Tuesday, 24 December 2013

ఈ సహస్రాబ్ది వ్యక్తి (Man off the millennium)


 
      ఎలా ఈయన అంత గుర్తింపు తెచ్చుకున్నాడు అని తెలుసుకుంటే ఆశ్చర్యమేస్తుంది. ఆయన పేరు కళ్యాణ సుందరం. ఆయనది తమిళనాడు రాష్ట్రం.చేసే ఉద్యోగము librarian.భారతదేశంలో అత్యుత్తమ librarian గా కేంద్ర ప్రభుత్వ సత్కారం పొందాడు. ప్రపంచంలోని 10 మంది అత్యుత్తమ librarians లో ఒకడిగా గుర్తింపు పొందాడు. ఇవన్నీ ఒక ఎత్తు .
          45 సం రాల నుండి సంఘసేవకు తన జీవితాన్ని అంకితం చేసాడు.వివాహము చేసుకోలేదు. 30 సం లుగా తన జీతం మొత్తాన్ని సేవా కార్యక్రమాలకే ఖర్చు చేస్తున్నాడు.మరి తన ఖర్చులకు డబ్బు ఎలా అని ఆశ్చర్య పోతు న్నారా! ఒక హోటల్ లో సాయంత్రం పనిచేస్తూ వారిచ్చేజీతంతో తన పరిమిత అవసరాలు తీర్చుకుంటాడు.రిటైర్ అయిన తరువాత వచ్చిన 10 లక్షలను సంఘసేవకే కేటాయించాడు.ఈ విషయాలన్నీ తెలుసుకున్న ఓ అమెరికన్ సంస్థ ఈయనను Man of the millennium గా ప్రకటించి 30 కోట్ల రూపాయలను బహుమతిగా అందించింది ఇక చెప్పేదేముంది ఈ మొత్తం కూడా దానధర్మాలకే వినియోగించాడు .
         ఈ విషయాలన్నీ గమనించిన రజనీకాంత్ ఎంతో ఆలోచించాడట ఆయన గురించి !అన్నీ ఇచ్చే చెట్టు గొప్పదా! చెట్టుని రక్షించేవాడు గొప్పవాడా! ఈ ఆలోచన తర్వాత రజనీకాంత్ మనసులో ఆయన ఓ జైన విగ్రహంలా ఎదిగారట  కల్యాణ సుందరం గారిని తన తండ్రిగా రజనీకాంత్ స్వీకరించారు.
           డబ్బు ఎంతున్నా తల్లిదండ్రులను ఆదుకోవడానికి అవేవీ పనికిరావు వారిని మనమే చూసుకోవాలి అన్న సందేశం ఈ దత్తత లో మనకు అర్దమవుతుంది.
           (ఈ కథనం ఆంధ్రజ్యోతి ఆదివారం సంచికలోనిది .వారికి ధన్యవాదాలు ) 

