Tuesday, 2 September 2025

వినూత్నంగా సన్మానాలు

 సన్మానాలు 

దండలు,శాలువాలు బదులు

మొక్కలు పుస్తకాలు ఇద్దాం 

      ప్రస్తుతం సన్మానం ఏదయినా  శాలువాలు, దండలు ఉండాల్సిందే!retire అయిన వారు జరుపుకునే functions కి ఇక చెప్పాల్సిన పని లేదు. August 15,September 5,January 26 ఇలా ఏ సందర్భంగా awards గెలుచుకున్నా ఇక శాలువాల,దండలు తప్పని సరి. రెండూ పునర్వినియోగించేవి కావు, దండలు అయితే కొద్ది సేపటికే అక్కడే వదిలేస్తారు,శాలువాలు అయితే ఇంటికి తీసుకెళ్లి బీరువాలో పెడతారు.మళ్ళీ వాటిని ఉపయోగించరు.

             ఇలా కాకుండా ఇంకేదైయినా మంచి సన్మానం ఉందా! అక్కడక్కడా ఈ పాటికే అటువంటి సన్మానాలు చేస్తున్నారు.APNGC meetings లో అయితే మొక్కలు ఇస్తారు. కొన్ని సాహిత్య సమావేశాల్లో పుస్తకాలు ఇస్తారు. మరి అన్ని సన్మానాలకు మొక్కలు లేదా పుస్తకాలు ఇస్తే బాగుంటుంది కదా! మొక్కలు ప్రకృతి పరిరక్షణకు,పుస్తకాలు జ్ఞానసముపార్జనకు పనికి వస్తాయి కదా!

         సన్మానం ఘనంగా చేయాలి అనుకుంటే పెద్ద మొక్కలు, గ్రంధాలు ఇవ్వవచ్చు. గుర్తుగా ఒక జ్ఞాపికను ఇచ్చుకోవచ్చు.పుస్తకాలు ఇవ్వడం ద్వారా సమాజంలో చదివే అలవాటు అభివృద్ధి అవుతుంది. అలాగే మొక్కలు నాటే సంస్కృతి పెరుగుతుంది.

           ప్రభుత్వమే రాబోయే september 5 న ఇచ్చే ఉత్తమ ఉపాధ్యాయుల సన్మానాల నుండే ఇలా చేయొచ్చు. తరువాత వారికి పాఠశాల స్థాయిలో మొక్కలు,పుస్తకాలు ఇవ్వడం ద్వారా వారిని అభినందించవచ్చు.ఏదయినా ఒక మంచి ఎక్కడో ఒకచోట మొదలు కావాలి.

       ప్రభుత్వ,ప్రైవేట్ ఉద్యోగులు,రాజకీయ నాయకులు, నూతనంగా పదవులు పొందే వారు ఇలా మొక్కలు పుస్తకాలు ఇవ్వడం మొదలు పెడితే సామాన్య ప్రజలు కూడా ఈ అలవాటును ఆచరిస్తారు. కనుక ఈ దిశగా సమాజం అంతా ఆలోచిస్తుందని, మొదటగా ఉపాధ్యాయులుగా మనం ఇందుకు మార్గదర్శకులుగా ఉందామని కోరుకుంటున్నాను 

ఒద్దుల రవిశేఖర్

స్వచ్ఛ అక్ష్యరాస్యత(Clean literacy)

 Clean literacy (స్వచ్ఛ అక్షరాస్యత )

FA1 పరీక్షల మార్కులు upload చేసి cluster meetings కు హాజరవుతున్న ఉపాధ్యాయ మిత్రులందరికి నమస్తే 

      FA1 పరీక్షా పత్రాలు దిద్దే క్రమంలో విద్యార్థులు వ్రాసిన భాషను గమనించి ఉంటారు కదా అందరు.అన్ని subject లలో విద్యార్థులు తప్పులు లేకుండా వ్రాయగలిగారా! తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల పరిస్థితి ఏంటి? ఇక ఇంగ్లీష్ మీడియంలోకి మారిన Maths, P.S N.S, Social పరిస్థితి ఏమిటి? ఎంత మంది అక్షరాలు, పదాలు, వాక్యాలు తప్పుల్లేకుండా సరిగా వ్రాయగలిగారు.

