Sunday 8 March 2015

RMSA లో DRP గా 5 రోజుల శిక్షణ

      RMSA లో  DRP(District resource person) గ  నేను,నాగమూర్తి,సజీవరావు,రఘురాం ఎన్నిక  కావటం తో  28/1/15 night hyderabad బయలుదేరాము.బస్సులో కిటికీ సరిగా మూసుకోక పోవటంతో బాగా అసౌకర్యానికి గురయ్యాము. ఇంకొక విషయం ఏంటంటే 11 గంటలకు బస్సు బయలు దేరింది. సినిమా పెట్టారు నేను నిద్ర పోవాలి ఆపమన్నాను.ఇంకొకరు పెట్టమన్నారు. రోజు T.V  లో 10 సినిమాలు వస్తుంటాయి .అయినా రాత్రి ప్రయాణం లో సినిమా కావా లంటారు .ఇదొక ప్రొబ్లెమ్.చివరకు డ్రైవర్ సినిమా తీసేసాడు .
         ఉదయం హైదరాబాద్ లో దిగేసరికి విపరీతమైన చలి. గచ్చిబౌలి లోని టెలికాం సెంటర్ కు చేరుకొని రిఫ్రెష్ అయ్ ఉదయం తరగతులకి  హాజరయ్యాము.మారిన 9,10 తరగతుల physical science textbooks పై  training మొదలయ్యింది.ఆనంద్ (text book writer,SRP)విద్యుత్ ,కాంతి పై చక్కటి అవగాహన కలిగించారు. ఆయనకు   ఫిజిక్స్ పై ఎంత ఇష్టం, పట్టు ఉందొ ఆ చెప్పే  విధానం బట్టి అర్థమవుతుంది.1200 పుస్తకాలతో కూడిన ఫిజిక్స్ లైబ్రరీ ఆయన ఇంట్లో ఉందిట.టీచర్స్ చాలా ప్రేరణ పొందారు .
         నెల్లూరు నుండి ఎ.వి  సుధాకర్  organic chemistry గురించి చెప్పారు. ఈయన scert  తరపున ల్యాబ్ బుక్స్ , సాక్షి భవితలో 10 వ తరగతి physicalscience పై వ్రాస్తున్నారు.నేను సుధాకర్ కలిసి మైసూరు లో జరిగిన కంప్యూటర్ ఎడ్యుకేషన్ శిక్షణకు(NCERT ) వెళ్లి వచ్చాము. ఇంకా కెమిస్ట్రీ  లో ఏకాంబరం,సుబ్రహ్మణ్యం,గురుప్రసాద్ మిగతా తరగతులు  తీసుకున్నారు.చివర్లొ  విద్య,సైన్స్ వెనుక ఉన్న ఫిలాసఫీ ని రమేష్(academic incharge,scert) అద్భుతంగా  వివరించారు.మిత్రు లంతా   smartphones తో  record చేసుకున్నారు. తరువాత A.P STATE  physicalscience teachers forum  ఏర్పడింది .
.    

Saturday 22 November 2014

నా ముంబై యాత్ర(My Mumbai Tour)


                 హోమిబాబా సైన్స్ సెంటర్ వారి ఆహ్వానం మేరకు ముంబై లో 4 రోజుల సెమినార్ కు (10/11/14 నుండి 13/11/14) వెళ్లాను.విజయవాడ నుండి 22 గంటల ప్రయాణం.నేనుముంబై లో  ఆదివారం దిగాను.kadapa నుండి మిత్రుడు hussainkhan అక్కడ వాళ్ళ బావమరిదితో కలిసి నన్ను కలిసాడు.clockroom లో బ్యాగ్ ఉంచి localtrain లో కుర్లా నుండి CST కి  వెళ్ళాము. అక్కడికి  దగ్గరలో Gateway of India,Taj hotel ఉన్నాయి. అక్కడ ఫొటోస్ దిగాము .సముద్రము లోనికి షిప్ లో వెల్లాము. ఇక తిరిగివస్తు మ్యూజియమ్ చూసాము. అక్కడ ముంబై గురించి 20 నిముషాల shortfilm చూపించారు.చాలా బాగుంది beautiful bay నుండి ఆ పేరు వచ్చింది .ఇక మళ్ళీ లోకల్ ట్రైన్ లో ట్రైనింగ్ క్యాంపు కు వెల్లాము.
              4 రోజులు అంతరిక్షం,నక్షత్రాలు గ్రహాల గురించి  చాలా లోతయిన అవగాహన కలిగించారు .ఒక రోజు nightskyobservatin కోసం ముంబైకి 100 కిమీ దూరం  తీసుకెళ్ళి  టెలీస్కోప్ ల సహాయంతో  నక్షత్రాలను చూపించారు.చాలా మంచి అనుభవం అన్ని  రాష్ట్రా లనుండి  60 మంది వచ్చారు . Nepal   నుండి 4 గురు,బంగ్లాదేశ్ నుండి ఒకరు వచ్చారు .Nepal వారికి మహేష్ బాబు ,పవన్ కళ్యాన్ సినిమాలు బాగా నచ్చుతాయని చెప్పారు. బ్రహ్మ నందం కా మెడి చాలా ఇష్టమట.ఒక రోజు రాత్రి interstellar అనే  scintific మూవీకి వెళ్ళాము.చాలా బాగుంది .olympiyad exams గురించి  వివరించారు.  మంచి  అనుభూతితో తో  తిరుగు  ప్రయానమయ్యాము. 