Sunday, 15 December 2013

దేవుడి భాషను చెప్పిన కుర్రాడు


             చిన్న జ్వరానికి,జలుబుకే కంగారు పడిపోతాం. కానీ అమెరికాకు చెందిన Myatee stepaneck నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చు. అతని 13 ఏళ్ళ జీవితంలో సాధించిన విజయాలు 1)అతడు వ్రాసిన కవితల పుస్తకాలు అమెరికాలో అత్యధికంగా అమ్ముడు పోయిన పుస్తకాల జాబితాలో స్థానం సంపాదించాయి.2)ప్రతిష్టాత్మక మైన మెలిండా ఎ లారెన్స్  పేరిట ఉన్నఅంతర్జాతీయ బుక్ అవార్డు గెలుచుకున్నాడు.3) తన లాంటి రోగుల కోసం దేశ మంతా తిరిగి విరాళాలు సేకరించి ఇచ్చాడు.3)ఎన్నోబహిరంగ సభల్లోపాల్గొన్నాడు,ఎన్నోటి .వి కార్యక్రమాల్లో పాల్గొ న్నాడు 4)అమెరికాలోని ప్రముఖులు అతని మిత్రులు .
            పుట్టినప్పటి నుంచి అతనికి ఓ అరుదైన వ్యాధి ఉంది.అది mascular dystrophy . ఈ వ్యాధితోనే అతని అన్నలు చనిపోయారు .చక్రాల కుర్చీ లేనిదే కదలలేడు.వారానికి ఒకసారి రక్త మార్పిడి చేయించుకోవాలి ఊపిరి పీల్చుకోవాలంటే ఒక యంత్రం పనిచేయాల్సిందే!ఆహారం గొంతులోకి గొట్టాల ద్వారా ఇవ్వాలి.ప్రతి రాత్రి నరాల ద్వారా సూదులు తప్పని సరి.ఎన్ని బాధలు !ఎంత కష్టం !
          ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది అతడు ఎప్పుడూ ఆనందంగా ఉండడం గురించి !నిరాశకు గురవకుండా అతను వ్రాసిన వేలాది కవితల గురించి.కవితలు కథలు వ్రాసేవాడు. శాంతి,ఆశ ప్రేమ జీవితం ప్రకృతి విచారం వైకల్యం లాంటి అంశాలపై ఎన్నో వ్యాసాలూ వ్రాసాడు. మ్యాటీ ని కలుసుకోవడం నా ఆశయాల్లో ఒకటి అన్నాడు జిమ్మీ కార్టర్. 
ఒఫ్రా విన్ఫ్రే ,ల్యారీ కింగ్ లాంటి ప్రముఖులు అతని కార్యక్రమాల్లో పాల్గొన్నారు .
     అతని భావాలలో కొన్ని
       *దేవుడికి నచ్చిన భాష పిల్లల భాష
     *నేను పెద్ద అవుతాననే నమ్మకం నాకు లేదు కానీ పెద్దవ్వాలనే కోరిక ఉంది . నాకు కథలు కవితలు ఇష్టం అందుకే రచయితను అవుతాను
* అందరి జీవితాల్లోను తుపానులు ఉంటాయి దీన్ని అందరు తెలుసుకోవాలి ప్రతి తుపాను తర్వాత మనం ఆడు కోవాలి.  జీవితమనే బహుమతి లభించినందుకు మనం ఆనందించాలి. 
*మనందరం ఒకే భూమి మీద ఉన్నాం. మన అందరికీ ఒకటే హృదయం ఉంది ఒకే జీవితం ఉంది అందుకే మన అందరం ఒకే కుటుంబం లా ఉండాలి
* నాకు ప్రతి రోజు ఒక బహుమతే! ఎందుకంటే ఎప్పుడు చనిపోతానో తెలియదు.కాబట్టి నాకు బలం దేవుడి నుంచి,అమ్మ నుంచి నాకు ఎదురయిన మనుషుల నుంచి లభిస్తోంది .
    చూడండి ఎంత ఆశావాదం! చిన్న విషయాలకే ఆత్మ హత్య చేసుకునే వారు,జబ్బుల బారిన పడి జీవితం పట్ల విరక్తి చెందిన  వారు అతని నుండి ఎంతో స్పూర్తి పొందవచ్చు.మ్యాటినీ తన 13 వ ఏట చనిపోయాడు గొప్ప స్పూర్తిని  ప్రపంచానికి అందించి.
  ( ఈ కథనం ఈనాడు పత్రిక లో వచ్చింది.వారికి ధన్యవాదాలు )


 

