Friday 16 November 2012

ప్రాధమిక విద్యకు బాలల హక్కుల చట్టం - 2009(రెండవ భాగం)


గత వ్యాసం తరువాయి భాగం )
       ఈ తీర్పు ద్వారా 1996 ఆగస్టులో ప్రాథమిక విద్యను ప్రాధమిక హక్కుగా రూపొందించడం లోని సాధ్యాసాధ్యా లను పరిశీలించడానికి సైకియా కమిటీని నియమించింది.ఆదేశిక సూత్రాలలో ఉన్నంతవరకు ఇది కేవలం Nonjusticiable fundamental right గా  ఉంది .దీన్ని  ప్రాధమిక  హక్కుల్లో  చేర్చి  Justiciable fundamental right గా మార్చాలన్న అవసరాన్ని గుర్తించారు.1997 సం :లో అధికారం లో ఉన్న United Front ప్రభుత్వం  రాజ్యాంగానికి  83 వ సవరణను ప్రతిపాదిస్తూ రాజ్య సభలో బిల్లు పెట్టింది. ఈ బిల్లులోని లోపాలతో వచ్చిన ప్రజా ప్రతిఘటనతో బిల్లు అటకెక్కింది.1997 సం : లో సైకియా   నివేదిక ను అధ్యయనం చేసి సూచనలు ఇవ్వటానికి తపస్ మజుందార్ ఆధ్వర్యం లో విద్యా వేత్తల బృందాన్ని నియమించింది.1999 జనవరిలో  ఆ  కమిటీ  నివేదిక  సమర్పించింది ..budjet లో విద్యకు అదనంగా 1,37,000 కోట్లు అదనంగా కేటాయిస్తే లక్ష్యాన్ని చేరుకోవచ్చని సూచించింది.2001 లో NDA ప్రభుత్వం రాజ్యాంగానికి 86 వ సవరణ ప్రతిపాదిస్తూ లోక్సభలో బిల్లు ప్రవేశ పెట్టింది.దీనిలో కూడా లోపాలు ఉన్నాయి.అయినప్పటికీ 86 వ సవరణ రాజ్యంగ సవరణ జరిగింది.
         UPA ప్రభుత్వం కపిల్ సిబాల్ నేతృత్వం లో కమిటీ(2005)ని నియమించింది.ఈ కమిటీ తయారు చేసిన బిల్లును CABE BILL 2005 అంటారు.అప్పటినుండి ఎన్నో మీటింగ్స్ జరిగి చర్చలు అయిన తర్వాత ప్రస్తుత స్థితిలోని ఈ బిల్ 2009 వచ్చింది.20/7/09 న రాజ్య  సభలో ,4/8/09 న  లోక్ సభలో  ఆ  బిల్లు  ఆమోదం  పొందటం  జరిగింది..26/8/09 న  రాష్ట్ర  పతి  సంతకం  పెట్టారు .27/8/09 న gazette notification లో ప్రచురించారు.2010 april 1 నుండి  అమలు చేస్తామని  రాష్ట్రపతి  ప్రకటించారు .
ఈ ప్రాధమిక విద్యా  హక్కు   చట్టం-2009 లోని ముఖ్యాంశాలు.
1)ప్రాధమిక విద్యలో నమోదు చేయించు కొని   లేదా పూర్తీ   చెయ్యని బాలలకు ప్రత్యేక ఏర్పాట్లు
2)వేరే బడికి బదిలీ హక్కు
3)బడిని స్థాపించడం  సంబంధిత స్థానిక ప్రభుత్వ భాద్యత ,ఆర్ధిక ఇతర బాధ్యతలను పంచుకోవడం
4)తల్లిదండ్రుల సంరక్షకుల బాధ్యతలు
5)పూర్వ పాటశాల విద్యనూ సంబందిత ప్రభుత్వం చూసుకోవాలి.
6)బడి ప్రవేశానికి ఎంపిక విధానం ,capitation రుసుం ఉండకూడదు.