మన చదువుల విషాదం ఏంటంటే ధారాళంగా చదవడం, శుద్ధంగా వ్రాయడం విషయంలో విద్యార్థులు ఇంకా సమస్యలు ఎదుర్కోవడం.అసలు పాఠం అర్ధం కావాలన్నా, నేర్చుకోవాలన్నా పై రెండు ప్రక్రియలు రాక పోతే ఎలా సాధ్యం?మనకున్న syllabus, exams,వివిధ కార్యక్రమాల నడుమ ప్రాధమిక ప్రక్రియలైన చదవడం, వ్రాయడం ప్రక్రియల పై దృష్టి పెట్టడం కష్టం అవుతుంది.కానీ ఈ సమస్య ను గుర్తించే FLN కి ప్రాధమిక స్థాయిలో ప్రాధాన్యత పెంచారు. మరి ఇప్పటి ఇంగ్లీష్ మీడియం ఉన్న పరిస్థితిలో పిల్లలు english లో ప్రశ్న చదవడం,దాన్ని అర్థం చేసుకోవడం, నేర్చుకొని వ్రాయడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను ఇలాగే పట్టించుకోకుండా వదిలేస్తే 10 వ తరగతి కి వచ్చే సరికి ఆ విద్యార్థులు పూర్తిగా వెనుక బడిపోతారు.అప్పటికి ఎలాగోలా బయట పడ్డ తరువాత చదువు కొనసాగించ లేక మానేస్తారు.

కనుక అందరు ఉపాధ్యాయులు తమ తమ subject లలో చదవడం, వ్రాయడం విషయం లో పిల్లలను వర్గీకరించుకొని, group leaders సహాయంతో పదాలు,వాక్యాలను ధారాళంగా చదవడం, శుద్ధంగా వ్రాయడంలో  నైపుణ్యం సంపాదించే టట్లు విద్యార్థులను తీర్చి దిద్ది  స్వచ్ఛ అక్షరాస్యత సాధించేందుకు ముందుకు రావలసినదిగా అభ్యర్థిస్తున్నాను..... ఒద్దుల రవిశేఖర్ 

Sunday, 20 July 2025

చదవడం, వ్రాయడం నేర్పిద్దాం (3)

 చదవడం, వ్రాయడం నేర్పిద్దాం (3)

గత రెండు వ్యాసాల సారాంశం:గణితం, సైన్స్, సోషల్ subject లు english medium లో మాత్రమే ఉండటంతో వాటిని కూడా ధారాళంగా చదవడం, శుద్ధంగా వ్రాయడం నేర్చుకోవడానికి అందులోని పాఠాల్లోని పదాలను అక్షరాల సంఖ్య కు అనుగుణంగా విభజించి వ్రాయించి group leaders సహకారంతో నేర్పించడం.ఈ ప్రక్రియ రెండు తెలుగు రాష్ట్రాలలోని చాలా మంది ఉపాధ్యాయులను ఆకర్షించడం, చాలా మంది ఉపాధ్యాయులు స్పందించడం జరిగింది. ఇంకో వ్యాసంలో వారిని గురించి వివరిస్తాను.

         ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1 నుండి 5 వ తరగతి పిల్లలకు నేర్పించడానికి FLN( Foundational Literacy and Numeracy ) శిక్షణను ఉపాధ్యాయులకు అందిస్తూ ఈ దిశగా పెద్ద ప్రయత్నమే చేస్తుంది. NEP 2020 లో FLN కు విశేష ప్రాధాన్యత ఇస్తున్నారు.ఉన్నత పాఠశాలల్లో 6 వ తరగతికి readiness program  కూడా అమలు చేస్తున్నారు. వీటి లక్ష్యం ఒక్కటే భాషలు చదవడం, వ్రాయడం రావాలి అని.