Thursday, 28 November 2013

అభివృద్ది పల్లవించిన గంగదేవిపల్లె


            ఈ రోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఎన్నికైన సర్పంచ్ లకు శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటవుతున్నాయి . ఆ సమావేశాల్లో గంగదేవిపల్లెను గురించి చెబితే బాగుంటుంది.
            పల్లెలన్నీ నిరక్షరాస్యత ,జీవన ప్రమాణాల తరుగుదల ,పేదరికం ఆకలి చావులు వంటి సమస్యలతో కునా రిల్లి  పోతున్నాయి.వాటికి అతీతమైనదేమీ కాదు ఒకప్పటి గంగదేవిపల్లె.అప్పుడు ఆ ఊరు మద్యం మత్తులో ముని గి తేలుతుంది.రోడ్లు లేవు కరంటు లేదు.ఊరంతా ఫ్లోరైడ్ నీళ్ళు .అధికారులు,రాజకీయ నాయకులు పట్టించు కున్న పాపాన పోలేదు.ఈ గ్రామం ఆంధ్రప్రదేశ్ లోని వరంగల్ జిల్లా,గీసుకొండ మండలంలో ఉంది.
         కూసం రాజమౌళి ఆయన మిత్రులు గొనె చేరాలు,చల్ల మల్లయ్య,కూసం నారాయణ పెండ్లి రాజయ్య ఓ జట్టుగా కలిసి ఆ ఊరిని ఆదర్శంగా తయారు చేయాలని సంకల్పించారు.గ్రామ ప్రజల్లో చైతన్యం కల్పించారు.ఆ ఊరిలో బడి లేదు డాక్టర్ లేడు. శివారు గ్రామం,పంచాయతీ కూడా కాదు. మద్యం తో అందరు ఇంట బయటా గొడవ పడుతుండే వారు.నాటు సారా త్రాగి చని పోతుండేవారు.రాజ మౌళి ఆయన  మిత్రులు కలిసి ఊర్లో సారాపై నిషేధం విధించారు.  ప్రతి ఇంటికి వెళ్లి త్రాగుబోతులకు నచ్చజెప్పారు.సారా contractors వ్యతిరేకించారు.అయినా లెక్కచేయకుండా అభి వృద్ది వైపు తోలి అడుగు వేసారు.1994 లో ఈ గ్రామానికి పంచాయతీగా గుర్తింపు వచ్చింది.
             తరువాత నీటి కమిటీని ఏర్పాటు చేసి గ్రామస్తుల చందాలతో  రూ 53000 వసూలు చేసి లోడి ,బాల వికాస్
సంస్థల  సహకారంతో కుళాయిల ద్వారా నీటి సరఫరా ఏర్పాటు చేసుకున్నారు. టాటా కంపెనీ సహాయంతో ఫ్లోరైడ్    రహిత త్రాగునీరు ఏర్పాటుచేసుకున్నారు.2000 సంవత్సరం సిమెంట్ రోడ్లు ,వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు అయ్యాయి.కానీ ఊరంతా ఆరుబయట మలమూత్ర విసర్జనాలు చేస్తుండేవారు.పారిశుధ్యం పై వారిలో చైతన్యం కల్పిం చారు రాజమౌళి.జరిమానాలు హెచ్చరికలతో ఊరంతా దారికి వచ్చారు.తరువాతి కాలంలో అక్షరాస్యతపై నాటి కలు వేయించి రాత్రి బడులు తెరిపించారు.పది మంది నిరక్ష్యరాస్యుల బాధ్యత ఒక అక్ష్యరాస్యుడికి అప్పగించారు. 2002 నాటికి 100% అక్ష్యరాస్యత సాధించారు.పిల్లలందరినీ బడిలో చేర్చారు .
            తరువాత పచ్చదనానికి ప్రాధాన్యత నిచ్చి ప్రతి ఇంటి ముందు ఒక మొక్క నాటేలా తప్పనిసరి చేసారు. మొక్క పెంచకపోతే మంచి నీళ్ళు కట్ చేసారు.ఆ వూరిలో కరంట్ చౌర్యం చేయరు.సకాలంలో బిల్లులు చెల్లిస్తారు. తగాదాలు పంచాయతీలోనే పరిష్కరించుకుంటారు. గ్రామ పెద్దలే తీర్పు ఇస్తారు ఎన్నికల్లో మందు,నోట్ల పంపిణీ నిషేదించారు.1995 నుంచి ఇప్పటివరకు ఏకగ్రీవ ఎన్నికలే ఊర్లో మహిళలే మహారాణులు.1995 నుంచి అందరు మహిళలే వార్డ్ members 14 పొదుపు సంఘాలున్నాయి .కెనడా,బంగ్లాదేశ్ ల నుంచి వచ్చిన సంస్థలు గ్రామ అభివృద్ధిని మెచ్చుకున్నాయి . శిక్షణ కొచ్చిన ప్రతి ఐఏఎస్ కు ఈ ఊరు ఓ పాట్యాంశం. 2005 లో పంచాయతీరాజ్ కమీషనర్ చెల్లప్ప "దేశం లో ప్రతి జిల్లాలో ఇలాంటి గ్రామం ఒకటుండాలి" అన్నాడు .
           గ్రామం లో 13 అభివృద్ది కమిటీలు వేసారు. రూపాయికి 20 లీటర్ల మినరల్ వాటర్ సదుపాయం కల్పించారు
2007 లో  ఈ గ్రామం దేశంలో ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎన్నికయింది . కూసం రాజమౌళి గారు అప్పటి నుంచి సర్పంచ్చ్ గా కొనసాగుతున్నారు.ఈ గ్రామం అగ్రశ్రీ అవార్డ్ సాధించింది.నిర్మల్ గ్రామ పురస్కారం అబ్దుల్ కలాం ద్వారా స్వీకరించారు . వివిధ పార్టీలున్నా ఊరి మంచికోసం అందరూ స్పందిస్తారు .
         ఇలాంటి గ్రామాలు దేశమంతా ఏర్పడితే దేశం అభివృద్ది చెందిన దేశంగా మారుతుంది.
             (ఈ సమాచారం ఈనాడు ఆదివారం నుండి సేకరించ బడింది .వారికి ధన్యవాదాలు )

