Saturday 18 February 2017

                                                    తమిళనాడు యాత్ర నా అనుభవాలు
                  ముందే ప్రయాణ టికెట్స్ బుక్ చేసుకున్నందున స్థిమితంగా ఉన్నాము. కానీ అక్కడ రాజకీయ పోరాటం మొదల య్యింది .ఎక్కడ గందరగోళం జరుగుతుందోనని ఆందోళన పడ్డా గవర్నర్ నిర్ణయం ఆలస్యం అవటంతో మేము యాత్ర ముగించుకుని రాగలిగాము .
           ఒంగోలులో అర్థ రాత్రి హైదరాబాద్ చెన్నై superfast express లో బయలుదేరాము .చెన్నైకి ఉదయం 6 గంటలకి చేరాలి .కానీ ఊరిబయట ముప్పావుగంట ఆపేసాడు.తరువాత కదిలినా చిన్నగా 7;50 కి చెన్నై సెంట్రల్ చేరుకున్నాము.8;15 కు ఎగ్మోర్ లో గురువాయూర్ express లో త్రిచికి వెళ్ళాలి. ఆటోలో ఎగ్మోర్ చేరుకొని పరుగెత్తి ఎక్కినా 2 నిముషాల కే  కదిలింది.ఈ అసౌకర్యానికి బి.పి పేషంట్స్ అయితే ట్రైన్ మిస్ అయ్యేవాళ్ళు .
            చెన్నై సెంట్రల్ బయట ఆటో లు ఎక్కువ రేట్ అడుగుతారు.కొద్దిగా బయటకు వెళ్లి ఎక్కితే మంచిది. సమయం ఉంటె చక్కగా బస్సులు  ఉన్నాయి .కాస్త అడిగి ఎక్కాలి.బస్సులపై వివరాలు తమిళంలో ఉంటాయి.  బస్సు సంఖ్యల ఆధారం గా ఎక్కాలి.ఇంగ్లీష్ లో పేర్లు ఉంటె బాగుండు .సెంట్రల్ నుండి ఎగ్మోర్ కు  40 రూపాయ లు తీసుకుంటారు.కానీ కొంత మంది rs100 అడుగుతారు.బస్సు కు అయితే కేవలం 4 రూపాయలు మాత్రమే.కొద్దీ దూరం ముందు కెడితే ఓ ఫ్లైఓవర్ వస్తుంది.అక్కడకు బస్ లు వస్తాయి.అక్కడనుండి ఎగ్మోర్కు కేవలం 5 నిముషాల ప్రయాణం .
        త్రిచి (తిరుచిరాపల్లి )లో ఆ రూమ్ తీసుకున్నాము . ASHBAY HOTEL  మన సినిమా లో ఉండే మండువా ఇల్లు లాగా ఉంటుంది .అద్దె  ఇద్దరికి RS 950 ,అదనం గా ఒకరికి 250 ఉంటుంది .1956 నుండి నడుస్తున్నది . చక్కటి ఇంటి వాతావరణం 1. 5 ఎకరా విస్తీర్ణం,మొక్కలు చెట్లు ఉంటాయి.రైల్వే స్టేషన్ కి బస్సు స్టాండ్ కి మధ్య లో ఉంటుంది .టిఫిన్స్ త్రిచి  రైల్వే స్టేషన్లో బాగుంటాయి .కొద్దిగా రేట్ కూడా తక్కువే కాఫీ 10 రూపాయలు .మంచి టేస్ట్ ,మన కంటే పరిమాణం కాస్త ఎక్కువ .దోషాలు పెద్దగా ఉంటాయి .రేటు 40 ఉంటుంది భోజనం దగ్గరలో ఆనంద్ హోటల్ ప్రక్కనే రెస్టారంట్ లో బాగుంటుంది .
     ఇక మరుసటి రోజు ఉదయాన్నే శ్రీరంగం బయలు దేరాము.7 కి మీ ఉంటుంది . rs 6 చార్జి .చాలా గొప్పగా ఉంది ఆలయం.విశాల మైన ప్రాంగణం.చాలా గుళ్ళు ఉన్నాయి.విష్ణువు కొలువై ఉన్నాడు.గర్భగుడిలో శయనించిన విష్ణువును చూడటం మరవొద్దు.ప్రాంగణమంతా తిరగాలంటే ఒక పూట  పడుతుంది.వేయి కాళ్ళ మంటపం,చుట్టూ ప్రాకారాల్లాంటి గోపురాలు,చూడచక్కని శిల్ప సంపద .ఆ కాలపు రాజుల అభిరుచి చెక్కిన స్తంభాలు ,మంటపాలు ఆలయాలు గోపురాల లో  వ్యక్త మవుతుంది (తరువాయి భాగం మరో పోస్ట్ లో )       

Wednesday 15 February 2017

తమిళనాడు యాత్ర

తమిళనాడు యాత్ర :.                                                           రెండు రోజులు శ్రీరంగపట్నం,త్రిచి,తంజావూరు,కుంభకోణం యాత్ర గురించి మీతో పంచుకోవాలని పించింది.తిరుచురాపల్లి నే త్రిచి అంటారు.ఇది జిల్లా కేంద్రం,ఇక్కడ airport కూడా ఉంది.దీనికి దగ్గర లోనే శ్రీరంగపట్నం లో విష్ణువు కొలువై ఉన్నాడు.ఇక్కడి  గుడి చాలా విశాలంగా ఉంటుంది.శిల్పకళ కు అచ్చెరువొందుతాం.తరువాత తంజావూరు బృహదీశ్వరాలయం చూశాము.దీనిని big temple అంటారు.ఇది ఆసియా లోనే ఒక పెద్ద గుడి అంటారు.కుంభకోణం లోని సారంగపాణి,కుంభేశ్వర ఆలయాలు దర్శించాం.

