Tuesday 21 November 2023

కోటప్పకొండ సందర్శన

 కొండలపై ఉన్న గుడుల పరిసరాలన్నీ ప్రకృతి రమణీయతతో శోభిళ్లుతుంటాయి. అందులో కోటప్పకొండ ఒకటి. ఇది శివాలయం. నరసరావుపేట కు దగ్గరలో 20 కి.మీ దూరం లో ఉంటుంది. బస్టాండ్ నుండి కార్తీక మాసం ఆదివారం,శనివారం లలో ₹50 ticket తో కొండపైకి RTC బస్సులు నడుస్తుంటాయి. కొండ క్రింద అన్ని వర్గాల వారికి సత్రాలున్నాయి. కొండ ఎక్కటానికి, దిగటానికి రెండు మార్గాలున్నాయి. ఎక్కే మార్గానికి ఇరువైపులా పూలు పూసి స్వాగతిస్తున్నాయి. మధ్యలో ఒక park ఏర్పాటు చేశారు. కొండ పైన గుడి ముందర భాగం విశాలంగా ఉంటుంది.దక్షిణామూర్తి గుడి, విగ్రహం,నంది విగ్రహం మనోహరంగా ఉంటాయి. శివుడి విగ్రహం 4 దిక్కులు కనపడే విధంగా గుడికి ఎదురుగా అమర్చారు.నిత్య అన్నదానం ఉంటుంది.చాలా రుచిగా ఉంది. మనకు తోచిన విరాళం ఇవ్వవచ్చు. ఇహ గుడి చాలా ఎత్తులో ఉంటుంది. గుడి లోపలికి మెట్లు చాలా ఎక్కాలి. గుడి బయటకు వచ్చాక ఎడం వైపు కొండ పైన నాగుల పుట్ట చాలా ఎత్తులో ఉంటుంది.అక్కడే ఒక శివుడి విగ్రహం చాలా ఆకర్షణీయం గా ఉంటుంది. అక్కడ నుండి దిగువకు, ప్రక్కలకు చూస్తే view point చా లా అద్భుతం గా ఉంటుంది. ప్రక్క కొండ మీద పాత కోటేశ్వర స్వామి ఉంటారు. అక్కడ mike లో పాటలు కొండ అంతా ప్రతి ధ్వనిస్తున్నాయి. శివరాత్రి కి కట్టే ప్రభలు ఆ ఉత్సవాలు, జనాల్ని చూడటానికి రెండు కళ్ళు చాలవట. చిన్నపురెడ్డిని బ్రిటిష్ వారు ఉరి తీసింది ఈ కొండపైనే.దేవుళ్ళందరూ కొండలపై ఎందుకు కొలువుంటారో తెలుసా, తమతో పాటు ప్రకృతిని ఆరాధించమని.కొండల నిండా ఇంకా చెట్లు బాగా పెంచితే గొప్ప ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం అవుతుంది. ... ఒద్దుల రవిశేఖర్

Monday 20 November 2023

ఉద్యానవనాల్లో మొక్కలు నాటడం

 ఉద్యానవనాల్లో మొక్కలు నాటుదాం

రోజూ "నడక " సాగించే muncipal park లో 5km నడక పూర్తయి ఇంటికి వెళ్లే క్రమంలో అక్కడ పనిచేసే తోటమాలి సురేష్ మొక్కలు నాటడం గమనించాను.ఇంతకు ముందు మొక్కలు ఇస్తానని చెప్పాను. ఇప్పుడు మొక్క తెస్తే నాటుతావా అని అడగ్గానే తప్పకుండా అన్నాడు. పండ్ల మొక్కలు తీసుకురానా అంటే ok అన్నాడు. నర్సరీ దగ్గర దిగి లోపలికి వెడుతుంటే మిత్రులు సజీవరాజు, ప్రదీప్ కనిపించి పలకరించి అడిగారు ఏం చేస్తున్నారుఅని.విషయం చెప్పగానే మేము మొక్కలు ఇస్తామన్నారు. సపోటా, నేరేడు, సీతాఫలం మొక్కలు తీసుకెళ్లగానే కొంత మంది పిల్లలతో కలిసి సురేష్,మేము park లో పాదులుతీసి మొక్కలు నాటాము. మేము ముగ్గురం APNGC లో సభ్యులం.ఇలాగే ఉభయ తెలుగు రాష్ట్రాలలోని NGC సభ్యులు, మొక్కల ప్రేమికులు వారి దగ్గర లో ఉన్న స్థానిక park లలో పండ్ల మొక్కలు,నీడ నిచ్చే మొక్కలు, పూల మొక్కలు నాటితే park లలో మంచి వాతావరణం ఏర్పడుతుంది.

