Sunday 11 November 2012

ప్రాధమిక విద్య కు బాలల హక్కుల చట్టం 2009


          {జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా వ్రాసిన ఈ వ్యాసం ప్రాధమిక విద్య కు బాలల హక్కుల చట్టం        తయారు చేసిన కమిటి లో సభ్యులయిన ప్రొఫెసర్ శాంతా సిన్హా (chairman National child rights commission) ప్రోఫెసర్ నళినీ జునేజా,R.వెంకట రెడ్డి(సెక్రెటరీ M.V Foundation) ల Seminars కు హాజరయి రూపొందించినది.వారికి ధన్యవాదాలు.}
   పరిచయం:విద్యా ప్రాధమిక హక్కుపై చర్చ భారత దేశానికి కొత్త గాదు.ఈ అంశాలు గత 130 సంవత్స రాలుగా చర్చించ బడుతున్నాయి.1882 సం:లో మహాత్మా జ్యోతీరావు పూలే indian education commission(hunter commission) కు సమర్పించిన నివేదికలో బ్రిటిష్ ప్రభుత్వం విద్యా వ్యాప్తికి సమకూర్చే నిధులు అగ్ర వర్ణ విద్యా వ్యాప్తికి మాత్రమే సహకరిస్తూ దళితులకు ,బలహీన వర్గాలకు ఈ విద్య అందకుండా ఎలా దూరం చేస్తున్నయో వివరించారు.1911 సం:లో బొంబాయి assembly లో గోపాల కృష్ణ గోఖలే ప్రాధమిక విద్యా హక్కు బిల్లును లేవనెత్తి నప్పుడు తీవ్ర వ్యతిరేకత వ్యక్త మయింది.1937 సం :లో  వార్డా జాతీయ  విద్యా  సదస్సులో  గాంధీ ప్రాధమిక విద్యకు అధిక నిధులు కేటాయించాలని కోరినా ఆనాటి మంత్రులంతా నిధులు లేవన్న వాదనతో తోసి పుచ్చడం జరిగింది.
        april 1947 లో వల్లభాయి పటేల్,కృష్న స్వామి కమిటీ విద్య ప్రాధమిక హక్కుగా మార్చటం గురించి చర్చించింది.గోబింద్ వల్లభ పంత్ దీనిని వ్యతిరేకించి Non justiciable fundamental right list లోనికి పంపించమన్నారు.అనగా ఆదేశిక సూత్రాలలో (Directive principles of state policy)చేర్చమన్నారు.
K.TShah దీనిని వ్యతిరేకించారు.ఆదేశిక సూత్రాలలో పెడితే ఒరిగేది ఏమీ లేదు.L.C jain తన రిపోర్ట్ లో బడ్జెట్ లో విద్య గురించి ఆర్దిక మంత్రులు మాట్లాడలేదు అన్నాడు.14 సం:వరకు నిర్బంధ ఉచిత విద్య అందించడానికి ఉద్దేశించిన ముసాయిదాబిల్ article 45  ను 11 సం:కు కుదించాలని 1948-49 లో రాజ్యాంగ సభ చర్చల్లో పాల్గొన్న ఒక సభ్యుడు అంబేద్కర్ తో వాదించాడు.అంబేద్కర్ వ్యతిరేకిం చక పోతే సవరణ జరిగేది.అలా జరిగి ఉంటె 11 సం:ల వయస్సు పిల్లలు పనులలో చేరి ఉండే వారు.అందులోని  మెజారిటీ  సభ్యులు  article 45 ను రాజ్యాంగపు మూడవ భాగంలో చేర్చకుండా అంబేద్కర్ ను నిరోధించారు.ఫలితంగా ఆధునిక భారత దేశం లో విద్య ప్రాధమిక హక్కు కాలేక పోయింది.1986 సం :కొత్త విద్యా విధానం రూపొందుతున్న సమయానికి 5-14 సం :ల వయస్సు కలిగిన మొత్తం పిల్లలలో సగం మంది ఆడపిల్లలయితే మూడింట రెండు వంతుల మంది బడి బయటే ఉన్నారు.s.c,s.t,మైనారిటీలు వికలాంగుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది.80-85% s.c బాలికలు ,90%s.t బాలికలు  10 వ  తరగతి  వరకు  చేరటం  లేదు .రిజర్వేషన్ ఫలాలు వారికందటం లేదు.ప్రైవేటీకరణ పెరగడం వలన సమాన నాణ్యత కలిగిన విద్య నందించే విషయం లో సమాజం లోని ఉన్నత వర్గాలకు,పేదలకు మధ్య అంతరాలు మరింత పెరుగుతున్నాయి.