         కనుక ఉన్నత పాఠశాలల్లో ని అన్ని subject ల ఉపాధ్యాయులు  తమ తరగతి లోని పిల్లల్లో చదవడం, వ్రాయడం తాము చెప్పే పాఠాల్లో ఎలా ఉందో పరీక్షించుకుంటే అర్థం అవుతుంది. అప్పుడు పిల్లల్ని groups గా విభజించి group leaders ను నియమించి చదవడం, వ్రాయడం రాని వారికి నేర్పించే లాగా చేయాలి.      ఉపాధ్యాయులు ఈ కార్యక్రమాన్ని follow up చేయాలి. మొదటి 3 పాఠాలు ఇలా చేస్తే పిల్లలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ గణితం, సైన్స్, సోషల్ పాఠాలను తప్పుల్లేకుండా చదవడం,వ్రాయడం నేర్చుకుంటారు. అప్పుడు ఆయా పాఠాలు వారికి అర్థం అవుతాయి. తరువాత వాటిని నేర్చుకోవడానికి ఆత్మ విశ్వాసం కలుగుతుంది.    ఈ విధానం నేను ఆచరిస్తున్నాను. చక్కని ఫలితాలు వస్తున్నాయి. మీరు కూడా ఆచరిస్తారని, మీరు ఇంకా వినూత్నంగా ఆచరిస్తే తెలియజేస్తారని పిల్లల్లో ఈ సమస్యను నివారించడానికి మనమందరం కృషి చేద్దాం అని కోరుకుంటున్నాను. మొదటి రెండు వ్యాసాలను క్రింది link లలో ఉన్న నా blog లో చదవండి.

1)https://ravisekharo.blogspot.com/2025/06/blog-post.html

2)https://ravisekharo.blogspot.com/2025/07/blog-post.html

ఒద్దుల రవిశేఖర్ SA(PS) 9492124454

Monday, 7 July 2025

చదవడం, వ్రాయడం నేర్పిద్దాం

 *ధారాళంగా* *చదవడం* , *శుద్ధంగా* *వ్రాయడం* *నేర్పిద్దాం* ( 2)

             పోయిన సారి వచ్చిన మెదటి వ్యాసానికి ఇది కొనసాగింపు.ఇంతకు ముందు వ్యాసానికి రెండు తెలుగు రాష్ట్రాల నుండి మంచి స్పందన వచ్చింది. ఫోన్ లో వాట్సాప్ లో మిత్రులు పలకరించారు. కొంత మంది మేము కూడా మెదలు పెడతామని, మరికొంత మంది తాము చేసిన విధానాల గురించి వివరించారు.                                         సహజంగా తరగతి గదిలో మనకున్న వ్యవధి తక్కువ. Syllabus పూర్తి చేయడం పరీక్షలకు  సిద్ధం చేయడం వంటి వాటికే సమయం చాలదు అనుకుంటాం.ఒక సారి మనం వెళ్లే తరగతి పిల్లలకి ఆయా subjects ఉపాధ్యాయులు వారి పాఠాలను చదివించడం, dictation చెబితే ఎంత మంది వెనుకబడి ఉన్నారో అర్థం అవుతుంది. లేదా పరీక్షా పత్రాలు దిద్దుతున్నప్పుడు వాళ్ళు వ్రాసింది చూస్తే పరిస్థితి మరింత అర్ధం అవుతుంది. మనం చెప్పిన పాఠం చదవడం రాక వాటిని పరీక్షలో వ్రాయలేక పోతే మనకే అనిపిస్తుంది కదా అయ్యో ఇలాగే వీళ్ళు 10 వ తరగతి వరకు వెడితే అప్పుడు సమస్య మరింత తీవ్రమవుతుంది కదాని!          అందుకని పై రెండు అంశాల్లో అన్ని తరగతుల్లో విద్యార్థులను గుర్తించి అందరు ఉపాధ్యాయులు వారి వారి subject లలో నేర్పించగలిగితే విద్యార్థుల్లో చదువు పట్ల ఇష్టం ఏర్పడుతుంది. బడి తెరిచాక నేను ఈ విధానం అమలు చేస్తున్నప్పుడు పిల్లల్లో ఈ కృత్యం పట్ల విపరీతమైన ఆసక్తి ఏర్పడింది. మెదటి పాఠంలోని పదాలన్నీ రెండు, మూడు.... అక్షరాల పదాలుగా వర్గీకరించుకుని గ్రూప్ leaders సహాయంతో పిల్లలే నేర్చుకుంటున్నారు. 4,5 అక్షరాల పదాల వరకు ఇంగ్లీష్ భాషా పదాలే ఎక్కువగా ఉంటాయి. 6 అక్షరాల పదాల నుండి PS Subject పదాలు ఎక్కువగా వస్తున్నాయి.రెండవ పాఠం నుండి నేర్చుకున్న మొదటి పాఠం లోని పదాలు తీసివేస్తే చాలా వరకు కొత్త పదాలు తగ్గిపోతుంటాయి.రెండు మూడు నెలలపాటు 3 పాఠాల్లో ఇలా చేస్తే తరువాత వారికి చదవడం, వ్రాయడం వచ్చేస్తుంది. తరువాత కూడా సంవత్సరమంతా group leaders వారిని follow up చేసే విధంగా చేయాలి.               కొద్దిగా మనం ఈ విషయం ఆలోచించి ప్రయత్నం చేస్తే తప్పకుండా పిల్లలు నేర్చుకుంటారు. మీరు చేసే ప్రయత్నాలు, వినూత్న విధానాలు నాకు తెలియజేయండి. మన అనుభవాలను సంకలనం చేద్దాం.ఈ వ్యాసాన్ని మన ఉపాధ్యాయ మిత్రులకు whatsapp, telegram, Facebook ఇలా అన్ని social media గ్రూప్ ల ద్వారా share చేయండి. ఎక్కువ మంది విద్యార్థులు ఈ సమస్య నుండి బయట పడాలని ఆశిద్దాం. ధన్యవాదాలు. ఒద్దుల రవిశేఖర్ SA(PS)