Sunday 12 November 2023

40.పాటల పూదోట

 వర్మ "రంగీలా " చూసారా. ఇండియాను ఊపేసింది. ఇందులో రెహమాన్ music వింటుంటే పాట మధ్యలో instruments ఇంత అత్య ద్భుతంగా ఉపయోగించవచ్చా అనిపిస్తుంది.హరిహరన్, స్వర్ణలతల స్వరాల్లో పాట ఇంత మధురంగా ఉంటుందా అని ఆశ్చర్యపోతాం. Ear phones పెట్టుకుని కళ్ళుమూసుకుని విని తరించండి.(https://youtu.be/KQUS-phhM0Y?si=3aJ0uYULkLJTO9pR)

39. పాటల పూదోట

 శ్రీమణి చక్కని సాహిత్యం అందించగా, సుదర్శన్ రూపంలో కొత్త స్వరాన్ని పరిచయం చేస్తూ DSP(దేవిశ్రీ ప్రసాద్) అందించిన హాయిగా వినాలనిపించే మంచి మెలోడీ ఇది.వినండి మరి.(https://youtu.be/tpvNtKjlf5E?si=PkF8-2JZrvvyaBi4)

38.పాటల పూదోట

 రెహమాన్ సృష్టించిన శాస్త్రీయ సంగీతపు అలలపై నరేష్ అయ్యర్ పలికిన సరిగమపదనిసల గమకాల పై మహతి సైంధవి స్వరం మీ మనసును మలయసమీరంలా తాకుతూ మీ హృదయాన్ని పరవశింపజేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం ear phone పెట్టుకుని కళ్ళు మూసుకుని ఆస్వాదించండి. (https://youtu.be/WjdAM6aLO5I?si=lLd6fZrE0Rw0l05e)

37. పాటల పూదోట

 రెహమాన్ సృష్టించిన శాస్త్రీయ సంగీతపు అలలపై నరేష్ అయ్యర్ పలికిన సరిగమపదనిసల గమకాల పై మహతి సైంధవి స్వరం మీ మనసును మలయసమీరంలా తాకుతూ మీ హృదయాన్ని పరవశింపజేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం ear phone పెట్టుకుని కళ్ళు మూసుకుని ఆస్వాదించండి. (https://youtu.be/WjdAM6aLO5I?si=lLd6fZrE0Rw0l05e)

Monday 6 November 2023

బుద్ధ వనం

 బుద్ధవనం

నాగార్జున సాగర్ మీదుగా హైదరాబాద్ వె డుతునప్పుడల్లా సాగర్ దాటాక ఎడమ వైపు బుద్ధవనం board చూస్తుంటాం. కాని 2014 నుండి నిర్మాణం లో ఉండి 2023 వేసవిలో ప్రారంభించబడిందట.దీనికోసం 274 ఎకరాలు కేటాయించారు. ప్రస్తుతం 70 ఎకరాల్లోనే కొన్ని విభాగాలు పూర్తయ్యాయి.మాచర్ల నుండి నల్లగొండ, హైదరాబాద్ వెళ్లే బస్సులన్నీ అక్కడ ఆపుతాయి. Ordinary bus, auto ల్లో ₹50 తీసుకున్నారు. అక్కడే cottages ఉన్నాయి. భోజనం మాత్రం బయట ఉన్న hotels లో చేయాలి. ఒక రోజు ఉదయం వెళ్లి మధ్యాహ్నం వరకు గడపవచ్చు. సొంత వాహనాలు ఉంటే సాయంత్రం వెళ్లి ఆ వాతావరణాన్ని enjoy చేయవచ్చు.ఉదయం 10 గంటల కల్లా వెళ్ళాం. అప్పుడప్పుడే యాత్రికుల రాక మొదలయింది. Ticket ₹50. రాజప్రసాదం లోపలికి వె డుతున్నామా అన్న అనుభూతి కలిగింది.