7)అదే తరగతిలో కొనసాగించడం,పేరు తీసివెయ్యటం నిషేధం.
8)రికగ్నిషన్ లేకుండా బడిని ప్రారంభించ కూడదు.
9)బడులకు,నియమాలు,ప్రామాణికాలు
10)బడి యాజమాన్య సంఘం,బడి అభివృద్ధి ప్రణాళిక
11)టీచర్ గా నియామకానికి అర్హతలు,ఉద్యోగ షరతులు,నిబంధనలు,టీచర్ల విధులు,సమస్యల పరిష్కారం
12)విద్యార్ధి టీచర్ల నిష్పత్తి,టీచర్ల ఖాళీలను భర్తీ చెయ్యటం,విద్యే తర పనులకు టీచర్లను పంపటం పై నిషేధం,టీచర్ల private tutions పై నిషేధం
13) పాట్య ప్రణాళిక,మూ ల్యాంకన విధానం
14)విద్యకు బాలల హక్కుల పర్యవేక్షణ,ఫిర్యాదుల పరిష్కారం
15)రాష్ట్ర జాతీయ సలహా సంఘాల ఏర్పాటు
16)ఆదేశాలు జారీ చేసే అధికారం,ప్రాశిక్యూశన్ కు ముందస్తు అనుమతి
పై అంశాలతో పాటు ఉపాధ్యాయులు గ్రహించ వలసిన అంశాలను ఈ క్రింద గుర్తించటం జరిగింది.
1)ఉచిత విద్య
2)నిర్బంధ విద్య అందించటం రాజ్యాంగం యొక్క బాధ్యత
3)రాజ్యంగా విలువలతో కూడిన పాట్య ప్రణాళిక
4)ఉపాధాయుల గునాత్మకత
5)) పాట శాలకు  గుణాత్మక నియమాలు
6)సామాజిక సంస్కరణల తోడ్పాటు
7)పిల్లల సంరక్షణ బాధ్యత
8)అమలులో నియమ నిబంధనలు కుదించడం
9)పౌరుల పాత్ర చట్టబద్దం చేయడం
10)పరీక్షల ఒత్త్జిడులు తొలగించటం
ఈ చట్టం అమలు పరిచే క్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు,స్థానిక సంస్థలు,విద్యార్థులు,తల్లిదండ్రులు పాటశాలలు,ఉపాధ్యాయులు కొన్ని బాధ్యతలను నిర్వర్తించటం జరుగుతుంది.ఈ చట్టం పర్యవేక్షణ బాలల హక్కుల రక్షణకు ఒక నిర్దిష్ట యంత్రాంగం ఉంటుంది.గవర్నమెంట్,పంచాయతీరాజ ,మున్సిపల్,ఎయిడెడ్ ప్రైవేటు పాటశాలలు విధిగా పాటించాలి.
విద్యా హక్కు బిల్లు లోని సందేహాలు,వివాదాలు
1)6  ఏళ్ళలోపు,14 సం: పైబడిన వారి పరిస్థితి ఏమిటి
2)ప్రైవేటు పాటశాలలు బలహీన వర్గాల వారికి 25% సీట్లు కేటాయింపు వారి ఖర్చు ప్రభుత్వం భరించుట
3)పర్యవేక్షణ యంత్రాంగం పటిష్టత
4)ఫీజుల పై నియంత్రణ
5)neighbourhood స్కూల్స్
పై విషయాలపై స్పష్టత లేదు.ఏది ఏమైనప్పటికీ స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే ఈ రక మైన బిల్లు వచ్చి వుంటే దేశం ఎంతో ముందడుగు వేసేది.ఇప్పటికయినా ఈ బిల్లు రావటం  దేశం లోని కోట్లాది చిన్నారులకు ఆశా జ్యోతిగా పరిగణించ వచ్చు.

