మాతృభాష ను మరువకుమా !
మాతృభాషా దినోత్సవం
మన జీవితమంతా మన ఎదుగుదలకు,మన వికాసానికి ఉపయోగపడేది మన మాతృభాష.అమ్మ మనకు గోరుముద్దలు తినిపిస్తూ నేర్పించే భాష .దాన్ని జీవితమంతా కాపాడుకోవాలి.మన పిల్లలకు ఆ భాష లోని మాధుర్యాన్ని గ్రోలేటట్లు చెయ్యాలి.మాధ్యమాల చర్చ ప్రక్కనపెడితే ప్రతి తల్లి తండ్రి తన బిడ్డలు తమ భాషను మర్చిపోకుండా బాధ్యత తీసుకోవాలి.అమ్మ,నాన్న అని పిలిచే పలుకులలోని తియ్యదనం మమ్మీ డాడీ లలో ఎక్కడ వస్తుంది.తాతయ్య,అమ్మమ్మ పిలుపుల్లోని కమ్మదనం గ్రాండ్ పా,గ్రాండ్ మా లో వస్తుందా.!విదేశాల్లో ఉండే తెలుగు ప్రజలు మన మాతృ భాషా పరిరక్షణకు ఎంతగానో తపిస్తుంటే ఇక్కడ ఉన్న మనకు నిర్లక్ష్యంగా వుంది.
ఒక చేదయిన వాస్తవమేమంటే ఆంగ్ల మాధ్యమం లో చదివే పిల్లలకు ఆంగ్లం రావటం లేదు ,తెలుగు రావటం లేదు .విద్యా వ్యవస్థలో ఎన్నో లోపాలు వున్నాయి.విదేశాలలో వున్నవారు ఏదోఒక విధం గా మీ బిడ్డలకి మాతృభాషలోని మధురిమలు పంచండి.క్రొత్త భాష రావాలంటే ఎంతో కష్ట పడతాము.మరి తల్లి భాషను దూరం చేసుకుంటే ఎలా?
ప్రపంచ తెలుగు మహాసభలు
ఒంగోలు లో ఘనంగా జరిగాయి .నేను,ఆనంద్ చివరి రోజు సమావేశానికి హాజరయ్యాము ..జనవరి 8 వ తారీకు న విద్య ఫై ఒక సదస్సు జరిగింది.అందులో లక్ష్మణ రావు,బాలసుబ్రమణ్యం, రామిరెడ్డి( శాసన మండలి సభ్యులు) శంకరనారాయణ జర్నలిస్ట్ డా .మన్నార్ ఇందిరా శ్రీనివాసన్,సామర్ల రమేష్ బాబు పాల్గొన్నారు .
బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ మాతృభాషలో విద్య బోధించే దేశాలైన చైనా ,జపాన్ వియత్నాం కొరియా ఉత్పత్తి రంగం లో ముందున్నాయి .పరభాషా బోధనా పై మక్కువున్న మనదేశం సేవల రంగం లో ముందుంది.8 వ తరగతి పూర్తి అయ్యేలోపు ఒక భాష లో నిష్ణాతు లై వుండాలి.మన ఇంగ్లీష్ మీడియం చదువుల్లో బాషలో పట్టు రావటంలేదు .అన్నారు శంకరనారాయణ తన మాటలలో Instein సాపేక్షసిధ్దంతాన్ని, మార్క్స్ దాస్ కాపిటల్ ను తమ మాతృబాష ఐన జర్మనీ లోనే వ్రాసారు. మన్నార్ ఇందిరా గారు ఆఫీసు ల లో మాతృబాష కు ప్రాధాన్యం లేకపోవటం చేత ప్రజలకు ఎలా నష్టం జరుగుతుందో వివరించారు.
బాష ఫై జరిగిన సదస్సు లో డా.పవనకుమార్ మాట్లాడుతూ బాషలు,చరిత్రలు,సంస్కృతులను ఏకం చెయ్యటం కష్టం అన్నారు.ప్రపంచీకరణ లోని ఏకత్వం సంస్కృతిని ఏకం చెయ్యలేకపోయింది సంస్కృతులు భిన్నత్వ దిశగా ప్రయాణం చేస్తాయన్నారు.అన్ని వ్యవస్థలను సమంగా ప్రభావితం చెయ్యగలిగేది విద్య. కంప్యూటర్ కు సంగనకము అని పేరు పెట్టారు.సామల రమేష్ గారు బాషభివ్రుద్ధికి అన్ని విధాల కృషి చేస్తామన్నారు.తెలుగు బాష అందచందాల పై ౩౦ నిముషాల పాటు అనర్గళంగా మాట్లాడింది.
ముగింపు కార్యక్రమం లో కృష్ణ జిల్లా వారి డప్పు నృత్యం అధ్బుతంగా వుంది.