Sunday 12 October 2014

బాలల హక్కుల యోధుడు కైలాష్ సత్యార్థి,మలాలా యూసఫజాయ్ లకు నోబెల్ శాంతి బహుమతి

                బాలల హక్కుల కోసం,వెట్టి చాకిరి నిర్మూలన కోసం,పిల్లల చదువుల కోసం కైలాష్ 3 దశాబ్దాల కృషికి ఈ నోబెల్ శాంతి బహుమతి వచ్చింది.ఇప్పటికి 80,000 మంది పిల్లలను బాలకా ర్మికత్వం నుంచి విముక్తి చెందించి వారికి అందమైన భవిష్యత్తును కల్పించారు.child labour act,విద్యాహక్కు రూపకల్పనలో పాలు పంచుకున్నారు. భారత దేశం లోనే కాకుండా ప్రపంచ వ్యాప్త బాల కార్మికుల కోసం ఈయన కృషిని గుర్తించారు. "నేను చనిపోయే లోపు బాల కార్మిక వ్యవస్థ అంతాన్ని చూస్తాను అని ఆత్మ విశ్వాసం తో చెబుతారు .
             బాలల పథకాలను వారి మీద జాలితో కాకుండా అవి వారి హక్కుగా చూడాలంటారు.పేదరికం,నిరక్షరాస్యత బా ల కార్మికవ్యవస్థ ఈ మూడింటి మధ్య అవినాభావ సంబంధం ఉందని వీటిని ఉమ్మడిగా తుద ముట్టించా లంటారు పిల్లల పట్ల ఆయన భావాలు ఆయన మాటల్లోనే
    "నేను చిన్న పిల్లల చెలికాడిని మనం వారిపట్ల చూపాల్సింది జాలి దయ కాదు మనకు స్వచ్చత పార దర్శకత నేర్పేందుకు పిల్లలను మించిన వారు ఎవరుంటారు .వారు పక్షపాతం లేకుండా ముక్కుసూటిగా ఆలోచించే మాయా మర్మం తెలియని వాళ్ళు "
        ఇంత ప్రేమ వారిపట్ల ఉండబట్టే నోబెల్ శాంతి బహుమతి వచ్చింది.
  ఇక మలాలా చావు బతుకుల మధ్య పోరాడి గెలిచి న  ధీరబాలిక .విద్య నేర్చుకోవటం  పట్ల ఆమె దృఢ చిత్తం ,ప్రాణాలను లెక్క చేయని సాహసం ఆమెకు ఈ అవార్డ్ తెచ్చి పెట్టాయి .ప్రపంచమ్ లోని బాలికలంతా ఆమె స్పూర్తిని అందిపుచ్చుకోవాలి.ఒక విద్యార్థి,ఒక ఉపాధ్యాయుడు ఒక కలం,ఒక పుస్తకం ఈ ప్రపంచాన్ని మారుస్తాయి అని ప్రకటించిన ఆశావాది .
           బాలలందరి తరపున వీరిద్దరిని హృదయపూర్వకంగా అభినందిద్దాము .
కైలాష్ విద్యార్థి గురించి మరింత సమాచారం ఈ క్రింది వెబ్సైటు లో గమనించగలరు . 
http://www.kailashsatyarthi.net/contact/submit.php 