Monday, 30 June 2025

ధారాళంగా చదవడం -శుద్ధంగా వ్రాయడం

 *ధారాళంగా* *చదవడం* , *శుద్ధంగా* *వ్రాయడం* :

భాషలు నేర్చుకోవడానికి LSRW ప్రక్రియను పాటిస్తుంటారు. Listening, Speaking, Reading, writing. పాఠశాలల్లో తెలుగు హిందీ ఇంగ్లీష్ భాషలు ఉంటాయి.ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా English medium అమల్లో ఉన్నందున Maths, Physical and Biological sciences,Social కూడా english భాష లోనే నేర్చుకోవలసి వస్తుంది. English లో ధారాళంగా చదవడం, శుద్ధంగా వ్రాయడం రాకపోతే ఈ subjects నేర్చుకోవడం సాధ్యం కాదు.English ఉపాధ్యాయులు ఈ విషయాలపై విశేషంగా శ్రమిస్తున్నా Non language subject లలో వచ్చే పదజాలం english subject పాఠాల్లో ఉండకపోవడం వల్ల కూడా విద్యార్థులు వాటిని చదవడం, వ్రాయడం లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

               ఈ సమస్య ను అధిగమించడానికి నాకు వచ్చిన ఆలోచనతో ఒక చిన్న ప్రయత్నం మా పాఠశాల లో మొదలు పెట్టాను. ఈ విద్యా సంవత్సరం మొదటి రోజు నుండే 7 వ తరగతి గణితం 8,9,10 తరగతుల భౌతిక శాస్త్రం మెదటి పాఠాల్లోని అన్ని english పదాలను అక్షరాల సంఖ్యకు( రెండక్షరాల, మూడ క్షరాల......... పదాలు )అనుగుణంగా విద్యార్థులతో notes లో వ్రాయించాను. బాగా చదివి వ్రాయగలిగే పిల్లల్ని group leaders గా పెట్టాను. వీరు తమ group లోని పిల్లలకు ఆయా పదాలను పలకడం వ్రాయడం లో సహాయం చేస్తుంటారు. నేను ప్రతి రోజు follow up చేస్తుంటాను. తరగతి లో కొద్ది సేపు విద్యార్థులతో పదాలను చదవడం వ్రాయడం లో పోటీ పెడుతుంటాను.అలాగే కొద్దిసేపు వాక్యాలు చదివిస్తాను. అలాగే ప్రతిరోజు ఇంటి దగ్గర పాఠాన్ని తెలుగు english భాషల్లో రెండు సార్లు చదివేలా ప్రోత్సాహిస్తుంటాను.