1) అర్థ చంద్రాకారంలా ఉన్న మహా స్థూపం,అందులోని నాలుగు వైపులా 4 బుద్ధ విగ్రహాలు బంగారు రంగులో మెరిసిపోతుంటే,పై భాగంలో ఆకాశం ప్రతిబింబిస్తుంటే ధ్యాన మందిరంలో యాత్రికులు ధ్యానం చేసుకునే విధంగా ఓ ప్రశాంత వాతావరణం అక్కడ విలసిల్లుతుంది.అక్కడ ధ్యానం చేయడం చక్కని అనుభూతి కలిగిస్తుంది. మహా స్థూపం క్రింద museum ఏర్పాటు చేశారు.క్రీ. శ 1 వ శతాబ్దం నాటి బుద్ధ విగ్రహాలను చూడవచ్చు.

2)మహా స్థూపానికి ముందు బుద్ధచరితవనంలో ఆయన జీవిత విశేషాలను పొందుపరిచారు.

3) జాతక వనంలో జాతక కథల్లోని చిత్రాలను శిల్పాలుగా మలిచారు.

4)ధ్యాన వనంలో శ్రీలంక ప్రభుత్వం donate చేసిన 27 అడుగుల బుద్ధ విగ్రహాన్ని చరిత వనం లో ధర్మ ఘంటను చూడవచ్చు.

5)స్థూప వనం లో విభిన్న దేశాలు ప్రాంతాల్లో ఉన్న బౌద్ధ స్థూపాల models చూడవచ్చు.

బుద్ధవనం లో ఇంకా చాలా విభాగాలు అభివృద్ధి చేయవలసి ఉంది. పూర్తి రూపం సంతరించుకుంటే ఇది అంతర్జాతీయ పర్యాటక కేంద్రం అవుతుంది.బుద్దవనం ప్రతి ఒక్కరు తప్పని సరిగా చూడదగ్గ సందర్శనీయ ప్రాంతం.... ఒద్దుల రవిశేఖర్

Monday 23 October 2023

36. పాటల పూదోట

 అభినందన సినిమా చూసారా.ఇందులో అన్ని పాటలు బాగుంటాయి.సంగీత సాహిత్యాలు పోటీ పడిన గీతమిది.ఆత్రేయ సాహిత్యం, ఇళయరాజా సంగీతం అందించగా బాలు జానకి ల స్వరాల్లో సుమధురంగా సాగిన ఈ వీనుల కు ఇంపైన గీతం ఈ వారం మీ కోసం. (https://youtu.be/RMoUYGnu02w?si=H-SCgSiTMdK2aLl-)

35. పాటల పూదోట

  ఉన్ని కృష్ణన్ పాటలెప్పుడైనా విన్నారా, విలక్షణ స్వరం.రెహమాన్ compose చేసిన ఈ పాటలో చరణాల మధ్య మంద్రంగా సాగే beat వింటూ అప్పుడప్పుడు మధ్య లో వచ్చే music వింటూ ఉంటే మనసు గాల్లో తేలిపోతుంది.కవితా కృష్ణ మూర్తి గొంతు హృదయాన్ని తాకుతుంది. కళ్ళు మూసుకుని earphone పెట్టుకుని పాట వినడం మరిచిపోకండి.(https://youtu.be/Wzj5vJgAtBk?si=E3Kddi92qEGTWkmS)

34.పాటల పూదోట

 Classical songs వింటూ ఉంటారా!వినలేం బాబూ అంటారా!wait wait కాస్త western beat add చేస్తాం లెండి.విజయ్ సంగీతంలో ఆర్యా దయాల్ baby సినిమా కోసం ఎంత విభిన్నంగా పాడిందో! వింటే మీకే అర్థం అవుతుంది. ఈ weekend మీకోసం"దేవరాజ........".(https://youtu.be/W2qp0A58PTA?si=TKYH5iL6zgZaxTOY)

33.పాటల పూదోట

 వేటూరి కలం నుండి జాలువారగా రాజన్ నాగేంద్ర స్వర కల్పనలో బాలు జానకి పాడిన మధురగీతం ఇది. " వీణ వేణువైన సరిగమ" పాటలోని వీణ ఫణి నారాయణ, వేణువు రామ చంద్ర మూర్తి పలికించిన instrumental music వినండి.మనసును హాయిగా మైమరిపించే చక్కని ప్రయోగం.(https://youtu.be/j0_86ZfGnE4?si=i8kpa5coSAi5LcoL)