Thursday 2 February 2017

బ్లాగులు :ఒక సమీక్ష
                        మన మది లోని భావాలను స్వేచ్చగా వ్యక్తీరించటానికి బ్లాగులు మంచి సాధనంగా ఉపయోగపడేవి . అప్పుడు ఎంతో మంది మిత్రులు పరిచయ మయ్యారు . ఒకరి పోస్టులు మరొకరు చదువుతూ చాలా ప్రొత్సాహక రమైన మాటలతో వ్యాఖ్యలు వ్రాస్తూ చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో బ్లాగులు ఉండేవి .తరువాత ఫేస్బుక్ బాగా ప్రాచుర్యం పొందిన తరువాత అందరు దానిలో సభ్యులు కావటం తో అక్కడే ఎక్కువగా గడుపుతూ బ్లాగుల్లో వ్రాయటం తగ్గించారు.నేను కూడా అంతే.దీని తరువాత దీనికంటే ప్రభావం కల్గించింది వాట్సాప్.ఇక జనం అంతా వ్యక్తిగతంగా గ్రూపుల్లో ఒకటే ముచ్చట్లు.దీనితో కొంత ఫేస్బుక్ ప్రభావం తగ్గటం తో గమనించిన ఫేస్బుక్ యాజమాన్యం వాట్సాప్ ను కొనేసింది.
           ఇక వాట్సాప్ లో గ్రూపుల్లో ఎన్నో సమస్యలు అడ్మిన్ ఒక ఉద్దేశ్యం తో గ్రూపు ప్రారంభిస్తే  పోస్టులు ఎవరి ఇష్టం వఛ్చినట్లు వారు వ్రాయటం చాలా గొడవలు జరగటం చాలా గ్రూపులు మూసివేయటం జరిగాయి .ఫొటోస్ ,వీడియో లు విపరీతం గా షేర్ చేసుకోవటం ఎంతో మందికి చికాకు తెప్పిస్తుంది .అడ్మిన్స్ ఎంత మొత్తు కున్నా వినే వారు లేరు అంతా చదువుకున్న వారే,మరి అర్థం చేసుకోరు ఎందుకో. రిలయన్స్ ఫ్రీ డేటా ఉండటం వ లన  ఇన్ని గ్రూపులు ఉన్నాయి గాని రేపు డబ్బులు వసూలు చేస్తే చూడాలి ఎంత మంది వాట్సాప్ లో ఉంటారో!
         బ్లాగు మిత్రులందరికీ మనవి ,అందరు మరల రండి బ్లాగు వేదికగా మన ఆలోచనలు అభిరుచులు కలబోసుకుందాము.      

Sunday 1 January 2017

కాలం(Time)
                     భూమి సూర్యుని చుట్టూ మరో  సారి చుట్టి వచ్చింది.అందుకే మన మంతా కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతున్నాం.కాలాన్ని విభజించుకుని పని చేయటం అలవాటయిపోయింది మరి.కానీ గతం లోని పనులు,భావాలు ,అభిరుచులు, లవాట్లు అభిప్రాయాలు దృక్పధాలు ఇవేమన్నా మారాయా,అలాగే ఉన్నాయా   తరచి చూసు కోవటం లేదెవ్వరు.కాలంతో పాటు ఎన్నో మారుతుంటాయి. ఆ మార్పు మంచి వైపుకైతే ఆహ్వానించవచ్చు.అదే చెడు వైపుకైతే ఆలోచించాల్సిందే .
               కొత్తదనం ప్రతి క్షణానికి సొంతం.దాన్నిమరిచి పోతున్నాం .ప్రతిక్షణం మన మనసు నిత్యనూతనం.ప్రతి క్షణాన్ని ఇలాగే ఆహ్వానిస్తే ఎలా ఉంటుంది.జీవితం నిత్య నూతన మై పోదూ !మనసును ఎప్పుడూ ఉల్లాసంగా ,ఉత్సాహంగా ఉంచుకుంటూ ఉంటే ఆనందం వెతుక్కుంటూ వస్తుంది .
            గతాన్ని తవ్వుకుంటూ బాధపడే కన్నా వర్తమానంలో ఉంటూ చేసే పనిలో లీనమైతే ఆనందం మన సొంత మవుతుంది.కాలం మనల్ని తనలోకి లాక్కెళుతూ ఉంటుంది.ఆ ప్రవాహంలో కొట్టుకు పోకుండా అనుబంధాలను,స్నేహ సంబంధాలను కాపాడుకుంటూ నిత్య నూతనంగా అందరూ గడపాలని నా కోరిక .