Monday 11 May 2015

మనలో సమూలమైన మార్పును తీసుకురాగలమా!(నేడు జిడ్డు కృష్ణ మూర్తి జయంతి )



              "మన జీవితాలలో దౌర్జన్యం నిండి ఉన్నది .కనుక ఈ ప్రపంచం లో జరుగుతూ ఉన్న ప్రతి యుద్దానికి మనదే బాధ్యత. మన జాతీయ భావాలు,స్వార్థ పరత,దేవుళ్ళు ,అసూయలు,ఆదర్శాలు ఇవన్నీ మనను విడదీస్తున్నాయి ఇందులోని యధార్తను మన ఆకలినో బాధనో గమనించేంతటి స్పష్టంగా సూటిగా ప్రపంచంలోని గందరగోళం అంతటికీ మీరు నేను బాధ్యులుం .దుఖాని కంతటికీ మనదే బాద్యత.విభిన్న మైన సంఘాన్ని తయారు చేయటానికి జ్ఞానులు ఏవేవో చెప్పారు.అన్ని మా ర్గాలు సత్యం వంకే నడుస్తాయని చెప్పారు.పరిశీలిస్తే ఇది అసంబద్దం అని తేలిపోతుంది.  సత్యానికి మార్గం,పథం అంటూ ఏమీ లేదు.సత్యానికి సంబంధించిన సుందరత అదే. అది సజీవ మైనది.దానికి విశ్రాంత మందిర మేమీ ఉండదు.ఎవరు మిమ్మల్ని అక్కడికి తీసుకు పోలేరు.ఈ సజీవ వస్తువే మీ స్వస్వరూపం అన్న సంగతి మీరు గమనిస్తారు మీ కోపము మీ దౌర్జన్యము,మీ నిరాశ,మీ బాధలు ఇదంతా అర్థం చేసుకోవడం లోనే సత్యం ఉన్నది. 
            మీరు ఎవరిపైనా ఆధార పడి మనగలగడం అసాధ్యమని తేలి  పోయింది.ఎవరు మార్గ దర్శకులు లేరు ,గురువులు లేరు ఆధిపత్యం లేదు,ఉన్నదంతా మీరే ఇతరులతో మీ సంబంధ బాందవ్యాలు.మీరు నేను మరే బాహ్య సంపర్కము ప్రభావము లేకుండా ఎవరి ప్రోద్భలము,జులుము,శిక్ష పడుతుందేమో అన్న భయం లేకుండా మనలో సమూల మైన మార్పును తీసుకు రాగలమా ?మానసికంగా ఆకస్మిక పరిణామం తీసుకు రాగలమా మనం అప్పుడు క్రూరులం  కాకుండా పై పోటీ మనో భావం లేకుండా ఆదుర్దాలు, భయాలు,అసూయలు,దురాశలు లేకుండా ఇప్పుడు మన జీవితాలలో నిండిపోయిన కుళ్ళు కల్మషము ఏమాత్రము లేకుండా ఉండగలుగుతాము." JK 
(ఈ వ్యాసం జిడ్డు కృష్ణమూ ర్తి బోధనలతో కూర్చిన ప్రచురణ అయిన అంతరంగ యాత్ర నుండి సేకరించినది .వారికి ధన్యవాదాలు )  
మరిన్ని వివరాలకు http://www.jkrishnamurti.org/index.php  వెబ్సైటు ను సందర్శించండి .

Saturday 18 April 2015

సంభాషణలు చర్చలు ఇలావుంటే ఎలావుంటుంది ?

                         మనందరికీ రాజకీయాలు,సినిమాలు,క్రికెట్ ,కులం,మతం ,వ్యక్తీ ,ప్రాంతం,వర్గం,దేశం,తత్వం లాంటి విషయాల పై కొన్ని నిశ్చితాభి ప్రాయాలు ఉంటాయి.సంభాషణల్లోఎదుటి వారి ముందు అవి వ్యక్త పరుస్తుంటాము. అవతలి వారు కూడా తమ అభిప్రాయాలు చెబుతారు.ఇరువైపులా ఒకే రక మైన అభిప్రాయాలు ఉంటె ఓకే.పరస్పరం వ్యతిరేకమయితే ఇక ఘర్షణ మొదలవుతుంది.ఇలా మనసులో ఒక స్థిర అభిప్రాయం లేకుండా ఏ ప్రభావానికి గురి కాకుండా ఒక సమస్యకు కొత్త కోణంలో సత్యం,వాస్తవం ప్రాతిపదికన చర్చించుకునే openmindset  ఏర్పరచుకోవటం ఎంతో అవసరం.అప్పుడే అందులోనుండి మనమేదయినా కొత్త అంశాన్ని అంటే సత్యాన్ని కనుగొనగలం.అప్పుడు అందరం ఆ అభిప్రాయం తో ఏకీభవించ వచ్చు.సమాజంలో అంత తీరిక,ఓపిక,సహనం ఎవరికీ ఉండటం లేదు.మన మధ్య జరిగే విధంగానే T.V  చర్చల్లో,అసెంబ్లీ,పార్లమెంటుల్లో ప్రతిఫలిస్తుంది.కాబట్టి ఎన్నో సమస్యలు పరిష్కారం కాకుండా పోతున్నాయి.
           ఈ openmindset ను పెంపొందించుకునే విధంగా విద్యార్థులను చిన్నప్పటినుండితీర్చిదిద్దాలి ఉపాధ్యాయు
లు ముందుగా ఈ ధోరణిని కలిగి ఉంటే విద్యార్థులకు నేర్పగలరు.అలాగే media కూడా ఈ ధోరణిని ప్రోత్సాహిస్తూ చర్చలు చేపడితే చాలా బాగుంటుంది.ప్రతి సంభాషణ నుండి,చర్చలనుండి ఒక కొత్త అంశం నేర్చుకోవటం,ఓ కొత్త సత్యం ఆవిష్కృతం కావటం,ఒక సమస్యకు పరిష్కారం లభించటం,ఓ వాస్తవిక దృక్పథం ఏర్పడటం,ఇవన్నీ వ్యక్తీ ,సమాజం అభివృద్ది చెందటానికి దోహదం చేస్తాయి