Saturday 14 October 2023

ప్రపంచ ప్రసిద్ధ ఉపన్యాసాలు

 పుస్తకం:ప్రపంచ ప్రసిద్ధ ఉపన్యాసాలు

పరిచయం :ఒద్దుల రవిశేఖర్

కళల్లో ఉపన్యాస కళ క్లిష్ట మైనది మరియు విశిష్ట మైనది. ప్రపంచ గతిని మార్చిన గొప్ప నాయకులు తమ ఉపన్యాసాల ద్వారానే ప్రపంచాన్ని విశేషంగా ప్రభావితం చేశారు.అందుకనే విద్యార్థి దశ నుండే వేదికలపై మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. అందుకనే పాఠశాల స్థాయిలో వక్ తృత్వ పోటీలు చర్చలు జరుపుతుంటారు. వాటి వల్ల విద్యార్థుల్లో సభా కంపం పోయి ధైర్యం వస్తుంది. ఎలా ఉపన్యసించాలో ఈ పుస్తకం తొలి పలుకు లో అనువాద రచయిత సి. వి. యస్. రాజు గారు వివరిస్తారు.ఉపన్యాసాల్లో విభిన్న శైలులు ఉంటాయి. చర్చిల్ హాస్యచతురత, సర్వేపల్లి వాక్చాతుర్యం(నిముషానికి 120 పదాలు ) ఇలా ఒక్కొక్కరు ఒక్కో విశేషమైన నైపుణ్యం కలిగి ఉంటారు.

ఈ పుస్తకం లో 1)సోక్రటీస్ :ప్రశ్నించడాన్ని ప్రపంచానికి నేర్పిన తాత్వికుడు. ఏథెన్స్ రాజ్యం లో జన్మించాడు సత్యాన్వేషణకు నూతన పద్ధతి కని పెట్టాడు. జ్ఞానమే దేవుడన్నారు.

2)సిసెరో :రోమ్ రాజ్యం లో సెనేటర్  ఇలా

గొప్ప వాక్ చాతుర్యం కలిగిన వ్యక్తి.సీజర్ ను పొగుడుతూ "నీ యుద్దాలు కాల మున్నంత వరకు ప్రతి భూమి పెదవులతో చెప్పుకోబడతాయి."

3) మార్క్ ఆంటోనీ :రోమన్ రాజకీయ నాయకుడు. జూలియస్ సీజర్ మిత్రుడు.తన ఉపన్యాసం లో " దేశ ద్రోహుల చేతుల కంటే కృతఘ్నత చాలా బలీయమైనది. "

4) జీసస్ :జీసస్ మొదటి శతాబ్దానికి చెందిన యూదు బోధకుడు. ఆయన బోధనలే క్రైస్తవ మతం గా మారింది."అసలు ప్రమాణాలు చేయవద్దు. భూమి మీద, భగవంతుని మీద, తలమీద ప్రమాణాలు చేయవద్దు ". 

5) క్వీన్ ఎలిజబెత్ :ఇంగ్లాండ్ రాణి

6) ఆలివర్ క్రాంవెల్ :ఇంగ్లాండ్, లెఫ్టినెంట్ జనరల్ గా పని చేశారు

7) పాట్రిక్ హెన్రీ :అమెరికా లోని వర్జీనియా కు గవర్నర్ గా పని చేశారు."స్వాతంత్ర్యమైనా ఇవ్వండి లేదా మరణాన్నైనా ఇవ్వండి ".

8) జార్జి వాషింగ్టన్:అమెరికా మొదటి అధ్యక్షులు. "నిజమైన స్వాతంత్ర్యమనే భవనానికి ఐక్యతే మూల స్థంభం ". 

9) థామస్ జెఫర్సన్ :అమెరికా మూడవ అధ్యక్షులు.

