Thursday 11 April 2013

విజయనామ ఉగాది ---తెలుగు వైభవం


       
                          ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి ఉన్న తెలుగు ప్రజలందరికి విజయ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.తెలుగు వారి మొట్ట మొదటి పండుగ ఇది.చైత్ర శుద్ధ పాడ్యమిన ఈ పండుగ వస్తుంది..ఇది ఉగాది అనే సంస్కృత పదానికి వికృతం.యుగానికి  ఆది కాబట్టి యుగాది అయింది.
       ఉగాది=ఉక్+ఆది ,ఇందులో ఉక్ అనగా నక్షత్రము అని అర్థం.మనిషి ఆది నక్షత్రాన్ని కనుగొన్న రోజు ఆదిమ దశ నుండి వైజ్ఞానిక దశకు ఎదిగే క్రమంలో జరుపుకున్న తొలి ఉత్సవం అని అంటారు.
      నూతన సంవత్సరం లో కలుగబోయే సుఖ దుఖాలకు,తీపి గుర్తులకు చెడు అనుభవాలకి ప్రతీక ఈ షడ్రుచులుగల ఉగాది పచ్చడి.పచ్చడిలో వాడిన ప్రతి వస్తువు ఒక్కోఔషధం.వేప పూత(చేదు),మామిడి ముక్కలు(వగరు ),చింత పండు పులుసు(పులుపు),చెరకు ముక్కలు,మిరియాలు(కారం
) జీల కర్ర,బెల్లం(తీపి),లవణం(ఉప్పు) శనగలు,పాలు,కొబ్బెర ముక్కలను కలుపుతారు. ఇంకా అరటిపళ్ళు,ఎండు ద్రాక్ష,జీడిపప్పు,బాదం పప్పు కూడా రుచి కోసం వేసుకుంటారు.ఈ పచ్చడి తినటం శరీరానికి మంచిది.బంధు మిత్రులకు కూడా పంచాలి.
             చై త్రం,వైశాఖం ఈ రెండు నెలల్ని కలిపి వసంత రుతువు అంటారు.ఈ కాలంలో గాలి మెల్లగా వీస్తుంది.చెట్లు పాత ఆకులు రాల్చి కొత్త చివుళ్ళు చిగురిస్తాయి.ఇది వసంతోదయానికి స్పష్ట మైన లక్షణం.కోయిలలు మదురం గా కూస్తుంటాయి.ఈ రుతువులో కోయిల మామిడి చిగురు తింటూ ఉత్సాహంగా గానం చేస్తుంటే ప్రకృతి పరవశించి పోతుంది.సృష్టిలో జరిగే ఈ రమణీయ మైన మార్పు మనకు ఆహ్లాదాన్ని ,ఆనందాన్ని కలిగిస్తుంది.
         ఈ సందర్భంగా తెలుగు భాష గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం.
                                            మంచి గుమ్మడి కన్నా దంచిన
                                         కొవ్వడ్ల బియ్యము కూడు కన్నా
                                       మేల్ జహంగీర్ మామిడి పండు కన్నా సుం
                                            కారిన లే సజ్జకంకి కన్నా
                                   కమియ పండిన ద్రాక్ష కన్న,చక్కర తగ
                                        బోసి వండిన పాలబువ్వ కన్న
                                      రస దాడి కన్నా పనసతోన కన్న,క
                                        జూరము కన్నను జున్నుకన్న
                                  అలతి పెర తేనియల కన్న,నామని తరి
                                     కొసరి కోసిన కోయిల కూత కన్న
                                    ముద్దులోలికెడి జవరాతిమోవి కన్న
                                    తీయ నైన దెయ్యది? అదే తెలుగు బాస    __ముదిగొండ వీర భద్ర మూర్తి.
                                  ఎంత కమ్మగా ఆ కవి వర్ణించాడో చూడండి.
         శాత వాహనుల కాకతీయుల ,కృష్నదేవరాయల పాలనలో తెలుగు భాష వృద్ది చెందింది.కృష్ణ దేవరాయలు తన ఆముక్త మాల్యదలో దేశ భాష లందు తెలుగు లెస్స అన్నాడు.ఇటలీ దేశస్థుడైన నికొలా య్ కామ్తే1420 లోమన భారత దేశం వచ్చినప్పుడు మన  తెలుగు భాష గురించి Italiyan of the east అన్నాడు.ఇటలీ భాష కూడా మన భాష లాగే అజంత భాష. అనగా పదము చివర అచ్చుతో అంత మయ్యె భాష.ప్రముఖ తమిళ కవి సుబ్రమణ్య భారతి సుందర తెలుంగు అన్నాడు.