             పాఠం ఎప్పుడైతే చదవడం బాగా వస్తోందో వ్రాయడం తప్పుల్లేకుండా వ్రాస్తారో అప్పుడే విద్యార్థికి ఆత్మ విశ్వాసం కలిగి ఆయా అంశాలను నేర్చుకొని పరీక్షల్లో వ్రాయ గలుగుతారు. ఈ విషయాలను గమనించి గణితం, PS&BS, సోషల్ ఉపాధ్యాయులు తమ పాఠాల్లోని పదజాలం విద్యార్థులకు నేర్పిస్తూ,చదివిస్తూ ఉంటే విద్యార్థుల్లో ఆయా subject లలో మంచి ప్రగతి నమోదు అవుతుంది. అలాగే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఉపాధ్యాయులు తమ భాషలు చదవడం, వ్రాయడం లో విద్యార్థులను ప్రావీణ్యులుగా చేయడానికి మరింతగా కృషి చేస్తారని హృదయ పూర్వకంగా కోరుకుంటున్నాను.    

             అందరం కలిసి విద్య కు పునాది అయినటువంటి ధారాళంగా చదవడం, శుద్ధంగా వ్రాయడం విషయాల్లో కలిసికట్టుగా కృషి చేసి విద్యార్థుల విద్యాభి వృద్ధికి కృషి చేద్దామని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.తెలంగాణ లో కూడా English medium ఉంది కనుక ఈ విషయాన్ని పరిశీలించ గలరు.ఈ విషయాన్ని మీ మిత్రులందరికీ, అన్ని Fb, telegram ఉపాధ్యాయ whatsapp, groups ద్వారా share చేయగలరు. పై విషయం పై ఎవరయినా విభిన్నంగా, వినూత్నంగా ప్రయత్నిస్తున్న మిత్రులు తెలియజేయగలరు.

 ఒద్దుల రవిశేఖర్ SA(PS).

Wednesday, 1 January 2025

BIS వారి పరిశ్రమల యాత్ర

 

*BIS* *వారి* *పరిశ్రమల* *సందర్శన* *యాత్ర* :
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్ వారు ఏర్పాటు చేసిన పరిశ్రమల సందర్శన లో భాగంగా ZPHS చెన్నారెడ్డి పల్లె విద్యార్థులు కడప జిల్లా బద్వేలుకు
సమీపంలోని సెంచరీ ప్లై వుడ్ కంపెనీ ని సందర్శించారు.ఈ కార్యక్రమంలో BIS తరపున G. కిషోర్ గారు హాజరయ్యారు. మొదటగా పాఠశాల లో BIS కార్యక్రమాల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ Y. శ్రీనివాస రావు,ఉపా ధ్యాయులు ఒ.వి. రవిశేఖర రెడ్డి( మెంటర్ BIS), ఒ.నరసింహారావు 8,9 వతరగతుల  విద్యార్థులు 26 మంది తో కలిసి సెంచరీ కంపెనీ సందర్శనకు బయలు దేరారు. కంపెనీ యాజమాన్యం సా దరంగా ఆహ్వానించి, కంపెనీని త్రిప్పి చూపించి విద్యార్థులకు వివరించడానికి ఇద్దరు ఉద్యోగులను కేటాయించారు.సుబాబుల్,మామిడి కర్ర ను ఉపయోగించి ప్లై వుడ్ తయారు చేస్తారని చెప్పారు. అంతా ఆటోమేటిక్ మిషన్ ల ద్వారా జరుగుతుందని కర్ర ను ముక్కలయ్యే దశనుండి చివరకు ప్లై వుడ్ తయారయ్యేంతవరకు వివిధ దశలను చూపిస్తూ వివరించారు. అన్ని యంత్రాలను కంప్యూటర్ ద్వారా గమనిస్తుంటారు. విద్యార్థులు తమ సందేహాలను అడుగుతు చాలా ఆసక్తిగా కంపెనీ లోని అన్ని విషయాలను తెలుసుకున్నారు. యంత్రాల పని తీరు, నిర్వహణ విధానం, అయిన ఖర్చు ను తెలుసుకుని ఉత్పత్తి అయిన వుడ్ ను చూసి విద్యార్థులు ఆశ్చర్యానికి లోనయ్యారు. చక్కని ఆతిధ్యం ఇచ్చి విద్యార్థులకు అన్ని విషయాలను వివరించిన కంపెనీ యాజమాన్యానికి ఉపాధ్యాయులు ధన్యవాదాలు తెలియ జేశారు.