Sunday 11 November 2012

ప్రాధమిక విద్య కు బాలల హక్కుల చట్టం 2009


          {జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా వ్రాసిన ఈ వ్యాసం ప్రాధమిక విద్య కు బాలల హక్కుల చట్టం        తయారు చేసిన కమిటి లో సభ్యులయిన ప్రొఫెసర్ శాంతా సిన్హా (chairman National child rights commission) ప్రోఫెసర్ నళినీ జునేజా,R.వెంకట రెడ్డి(సెక్రెటరీ M.V Foundation) ల Seminars కు హాజరయి రూపొందించినది.వారికి ధన్యవాదాలు.}
   పరిచయం:విద్యా ప్రాధమిక హక్కుపై చర్చ భారత దేశానికి కొత్త గాదు.ఈ అంశాలు గత 130 సంవత్స రాలుగా చర్చించ బడుతున్నాయి.1882 సం:లో మహాత్మా జ్యోతీరావు పూలే indian education commission(hunter commission) కు సమర్పించిన నివేదికలో బ్రిటిష్ ప్రభుత్వం విద్యా వ్యాప్తికి సమకూర్చే నిధులు అగ్ర వర్ణ విద్యా వ్యాప్తికి మాత్రమే సహకరిస్తూ దళితులకు ,బలహీన వర్గాలకు ఈ విద్య అందకుండా ఎలా దూరం చేస్తున్నయో వివరించారు.1911 సం:లో బొంబాయి assembly లో గోపాల కృష్ణ గోఖలే ప్రాధమిక విద్యా హక్కు బిల్లును లేవనెత్తి నప్పుడు తీవ్ర వ్యతిరేకత వ్యక్త మయింది.1937 సం :లో  వార్డా జాతీయ  విద్యా  సదస్సులో  గాంధీ ప్రాధమిక విద్యకు అధిక నిధులు కేటాయించాలని కోరినా ఆనాటి మంత్రులంతా నిధులు లేవన్న వాదనతో తోసి పుచ్చడం జరిగింది.
        april 1947 లో వల్లభాయి పటేల్,కృష్న స్వామి కమిటీ విద్య ప్రాధమిక హక్కుగా మార్చటం గురించి చర్చించింది.గోబింద్ వల్లభ పంత్ దీనిని వ్యతిరేకించి Non justiciable fundamental right list లోనికి పంపించమన్నారు.అనగా ఆదేశిక సూత్రాలలో (Directive principles of state policy)చేర్చమన్నారు.
K.TShah దీనిని వ్యతిరేకించారు.ఆదేశిక సూత్రాలలో పెడితే ఒరిగేది ఏమీ లేదు.L.C jain తన రిపోర్ట్ లో బడ్జెట్ లో విద్య గురించి ఆర్దిక మంత్రులు మాట్లాడలేదు అన్నాడు.14 సం:వరకు నిర్బంధ ఉచిత విద్య అందించడానికి ఉద్దేశించిన ముసాయిదాబిల్ article 45  ను 11 సం:కు కుదించాలని 1948-49 లో రాజ్యాంగ సభ చర్చల్లో పాల్గొన్న ఒక సభ్యుడు అంబేద్కర్ తో వాదించాడు.అంబేద్కర్ వ్యతిరేకిం చక పోతే సవరణ జరిగేది.అలా జరిగి ఉంటె 11 సం:ల వయస్సు పిల్లలు పనులలో చేరి ఉండే వారు.అందులోని  మెజారిటీ  సభ్యులు  article 45 ను రాజ్యాంగపు మూడవ భాగంలో చేర్చకుండా అంబేద్కర్ ను నిరోధించారు.ఫలితంగా ఆధునిక భారత దేశం లో విద్య ప్రాధమిక హక్కు కాలేక పోయింది.1986 సం :కొత్త విద్యా విధానం రూపొందుతున్న సమయానికి 5-14 సం :ల వయస్సు కలిగిన మొత్తం పిల్లలలో సగం మంది ఆడపిల్లలయితే మూడింట రెండు వంతుల మంది బడి బయటే ఉన్నారు.s.c,s.t,మైనారిటీలు వికలాంగుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది.80-85% s.c బాలికలు ,90%s.t బాలికలు  10 వ  తరగతి  వరకు  చేరటం  లేదు .రిజర్వేషన్ ఫలాలు వారికందటం లేదు.ప్రైవేటీకరణ పెరగడం వలన సమాన నాణ్యత కలిగిన విద్య నందించే విషయం లో సమాజం లోని ఉన్నత వర్గాలకు,పేదలకు మధ్య అంతరాలు మరింత పెరుగుతున్నాయి.