10) నెపొలియన్ బోనపార్టి:ఫ్రాన్స్ దేశ అధ్యక్షులు గా పని చేశారు

11) అబ్రహాం లింకన్ :అమెరికా అధ్యక్షుడిగా పనిచేశారు."మనం ఇప్పుడు చెప్పిన మాటల్ని ప్రపంచం గుర్తించదు, జ్ఞాపకం ఉంచుకోదు కాని ఇక్కడ వారు చేసిన పనిని మాత్రం మరచి పోదు ఇలా సుసాన్ బి అంథోని,ఎమిలిన్ ప్యాంక్ హార్ట్స్, మేరీ క్యూరీ, గాంధీ, లెనిన్, చర్చిల్, స్టాలిన్, రూజ్ వెల్ట్, హిట్లర్, నెహ్రూ,కెనడీ, ఇందిరా గాంధీ, మదర్ థెరిసా, రీగన్ నెల్సన్ మండేలా మార్టిన్ లూథర్ కింగ్, చేగువేరా, గోర్బ చోవ్, బుష్ వంటి 30 మంది ప్రసిద్ధ ఉపన్యాసాలు ఇందులో ఇచ్చారు.వీటిని చదవడం వలన చక్కని ఉపన్యాస మెలకువలు తెలుస్తాయి. విద్యార్థులు ఉపాధ్యాయులు చదవ తగ్గ పుస్తకం.

Wednesday 27 September 2023

ప్రపంచ పర్యాటక దినోత్సవం సెప్టెంబర్ 27

 ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా మీకు ఇష్ట మైన ప్రాంతాన్ని సందర్శించండి. జీవితాన్ని కొత్త కోణం లో చూడండి.ఖరీదైన వస్తువులు ఇచ్చేసంతోషం కన్నా కొత్త ప్రాంతాలు చూస్తే కలిగే ఆనందం మిన్న.పర్యాటకం మీ జ్ఞానాన్ని విస్తృత పరుస్తుంది.జీవితాన్ని అర్థం చేసుకోవడానికి చక్కగా ఉపయోగ పడుతుంది. మీ పర్యాటక అనుభవాలను పంచుకొని మిగతావారికి మార్గదర్శకులు కండి. ప్రకృతి పరిమళాన్ని మీ గుండెలనిండా నింపుకోండి.ప్రపంచం లోని ప్రతి ఒక్కరూ ప్రతినెలా ఏదో ఒక ప్రాంతాన్నిసందర్శిస్తే ఎంతో మందికి ఉపాధి లభిస్తుంది.... ఒద్దుల రవిశేఖర్.

