స్నేహితుడు సినిమా ఎందుకు చూడాలి?
విద్యార్థులు,తల్లిదండ్రులు ఉపాధ్యాయులు,అధ్యాపకులు, యాజమాన్యాలు, ప్రభుత్వ విద్యా శాఖ ,విద్యకు సంబంధించిన ప్రతి ఒక్కరు ఈ సినిమాను చూడాలి. ఇదేంటి !ఈ సినిమాకు ప్రచారం చేస్తున్నాడు అనుకుంటున్నారా!
హిందీలో 3 idiots చూడలేకపోయాను.ఈ స్నేహితుడు చూసిన తర్వాత చూడమని చెప్పకుండా ఉండలేకపోతున్నాను .ఎందుకో వినండి! మొత్తం మన విద్యా వ్యవస్థ లక్ష్యం విద్యార్థులందరినీ ర్యాంకులు,మార్కులతో విభజిస్తూ భవిష్యత్ గుమస్తాలను తయారు చేసే దిశగా సాగుతోంది.బ్రిటిష్ మెకాలే ప్రవేశపెట్టిన వ్యవస్థ ఇంకా కొనసాగుతోంది.లేకపోతే ర్యాంకులు, మార్కుల లక్ష్యముగా భోధన జరుగుతుందేకాని విద్యార్థి సమగ్ర మూర్తిమత్వాన్ని అభివ్రుద్దిచేసే విధానాలు భోధనలో లేవు.
విద్యా వ్యవస్థను రెండు భాగాలుగా చేసి విశ్లేసిస్తే 1)L.KG నుండి 12 వ తరగతి 2)ఉన్నత విద్య
ఉన్నత విద్య అయిన మెడిసిన్ ఇంజనీరింగ్ ఎంట్రన్సు లకు శిక్షణా కేంద్రాలుగా పాటశాలలు మారి పోయాయి. .ఉదాహరణకు 10,000 సీట్లు ఉండే I.I.T ఎంట్రన్సు కోసం 5 లక్షలమంది, A.I.E.E.E కోసం 10 లక్షల మంది విద్యార్థులు శిక్షణ పొందుతూ ఉంటె వీటికి foundation course పేరిట ఆరవ తరగతి నుండి దేశ వ్యాప్తంగా మరి కొన్ని లక్షలమంది గణితము, సైన్సునే application orriented లో అభ్యసిస్తున్నారు .ఆటలు,పాటలు,కళలు moral values, సైన్సు ప్రయోగాలు అన్ని పాటశాలల లో శూన్యం. ఇలా తయారైతే భవిష్యత్తులో వీరు ఏమవుతారు ఉన్నత విద్యలో కూడా సినిమాలో చూపినట్లు ఎక్కడా విద్యార్థి సృజనాత్మకతకు, పరిశోధనకు అవకాశం ఇవ్వకుండా జరిగే విద్యా భోధన శాస్త్రవేత్తలను ఎలా తయారు చేయగలదు. అమెరికా డాలర్స్ సంపాదించే కంప్యూటర్ మనుషులను తప్ప!
ప్రస్తుత సమాజ అవసరాలఫై అధ్యయనం చేయని విద్య, పరిశోధనకు ప్రాముఖ్యత ఇవ్వని విద్య,పరిశ్రమలతో ప్రత్యక్ష అనుసంధానము లేని విద్య ఎలా భావిభారత పౌరులను తయారుచేయగలదు?మన దేశ బడ్జెట్ లో 2% విద్యకు కేటాయించి ఏమి సాధించాలి?అందులో పరిశోధనకు మరింత తక్కువ కేటాయిస్తారు.6% కేటాయిస్తే కొంతవరకు న్యాయం చేసినట్లు.
భారత మానవ వనరుల శాఖ నిర్ణయించినట్లు,దేశవ్యాప్త ఇంజనీరింగ్ ఎంట్రన్సు పెడుతూ దానిని SAT(USA) తరహాలో కోచింగ్ లకు ఆస్కారం లేని విధం గా సిలబస్ లోనే ఆయా అంశాలఫై భోధన వుండే విధం గా తయారు చెయ్యాలి.పాటశాల స్థాయిలోర్యాంకులు ,మార్క్స్ గొడవ తీసివేసి సమగ్ర మూల్యాంకనం ప్రవేశ పెట్టాలి.అప్పుడే విద్యాలయాలు బాగుపడతాయి .
