Sunday 19 February 2023

సంగమేశ్వర సందర్శన

 ఎప్పటినుండో చూడాలని అనుకుంటున్న ప్రాంతం సంగమేశ్వరం. శివరాత్రి సందర్భంగా  వెళ్లడం జరిగింది. ఆత్మకూరు అటవీ ప్రాంతం ఎండలకేమో చెట్లు ఎక్కువగా ఎండిపోయి కనిపించాయి. దారంటా అటు ఇటు వెదురు విస్తారంగా గుబుర్లు గుబుర్లుగా పెరిగి కనువిందు చేస్తూ ఉంది.దోర్నాల దాటాక కొత్త పల్లి దగ్గర వెలుగొండ tunnels దాటిన తర్వాత అడవి మొదలవుతుంది.అడవి ప్రయాణం ఎప్పుడూ ఉత్సాహాన్నిస్తుంది. కొర్రపోలు,పెద్దమంతనాల,బైర్లూటి ఊర్లు దారిలో కనిపిస్తాయి.భైర్లూటి దగ్గర Jungle safari ని AP అటవీ శాఖ ఏర్పాటు చేసింది.ఇక్కడ రాత్రి బసకు ఏర్పాట్లు చేసారు.అడవిలో ఒక రోజు ఉండాలని ఉంది.చూడాలి ఎప్పుడు కుదురుతుందో.ఆత్మకూరుకు 40 కిమీ దూరం లో కృష్ణానదిలో సంగమేశ్వరం ఉంటుంది.శ్రీశైలం డాం పూర్తిగా నిండితే ఇక్కడ ఉన్న శివాలయం  నదీ గర్భంలో పూర్తిగా మునిగిపోతుంది. నీరు తగ్గిన తరువాత మరల ఫిబ్రవరి, మార్చి లోనే గుడి బయట పడుతుంది.గత సం.రం శివరాత్రి కి నీళ్ల నుండి గుడి బయట పడలేదట.గుడి చుట్టూ 3 వైపులా నది ఒక వైపు చిన్న కొండ ఉంటాయి. చిన్న పడవలు నదిలో తిరుగుతున్నాయి.గుడి చుట్టూ నది హారంలా ఉంది. కనుచూపు మేరలో నది మధ్యలో కొండలు ఉన్నాయి. పుణ్య క్షేత్రంతో పాటు చక్కని నదీ విహార కేంద్రంగా దీన్ని మలచవచ్చు. ఇంకా గుడి ఎదురుగా ఉన్న కొండ పరిసర ప్రాంతాలను AP tourism శాఖ చక్కని resort లు కట్టి ,ఉద్యానవనాలు అభివృద్ధి చేయవచ్చు. Tourism department వారు boat షికార్ కూడా ఏర్పాటు చేయవచ్చు. ఇక్కడకు కొద్ది దూరం లో నది అవతల తెలంగాణ లోకి పడవ ద్వారా వెళ్లొచ్చు. అక్కడే కేంద్రప్రభుత్వం నది పై ఒక వంతెన కట్టబోతుంది. తరువాత మార్గ మధ్యం లో కొలను భారతి ని సందర్శించాము. ఇది జ్ఞాన సరస్వతి ఆలయం. బాసర సంగీత సరస్వతి ఆలయమట.ఇక్కడ పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తారు.7 రకాల శివాలయాలు బంగారు వర్ణం తో మెరిసిపోతున్నాయి.3 వైపులా కొండలు ఉంటాయి.ప్రకృతి ఒడిలో ఉన్నట్లు ఉంది ఈ ప్రాంతం. చిన్న పిల్లలు వేదమంత్రాలు చదువుతున్నారిచ్చట. తరువాత ఆత్మకూరు నుండి నంద్యాల మార్గంలో అడవిలోకి 15 కి.మీ వెళ్ళాము.ఇక్కడ రుద్రకోడూరులో శివుడు కొలువై ఉన్నాడు.పూర్తిగా మట్టి రోడ్డు. ఎదురుగా వాహనాలు వస్తే తప్పుకో లేనంతటి దారి. కాని bus లు ట్రాక్టర్లు జీప్ లలో జనం విపరీతంగా వచ్చారు. అసలు ఈ దారిలో వెళ్లి తిరిగి రావడం అదృష్టమే. ట్రాఫిక్ జామ్ అయి ఇరుక్కుంటే ఇక అడవిలో జాగారమే.ప్రభుత్వం ఈ విషయమై ఆ లోచించి కొద్దిగా రోడ్డు వెడల్పు చేయాలి.దేవాలయం దగ్గర ఎత్తయిన చెట్లు పచ్చగా చిగురించి మరింత శోభనిస్తున్నాయి. ప్రక్కనే కొలనులో భక్తులు స్నాన మాచరిస్తున్నారు.ఆ ప్రాంతమంతా భక్తులతో కోలాహలంగా ఉంది.కాని దర్శనం దగ్గర విపరీతమైన రద్దీ. గర్భ గుడిలోకి చిన్న వాకిలి గుండా దర్శనం చేయిస్తున్నారు. ఏమాత్రం తొ క్కిసలాట జరిగినా ప్రాణాలకే ప్రమాదం. ఇక్కడ కూడా ఆలయానికి బంగారు వర్ణం అద్దారు. ఈ ప్రాంతమంతా పచ్చని చెట్లతో మనోహరంగా ఉంది.ఇంత అటవి లోపలికి భక్తులు రావడం సాహసమే.ప్రభుత్వం మరింత శ్రద్ధ వహించి రహదారి వెడల్పు చేసి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తిరుగు ప్రయాణం కూడా ట్రాఫిక్ జామ్ లతో సాగి బయటపడి ఊపిరి పీల్చుకున్నాము.పండుగ సమయంలోనే కాకుండా సంగమేశ్వరం,కొలను భారతి, రుద్ర కోడూరు విడిగా రాగలిగితే చక్కటి అనుభూతినిస్తాయి. తీర్ధ యాత్రలతో పాటు విహార యాత్రలుగా కూడా అందరు ఈ ప్రాంతాలను సందర్శించే లాగా చేయగలిగితే మరింత బాగుంటుంది. ప్రకృతి, అడవుల్లోకి ప్రయాణం మనల్ని మరింత ఉత్తేజితుల్ని చేస్తాయి. అందుకని వాటిప్రేరణ తో మన పరిసరాల్లో మొక్కలు నాటి పెంచి మన ఆరోగ్యాలు కాపాడుకోవడంతో పాటు భావి తరాలకు చక్కటి పరిసరాలను  అప్పగించవచ్చు. ప్రకృతిని కాపాడండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది....... ఒద్దుల రవిశేఖర్.

No comments:

Post a Comment