    J.P.unnikrishanan versus A.P Govt మరియు  ఇతరులు (S.C2178,1993) కేసులో సుప్రీం కోర్టు తన చారిత్రాత్మక తీర్పులో ఈ పెడ పోకడలను తీవ్రంగా నిరసించింది.రాజ్యాంగం మనకు ప్రాధమిక హక్కులుగా భావ ప్రకటనా స్వేచ్చ జీవించే  హక్కు  (article 21) దేశంలో ఎక్కడయినా నివసించే హక్కు వంటివి కల్పించింది.వీటికి భంగం కలిగితే మనం కోర్టు ను ఆశ్రయించ వచ్చు.ప్రభుత్వం ఖచ్చితంగా ఈ హక్కులు మనకు కల్పించాలి.అదే విధంగా రాజ్యాంగం లో మనకు ఆదేశిక సూత్రాలు ఉన్నాయి. ప్రభుత్వా లు వీటిని ఖచ్చితంగా పాటించాల్సిన పని లేదు.వీటిలో పిల్లల గురించి 24,39,45  అధికరణాల్లో వివరిం చారు.
అధికరణం  24:  14 సం : లోబడిన పిల్లలను వారికి ప్రయోజనకరమైయిన వృత్తులలో పరిశ్రమలు,గనులు వంటిచోట నివసిం చకూడదు.
అధికరణం 39: ప్రభుత్వాలు  పిల్లల  పసితనాన్ని  పరిరక్షిస్తూ ,వారు  పరువుగా  స్వేచ్చగా  ఆరోగ్యకర మయిన  వాతావరణంలో  ఎదిగేలా  అవకాసం  కల్పించాలి .
అధికరణం 45: రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి నుండి  10 సం :లోపు  పిల్లలందరికీ  14 సం : నిండే వరకు  ఉచితంగా  నిర్భందంగా  విద్య  నందించే  ప్రయత్నం  చేయాలని  ప్రభుత్వానికి  నిర్దేశించ  బడింది .
       45 వ ఆర్టికల్ దృష్ట్యా 21 వ ఆర్టికల్ ను(జీవించే హక్కు)ను పరిశీలిస్తే పిల్లలందరికీ విద్యా ప్రాధమిక హక్కును రాజ్యాంగం కల్పించినట్లు తెలుస్తుంది."అని సుప్రీం కోర్టు తన నిర్ణ యాత్మకమైన తీర్పులో స్పష్టం చేసింది.ఆదేశిక సూత్రాలు(నాలుగవ  భాగం)ప్రభుత్వం సాధించ వలసిన లక్ష్యాల యితే ప్రాధమిక హక్కులు (మూడవ భాగం)అందుకు అనుసరించవలసిన మార్గాలుగా సుప్రీం కోర్టు రూలింగ్ ఇచ్చింది. 45 article లో సవరణ జరిగినా ఆరు సం: లోపు పిల్లలకు పూర్వ ప్రాధమిక విద్య 45 article ను అనుసరించి 14  సం:దాటిన  వారు కూడా ప్రభుత్వ ఆర్ధిక సామర్ధ్యాలననుసరించి  విద్యా ప్రాధమిక హక్కును కలిగి ఉంటారని సుప్రీం కోర్టు పేర్కొంది.
(మిగతా భాగం తరువాతి వ్యాసం లో )

4 comments:

  1. Replies
    1. ధన్యవాదాలు వెన్నెల గారు!మరల చాలా రోజులకి మీ ఆగమనం స్వాగతం.

      Delete
  2. ennaallaki raja sekhar gaaroo!...blog ki selav prakatinchaaraa...manchi postu...@sri

    ReplyDelete
    Replies
    1. నిజమే ఓ ఇరవై రోజుల విరామం.ధన్యవాదాలు శ్రీనివాస్ గారు!

      Delete