Monday 12 July 2021

ప్రకృతితో స్నేహం చేద్దాం రండి.

 ఆహారసేకరణ కోసం ప్రతి రోజు 40 కి.మీ నడిచి ఎంతో శ్రమ కోర్చి ఆహారం సంపాదించే దశ నుండి కూర్చున్నచోట నుండి లేవకుండా కోరిన తిండి తినే దశకు వచ్చిన మానవుడు శ్రమకు,ప్రకృతికి దూరమయ్యాడు.దానితో ఎన్నో జబ్బులు చుట్టుముట్టి విలవిలలాడుతున్నాడు.తిరిగి ప్రకృతి మూలాల్లోకి వెళ్లకుండా ఈ తప్పును సరిదిద్దుకోలేం.మొక్కలతో,చెట్లతో,ప్రకృతితో స్నేహం చేస్తే ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది.మన ఇంటి ముందు,వెనుక మొక్కలు నాటి పెంచడం దగ్గరనుండి,రహదారుల వెంట,ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటి పెంచడం వరకు ఎవరికి వీలయిన విధంగా వాళ్ళు ప్రతి ఒక్కరు భూమికి మనం చెల్లించే బాకీగా భావించి ఈ కార్యక్రమంలో పాల్గొనాలి.అలాగే పిల్లలకు చిన్నప్పటినుండే ఈ అలవాటు నేర్పిస్తే వారి జీవితం ఎంతో ఆనందంగా మారుతుంది.ఇంకా ఈ కరోనకాలం లో తమ సొంత గ్రామాలకు,పట్టణాలకు చేరిన యువకులు మొక్కలు నాటి పెంచే కార్యక్రమం తో పాటు తమ వ్యవసాయక్షేత్రాల్లో తండ్రికి పొలం పనుల్లో సహాయం చేస్తే శ్రమ విలువ తెలుస్తుంది.అలా పొలం అందుబాటులో లేని వాళ్ళు తమ బంధువులు రైతులయితే వారి పొలాల్లోకి వెళ్లి చిన్నపాటి పనులు చేయండి.నీరు కట్టడం,కలుపు తీయడం,మట్టిపనులు చేయండి.చెమట పడుతుంటే కలిగే ఆనందాన్ని అనుభవించండి.మట్టి వాసన,నీటి పలకరింపులతో పులకరించండి.మొక్కలు రోజు పెరుగుతుంటే పరిశీలించడం అద్భుతమైన అనుభవం.ఇవన్నీ చేస్తున్నవాడిగా చెబుతున్నా,ప్రయత్నించండి.ఒక ముఖ్య విషయం ఆరోగ్యం కోసం ఉదయపు,సాయంత్రపు నడకలు,వ్యాయామాలు చేస్తుంటాం.చెమట చిందిస్తుంటాం.కానీ పైన చెప్పిన పనులు చేస్తుంటే దాని వల్ల ప్రకృతికి మేలు చేయడం తో పాటు సహజానందం కలుగుతుంది.మన శ్రమ ఓ పుష్పంగా,ఓ కాయగా,ఓ కూరగాయగా,నీడ నిచ్చే చెట్టుగా మారుతుంటే కలిగే ఆనందం వెలకట్టలేనిది.ప్రకృతి తో స్నేహం చేద్దాం,రండి....ఒద్దుల రవిశేఖర్.

No comments:

Post a Comment