Sunday, 24 November 2013

స్టీవ్ జాబ్స్ చెప్పిన జీవిత సత్యాలు

       సాంకేతిక ప్రపంచానికి రారాజు లా వెలుగొందినా తాను జీవితం లో చూసిన ఎత్తు పల్లాలను తనదైన మాటల్లో ఓ తాత్వికవేత్తలా స్టీవ్ జాబ్స్ చెప్పిన తీరు ఆయన మాటల్లోనే 
  •  "మనిషి జీవితం లోని అన్ని సంఘటనలకు లింక్ లు ఉంటాయి . వాటన్నిటిని కలుపుతూ  పోతే అదే భవిష్యత్తు అవుతుంది . అదే జీవిత మవుతుంది . ప్రతి మార్పును ఆహ్వానించాలి.ఆస్వాదించాలి . "
  • "జీవితంలో ఎదురుదెబ్బలు అవసరం.ఆత్మ విశ్వాసాన్నికోల్పోకూడదు.చేస్తున్న పనిని ప్రేమిస్తూ ఉండాలి.ఎప్పుడూ ఒకే పనిలో సెటిల్ అయిపోకూడదు . అలా అయిపోతే మనలోని కొత్త ఆలోచనలు బయటికి రావు.జీవితంలో ఎలాంటి మెరుపులు ఉండవు ".   
  • "ప్రతి రోజు ఇదే నీ ఆఖరి రోజు అనుకోని బ్రతికితే ఏదో ఒకరోజు నువ్వు ఉన్నత స్థానంలో ఉంటావు . "
  • "ఈ భూమ్మీద మనుషులందరూ సమానంగా పంచుకునేది ఏదయినా ఉందంటే అది మరణమే .కాబట్టి ఈ ప్రయాణం లో ఎదురయ్యే అవమానాలు,రాగ ద్వేషాలు ,అపజయాలు అన్నీసమానమే". 
  • "మనం  ఏం వదిలేసి వెళ్ళిపోతున్నాం అన్నదే ముఖ్యం.సాటి వారికి ఎంత సాయ పడ్డాం,ఈ ప్రపంచానికి ఏం అందించ గలిగాం,ఎంత ప్రేమను పొందాం అన్నదే శాశ్వతం". 
  • "connecting the dots,నేను దీన్ని నమ్ముతాను. మన లక్ష్యం బలంగా ఉండాలి.ఎన్నిఅనూహ్య పరిణామాలు ఎదురయినా మనసు కోకూడదు.అప్పుడే ఆ పరిణామాలన్నీ అనుసంధానమై లక్ష్యం వైపు నడిపిస్తాయి ".

Sunday, 10 November 2013

ప్రజల ప్రాణాలు గాల్లో!