హిందీలో 3 idiots చూడలేకపోయాను.ఈ స్నేహితుడు చూసిన తర్వాత చూడమని చెప్పకుండా ఉండలేకపోతున్నాను .ఎందుకో వినండి! మొత్తం మన విద్యా వ్యవస్థ లక్ష్యం విద్యార్థులందరినీ ర్యాంకులు,మార్కులతో విభజిస్తూ భవిష్యత్ గుమస్తాలను తయారు చేసే దిశగా సాగుతోంది.బ్రిటిష్ మెకాలే ప్రవేశపెట్టిన వ్యవస్థ ఇంకా కొనసాగుతోంది.లేకపోతే ర్యాంకులు, మార్కుల లక్ష్యముగా భోధన జరుగుతుందేకాని విద్యార్థి సమగ్ర మూర్తిమత్వాన్ని అభివ్రుద్దిచేసే విధానాలు భోధనలో లేవు.
విద్యా వ్యవస్థను రెండు భాగాలుగా చేసి విశ్లేసిస్తే 1)L.KG నుండి 12 వ తరగతి 2)ఉన్నత విద్య
ఉన్నత విద్య అయిన మెడిసిన్ ఇంజనీరింగ్ ఎంట్రన్సు లకు శిక్షణా కేంద్రాలుగా పాటశాలలు మారి పోయాయి. .ఉదాహరణకు 10,000 సీట్లు ఉండే I.I.T ఎంట్రన్సు కోసం 5 లక్షలమంది, A.I.E.E.E కోసం 10 లక్షల మంది విద్యార్థులు శిక్షణ పొందుతూ ఉంటె వీటికి foundation course పేరిట ఆరవ తరగతి నుండి దేశ వ్యాప్తంగా మరి కొన్ని లక్షలమంది గణితము, సైన్సునే application orriented లో అభ్యసిస్తున్నారు .ఆటలు,పాటలు,కళలు moral values, సైన్సు ప్రయోగాలు అన్ని పాటశాలల లో శూన్యం. ఇలా తయారైతే భవిష్యత్తులో వీరు ఏమవుతారు ఉన్నత విద్యలో కూడా సినిమాలో చూపినట్లు ఎక్కడా విద్యార్థి సృజనాత్మకతకు, పరిశోధనకు అవకాశం ఇవ్వకుండా జరిగే విద్యా భోధన శాస్త్రవేత్తలను ఎలా తయారు చేయగలదు. అమెరికా డాలర్స్ సంపాదించే కంప్యూటర్ మనుషులను తప్ప!
ప్రస్తుత సమాజ అవసరాలఫై అధ్యయనం చేయని విద్య, పరిశోధనకు ప్రాముఖ్యత ఇవ్వని విద్య,పరిశ్రమలతో ప్రత్యక్ష అనుసంధానము లేని విద్య ఎలా భావిభారత పౌరులను తయారుచేయగలదు?మన దేశ బడ్జెట్ లో 2% విద్యకు కేటాయించి ఏమి సాధించాలి?అందులో పరిశోధనకు మరింత తక్కువ కేటాయిస్తారు.6% కేటాయిస్తే కొంతవరకు న్యాయం చేసినట్లు.
భారత మానవ వనరుల శాఖ నిర్ణయించినట్లు,దేశవ్యాప్త ఇంజనీరింగ్ ఎంట్రన్సు పెడుతూ దానిని SAT(USA) తరహాలో కోచింగ్ లకు ఆస్కారం లేని విధం గా సిలబస్ లోనే ఆయా అంశాలఫై భోధన వుండే విధం గా తయారు చెయ్యాలి.పాటశాల స్థాయిలోర్యాంకులు ,మార్క్స్ గొడవ తీసివేసి సమగ్ర మూల్యాంకనం ప్రవేశ పెట్టాలి.అప్పుడే విద్యాలయాలు బాగుపడతాయి .
ఈ సినిమా ఆదిశగా ఆలోచింప చేస్తుంది.ఇంత హృద్యంగా కథను తయారుచేసిన రాజు హీర్వాని దాన్ని మన భాష లో అద్భుతంగా అందించిన శంకర్ గారిని,విజయ్ మరియు సహనటుల్ని ,అభినందించకుండా ఉండలేము.
అందుకే "స్నేహితుడు" సినిమా చూడండి.
అందుకే "స్నేహితుడు" సినిమా చూడండి.
IIT-JEE,AIEEE రద్దు మరియు ISECET ఏర్పాటు
స్నేహితుడు సినిమా చూడమని చెప్పిన టపాకు విపరీతమయిన స్పందన వచ్చింది(చదవటం వరకే ,వ్యాఖ్యలు లేవు).ఆటపా లో కోరినట్లుగా జరిగింది .ఆ టపాను మంత్రులు చదివారా అన్నంతగా రెండు రోజులకే IIT_JEE
రధ్ధవడం ఎంతో ఆశ్చర్యానికి గురిచేశాయి.ఏమైనా ఈ మార్పును మనస్పూర్తిగా ఆహ్వానించాలి.