        శాతవాహనులలో ప్రముఖుడైన హాలుడి ఆస్థానం లో గునాడ్యుడు ఆస్థాన కవిగా ఉండే వాడు.ఆ యన పైశాచీ భాషలో వ్రాసిన  బృహుత్కథ ప్రపంచం లోని ప్రముఖ భాష  లన్నింటిలోకి అనువాదం అయింది.ఇది  తెలంగాణాలో పుట్టింది.దీనిని సోమ దేవుడు తెలుగు లో కథా సరిత్సాగరం గా అనువదించారు.
        తెలుగు మొట్ట మొదటి పద్యం తరువోజ ఇది అద్దంకి లో పుట్టింది.కందం కరీంనగర్ లో పుట్టింది.వేమన ఆట వెలది లో అద్భుత మైన పద్యాలు వ్రాసారు.ఆది కవి నన్నయ,తిక్కన ఎర్రన కవిత్రయం మహా భారతాన్ని ఆంధ్రీకరిం చారు.ఆధునిక కాలం లో గురజాడ,వ్యవహారిక భాశోద్యం సారధి గిడుగు రామమూర్తి తెలుగును సుసంపన్నం చేసారు.తన జీవితాన్ని తెలుగు భాష కోసం వెచ్చించిన మహనీయులు బ్రౌన్.వీరు ఎన్నో తెలుగు గ్రంధాలను వెలికి తీసారు.అలాగే కద్వెల్,గిన్,హాల్డేన్ మొదలైన వారు ఎంతో సేవ చేసారు.డా డేనియల్ నేజర్స్ తెలుగు వారి బుర్ర కథలపై పరిశోధన చేసి పారిస్ లో సిద్దాంత వ్యాసం సమర్పించాడు.
            కర్నాటక సంగీత వాగ్గేయ కారుల్లో త్రిమూర్తు లైన శ్యామ శాస్త్రి,త్యాగ రాజు,ముత్తు స్వామి మన తెలుగు వారే .వస్తుత ఇది తెలుగు సంగీతమే.
          ప్రపంచం లో లిపి ఉన్న భాషల్లో అత్యుత్త మైన దాని ఎంపిక చేయగా మన తెలుగుకు ద్వితీయ స్థానంవచ్చింది కొరియాకు ప్రధమ స్థానం ,ఆంగ్లానికి తృతీయ స్థానం వచ్చాయి.దీనికి విశేష కృషి చేసి అచ్చ తెనుగు సొగసును సొబ గును ప్రపంచానికి చాటిన వారు మాడ భాషి సంపత్కుమార్.
          ఎదుటివారికి అర్థమయ్యే భాషలో మాట్లాడితే ఆ మాటల భావం వారి మెదల్లలోకి వెడుతుంది.అదే వారి మాతృ భాషలో మాట్లాడితే నేరుగా వారి హృదయాలను తాకుతుంది--------నెల్సన్ మండేలా    ఇది అక్షర సత్యం కదా!
        ప్రతి ఒక్కరు తమ మాతృ భూమిని ,సంస్కృతిని,మాతృ భాషను గౌరవించాలి.ఎందుకంటే అవి మనకు ఆనందాన్ని కలిగించేవి.--------------ఋగ్వేదం
        600 సంవత్సరాల క్రిందట భరతుని నాట్య శాస్త్రం నుండి సిద్ద్డెంద్ర యోగి కూచి పూడి  నాట్యాన్ని సృష్టించారు చక్కర తేనెల ఊట,మధురామ్రుతాల తోట ,నవరస నాట్య దీపిక మన కూచిపూడి
        బాపు బొమ్మలు,బాపు అక్షర శైలి మన భాషకే సొంతం.అన్నమయ్య ,త్యాగయ్య,క్షేత్రయ్య ప్రముఖ వాగ్గేయ కారులు.
          మల్లె పూవు కంటే----- మంచి గంధము కంటే
          పంచదార కంటే----పాల కంటే
          తెలుగు భాష లెస్స!దేశభాషలకు,సం
          గీతభాష తెలుగు జాతి భాష ----------రసరాజు
   ఒక సంగీత మేదో పాడినట్లు ,భాసించు నపుడు వినిపించు భాష అన్నారు విశ్వనాద.
   అవధానం తెలుగు భాషలో మాత్రమే ఉంది కొండవీటి వెంకట కవులు,గరికపాటి,నాగ ఫనిశర్మ ప్రసిద్ధులు.
చలం,శ్రీశ్రీ,శేషేంద్ర శర్మ,డా సి.నారె, దాశరథి ఇలాంటి ఎంతో మంది ఆధునిక కవుల వలన కూడా తెలుగు భాష పరిమళిస్తుంది.
(పై సమాచారం తెలుగు వెలుగు మాస పత్రిక, మరికొన్ని ఇతర పుస్తకాలనుండి సేకరించినది.వారికి ధన్య వాదాలు.)

4 comments:

  1. ఉగాది గురించి తెలుగు గురించి మంచి విషయాలు పంచుకున్నారు.
    పండుగ శుభాకాంక్షలు.

    ReplyDelete
  2. ఎప్పటిలాగే చక్కని విషయాలు ఉగాది గురించి టపా లో పొందుపరిచారు.ధన్యవాదాలు రవిశేఖర్ గారు.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు వెన్నెల గారు!

      Delete