket.ఒక ఆహ్లాద కరమైన అనుభవాన్ని మూటగట్టుకొని తిరుగు ప్రయాణం అయ్యాము."Save tiger "అని ముద్రించిన tea shirt ను బహుకరించారు.APNGC, AP Forest department తో కలిసి మరిన్ని కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకున్నాము.Eco Tourism sites in NTSR  లను గురించి వివరించారు. Nallamala Jungle Safari ని చూడటానికి సంప్రదించండి : Ph:9154825778

Saturday 14 January 2023

ఆనంద సాగరం

 పుస్తకం: ఆనంద సాగరం (The book of joy కి సంక్షిప్తానువాదం )                                      మూలం :దలైలామా, డెస్మండ్ టుటు, డగ్లస్ అబ్రామ్స్, అనువాదం : రావెల సాంబశివరావు. పుస్తక పరిచయం:ఒద్దుల రవిశేఖర్  దలైలామా,డెస్మండ్ టుటు ల సంభాషణను దగ్లస్ అబ్రాహాం గ్రంధస్తం చేశారు.మతం విశ్వ జనీనమైనది కాదని విద్య సార్వ జనీనమైనదని  అందువలన విలువలు వ్యాప్తి చేయడానికి విద్య సాధనమని అన్నింటికంటే మానవతా వాదం ప్రధానమని ఇందులో వారి అభిప్రాయం. ఈ బాధామయ ప్రపంచం లో ఆనందాన్ని సాధ్యం చేసుకోవడం ఎలా అనే అంశం ఈ పుస్తకం యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ ఆనందాన్ని పొందడానికి ఉన్న అడ్డంకులు, ఆనందానికి ఆధారాల గురించి వారి లోతయిన సంభాషణ సాగుతుంది. మానసిక ఆనందం, మానవత ద్వారా ఐకమత్యాన్ని సాధించడం,ఆనంద సాధనలో ప్రేమ పాత్ర వంటి అంశాలు చర్చించారు. ఆనంద సాధనకు అవసరం అయిన 8 లక్షణాలు లోతుగా చర్చించ బడ్డాయి. ఇందులో 4 మేధోపరమయినవి :1)దృక్కోణం 2) నమ్రత 3)హాస్యం 4)ఆమోదం.4 లక్షణాలు హృదయ గతమైనవి1) క్షమాగుణం 2)కృతజ్ఞత 3) కరుణ 4)ఔదార్యం. ఈ పుస్తకం మానవీయ విలువల సృజనాత్మక క్రోడీకరణ. ఇతరుల కోసం జీవించడం లోనే నిజమైన ఆనందం ఇమిడి ఉంది అనేది ఈ పుస్తకం చివరి ప్రత్తిపాదన. మనుషులు శాంతి సంతోషాలతో జీవించడానికి ప్రేమ కరుణ అనురాగం మూలమని దలైలామా అంటారు. ఇందులోని ముఖ్య విషయాలు                                  *జీవితపు ప్రయోజనం ఆనందాన్వేషణే               * మనకు ఎక్కడ మిత్రులుంటే అదే మన దేశం, మనకు ఎక్కడ ప్రేమ లభిస్తే అదే మన కుటుంబం    .* స్వార్ధం బాధకు దారి తీస్తే ఇతరులమేలు కోరడం ఆనందాన్ని చేకూర్చుతుంది.            *ఆనందమయులు సమాజం లో కలిసి పోతూ సృజన కర్తలుగా ప్రేమమ యులుగా ఉంటారు.        * మనకు ఆనందాన్ని అందించేది ప్రసన్నత, స్నేహపూర్వక ప్రవర్తన                              *అసూయ మానసిక ప్రశాంతతను ధ్వంసం చేసి ఆనందాన్ని దూరం చేస్తుంది.                                * మరణం జీవితం లో ఒక భాగం. మరణం దగ్గరయ్యేకొద్ది ఆనందం  ఆనందం పొందటం అత్యుత్తమ మార్గం.                                            * ఈ గ్రహం మీద మనం అతిధులం. ఉన్నన్నాళ్ళు జీవితాన్ని తెలివిగా వెళ్ళబుచ్చాలి. ఈ ప్రపంచాన్ని అందరికి అనువుగా ఉండేట్లు చేయాలి.       *ఆనందం అనేది ఒక బహుమతి లేదా ప్రతిఫలం.  * మానవ జాతి మనుగడకు కరుణ మూలం          * ప్రపంచాన్ని మార్చటం అన్నది ప్రజలకు కరుణను అలవాటు చేయడం ద్వారామాత్రమే సాధ్యం