ఇంటర్ మార్క్స్ కి ప్రాధాన్యతనిస్తూ, రెండుదశ ల్లోనిర్వహించాలని ప్రతిపాదన .మొదటి దశలో సమగ్రంగా పరిశీలించే పరీక్ష ,రెండవ దశలో సబ్జెక్టు ఫై పరీక్ష ఉంటాయంటున్నారు.ఈ విషయం లో అమెరికా లో ఏవిధంగా వుందో పూర్తిగా తెలిసిన NRI లు ప్రభుత్వానికి సలహా లివ్వగలరు.ఎందుకంటే రాబోయే రెండు నెలలలో నియమాలు తయారు కాబోతున్నాయి.అమెరికా నే కాదు ప్రపంచం లోని ఇతర దేశాల్లో ఎలావుందో కూడా మీ మీ అభిప్రాయాలను భారత మానవ వనరుల శాఖకు పంపించండి .విద్యార్థులకు గొప్ప ఉపకారం చేసినవారవుతారు.మేధావులు,విద్యావంతులు ముందుకు వచ్చి సలహాలివ్వగ లిగితేనే విద్యా వ్యవస్థ లో మార్పులు వస్తాయి.
చివరగా చిన్న మనవి ఈ బ్లాగు లో పోస్ట్ చేసే వాటిలో వ్యక్తిగతంగా, సమాజపరంగా ఉపయోగపడే అంశాలనే ఉంచుతున్నాను.మీ అభిప్రాయాలను,సలహాలను వ్యాఖ్యల రూపం లో ఇవ్వగలిగితే మరింత మెరుగయిన అంశాలపైన వ్రాయాలని వుంది.మీ సహకారాన్ని ఆశిస్తూ ......
సైన్సు@మొబైల్
రధ్ధవడం ఎంతో ఆశ్చర్యానికి గురిచేశాయి.ఏమైనా ఈ మార్పును మనస్పూర్తిగా ఆహ్వానించాలి.
ఇంటర్ మార్క్స్ కి ప్రాధాన్యతనిస్తూ, రెండుదశ ల్లోనిర్వహించాలని ప్రతిపాదన .మొదటి దశలో సమగ్రంగా పరిశీలించే పరీక్ష ,రెండవ దశలో సబ్జెక్టు ఫై పరీక్ష ఉంటాయంటున్నారు.ఈ విషయం లో అమెరికా లో ఏవిధంగా వుందో పూర్తిగా తెలిసిన NRI లు ప్రభుత్వానికి సలహా లివ్వగలరు.ఎందుకంటే రాబోయే రెండు నెలలలో నియమాలు తయారు కాబోతున్నాయి.అమెరికా నే కాదు ప్రపంచం లోని ఇతర దేశాల్లో ఎలావుందో కూడా మీ మీ అభిప్రాయాలను భారత మానవ వనరుల శాఖకు పంపించండి .విద్యార్థులకు గొప్ప ఉపకారం చేసినవారవుతారు.మేధావులు,విద్యావంతులు ముందుకు వచ్చి సలహాలివ్వగ లిగితేనే విద్యా వ్యవస్థ లో మార్పులు వస్తాయి.
చివరగా చిన్న మనవి ఈ బ్లాగు లో పోస్ట్ చేసే వాటిలో వ్యక్తిగతంగా, సమాజపరంగా ఉపయోగపడే అంశాలనే ఉంచుతున్నాను.మీ అభిప్రాయాలను,సలహాలను వ్యాఖ్యల రూపం లో ఇవ్వగలిగితే మరింత మెరుగయిన అంశాలపైన వ్రాయాలని వుంది.మీ సహకారాన్ని ఆశిస్తూ ......
సైన్సు@మొబైల్
జాతీయ సైన్సు దినోత్సవాల్లో భాగంగా విజ్ఞాన్ ప్రసార్,ఇగ్నో కలిసి సైన్సు@మొబైల్ ను ప్రవేశ పెట్టారు.సైన్సు కు సంభందించిన వార్తలు ,ముఖ్యమైన రోజులు,నిజాలు,సూక్తులు,శాస్త్ర వేత్తల వివరాలు,ఆరోగ్య చిట్కాలు ఉచితంగా sms రూపంలో అందిస్తుంది.SCIMBL అని టైపు చేసి 092230516161 కు sms పంపించాలి . లేదా www.vigyanprasar.gov.in లో SCIMBL అని సెర్చ్ లో టైపు చేస్తే ఒక రిజిస్ట్రేషన్ form వస్తుంది అది పూర్తి చేస్తే సరి.
దీనిని ఎవరైనా ఉపయోగించుకోవచ్చు.అందరు దీనిని వినియోగించుకొని సైన్సు గురించి తెలుసుకోండి.