Wednesday 25 June 2014

జీవితంలో కుతూహలం ముఖ్యం ---రాకేశ్ రెడ్డి 2013 CIVILS విజేత

                    దేశంలో అత్యున్నత సర్వీస్ అయిన సివిల్స్ లో 219 రాంక్ సాధించారు మార్కాపురానికి చెందిన రాకేశ్ రెడ్డి .IPS వస్తుందని ఆశిస్తున్నారు . అలాగే  మార్కాపురానికి చెందిన   సాయి శ్రీనివాస్ ఎంసెట్ లో medicine లో state  first సాధించారు. వీరిద్దరికీ స్థానికంగా ఉన్న ఒక ప్రైవేటు పాటశాలలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసారు.ఇందులో రాకేశ్ రెడ్డి ఇచ్చిన సందేశం  ఎంతో ఉపయోగకరంగా ఉంటుందనే  ఉద్దేశంతో ఇక్కడ వ్రాస్తు న్నాను.ఆయన మాటల్లోనే


విద్యార్థులంతా కుతూహలాన్ని  కలిగి ఉండాలని ప్రతి విషయాన్ని ఎందుకు?ఏమిటి?ఎలా?అని ప్రశ్నించుకోవాలి నవోదయాలో చదివాను .software job  చేస్తుంటే  డబ్బు వచ్చేది కాని మనసులో    ఎక్కడో  అసంతృప్తి   ఉండేది.ఎక్కువ  మందికి ఉపయోగపడే పని సంతృప్తి కలిగించేది ఏదో దానిని ఎన్నుకోవాలనుకున్నాను. పని చేస్తున్నంత కాలం దానిలో ఆనందం పొందే విధంగా
 ఉండాలని అనుకున్నాను .దానికి సివిల్స్ అయితే సరిపోతుంది అనిపించింది జీవితం లో గమ్యం ఎంత ముఖ్యమో దానిని సాధించే క్రమంలో గమనం కూడా అంతే ముఖ్యం ఆ process  ను  ఎంజాయ్ చేయాలి .
అందుకే నాకు సివిల్స్ పరీక్ష తయారీలో కష్టం అనిపించలేదు .
సివిల్స్ ప్రేరణ మా నాన్న నుండి పొందాను. ఆయన  తన వృత్తిలో నిరంతరం ఆనందం పొందుతుండేవాడు . సివిల్స్ సాధించటానికి ముఖ్యంగా 3 అంశాలు దోహదం చేస్తాయి . 1)analytical ability 2)writing ability3) hard work and passion .విద్యార్థి దశలో అన్ని కార్యక్రమాల్లో పాల్గొనాలి .చర్చల్లొ పాల్గొనాలి . మధ్యతరగతి నుండి వచ్చాను. నాన్న ఎప్పుడు చెబుతుండే వారు మనకు చదువు తప్ప వేరే మార్గం లేదు అని అందుకే ఎప్పుడు మెరిట్ స్టూడెంట్ గా ఉండే వాణ్ని .
          వివే కానందుడి మాటలు గుర్తుంచుకోండి .లక్ష్యము సాధించేంత వరకు విశ్రమించకండి .కలామ్ చెప్పినట్లు కలలు కనండి .వాటిని సాకారం  చేసుకోండి. మన లక్ష్యాలను సాధించిన తరువాత సమాజం లో అట్టడుగు వర్గాల వారికి సహాయ పడాలి  .ప్రపంచమ్ లోని  అత్యంత కష్ట మైన పరీక్షల్లో ఇది ఒకటి . 3 దశల   వడపోతలో మన లోని అన్ని కోణాలను పరీక్షిస్తారు .సివిల్స్ లో నైతిక విలువలు కూడా సిలబస్ లో చేర్చారు. తరువాత విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు .విద్యార్థులు తామెంతో inspire అయ్యామని చెప్పారు .
తరువాత మెడిసిన్ 1 ranker  సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ ఇంటర్ లో పూర్తీ స్థాయి ఫోకస్ పెడితే సరిపోతుందని చెప్పారు .
తరువాత రాకేశ్ రెడ్డి తో నేను మాట్లాడినప్పుడు psycology,public administration options గా తీసు కున్నానని  చెప్పాడు . మీ  సర్వీస్ లో ఇలాగే పిల్లలతో వీలు దొరికినప్పుడల్లా కలిసి వారికి మంచి విషయాలు వివరించమని చెప్పాను . నైనిటాల్ లో కంటోన్మెంట్ సి యి ఒ గా పనిచేస్తున్నాని చెప్పారు.