Monday 18 September 2023

చదువులు.. కొత్త దారులు

 చదువులు కొత్త దారులు                                           మనము  కలవాలి ,అనుభవాలు పంచుకోవడానికి అని C.A  ప్రసాద్ గారు చెప్పడంతో 16 /9 /2018 ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసాం.9:30 కే  రమ్మన్నారు. నేను జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాస్ రెడ్డి గారు 9:40 కల్లా వెళ్ళాము. అక్కడకు వెళ్లగానే ప్రసాద్ గారు కుర్చీలు వేస్తూ సర్దుతూ కనిపించారు ఇంకా ఎవరూ రాలేదు. అంత సామాన్యంగా ఉంటారు ఆయన. సార్ మాకు ఏమైనా పని చెప్పమంటే నవ్వి ఊరుకున్నారు ఇక పని మనమే వెతుక్కోవాలని చూసా . క్రింద అప్పుడేే పుస్తకాలు వచ్చాయి వాటిని మొదటి అంతస్తుకు తీసుకువచ్చి  బల్ల పై సర్దాము.  ఒక్కొక్కరే ఉపాధ్యాయులు రావటం మొదలైంది ఆనంద్, నాగమూర్తి వచ్చారు. పదకొండు గంటలకల్లా దాదాపు 80 మంది ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు వచ్చారు.                                                                                                                                                                          కార్యక్రమానికి వచ్చిన ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ ఈదర హరిబాబు గారిని,వాడ్రేవు చినవీరభద్రుడు గారిని విజయ భాను గారిని SSA అధికారిని వేదికపైకి ఆహ్వానించారు.ప్రసాద్ గారుమాత్రం వెనక కూర్చొని వింటూ కార్యక్రమాన్ని సంధాన  పరుస్తున్నారు స్టేజీపై కూర్చోవాలనే ఆలోచన కూడా ఆయనకు లేదు. మొదటగా హీల్ పారడైస్ స్కూల్(http://healcharity.org)ప్రిన్సిపాల్ శోభారాణి గారిని  ప్రసంగించమని ఆహ్వానించారు. ఈ పాఠశాలను లండన్ లో ఉండ కోనేరు సత్యప్రసాద్ గారు స్థాపించారట.తన ఆస్తిలో చాలా భాగం దానికి ఆయన ఖర్చు చేశారట 27 ఎకరాలలో ఉన్న ఈ పాఠశాలలోపిల్లలే పరిశుభ్రత ,వంట,తోటపని చేసుకుంటారట. ఇందులో అనాధ పిల్లలకే ప్రవేశం. చాలాకాలానికి నేను అనుకున్న కార్య క్షేత్రం నాకు దొరికినట్లయింది త్వరలో ఈ పాఠశాలకు వెళ్లాలని 550 మంది అనాధ పిల్లలకు ఏదైనా చేయాలన్న సంకల్పం కలిగింది. శోభారాణి గారితో తర్వాత వివరంగా మాట్లాడాను ఆమె తప్పకుండా రండి సార్ అని ఆహ్వానించింది ఆనంద్, నేను వెళ్లాలని నిర్ణయించుకున్నాము. తర్వాత మార్తాండ రెడ్డి అని కడప లో రిటైర్ అయిన డాక్టర్ గారు మాట్లాడారు పిల్లలకు నేర్పాల్సిన కొన్ని కార్యక్రమాలు  చేస్తున్నారట. Ten commandments for teachers  అనే పుస్తకాన్ని ముద్రించారట. కొమరోలు ఉన్నత పాఠశాల ప్రభుత్వ కాలేజీ చాలా బాగుందని ప్రశంసించారు. తర్వాత ప్రాథమిక విద్యారంగంలో సంచలనాలు సృష్టిస్తున్న విజయ భాను కోటే గారు మాట్లాడుతూ చిన్నప్పుడు రామకృష్ణ మఠం వెళ్ళేదాన్నని వివేకానందుని సూక్తులు  నాపై ప్రభావం చూపాయి అని చెప్పారు. తర్వాత ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి విద్యార్థులకు తను చేసిన ప్రయోగాలు వివరించారు.ఈ విధానాన్ని ఆస్ట్రేలియాలోని స్టీవార్ట్ అనే professor  ప్రవేశపెట్టారు. దీనిని 1 నుండి 10 వ తరగతి వరకు అమలు చేయవచ్చు. 1 + 4 +6  విధానంలో జూన్ నెల అంతా పిల్లలను పాఠశాలకు అలవాటు చేయడం, మిగతా నాలుగు నెలలు  లేతఆకాశం అనే కార్యక్రమం ద్వారా బోధన, తర్వాత ఆరు నెలలు పిల్లలు స్వయంగా   చే

