Monday, 7 July 2025

చదవడం, వ్రాయడం నేర్పిద్దాం

 *ధారాళంగా* *చదవడం* , *శుద్ధంగా* *వ్రాయడం* *నేర్పిద్దాం* ( 2)

             పోయిన సారి వచ్చిన మెదటి వ్యాసానికి ఇది కొనసాగింపు.ఇంతకు ముందు వ్యాసానికి రెండు తెలుగు రాష్ట్రాల నుండి మంచి స్పందన వచ్చింది. ఫోన్ లో వాట్సాప్ లో మిత్రులు పలకరించారు. కొంత మంది మేము కూడా మెదలు పెడతామని, మరికొంత మంది తాము చేసిన విధానాల గురించి వివరించారు.                                         సహజంగా తరగతి గదిలో మనకున్న వ్యవధి తక్కువ. Syllabus పూర్తి చేయడం పరీక్షలకు  సిద్ధం చేయడం వంటి వాటికే సమయం చాలదు అనుకుంటాం.ఒక సారి మనం వెళ్లే తరగతి పిల్లలకి ఆయా subjects ఉపాధ్యాయులు వారి పాఠాలను చదివించడం, dictation చెబితే ఎంత మంది వెనుకబడి ఉన్నారో అర్థం అవుతుంది. లేదా పరీక్షా పత్రాలు దిద్దుతున్నప్పుడు వాళ్ళు వ్రాసింది చూస్తే పరిస్థితి మరింత అర్ధం అవుతుంది. మనం చెప్పిన పాఠం చదవడం రాక వాటిని పరీక్షలో వ్రాయలేక పోతే మనకే అనిపిస్తుంది కదా అయ్యో ఇలాగే వీళ్ళు 10 వ తరగతి వరకు వెడితే అప్పుడు సమస్య మరింత తీవ్రమవుతుంది కదాని!          అందుకని పై రెండు అంశాల్లో అన్ని తరగతుల్లో విద్యార్థులను గుర్తించి అందరు ఉపాధ్యాయులు వారి వారి subject లలో నేర్పించగలిగితే విద్యార్థుల్లో చదువు పట్ల ఇష్టం ఏర్పడుతుంది. బడి తెరిచాక నేను ఈ విధానం అమలు చేస్తున్నప్పుడు పిల్లల్లో ఈ కృత్యం పట్ల విపరీతమైన ఆసక్తి ఏర్పడింది. మెదటి పాఠంలోని పదాలన్నీ రెండు, మూడు.... అక్షరాల పదాలుగా వర్గీకరించుకుని గ్రూప్ leaders సహాయంతో పిల్లలే నేర్చుకుంటున్నారు. 4,5 అక్షరాల పదాల వరకు ఇంగ్లీష్ భాషా పదాలే ఎక్కువగా ఉంటాయి. 6 అక్షరాల పదాల నుండి PS Subject పదాలు ఎక్కువగా వస్తున్నాయి.రెండవ పాఠం నుండి నేర్చుకున్న మొదటి పాఠం లోని పదాలు తీసివేస్తే చాలా వరకు కొత్త పదాలు తగ్గిపోతుంటాయి.రెండు మూడు నెలలపాటు 3 పాఠాల్లో ఇలా చేస్తే తరువాత వారికి చదవడం, వ్రాయడం వచ్చేస్తుంది. తరువాత కూడా సంవత్సరమంతా group leaders వారిని follow up చేసే విధంగా చేయాలి.               కొద్దిగా మనం ఈ విషయం ఆలోచించి ప్రయత్నం చేస్తే తప్పకుండా పిల్లలు నేర్చుకుంటారు. మీరు చేసే ప్రయత్నాలు, వినూత్న విధానాలు నాకు తెలియజేయండి. మన అనుభవాలను సంకలనం చేద్దాం.ఈ వ్యాసాన్ని మన ఉపాధ్యాయ మిత్రులకు whatsapp, telegram, Facebook ఇలా అన్ని social media గ్రూప్ ల ద్వారా share చేయండి. ఎక్కువ మంది విద్యార్థులు ఈ సమస్య నుండి బయట పడాలని ఆశిద్దాం. ధన్యవాదాలు. ఒద్దుల రవిశేఖర్ SA(PS)

Monday, 30 June 2025

ధారాళంగా చదవడం -శుద్ధంగా వ్రాయడం

 *ధారాళంగా* *చదవడం* , *శుద్ధంగా* *వ్రాయడం* :

భాషలు నేర్చుకోవడానికి LSRW ప్రక్రియను పాటిస్తుంటారు. Listening, Speaking, Reading, writing. పాఠశాలల్లో తెలుగు హిందీ ఇంగ్లీష్ భాషలు ఉంటాయి.ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా English medium అమల్లో ఉన్నందున Maths, Physical and Biological sciences,Social కూడా english భాష లోనే నేర్చుకోవలసి వస్తుంది. English లో ధారాళంగా చదవడం, శుద్ధంగా వ్రాయడం రాకపోతే ఈ subjects నేర్చుకోవడం సాధ్యం కాదు.English ఉపాధ్యాయులు ఈ విషయాలపై విశేషంగా శ్రమిస్తున్నా Non language subject లలో వచ్చే పదజాలం english subject పాఠాల్లో ఉండకపోవడం వల్ల కూడా విద్యార్థులు వాటిని చదవడం, వ్రాయడం లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