    J.P.unnikrishanan versus A.P Govt మరియు  ఇతరులు (S.C2178,1993) కేసులో సుప్రీం కోర్టు తన చారిత్రాత్మక తీర్పులో ఈ పెడ పోకడలను తీవ్రంగా నిరసించింది.రాజ్యాంగం మనకు ప్రాధమిక హక్కులుగా భావ ప్రకటనా స్వేచ్చ జీవించే  హక్కు  (article 21) దేశంలో ఎక్కడయినా నివసించే హక్కు వంటివి కల్పించింది.వీటికి భంగం కలిగితే మనం కోర్టు ను ఆశ్రయించ వచ్చు.ప్రభుత్వం ఖచ్చితంగా ఈ హక్కులు మనకు కల్పించాలి.అదే విధంగా రాజ్యాంగం లో మనకు ఆదేశిక సూత్రాలు ఉన్నాయి. ప్రభుత్వా లు వీటిని ఖచ్చితంగా పాటించాల్సిన పని లేదు.వీటిలో పిల్లల గురించి 24,39,45  అధికరణాల్లో వివరిం చారు.
అధికరణం  24:  14 సం : లోబడిన పిల్లలను వారికి ప్రయోజనకరమైయిన వృత్తులలో పరిశ్రమలు,గనులు వంటిచోట నివసిం చకూడదు.
అధికరణం 39: ప్రభుత్వాలు  పిల్లల  పసితనాన్ని  పరిరక్షిస్తూ ,వారు  పరువుగా  స్వేచ్చగా  ఆరోగ్యకర మయిన  వాతావరణంలో  ఎదిగేలా  అవకాసం  కల్పించాలి .
అధికరణం 45: రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి నుండి  10 సం :లోపు  పిల్లలందరికీ  14 సం : నిండే వరకు  ఉచితంగా  నిర్భందంగా  విద్య  నందించే  ప్రయత్నం  చేయాలని  ప్రభుత్వానికి  నిర్దేశించ  బడింది .
       45 వ ఆర్టికల్ దృష్ట్యా 21 వ ఆర్టికల్ ను(జీవించే హక్కు)ను పరిశీలిస్తే పిల్లలందరికీ విద్యా ప్రాధమిక హక్కును రాజ్యాంగం కల్పించినట్లు తెలుస్తుంది."అని సుప్రీం కోర్టు తన నిర్ణ యాత్మకమైన తీర్పులో స్పష్టం చేసింది.ఆదేశిక సూత్రాలు(నాలుగవ  భాగం)ప్రభుత్వం సాధించ వలసిన లక్ష్యాల యితే ప్రాధమిక హక్కులు (మూడవ భాగం)అందుకు అనుసరించవలసిన మార్గాలుగా సుప్రీం కోర్టు రూలింగ్ ఇచ్చింది. 45 article లో సవరణ జరిగినా ఆరు సం: లోపు పిల్లలకు పూర్వ ప్రాధమిక విద్య 45 article ను అనుసరించి 14  సం:దాటిన  వారు కూడా ప్రభుత్వ ఆర్ధిక సామర్ధ్యాలననుసరించి  విద్యా ప్రాధమిక హక్కును కలిగి ఉంటారని సుప్రీం కోర్టు పేర్కొంది.
(మిగతా భాగం తరువాతి వ్యాసం లో )