           చార్ ధామ్ యాత్రలోఆకస్మిక వరదల్లో వేలల్లోభక్తులు మరణించారు.భక్తీ పారవశ్యంతో వెళ్లి కుంభమేలాల్లో ఆలయాల్లోతోక్కిసలాటల్లో వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు.ఆలయాలు,మత సంబంద ప్రాంతాల్లో గత పదేళ్ళలో 1000 మంది ప్రాణాలు కోల్పొయారు.వీటిల్లో నిస్సహాయులైన మహిళలు ,వృద్దులు,చిన్నారులు   బలి అవుతున్నారు. వరదలు,తుపానులు వలన మరిన్ని వందల మంది మరణిస్తున్నారు. ఆలయాలకు ఆదాయం పుష్కలంగా వస్తున్నా సురక్షిత ఏర్పాట్ల పై ఏమాత్రం దృష్టి పెట్టక పోవటం ,గత అనుభవాల నుండి పాటాలు నేర్వక పోవటంతో ఈ సంభవిస్తున్నాయి.
               ఇవన్నీఒక ఎత్తు అయితే ఇక యముడి నరకలోకానికి దారులా అన్న విధంగా ఉండే మన రోడ్లపై జరిగే ప్రమాదాల్లో ఏడాదికి కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు.ఈ మధ్య వోల్వో బస్సులో45 మంది సజీవదహన సంఘటన మనసును కలచి వేసింది.ఈ ఘటన కలిగించిన భయంతో ట్రైన్ లో పొగలు రావటంతో దూకి ప్రాణాలు పోగొ ట్టుకున్న వారెంత దురదృష్టవంతులు.ఇక గౌతమీ ఎక్ష్ ప్రెస్ లో మంటల్లో ప్రాణాలు కోల్పోయిన వారిదెంత విషా దం.ఇక లారీలు,ఆటోలు ,బైక్స్ ప్రమాదాలు లెక్క లేనన్ని ఆగి ఉన్న లారీని డీ కొని ఎన్నో  ప్రమాదాలు జరుగుతు న్నాయి.బైక్స్ పై వేగంగా వెడుతూ యువకులు ప్రాణాలు కోల్పోతున్నారు.విజయవాడలో బస్ స్టాప్ లో ఆగి ఉన్న వారిపై కారు వెళ్ళడం వారు చనిపోవడం చూస్తుంటే ప్రజల ప్రాణాల కెంత భద్రత ఉందో అర్థమవుతుంది .
          వీటి వెనుక ప్రజలు సరి అయిన జాగ్రత్తలు తీసుకోక పోవటం,డ్రైవర్స్ నిర్లక్ష్యం ట్రాఫిక్ నియంత్రణ సరిగా లేకపో వటం రోడ్డు భద్రతా ప్రమాణాలను పాటించే యంత్రాంగం వైఫల్యం ,త్వరగా గమ్యం చేరుకోవాలనే ప్రయాణీకుల తొందర ఇలా ఎన్నో అంశాలు ఇమిడి ఉన్నాయి.
        పటిష్ట మైన భద్రతా ఏర్పాట్లు ,ముందస్తు హెచ్చరికలు ,చట్టాలను కటినంగా అమలు చేయటం,ట్రాఫిక్ నిబం ధనల ప్రచారం , లైసెన్స్ ల తనిఖీ, వాహనాలు  సరి అయిన స్థితిలో ఉన్నాయో లేదో చూడటం  వంటి చర్యల వలన వీలయినంత మేర ప్రమాదాలు  తగ్గించవచ్చు.ప్రజలు తమ విలువైన ప్రాణాలు  కాపాడు కోవటానికి తగిన  జాగ్రత్తలు తీసుకోవటం ,పకడ్బందీ ఏర్పాట్లతో ప్రయాణం చేయటం ఎంతో అవసరం .    

Monday, 4 November 2013

పుట్టిన రోజు ఇలా చేస్తే ఎలా ఉంటుంది!


           మా చిన్నప్పుడు పుట్టిన రోజు చేసుకున్న జ్ఞాపకాలే లేవు.గుర్తు ఉంచుకుందామనుకుంటూ ఉంటాము.   తీరా ఆ  రోజుకి మర్చి పోవటం ,18 వ ఏట అనుకుంటా ఓ ఫ్రెండ్ గుర్తుచేసేదాకా ఇలా మరిచిపోవటమే జరిగింది మరి ప్పుడో పిల్లల పుట్టిన రోజులు ఎంతో వైభవంగా జరపటం చూస్తున్నాము.ఘనంగా ఆడంబరంగా జరుపుతున్నారు.   ఎంతోడబ్బు ఖర్చు చేస్తున్నారు.చిన్నప్పుడు ఓ 5 లేదా 6 ఏండ్ల వరకు పర్లేదు కానీ తరువాత నిరాడంబరంగా జరు పుకుంటే బాగుంటుందేమో!
          ఇక పోతే పుట్టిన రోజు ఎన్నో నిర్ణయాలు తీసుకుంటారు.వాటి అమలులో విఫలం అవుతుంటారు .ఇది అంతా మామూలే! ఇక చెప్పేదేమిటంటే ఈ మధ్య మా అమ్మాయి పుట్టిన రోజు ఏదైనా విభిన్నంగాచేద్దామనుకున్నాను. గుర్తు ఉండిపోయేలా!అప్పుడు ఓ ఆలోచన వచ్చింది.ఆ రోజు మొక్కలు నాటితే ఎలా ఉంటుంది అని. కానీ ఎక్కడ నాటాలి ? నాటగానే సరిపోదు వాటిని సంరక్షించాలి. వాటిని పెంచాలి. అప్పుడే కదా ఫలితం.నేను పనిచేసే పాటశాల సరయిన చోటు అని నిర్ణయించుకున్నాక దగ్గరిలో ఉన్న నర్సరీ నుండి 8 కానుగ మొక్కలు తెప్పించి బడి పిల్లలు మరియు మావ్యాయామ ఉపాధ్యాయుడు  రామానాయక్ సహకారంతో నాటించాను.ఆయన అప్పటికే చాలా  మొక్కలను పెంచాడు.8,9 తరగతుల పిల్లలకు వాటి బాధ్యత అప్పగించాము.ఒక్కొక్కరికి ఒక మొక్క కేటాయించి వాటి సంరక్షణ చూడమని ప్రోత్సాహించాము.అలాగే పిల్లలందరికీ వారి పుట్టిన రోజు నాడు మొక్కలు నాటమని చెప్పాము .
             ఇలా మనం ప్రతి పుట్టిన రోజు ఒక మొక్క నాటినా ఈ ప్రపంచానికి ఎంతో మేలు చేసిన వారిమవుతాము.ఓ కల కంటే తప్పు లేదనుకుంటా! ప్రపంచంలో ప్రతి ఏటా 7 వ వంతు జనాభా ప్రతి ఒక్కరు ఇలా ఒక మొక్క నాటినా   ఏటా 100 కోట్ల మొక్కలు నాటవచ్చు.అప్పుడు ఈ భూమి మీద నీటి కరువు ,గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఉండవేమో!
మీరు కూడా మీ గుర్తుగా ఈ భూమికి  బహుమతిగా ఒక మొక్క నాటుతారు కదూ !