నేర్చుకుంటారు.TLM కూడా పిల్లలే చేస్తారు.Cleanliness is not cleaning,it is not littering. విజయ భాను గారు ఏపీ ప్రభుత్వ సహకారంతో ఫిన్లాండ్ విద్యా విధానాన్ని పరిశీలించడానికి వెళ్లారు. ఆహారము పోషక విలువలతో కూడిన టువంటి ఆయుర్వేద మందులను తయారు చేయడంపై పిల్లలకు అవగాహన కార్యక్రమాలు పోషకాహారం పిండిని పిల్లలతో తయారు చేయించడం చేస్తారు. మునగాకు పొడి పచ్చడిని తయారు చేశారు పిల్లలు చేసిన కార్యక్రమాలన్నీ రికార్డు చేస్తారు.Shine India comes from teacher. జీతములో 10% పాఠశాలకు ఇస్తారట. వీటన్నిటికీ కారణం పాఠశాల పట్ల పిల్లల పట్ల నాకున్న passion.                                                          ...............తర్వాత వాడ్రేేవు చినవీరభద్రుడు గారిని ప్రసంగించమని ఆహ్వానించారు.ఈయన centre for innovations in publicsystem లో assistant director గా పని చేస్తున్నారు. ఈ సంస్థ విద్య వైద్యం ఈ గవర్నెన్స్ లో దేశవ్యాప్తంగా జరుగుతున్న నూతన ప్రయోగాలు పరిశీలించడం ప్రభుత్వానికి సలహా ఇవ్వటం చేస్తుంది దేశంలోని చాలా ప్రాంతాల్లో అద్భుతాలు జరుగుతున్నాయి. కొన్ని వినూత్న కార్యక్రమాలు1) అరబిందో సొసైటీ వారు ఉత్తరప్రదేశ్ లోని పాఠశాలల్లో పైసా ఖర్చు లేకుండా అమలయ్యే విధానాలు  తెలియజేయమని అక్కడి ఉపాధ్యాయులను కోరితే లక్ష మంది స్పందించారు వాటిలో 33 రకరకాల అత్యుత్తమ పద్ధతులను ఎన్నుకున్నారు. 1నుండి  5వ  తరగతి వరకు 11 రకాల పద్ధతులు తయారు చేశారు. 2)BALA: Building as learning aid.గదే బోధనోపకరణం.మెట్లకు సంవత్సరాలు రాసి వాటి ప్రాముఖ్యతను తెలియజేస్తారు.3). విజయనగరం జిల్లా చీపురుపల్లి లో శోధన అనే బాలబడి ఉంది దీనికి జీఎంఆర్ ఫౌండేషన్ సహాయం చేస్తుంది. పాఠాలను చిన్నచిన్న నాటికల రూపంలోకి మారుస్తారు. పిల్లల్లో గొప్ప ఉత్సాహం కనిపిస్తుంది 1 నుండి 9వ తరగతి వరకు పాఠశాలల్లో సిలబస్ అక్కడ స్థానిక సమాజం నిర్ణయించాలి. పాఠశాల విద్యా చరిత్ర కేవలం 156 సంవత్సరాలు మాత్రమే.అంతకు ముందు అంతా జ్ఞాన ప్రసారము చుట్టుపక్క సమాజం ద్వారానే జరిగింది వ్యవసాయం పాఠం సెప్టెంబర్ లో ఉంటే దానిని సందర్శించి నేర్చుకోవచ్చు.4) జిడ్డు కృష్ణమూర్తి గారి ప్రభావంతో ప్రేమ గంగాచారి అనేవారు  తమిళనాడులోని కోయంబత్తూరు దగ్గర anaikatti లో విద్యావనం(http://www.vidyavanam.org/home.html) అనే పాఠశాలను స్థానిక గిరిజన తెగ పిల్లల కోసం స్థాపించారు.వారి కుటుంబంలో వీరే మొట్టమొదట బడికొచ్చిన పిల్లలు. ఇక్కడ స్థిరమైన తరగతి గదులు ఉండవు తమిళం, ఇంగ్లీషు, లెక్కలు, సైన్సు వంటి zones ఉంటాయి.5) అలాగే ఒరిస్సా రాజధాని భువనేశ్వర్ లో డాక్టర్ అచ్యుత్ సమంత అనే ఆయన కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ను స్థాపించారు. ఇక్కడ 25 వేల మంది పిల్లలు చదువుకుంటున్నారు అందులో 13 వేల మంది అక్కడ ఉన్న హాస్టల్లో ఉంటున్నారు. ఇక్కడ పాఠశాలల్లో  ఒకేషనల్ విద్యా విధానం పటిష్టంగా ఉంది పిల్లలే బట్టలు కుట్టుకుంటారు పచ్చళ్లు తయారు చేసుకుంటారు. ఆ పిల్లల వార్షికాదాయముఒకటిన్నర  కోట్లు. ఇలాంటి 130 అత్యున్నతమైన విధానాలు మేము సేకరించాము.వీటిని దేశం లోని అన్ని రాష్ట్రాలకు పంపించాము, విచారకరమైన విషయమేమంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వీటినింతవరకు అమలుచేయలేదు,మిగతా రాష్ట్రాలు అన్ని ఈ విధానాలను అమల్లో పెట్టాయి. చివర్లో ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ ఈదర హరిబాబు గారు మాట్లాడుతూ విద్యాలయాల్లోకి నేను ప్రవేశించడానికి ముందు నాలో ఉన్న రాజకీయ నాయకుడిని చెడు అలవాట్లను చంపుకున్నాను. ఉపాధ్యాయులారా మిమ్మల్ని మీరు సంస్కరించుకోండి. పాఠశాలలు జాతి నిర్మాణ కేంద్రాలు.ఉపాధ్యాయులు,విద్యార్థులు దేశ సంపద. చివరగా డాక్టర్ కొర్ర పాటి  సుధాకర్ గారు మాట్లాడుతూ పిల్లల నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు వారికి కోపం రాదు ఆనందంగా ఉండటం ఎలాగో వారి నుండి నేర్చుకోవచ్చు.ఒక ఎకరంలో అడవిని పెంచుతున్నా అంటూ ముగించారు.తరువాత మధ్యాహ్నం,ప్రాధమిక పాఠశాల ఉపాధ్యాయులు ఒక గ్రూపు సృజన ఆధ్వర్యం లో,ఉన్నత పాఠశాల ల ఉపాధ్యాయులు నా ఆధ్వర్యం లో మరో గ్రూపులో కూర్చొని తమ అనుభవాలు,అభిప్రాయాలు కలబోసుకున్నాము.ఇంతటి మహత్తర కార్యక్రమం రూపొందించిన C.A.ప్రసాద్ గారు చివర్లో మాట్లాడుతూ ఇవన్నీ ఒక పుస్తకం రూపం లో తీసుకు వస్తాము.అందరికీ ధన్యవాదాలు,మళ్లీ కలుద్దాం అని ముగించారు....... ఒద్దుల రవిశేఖర్ 

