Tuesday, 2 September 2025

వినూత్నంగా సన్మానాలు

 సన్మానాలు 

దండలు,శాలువాలు బదులు

మొక్కలు పుస్తకాలు ఇద్దాం 

      ప్రస్తుతం సన్మానం ఏదయినా  శాలువాలు, దండలు ఉండాల్సిందే!retire అయిన వారు జరుపుకునే functions కి ఇక చెప్పాల్సిన పని లేదు. August 15,September 5,January 26 ఇలా ఏ సందర్భంగా awards గెలుచుకున్నా ఇక శాలువాల,దండలు తప్పని సరి. రెండూ పునర్వినియోగించేవి కావు, దండలు అయితే కొద్ది సేపటికే అక్కడే వదిలేస్తారు,శాలువాలు అయితే ఇంటికి తీసుకెళ్లి బీరువాలో పెడతారు.మళ్ళీ వాటిని ఉపయోగించరు.

             ఇలా కాకుండా ఇంకేదైయినా మంచి సన్మానం ఉందా! అక్కడక్కడా ఈ పాటికే అటువంటి సన్మానాలు చేస్తున్నారు.APNGC meetings లో అయితే మొక్కలు ఇస్తారు. కొన్ని సాహిత్య సమావేశాల్లో పుస్తకాలు ఇస్తారు. మరి అన్ని సన్మానాలకు మొక్కలు లేదా పుస్తకాలు ఇస్తే బాగుంటుంది కదా! మొక్కలు ప్రకృతి పరిరక్షణకు,పుస్తకాలు జ్ఞానసముపార్జనకు పనికి వస్తాయి కదా!

         సన్మానం ఘనంగా చేయాలి అనుకుంటే పెద్ద మొక్కలు, గ్రంధాలు ఇవ్వవచ్చు. గుర్తుగా ఒక జ్ఞాపికను ఇచ్చుకోవచ్చు.పుస్తకాలు ఇవ్వడం ద్వారా సమాజంలో చదివే అలవాటు అభివృద్ధి అవుతుంది. అలాగే మొక్కలు నాటే సంస్కృతి పెరుగుతుంది.

           ప్రభుత్వమే రాబోయే september 5 న ఇచ్చే ఉత్తమ ఉపాధ్యాయుల సన్మానాల నుండే ఇలా చేయొచ్చు. తరువాత వారికి పాఠశాల స్థాయిలో మొక్కలు,పుస్తకాలు ఇవ్వడం ద్వారా వారిని అభినందించవచ్చు.ఏదయినా ఒక మంచి ఎక్కడో ఒకచోట మొదలు కావాలి.

       ప్రభుత్వ,ప్రైవేట్ ఉద్యోగులు,రాజకీయ నాయకులు, నూతనంగా పదవులు పొందే వారు ఇలా మొక్కలు పుస్తకాలు ఇవ్వడం మొదలు పెడితే సామాన్య ప్రజలు కూడా ఈ అలవాటును ఆచరిస్తారు. కనుక ఈ దిశగా సమాజం అంతా ఆలోచిస్తుందని, మొదటగా ఉపాధ్యాయులుగా మనం ఇందుకు మార్గదర్శకులుగా ఉందామని కోరుకుంటున్నాను 

ఒద్దుల రవిశేఖర్

స్వచ్ఛ అక్ష్యరాస్యత(Clean literacy)

 Clean literacy (స్వచ్ఛ అక్షరాస్యత )

FA1 పరీక్షల మార్కులు upload చేసి cluster meetings కు హాజరవుతున్న ఉపాధ్యాయ మిత్రులందరికి నమస్తే 

      FA1 పరీక్షా పత్రాలు దిద్దే క్రమంలో విద్యార్థులు వ్రాసిన భాషను గమనించి ఉంటారు కదా అందరు.అన్ని subject లలో విద్యార్థులు తప్పులు లేకుండా వ్రాయగలిగారా! తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల పరిస్థితి ఏంటి? ఇక ఇంగ్లీష్ మీడియంలోకి మారిన Maths, P.S N.S, Social పరిస్థితి ఏమిటి? ఎంత మంది అక్షరాలు, పదాలు, వాక్యాలు తప్పుల్లేకుండా సరిగా వ్రాయగలిగారు.

మన చదువుల విషాదం ఏంటంటే ధారాళంగా చదవడం, శుద్ధంగా వ్రాయడం విషయంలో విద్యార్థులు ఇంకా సమస్యలు ఎదుర్కోవడం.అసలు పాఠం అర్ధం కావాలన్నా, నేర్చుకోవాలన్నా పై రెండు ప్రక్రియలు రాక పోతే ఎలా సాధ్యం?మనకున్న syllabus, exams,వివిధ కార్యక్రమాల నడుమ ప్రాధమిక ప్రక్రియలైన చదవడం, వ్రాయడం ప్రక్రియల పై దృష్టి పెట్టడం కష్టం అవుతుంది.కానీ ఈ సమస్య ను గుర్తించే FLN కి ప్రాధమిక స్థాయిలో ప్రాధాన్యత పెంచారు. మరి ఇప్పటి ఇంగ్లీష్ మీడియం ఉన్న పరిస్థితిలో పిల్లలు english లో ప్రశ్న చదవడం,దాన్ని అర్థం చేసుకోవడం, నేర్చుకొని వ్రాయడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను ఇలాగే పట్టించుకోకుండా వదిలేస్తే 10 వ తరగతి కి వచ్చే సరికి ఆ విద్యార్థులు పూర్తిగా వెనుక బడిపోతారు.అప్పటికి ఎలాగోలా బయట పడ్డ తరువాత చదువు కొనసాగించ లేక మానేస్తారు.

కనుక అందరు ఉపాధ్యాయులు తమ తమ subject లలో చదవడం, వ్రాయడం విషయం లో పిల్లలను వర్గీకరించుకొని, group leaders సహాయంతో పదాలు,వాక్యాలను ధారాళంగా చదవడం, శుద్ధంగా వ్రాయడంలో  నైపుణ్యం సంపాదించే టట్లు విద్యార్థులను తీర్చి దిద్ది  స్వచ్ఛ అక్షరాస్యత సాధించేందుకు ముందుకు రావలసినదిగా అభ్యర్థిస్తున్నాను..... ఒద్దుల రవిశేఖర్