Saturday 18 February 2017

                                                    తమిళనాడు యాత్ర నా అనుభవాలు
                  ముందే ప్రయాణ టికెట్స్ బుక్ చేసుకున్నందున స్థిమితంగా ఉన్నాము. కానీ అక్కడ రాజకీయ పోరాటం మొదల య్యింది .ఎక్కడ గందరగోళం జరుగుతుందోనని ఆందోళన పడ్డా గవర్నర్ నిర్ణయం ఆలస్యం అవటంతో మేము యాత్ర ముగించుకుని రాగలిగాము .
           ఒంగోలులో అర్థ రాత్రి హైదరాబాద్ చెన్నై superfast express లో బయలుదేరాము .చెన్నైకి ఉదయం 6 గంటలకి చేరాలి .కానీ ఊరిబయట ముప్పావుగంట ఆపేసాడు.తరువాత కదిలినా చిన్నగా 7;50 కి చెన్నై సెంట్రల్ చేరుకున్నాము.8;15 కు ఎగ్మోర్ లో గురువాయూర్ express లో త్రిచికి వెళ్ళాలి. ఆటోలో ఎగ్మోర్ చేరుకొని పరుగెత్తి ఎక్కినా 2 నిముషాల కే  కదిలింది.ఈ అసౌకర్యానికి బి.పి పేషంట్స్ అయితే ట్రైన్ మిస్ అయ్యేవాళ్ళు .
            చెన్నై సెంట్రల్ బయట ఆటో లు ఎక్కువ రేట్ అడుగుతారు.కొద్దిగా బయటకు వెళ్లి ఎక్కితే మంచిది. సమయం ఉంటె చక్కగా బస్సులు  ఉన్నాయి .కాస్త అడిగి ఎక్కాలి.బస్సులపై వివరాలు తమిళంలో ఉంటాయి.  బస్సు సంఖ్యల ఆధారం గా ఎక్కాలి.ఇంగ్లీష్ లో పేర్లు ఉంటె బాగుండు .సెంట్రల్ నుండి ఎగ్మోర్ కు  40 రూపాయ లు తీసుకుంటారు.కానీ కొంత మంది rs100 అడుగుతారు.బస్సు కు అయితే కేవలం 4 రూపాయలు మాత్రమే.కొద్దీ దూరం ముందు కెడితే ఓ ఫ్లైఓవర్ వస్తుంది.అక్కడకు బస్ లు వస్తాయి.అక్కడనుండి ఎగ్మోర్కు కేవలం 5 నిముషాల ప్రయాణం .
        త్రిచి (తిరుచిరాపల్లి )లో ఆ రూమ్ తీసుకున్నాము . ASHBAY HOTEL  మన సినిమా లో ఉండే మండువా ఇల్లు లాగా ఉంటుంది .అద్దె  ఇద్దరికి RS 950 ,అదనం గా ఒకరికి 250 ఉంటుంది .1956 నుండి నడుస్తున్నది . చక్కటి ఇంటి వాతావరణం 1. 5 ఎకరా విస్తీర్ణం,మొక్కలు చెట్లు ఉంటాయి.రైల్వే స్టేషన్ కి బస్సు స్టాండ్ కి మధ్య లో ఉంటుంది .టిఫిన్స్ త్రిచి  రైల్వే స్టేషన్లో బాగుంటాయి .కొద్దిగా రేట్ కూడా తక్కువే కాఫీ 10 రూపాయలు .మంచి టేస్ట్ ,మన కంటే పరిమాణం కాస్త ఎక్కువ .దోషాలు పెద్దగా ఉంటాయి .రేటు 40 ఉంటుంది భోజనం దగ్గరలో ఆనంద్ హోటల్ ప్రక్కనే రెస్టారంట్ లో బాగుంటుంది .
     ఇక మరుసటి రోజు ఉదయాన్నే శ్రీరంగం బయలు దేరాము.7 కి మీ ఉంటుంది . rs 6 చార్జి .చాలా గొప్పగా ఉంది ఆలయం.విశాల మైన ప్రాంగణం.చాలా గుళ్ళు ఉన్నాయి.విష్ణువు కొలువై ఉన్నాడు.గర్భగుడిలో శయనించిన విష్ణువును చూడటం మరవొద్దు.ప్రాంగణమంతా తిరగాలంటే ఒక పూట  పడుతుంది.వేయి కాళ్ళ మంటపం,చుట్టూ ప్రాకారాల్లాంటి గోపురాలు,చూడచక్కని శిల్ప సంపద .ఆ కాలపు రాజుల అభిరుచి చెక్కిన స్తంభాలు ,మంటపాలు ఆలయాలు గోపురాల లో  వ్యక్త మవుతుంది (తరువాయి భాగం మరో పోస్ట్ లో )       

Wednesday 15 February 2017

తమిళనాడు యాత్ర

తమిళనాడు యాత్ర :.                                                           రెండు రోజులు శ్రీరంగపట్నం,త్రిచి,తంజావూరు,కుంభకోణం యాత్ర గురించి మీతో పంచుకోవాలని పించింది.తిరుచురాపల్లి నే త్రిచి అంటారు.ఇది జిల్లా కేంద్రం,ఇక్కడ airport కూడా ఉంది.దీనికి దగ్గర లోనే శ్రీరంగపట్నం లో విష్ణువు కొలువై ఉన్నాడు.ఇక్కడి  గుడి చాలా విశాలంగా ఉంటుంది.శిల్పకళ కు అచ్చెరువొందుతాం.తరువాత తంజావూరు బృహదీశ్వరాలయం చూశాము.దీనిని big temple అంటారు.ఇది ఆసియా లోనే ఒక పెద్ద గుడి అంటారు.కుంభకోణం లోని సారంగపాణి,కుంభేశ్వర ఆలయాలు దర్శించాం.