Thursday, 26 December 2024

SHEROES పుస్తకావిష్కరణ


ఒక పుస్తకాన్ని విడుదల చేస్తున్నారంటే ఒక auditorium లో ఆ పుస్తకం గురించి మాట్లాడే కొద్ది మంది వక్తలు, ప్రేక్షకులు,రచయిత ఆ కార్యక్రమంలో ఉంటారు.వక్తలు మాట్లాడిన తరువాత ఓ నాలుగు పుస్తకాలు విడుదల చేసి సభను ముగిస్తారు ఎక్కడయినా.ఆ విధానాన్ని SHEROES పుస్తక విడుదల కార్యక్రమం బ్రద్దలు కొట్టింది. Dr శివ ఆర్ జాస్తి, అహల గార్లు రచించిన ఈ పుస్తకం ఆంగ్లం లో జనవరిలో విడుదల కాగా ప్రస్తుతం వంగపల్లి పద్మ దానికి తెలుగు లోకి అనువాదం చేయగా విడుదల చేసే కార్యక్రమం ఇది.256 మంది ధీర వనితల జీవితాలను గురించి క్లుప్తంగా వివరిస్తూ వారు సాధించిన అనుపమాన మైన లక్ష్యాలను నేటి బాలలకు పరిచయం చేయడం ద్వారా వారిలో ప్రేరణ నింపడానికి రచయితలు ఈ పుస్తకం ద్వారా ప్రయత్నించారు.ఈ పుస్తకానికి బాబు డుండ్రపల్లి వేసిన బొమ్మలు అద్భుతమైన అందాన్ని తీసుకొచ్చాయి.అందరు SHEROES బొమ్మలు ప్రదర్శనగా ఉంచడం ప్రత్యేక ఆకర్షణ.అదనంగా మరో 100 మంది SHEROES ను గుర్తించారు మరో సంచికలో చేర్చడానికి. మొత్తం దాదాపుగా 350మంది బాలికలచే SHEROES పాత్రల ఏకపాత్రాభినయాలు చేయించి వారిలోని ప్రతిభ ను ఈ సందర్భంగా గుర్తించడం ప్రశంసనీయం. ప్రతి రూమ్ లో 40 మంది చొప్పున 8 గదుల్లో 350 మంది బాలికలు ప్రదర్శన ఇవ్వగా వారిని 16 మంది జడ్జి లు పరిశీలించి ఉత్తమ ప్రదర్శనలు ఎంపిక చేసి వారిచే సభలో మరల వారి ప్రతిభను ప్రేక్షకులకు పరిచయం చేశారు.మధ్యాహ్నం ఈ పుస్తకం లోని కొంతమంది SHEROES అయిన ఉషా ముళ్ళపూడి, శ్యాల తాళ్లూరి, వంగపల్లి పద్మ, ఓల్గా, వంటి వారితో పుస్తక ఆవిష్కరణ చేయించారు. 350 బాలికలకు ఈ పుస్తకాలు జ్ఞాపికలు ప్రశంసా పత్రాలు బహుకరించారు.ప్రసాద్ గారు ఇందులో పాల్గొనే బాలికలను,తల్లిదండ్రులను సమన్వయం చేసి కార్యక్రమం విజయవంతం కావడానికి కీలక పాత్ర పోషించారు.ఇంకా NRIVA నుండి పందిరి శ్రీనివాస్ గారు కార్యక్రమ సమన్వయ కర్త గా చక్కని పాత్ర పోషించారు.Oxford పాఠశాలను వేదికగా ఇచ్చినందుకు పాఠశాల అధినేత వేదకుమార్ గారికి పుస్తక రచయితలు కృతజ్ఞతలు తెలియజేసారు.