               ఈ సమస్య ను అధిగమించడానికి నాకు వచ్చిన ఆలోచనతో ఒక చిన్న ప్రయత్నం మా పాఠశాల లో మొదలు పెట్టాను. ఈ విద్యా సంవత్సరం మొదటి రోజు నుండే 7 వ తరగతి గణితం 8,9,10 తరగతుల భౌతిక శాస్త్రం మెదటి పాఠాల్లోని అన్ని english పదాలను అక్షరాల సంఖ్యకు( రెండక్షరాల, మూడ క్షరాల......... పదాలు )అనుగుణంగా విద్యార్థులతో notes లో వ్రాయించాను. బాగా చదివి వ్రాయగలిగే పిల్లల్ని group leaders గా పెట్టాను. వీరు తమ group లోని పిల్లలకు ఆయా పదాలను పలకడం వ్రాయడం లో సహాయం చేస్తుంటారు. నేను ప్రతి రోజు follow up చేస్తుంటాను. తరగతి లో కొద్ది సేపు విద్యార్థులతో పదాలను చదవడం వ్రాయడం లో పోటీ పెడుతుంటాను.అలాగే కొద్దిసేపు వాక్యాలు చదివిస్తాను. అలాగే ప్రతిరోజు ఇంటి దగ్గర పాఠాన్ని తెలుగు english భాషల్లో రెండు సార్లు చదివేలా ప్రోత్సాహిస్తుంటాను.

             పాఠం ఎప్పుడైతే చదవడం బాగా వస్తోందో వ్రాయడం తప్పుల్లేకుండా వ్రాస్తారో అప్పుడే విద్యార్థికి ఆత్మ విశ్వాసం కలిగి ఆయా అంశాలను నేర్చుకొని పరీక్షల్లో వ్రాయ గలుగుతారు. ఈ విషయాలను గమనించి గణితం, PS&BS, సోషల్ ఉపాధ్యాయులు తమ పాఠాల్లోని పదజాలం విద్యార్థులకు నేర్పిస్తూ,చదివిస్తూ ఉంటే విద్యార్థుల్లో ఆయా subject లలో మంచి ప్రగతి నమోదు అవుతుంది. అలాగే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఉపాధ్యాయులు తమ భాషలు చదవడం, వ్రాయడం లో విద్యార్థులను ప్రావీణ్యులుగా చేయడానికి మరింతగా కృషి చేస్తారని హృదయ పూర్వకంగా కోరుకుంటున్నాను.    

             అందరం కలిసి విద్య కు పునాది అయినటువంటి ధారాళంగా చదవడం, శుద్ధంగా వ్రాయడం విషయాల్లో కలిసికట్టుగా కృషి చేసి విద్యార్థుల విద్యాభి వృద్ధికి కృషి చేద్దామని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.తెలంగాణ లో కూడా English medium ఉంది కనుక ఈ విషయాన్ని పరిశీలించ గలరు.ఈ విషయాన్ని మీ మిత్రులందరికీ, అన్ని Fb, telegram ఉపాధ్యాయ whatsapp, groups ద్వారా share చేయగలరు. పై విషయం పై ఎవరయినా విభిన్నంగా, వినూత్నంగా ప్రయత్నిస్తున్న మిత్రులు తెలియజేయగలరు.

 ఒద్దుల రవిశేఖర్ SA(PS).

Wednesday, 1 January 2025

BIS వారి పరిశ్రమల యాత్ర

 

*BIS* *వారి* *పరిశ్రమల* *సందర్శన* *యాత్ర* :
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్ వారు ఏర్పాటు చేసిన పరిశ్రమల సందర్శన లో భాగంగా ZPHS చెన్నారెడ్డి పల్లె విద్యార్థులు కడప జిల్లా బద్వేలుకు
సమీపంలోని సెంచరీ ప్లై వుడ్ కంపెనీ ని సందర్శించారు.ఈ కార్యక్రమంలో BIS తరపున G. కిషోర్ గారు హాజరయ్యారు. మొదటగా పాఠశాల లో BIS కార్యక్రమాల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ Y. శ్రీనివాస రావు,ఉపా ధ్యాయులు ఒ.వి. రవిశేఖర రెడ్డి( మెంటర్ BIS), ఒ.నరసింహారావు 8,9 వతరగతుల  విద్యార్థులు 26 మంది తో కలిసి సెంచరీ కంపెనీ సందర్శనకు బయలు దేరారు. కంపెనీ యాజమాన్యం సా దరంగా ఆహ్వానించి, కంపెనీని త్రిప్పి చూపించి విద్యార్థులకు వివరించడానికి ఇద్దరు ఉద్యోగులను కేటాయించారు.సుబాబుల్,మామిడి కర్ర ను ఉపయోగించి ప్లై వుడ్ తయారు చేస్తారని చెప్పారు. అంతా ఆటోమేటిక్ మిషన్ ల ద్వారా జరుగుతుందని కర్ర ను ముక్కలయ్యే దశనుండి చివరకు ప్లై వుడ్ తయారయ్యేంతవరకు వివిధ దశలను చూపిస్తూ వివరించారు. అన్ని యంత్రాలను కంప్యూటర్ ద్వారా గమనిస్తుంటారు. విద్యార్థులు తమ సందేహాలను అడుగుతు చాలా ఆసక్తిగా కంపెనీ లోని అన్ని విషయాలను తెలుసుకున్నారు. యంత్రాల పని తీరు, నిర్వహణ విధానం, అయిన ఖర్చు ను తెలుసుకుని ఉత్పత్తి అయిన వుడ్ ను చూసి విద్యార్థులు ఆశ్చర్యానికి లోనయ్యారు. చక్కని ఆతిధ్యం ఇచ్చి విద్యార్థులకు అన్ని విషయాలను వివరించిన కంపెనీ యాజమాన్యానికి ఉపాధ్యాయులు ధన్యవాదాలు తెలియ జేశారు.