Sunday 17 September 2023

32.పాటల పూదోట

 

ఇది సినిమా లోని పాట కాదు.ఒక నిజ జీవిత సంఘటనకు అక్షర రూపం ఈ పాట.పిల్లలు క్షణికావేశానికి లోనై ఆత్మహత్య లు చేసుకుంటే తల్లి తండ్రులు పడే అంతులేని వేదనకు ప్రతి రూపం ఈ గీతం.1)(https://youtu.be/IBs2FyxUGlc) 2)https://youtu.be/3d1lCjnZ9S8. పై హిందీ లో ఉన్న పాటకు ఇది తెలుగు అనువాదం.గుండెల్ని పిండేసే ఈ గీతాన్ని వినండి.

31. పాటల పూదోట

 

భరతన్ దర్శకత్వంలో కీరవాణి మనల్ని మంత్ర ముగ్దుల్ని చేసిన ఈ గీతం "దేవరాగం "అనే మలయాళ చిత్రంలోనిది.చిత్ర, జయచంద్రన్ స్వరాల్లో జాలువారిన "దేవరాగాన్ని " వినండి ఈ వారాంతం.(https://youtu.be/pUmyjM35LII)

30. పాటల పూదోట

 

"ఆనందం"సినిమా పేరు విన్నారా ఈ పాట ప్రత్యేకత సగం పాట గాయకుడు పాడాక మిగతా సగం గాయని పాడుతుంది. సిరివెన్నెల చిలికిన చిక్కని తెలుగు పదాల సౌరభాన్ని దేవిశ్రీ ప్రసాద్ తన సంగీతం తో మరింత గుబాళింప చేసాడు.ప్రతాప్ చిత్రల స్వరాల్లో చిత్రంగా పలికిన ఈ గీతం ఈ వారాంతం మీ కోసం.(https://youtu.be/pN8g9Mp-a_4)

29. పాటల పూదోట

 

సిరివెన్నెల పాటల్లో ఆణిముత్యం ఈ పాట. కెవి మహదేవన్ స్వర కల్పనలో బాలు, సుశీల పాడిన ఈ పాట ఎన్ని సార్లు విన్నా తనివితీరదు. విశ్వనాధ్ దర్శకత్వం లో వచ్చిన  " సిరివెన్నెల" చిత్రం లోని పాటలన్నీ అజరామరం.(https://youtu.be/dfOYIXOclTg)

28.పాటల పూదోట

 

https://youtu.be/vbz_BVTiozE ) శివ compose చేయగా సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాట  ఒకే టెంపో లో సాగుతూ మన హృదయాలను మీటుతుంది, వినండి ఈ weekend.

27. పాటల పూదోట

 

https://youtu.be/rGX1Ch6OyUs(https://youtu.be/rGX1Ch6OyUs )"వరాహరూపం" పాట విన్నారా, origional song సన్నాయి మీద సాగితే ఇందులో వేణువు, గిటార్ modern music touch చేస్తూ అనూప్ శంకర్ చేసిన విభిన్నప్రయోగం,వినండి మరి.)