ఒద్దుల రవిశేఖర్

పుస్తకాల పండక్కి వెళ్ళొద్దాం


పుస్తకం మస్తకపు ద్వారాలను తెరిచి విశాల ప్రపంచాన్ని చూపిస్తుంది. కాలం ఎంత మారినా పుస్తకం చేతికి తీసుకుని చదువుతూ ఉహించుకుంటూ అందులోని ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటే ఆ మజానే వేరు.పుస్తకపు పరిమళం అక్షరాల ద్వారా వెదజల్లబడుతుంది.దాన్ని గ్రోలుతూ ఉంటే మనస్సు విభిన్న భావోద్వేగాలకు లోనవుతుంటే ప్రపంచం మన ముందు సాక్షాత్కారించి నట్లుంటుంది. ఎందరో కవులు,రచయితలు తమ సృజనాత్మకతకు,మేధస్సుకు పదును పెట్టి ఎన్నో విలువైన విషయాలు మనకందిస్తుంటే మనం అతి సులభంగా ఆ జ్ఞానాన్ని అనుభూతిని పొందు తున్నాం.

ఇక విషయానికి వస్తే హైదరాబాద్ లో జరిగే పుస్తకాల పండుగ గురించి. ఎన్ని వందల స్టాళ్ల లో ఎన్ని వేల పుస్తకాలు కొలువు దీరి ఉన్నాయో, పుస్తక ప్రియులను రా రమ్మని ఆహ్వానిస్తూ! తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ ఇలా విభిన్న భాషల్లో మనల్ని ఆనందింప జేయడానికి సిద్ధంగా ఉన్నాయి.ఎంతో మంది కవులు,రచయితలు తమ పుస్తకాలను స్వయంగా అమ్ముతున్నారు. ఆ ప్రాంగణంలో పుస్తక ఆవిష్కరణలు, సమీక్షలు, సాంస్కృతిక కార్యక్రమాలు,పిల్లల ప్రదర్శనలు, రకరకాల తినుబండారాలు ఇలా ఓ పండుగనే తలపిస్తుంది. వేల మంది ఎంతో ఆసక్తిగా పుస్తకాలు చూస్తూ వివరాలు అడిగి తెలుసుకుంటూ కొంటున్నారు. పాత మిత్రుల కలయిక, కొత్త మిత్రులు పరిచయం కావడం ఓ అదనపు ప్రయోజనం.

ప్రతి ఒక కుటుంబం తమ పిల్లలతో కలిసి తప్పక సందర్శించవలసిన ప్రదేశం ఇది.చదివే అలవాటు లేని వారు కూడా ఒక్క సారి సందర్శిస్తే ఏదో ఒక పుస్తకం కొనక మానరు.పిల్లలకు ఇప్పటినుండే విభిన్న పుస్తకాలు చదివే అలవాటు చేయడం తల్లిదండ్రుల బాధ్యత. ఇప్పుడు చదవడం అలవాటయితే జీవితాంతం ఆ అలవాటు మానరు. వారికి మీరు ఇచ్చే అతి గొప్ప బహుమతి పుస్తకం అయితే చదవడం నేర్పే అలవాటు వారి జీవితాలను అత్యున్నత స్థాయికి తీసుకు వెడుతుంది.

చివరగా ఇంకో 4 రోజులు అంటే 29/12/24 9:00PM వరకు మాత్రమే NTR Stadium (దాశరధి కళా ప్రాంగణం ), ఇందిరాపార్క్ దగ్గర హైదరాబాద్ లో ఈ పండుగ జరుగుతుంది. ఒక్కసారి ఈ పండక్కి వెళ్లిరండి .