Wednesday, 30 October 2013

అన్ని గ్రామాలు హివ్రే బజార్ లా ఉంటే ఎంత బాగుంటుందో కదా!


                    ఆంధ్రప్రదేశ్ లో 3 నెలల క్రితం పంచాయతీ ఎన్నికలు జరిగాయి .నిన్ననే సర్పంచ్ లకు చెక్ పవర్ వచ్చింది .మరి గ్రామాలు ఎలా ఉండాలి?మహాత్ముడు కలలు గన్న గ్రామ స్వరాజ్యం ఎక్కడుంది? సర్పంచ్ ల నాయ కత్వంలో ప్రజలు సమిష్టి కృషితో ఏ విధంగా అభివృద్ది సాగించాలి? అనే విషయాలను మహారాష్ట్ర లోని అహ్మద్ నగర్ జిల్లా  నగర్ తాలుకాలోని హివ్రేబజార్ గ్రామాన్నిపరిశీలిస్తే అర్థమవుతుంది.
           ప్రపంచంలోని వంద దేశాల ప్రతినిధులు సందర్శించిన పల్లె అది.సర్పంచ్ ఎలా ఉండాలో ప్రజలెలా  ఉండాలో ఆదర్శ గ్రామాలు ఎలా ఉండాలో నిరూపించిన గ్రామం ఇది.ఆ వూరి సర్పంచ్ పేరు పోపట్రావు పవార్.ప్రజలు,నీళ్ళు అడవి,జంతువులు ఆయన అజెండా!అంతర్గత శతృవులయిన కరవు ,పేదరికం నిరుద్యోగం,అనారోగ్యం ఇవే కదా ! పల్లెలకు శత్రువులు .వీటిపై మరో స్వాతంత్ర్య పోరాటం చేయాలని పిలుపు నిచ్చాడు జల సంరక్షనే ప్రధాన లక్ష్యం వాన చినుకుల్ని ఒడిసి పట్టుకున్నారు.ప్రభు త్వ నిధులు ఒక్క పైసా దుర్వినియోగం కాకుండా 600 ఇంకుడు గుంతలు త్రవ్వుకున్నారు. checkdam  లు కట్టుకున్నారు.పల్లె అంతా బిందు సేద్యమే!నీటి ఆడిట్ పద్ధతిని ఏర్పాటు చేసుకుని గొట్టపు బావులు నిర్మించారు.గ్రామసభలోచర్చించి ఎవరు ఏ ఏ పంటలు వేయాలో నిర్ణయిస్తారు. అన్ని వసతుల గల  పాటశాల నిర్మించుకున్నారు.ఒక్క దోమ కూడా అక్కడ కనపడదు .ప్రతి ఇంటికి మంచి నీటి కుళా యిలు,మరుగు దొడ్డి ఉన్నాయి.భూగర్భ డ్రైనేజి వ్యవస్థ ఉంది.ఊరంతా బయో గ్యాస్ తో వంట చేస్తారు.దొంగ  తనాలు దోపిడీలు లేవు. మద్యపానం అక్కడ నిషిద్ధం. వ్యాయమశాల,గ్రంధాలయం,ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పశు వుల ఆసు పత్రి ఆడిటోరియం ఉన్నాయి.నిధులు ప్రభుత్వానియే అయినా ఇవన్నీ ప్రజలు శ్రమదానం ద్వారా కట్టుకున్నవే! పల్లె బాగుపడాలంటే ప్రజల్లో సమైక్యత ఉండాలి .సహకార స్పూర్తి కావాలి..ఇదే  గ్రామీణ భారత ధార్మిక నీతి... ---హివ్రేబజార్ విజయ  రహస్యము ..
         1989 నుండి ఏకగ్రీవంగా ఎన్నికవుతున్న పోపట్ రావు M.COM. చదివారు.అన్నాహజారెను ఆదర్శంగా తీసుకుని ప్రజల్లో నైతిక విలువలు పెంపొందించారు .సార్క్ సదస్సులో తన అనుభవాన్ని పంచుకున్నారు.వివిధ విశ్వవిద్యాలయాలు,మేనెజ్ మేంట్ స్కూల్స్ లో  గ్రామీణాభివృద్ది గురించి మాటలాడారు.మహారాష్ట్ర  ప్రభుత్వం  golden jubilee india programme క్రింద 300 గ్రామాల్ని హివ్రేబజార్ లా తీర్చిదిద్దాల్సిన  బాధ్యత  ఆయనకు అప్పగిం చింది జాతీయఅవార్డ్  అందుకున్నారు.రాజకీయ party లు ఆయనకు  M.L.A పదవి  ఇస్తామన్నా వద్దన్నారు .
              మన  రాష్ట్ర  సర్పంచ్ లంతా  హివ్రే బజార్ చూసి వచ్చి ఇక్కడ కూడా అలా చేస్తే  బాగుంటుంది కదా!
(ఈ వ్యాసం ఆదివారం ఈనాడు అనుబంధం లోనిది .వారికి ధన్యవాదాలు.)
  మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్  ను గమనించండి
http://www.rainwaterharvesting.org/Rural/Hirve.htm  