మన జీవితమంతా మన ఎదుగుదలకు,మన వికాసానికి ఉపయోగపడేది మన మాతృభాష.అమ్మ మనకు గోరుముద్దలు తినిపిస్తూ నేర్పించే భాష .దాన్ని జీవితమంతా కాపాడుకోవాలి.మన పిల్లలకు ఆ భాష లోని మాధుర్యాన్ని గ్రోలేటట్లు చెయ్యాలి.మాధ్యమాల చర్చ ప్రక్కనపెడితే ప్రతి తల్లి తండ్రి తన బిడ్డలు తమ భాషను మర్చిపోకుండా బాధ్యత తీసుకోవాలి.అమ్మ,నాన్న అని పిలిచే పలుకులలోని తియ్యదనం మమ్మీ డాడీ లలో ఎక్కడ వస్తుంది.తాతయ్య,అమ్మమ్మ పిలుపుల్లోని కమ్మదనం గ్రాండ్ పా,గ్రాండ్ మా లో వస్తుందా.!విదేశాల్లో ఉండే తెలుగు ప్రజలు మన మాతృ భాషా పరిరక్షణకు ఎంతగానో తపిస్తుంటే ఇక్కడ ఉన్న మనకు నిర్లక్ష్యంగా వుంది.
ఒక చేదయిన వాస్తవమేమంటే ఆంగ్ల మాధ్యమం లో చదివే పిల్లలకు ఆంగ్లం రావటం లేదు ,తెలుగు రావటం లేదు .విద్యా వ్యవస్థలో ఎన్నో లోపాలు వున్నాయి.విదేశాలలో వున్నవారు ఏదోఒక విధం గా మీ బిడ్డలకి మాతృభాషలోని మధురిమలు పంచండి.క్రొత్త భాష రావాలంటే ఎంతో కష్ట పడతాము.మరి తల్లి భాషను దూరం చేసుకుంటే ఎలా?
ప్రపంచ తెలుగు మహాసభలు
ఒంగోలు లో ఘనంగా జరిగాయి .నేను,ఆనంద్ చివరి రోజు సమావేశానికి హాజరయ్యాము ..జనవరి 8 వ తారీకు న విద్య ఫై ఒక సదస్సు జరిగింది.అందులో లక్ష్మణ రావు,బాలసుబ్రమణ్యం, రామిరెడ్డి( శాసన మండలి సభ్యులు) శంకరనారాయణ జర్నలిస్ట్ డా .మన్నార్ ఇందిరా శ్రీనివాసన్,సామర్ల రమేష్ బాబు పాల్గొన్నారు .
బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ మాతృభాషలో విద్య బోధించే దేశాలైన చైనా ,జపాన్ వియత్నాం కొరియా ఉత్పత్తి రంగం లో ముందున్నాయి .పరభాషా బోధనా పై మక్కువున్న మనదేశం సేవల రంగం లో ముందుంది.8 వ తరగతి పూర్తి అయ్యేలోపు ఒక భాష లో నిష్ణాతు లై వుండాలి.మన ఇంగ్లీష్ మీడియం చదువుల్లో బాషలో పట్టు రావటంలేదు .అన్నారు శంకరనారాయణ తన మాటలలో Instein సాపేక్షసిధ్దంతాన్ని, మార్క్స్ దాస్ కాపిటల్ ను తమ మాతృబాష ఐన జర్మనీ లోనే వ్రాసారు. మన్నార్ ఇందిరా గారు ఆఫీసు ల లో మాతృబాష కు ప్రాధాన్యం లేకపోవటం చేత ప్రజలకు ఎలా నష్టం జరుగుతుందో వివరించారు.
బాష ఫై జరిగిన సదస్సు లో డా.పవనకుమార్ మాట్లాడుతూ బాషలు,చరిత్రలు,సంస్కృతులను ఏకం చెయ్యటం కష్టం అన్నారు.ప్రపంచీకరణ లోని ఏకత్వం సంస్కృతిని ఏకం చెయ్యలేకపోయింది సంస్కృతులు భిన్నత్వ దిశగా ప్రయాణం చేస్తాయన్నారు.అన్ని వ్యవస్థలను సమంగా ప్రభావితం చెయ్యగలిగేది విద్య. కంప్యూటర్ కు సంగనకము అని పేరు పెట్టారు.సామల రమేష్ గారు బాషభివ్రుద్ధికి అన్ని విధాల కృషి చేస్తామన్నారు.తెలుగు బాష అందచందాల పై ౩౦ నిముషాల పాటు అనర్గళంగా మాట్లాడింది.
ముగింపు కార్యక్రమం లో కృష్ణ జిల్లా వారి డప్పు నృత్యం అధ్బుతంగా వుంది.