 ఒద్దుల రవిశేఖర్(https://www.facebook.com/share/p/15ZfRWHbbW/)

Sunday, 15 September 2024

47.పాటల పూదోట

 హిందీ musical language. మాటలు పాటలుగా ఒదిగే భాష. మహేంద్రకపూర్ పాడిన ఈ old melody వినండి. ప్రకృతిలోని మేఘం, ఆకాశం, జలపాతాలు, పర్వతాలు, ఇలా అన్నిటిని వర్ణిస్తూ విహరిస్తూ, వర్ణిస్తూ మనల్ని మైమరిపించేలా చేసే ఈ గీతం వింటుంటే ఇలా కదా జీవించాల్సింది వర్తమానంలో ప్రకృతితో కలిసి అనిపిస్తుంది.(https://youtu.be/904vZjjVhJU?si=MVJM9hek7E-K8s1L)

పుట్టినరోజు మొక్కలు నాటి పెంచడం.... ఈనాడు వార్త



పుడమికి పచ్చదనమే ఊపిరి


• మొక్కల పెంపే లక్ష్యంగా ముందడుగు •


భావితరాలకు మార్గదర్శకులు ఆ ఉపాధ్యాయులు


పర్యావరణ పరిరక్షణకు మొక్కల పెంపకం కీలకమని గుర్తించిన ఆ మాస్టార్లు కేవలం వాటిని పాఠాలకే పరిమితం చేయలేదు. విద్యార్థులకు భవిష్యత్తు నిర్దేశనం చేసే మార్గదర్శకులుగా మారారు. తాము పనిచేస్తున్న పాఠశాలలోనే అటు విధులు నిర్వహిస్తూ ఇటు పచ్చదనానికి శ్రీకారం చుట్టి పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. వారే మార్కాపురం పట్టణానికి చెందిన ఉపాధ్యా యులు ఒద్దుల రవిశేఖర్ రెడ్డి, ఎం.శ్రీనివాస్


న్యూస్ టుడే, మార్కాపురం పట్టణం


పాఠశాలలో విద్యార్థులతో మొక్కలు నాటిస్తున్న రవిశేఖర్ రెడ్డి 


పుట్టిన రోజు గుర్తుండి పోయేలా...


ఒద్దుల రవిశేఖర్ రెడ్డి తర్లుపాడు మండలంలోని చెన్నారెడ్డిపల్లె ఉన్నత పాఠశాలలో భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. మొక్కల పెంపకంపై అమితమైన ఆసక్తి ఉన్న ఈయన తాను పనిచేసిన ప్రతి పాఠశాలలో పచ్చదనం పెంపునకే ప్రాధా న్యమిచ్చారు. విద్యార్థులను ఆ బాటలో నడిపేందుకు విద్యార్థుల పుట్టిన రోజు సంద ర్భంగా మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విద్యార్థుల పుట్టిన రోజులను ముందుగానే రాసు కొని వారికి ఆ విషయాన్ని గుర్తు చేసి మొక్కలు తెప్పించి పుట్టిన రోజు నాటేలా చూశారు. దీంతో ఆ పాఠశాలలో ప్రస్తుతం పచ్చదనంతో కళకళలాడుతోంది తన సొంత ఖర్చులతో కొంత, దాతల సహకా రంతో మరికొంత నగదును పోగు చేసి వివిధ రకాలు మొక్కలు కొని నాటుతున్నారు. సపోట, దానిమ్మ, సీతాఫలం, నేరేడు, బాదం, బత్తాయి వంటి మొక్కలతో పాటు కూరగాయలు, ఆకుకూరల మొక్కలు పెంచుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. 13 సంవత్సరాలుగా ఆయన పనిచేసే ప్రతి పాఠశాలలో మొక్కల పెంపకానికి శ్రీకారం చుట్టి వాటి రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం గమనార్హం. మొక్కల పెంపకానికి సంబందించి ప్రభుత్వ కార్యక్రమాల్లో సమన్వయకర్తగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.