Sunday, 20 October 2013

తల్లిదండ్రులూ!పిల్లలకు bikes,cars ఇచ్చేముందు ఓ సారి ఆలోచించండి! .

           ఓ హృదయ విదారక సంఘటనను చూసిన తరువాత ఈ వ్యాసం వ్రాయాల్సి వచ్చింది. స్కూల్స్ colleges తెరిచిన తొలి రోజు మేము స్కూల్ నుండి ఇంటికి వస్తుండగా ఒక విద్యార్థి ఒక అమ్మాయిని బైక్ మీద తీసుకువస్తూ ఒక కల్వర్ట్ దగ్గర accident కు గురై అబ్బాయి చనిపోగా ఆ అమ్మాయికి కాలు విరగటం జరిగింది.నేను బస్సులో అక్కడికి వచ్చే ఓ 5 నిముషాల ముందే అది జరిగింది. ఆ అమ్మాయి ఆ అబ్బాయి అక్క అని తరువాత తెలిసింది  ఆ తల్లితండ్రుల కెంత గర్భశోకం. ఆ అబ్బాయి ఇంటర్ పూర్తిచేసి ఇంజినీరింగు వెళ్ళాల్సి ఉంది అమ్మాయి ఇంజినీరింగ్ చదువుతూ ఉంది.అక్కను కాలేజీ నుండి ఇంటికి తీసుకు వస్తుండగా జరిగింది ఈ సంఘటన.
          ఇటువంటి సంఘటనలు ఈ మధ్య చాలా జరుగుతున్నాయి.పిల్లల కోరిక మేరకు bikes,cars కోరిక మేరకు కొని ఇస్తున్నారు.వాటిని అతి వేగంతో నడపటం,లేదా ఎదురుగా వచ్చేవాహనాల పొరపాటుతో ప్రమాదాలు జరగటం చూస్తున్నాం .బాబు మోహన్ ,అజహరుద్దీన్ కోట శ్రీనివాసరావు ,కోమటిరెడ్డి వెంకట రెడ్డి వీరి కుమారులు  ఈ విధం గా చనిపోయిన వారే!18 సంవత్సరాల వయసు నిండదనిదే వాహనం నడపకూడదు.12 సంవత్సరాల పిల్లలు కూడా నడుపుతున్నారు.వారికి bikes నడపటానికి parents ఎలా అనుమతిస్తున్నారో అర్థం కాదు.అలాగే ట్రాఫిక్ పోలీస్ పట్టించుకోవటం లేదు.అతి వేగంతో నడపటం కాకుండా ఒక్కో  బైక్ మీద ముగ్గురు కూడా ప్రయాణం చేస్తుంటారు town limits లోకూడా అతి వేగంగా వెళ్లి పాదచారులను ప్రమాదాలకు గురిచేస్తున్నారు.ఇక driving licence లేకుండా నడిపే వారెంత మందో!అడిగే వారెవరూ లేరు.
              ఈ విషయం చాలా serious గా ఆలోచించాల్సిన అంశం . లేక పోతే దేశానికి ఎంతో విలువైన యువత అర్థాంతరంగా రాలిపోతున్నారు.ఇది  తల్లిదండ్రులు,ట్రాఫిక్  వ్యవస్థ ,పౌర సమాజం స్పందించాల్సిన అంశం .

