Wednesday 15 February 2012

సాయంత్రము త్వరగా భోజనం చేయటం

మన ఆరోగ్యం గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలలో మరో అంశం మీ ముందుకు .
మనం సాయంత్రం ఆలస్యంగా భోజనం చేస్తుంటాము.ఈ అలవాటు అంత మంచిది కాదు .ఎందుకంటే మనం తిన్న తరువాత నిద్ర పోతాము కాబట్టి ఆహారం సరిగా జీర్ణం కాక పలు రకాల ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం అవుతాయి .దీని పలితంగా పొట్ట వచ్చే అవకాశం ఎక్కువగా వుంటుంది.బరువు పెరగటం మామూలే .దీనికి ప్రత్యామ్నాయంగా పెందలకడనే భోజనం ముగించటం ఉత్తమం .
          సరే భోజనం లో ఏమి తీసుకుంటాము?సహజం గా తెలుగువారు అన్నము ఎక్కువగా వాడుతుంటారు.ఒక నివేదిక ప్రకారం ప్రపంచం లో భారత దేశం లో చక్కర వ్యాదిగ్రస్తులు ఎక్కువగా వుంటే మన  దేశం లో మన రాష్ట్రం లో ఎక్కువట .హైదరాబాద్ లో మరీ ఎక్కువ .అన్నము ఎక్కువగా తీసుకోవటం తగ్గించి నూనె  లేని పుల్కాలు రాత్రి త్వరగా తింటే పడుకోవటానికి సమయం ఉంటుంది కాబట్టి ఈలోపు కొంత అరగటమే  కాక బాగా నిద్ర పడుతుంది. 7 గంటలకు తినటం ఉత్తమం .
     ఈ చిన్న మార్పు చేసుకుంటే ఎంతో ఫలితము ఉంటుంది.ప్రయత్నిస్తారు కదూ !  

No comments:

Post a Comment