Tuesday, 15 October 2013

విశ్వ నరుడు(స్టీఫెన్ హాకింగ్ పై పాపినేని శివశంకర్ కవిత)

physically challenged  కాదు
Physics నే  challenge చేసినవాడు
దేహ విధ్వంసం చేసే
మోటార్   న్యురాన్  వ్యాధిని
విజ్ఞాన వ్యాయామంతో
అధిగమించినవాడు
ధ్వనులుగా పొల్లులుగా  విడిపోయి
పడిపోయిన మాటని
speech synthesizer లో స్థిరపరుచుకున్నవాడు
ప్రపంచంలో ప్రతి వికలాంగుడికి
గుండెదిటవు నిచ్చినవాడు
కాస్మిక్ కడలిలో
బుద్ది బాహువుల గజ ఈతగాడు
కాల్లూ చేతులు  ఆడకపోయినా
కాలబిలంలో ఏరోబిక్స్ చేసినవాడు
అండాండ పిండాండాల నులిపోగుల్లో
ఉయ్యాల లూగినవాడు
విశ్వానికి అంతం లేదని పంతంతో
బ్రహ్మాండానికి Grand design నిర్మించి
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకునికే
ప్రవేశం నిరాకరించినవాడు
వికలాంగుడు కానే కాడు
సకల మేధాంగ  సుందరుడు
స్టీఫెన్ హాకింగ్  einstein కు
అసలైన వారసుడు

Sunday, 13 October 2013

అన్నార్తులకు ఇ-సాయం

              ప్రపంచ వ్యాప్తంగా తినేందుకు తిండి లేక ప్రతిరోజు 24,000 మంది చనిపొతున్నారు.వీరిలొ 3 వ వంతుమంది 5 సంవత్సరాల వయసు లోపు చిన్నారులే .ఈ విషయం తెలుసుకున్న జాన్ బ్రీన్ అనే కంప్యూటర్ ప్రోగ్రామర్  ఇంటర్నెట్ తో అన్నదానాన్ని ముడి పెట్టాలనుకున్నాడు .ఈ ఆలోచన పలితమే hungersite అనే website.1999 june లో ఏర్పాటయింది.తరువాత  ఆర్ధిక  సమస్యల  కారణంగా ఈ సైట్ charityusa   అనే సంస్థ చేతుల్లోకి వెళ్ళింది.
              కొన్ని సంస్థలు విరాళాలు తీసుకుంటాయి.కానీ ఈ సైట్  మనం చేసే క్లిక్ ల ఆధారంగా నడుస్తుంది www.thehungersite.com  open చెయ్యగానే  click here its free అని  వస్తుంది రోజు కొక సారి క్లిక్ చెయ్యటమే అలా చెయ్యగానే మనం  thankyou పేజి లోకి వెళ్తాము అక్కడ కొన్ని వ్యాపార ప్రకటనలు ఉంటాయి.  మనం   కొన్నా    కొనకపోయినా చూస్తె  చాలు.స్పా న్సర్స్ hungersite కు foodpackets  పంపిస్తారు అది వాళ్ళ మధ్య ఒప్పందం .ఈ సైటుకు అమెరికా లోని mercycore,second harvest అనే  సంస్థలు  సాయం  అందిస్తున్నాయి.
             ఇంకా ఈ సైట్ లో breastcancer,animals,veterans,autism,diabetes,literacy,rainforest వంటి సమస్యలకు కూడా సైట్స్ ఉన్నాయి .
            ప్రతి రోజు ఒక్క  సారయినా ఈ  సైట్ లోకి వచ్చి క్లిక్స్ ఇవ్వడం ద్వారా ఎంతోమంది జీవితాల్లో ఆనందాన్ని నింపిన వారమవుతాము. మరెందుకు ఆలస్యం ఈ రోజే మొదలెడదాము.

www.thehungersite.com
(ఈ సమాచారం ఆదివారం ఈనాడు అనుబంధం  లోనిది .వారికి ధన్యవాదాలు)